National
Windfall Tax: విండ్ఫాల్ టాక్స్ తగ్గించిన కేంద్రం.. డీజిల్, ATFపై జీరో.. లేటెస్ట్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
Petrol Diesel Prices: అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గత నెలలో విండ్ఫాల్ టాక్స్ భారీగా పెంచిన సంగతి తెలిసిందే. విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోలియం ఉత్పత్తులపై ఇది అమలవుతుంది. అయితే ఇప్పుడు మే నెలలో మాత్రం కేంద్రం ఆయిల్ కంపెనీలకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. క్రూడాయిల్పై విండ్ఫాల్ టాక్స్ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు దేనిపై ఎంత పన్ను ఉందో తెలుసుకుందాం.
India Windfall Tax: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా మంగళవారం రోజు కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న క్రూడాయిల్పై విండ్ఫాల్ టాక్స్ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఇది టన్నుపై రూ. 9600 గా ఉండగా.. ఇప్పుడు అది రూ. 8400 కు దిగొచ్చింది. ఇది కేవలం క్రూడ్ పెట్రోలియంపై వర్తిస్తుండగా.. పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్పై (ATF) మాత్రం విండ్ఫాల్ టాక్స్ సున్నాగా (జీరో) ఉంది. ఈ కొత్త రేట్లు మే 1 నుంచి అమల్లోకి వస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) మంగళవారం రోజు ఆలస్యంగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.
విండ్ఫాల్ టాక్స్ను కేంద్రం.. ప్రతి 15 రోజులకు ఒకసారి సవరిస్తుంటుంది. ఒకటో తేదీ, 15వ తేదీ దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటుంటుంది. యథాతథంగా ఉంచడం, పెంచడం లేదా తగ్గించడం చేస్తుంటుంది.
చివరిసారిగా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 16న క్రూడాయిల్పై విండ్ఫాల్ టాక్స్ పెంచింది. అప్పుడు రూ. 6800 నుంచి టన్నుకు ఏకంగా రూ. 9600 కు చేర్చింది. దాదాపు రూ. 2800 ఒక్కసారే పెంచడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ రేట్లు వరుసగా పెరుగుకుంటూ పోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తగ్గుతున్న క్రమంలోనే మళ్లీ విండ్ఫాల్ టాక్స్ తగ్గించింది. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లకు అనుగుణంగానే ఈ రేట్లను ఎప్పటికప్పుడు మారుస్తుంటుందని చెప్పొచ్చు.
అంతకుముందు ఏప్రిల్ 4న కూడా క్రూడాయిల్పై విండ్ఫాల్ టాక్స్ను మెట్రిక్ టన్నుకు రూ. 4900 గా ఉండగా.. దానిని రూ. 6800 కు చేర్చింది. ఈ కనిష్ట ధర నుంచి చూస్తే రెండు సార్లు సవరణతో రూ. 4700 పెంచడం గమనార్హం.
దేశీయంగా ఉన్న చమురు ఉత్పత్తి దారులపై స్పెషల్ అడిషనల్ ఎక్స్చైజ్ డ్యూటీ (SAED) కింద విండ్ఫాల్ టాక్స్ విధిస్తుంటుంది కేంద్రం. ఈ కంపెనీల్లో ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ONGC లిమిటెడ్, ఆయిల్ ఇండియా వంటి కంపెనీలు ఉన్నాయి.
మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఈ విండ్ఫాల్ టాక్స్ విధానాన్ని 2022, జులై 1 న అమలు చేసింది. అప్పట్లో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సమయంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగి జీవనకాల గరిష్టాల్ని తాకిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయంగా ఉన్న ఆయిల్ కంపెనీలు.. ఇక్కడ భారత్లో పెట్రోలియం వెలికితీసి.. పెట్రోల్, క్రూడాయిల్, డీజిల్, ఏటీఎఫ్ రూపంలో ఇక్కడ విక్రయించకుండా విదేశాలకు పెద్ద మొత్తంలో ఎగుమతి చేసి సొమ్ము చేసుకున్నాయి. వాటి లాభాలకు అడ్డుకట్ట వేసేందుకే కేంద్రం ఈ విండ్ఫాల్ టాక్స్ విధానం తీసుకొచ్చింది. దీని ప్రకారం.. అంతర్జాతీయంగా రేట్లు పెరిగితే.. ఇక్కడ టాక్స్ పెంచుతుంది. చమురు రేట్లు తగ్గితే.. టాక్స్ తగ్గిస్తుంటుంది.
ఇది దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై నేరుగా ఎలాంటి ప్రభావం చూపదు. కానీ పరోక్షంగా మాత్రం ఎఫెక్ట్ ఉంటుంది. ముడిచమురు రేట్లు పెరుగుతున్నప్పుడే విండ్ఫాల్ టాక్స్ పెంచుతుంది కాబట్టి.. అప్పుడు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి సంకేతాలు ఇస్తున్నట్లు అవుతుంది. ఇటీవల లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. లీటర్పై రూ. 2 చొప్పున తగ్గించగా.. ప్రస్తుతం హైదరాబాద్లో పెట్రోల్ లీటర్కు రూ. 107.41 వద్ద ఉండగా.. లీటర్ డీజిల్ రూ. 95.65 పలుకుతోంది.
National
స్తంభం పైన ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. ఇంతలో అటుగా వచ్చిన ఓ పక్షి…
కొన్ని దృశ్యాలు చూస్తే.. నమ్మశక్యంగా అనిపించవు. అరె.. ఇది ఏమైనా మ్యాజిక్కా లేక కనికట్టా అనిపిస్తుంది. తాజాగా 78వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. కేరళలో జాతీయ జెండా ఎగురవేస్తుండగా.. పైభాగంలో ఇరుక్కుపోయింది. ఈ సమయంలో అటుగా వచ్చిన ఒక పక్షి.. ఇరుక్కుపోయిన పైభాగాన్ని విప్పేసింది. నమ్మశక్యం కాని ఈ ఘటన కేరళలో వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Kerala – National Flag got stuck at the top while hoisting. A bird came from nowhere and unfurled it!! ✨ pic.twitter.com/lRFR2TeShK
— Shilpa (@shilpa_cn) August 16, 2024
ఇండిపెండెన్స్ డే శుభ సందర్భంగా, కొందరు పిల్లలు, పెద్దలు కలిసి జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో జాతీయ జెండా ఎగరవేస్తుండగా.. దురదృష్టవశాత్తు అది పైభాగంలో చిక్కుకుపోయింది. క్షణాల్లో, ఎక్కడి నుంచో ఎగురుతూ ఒక పక్షి వచ్చి చిక్కుకుపోయిన త్రివర్ణ పతాకాన్ని విప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆపై పక్షి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇది “దైవిక జోక్యం!” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “ఈ ప్రకృతి ఏదో దాగి ఉంది. మనుషులే అర్థం చేసుకోలేకపోతున్నారు” అని మరొకరు వ్యాఖ్యానించారు. “ఇలా జరగడానికి ఆస్కారం లేదు.. ఇది ఎడిట్ చేసిన వీడియో కావొచ్చు” అని మరొక వ్యక్తి అనుమానం వ్యక్తం చేశారు.
National
Railway Jobs: క్రీడాకారులకు సదావకాశం.. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024-25 సంవత్సరానికి గాను వెస్ట్రన్ రైల్వేలో గ్రూప్ ‘సి’, గ్రూప్ ‘డి’ ఖాళీల భర్తీకి ఈ ప్రకటన వెలువరించింది. అర్హులైన పురుష, మహిళా క్రీడాకారులు ఈ పోస్టుకలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 14, 2024వ తేదీలోని చివరి తేదీగా నిర్ణయించారు. మొత్తం 64 గ్రూప్ ‘సి’, గ్రూప్ ‘డి’ పోస్టులను స్పోర్ట్స్ కోటాలో ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. లెవెల్-4/5 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లెవెల్-2/3 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ, పన్నెండో తరగతిలో, లెవెల్-1 పోస్టులకు పదో తరగతి, ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బాస్కెట్బాల్, క్రికెట్, రెజ్లింగ్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాడీ బిల్డింగ్, సైక్లింగ్, హాకీ, ఖో-ఖో, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్.. వంటి క్రీడాంశాల్లో ఏదైనా ఒక దానిలో వివిధ స్థాయుల్లో విజయాలు సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు జనవరి 01, 2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. పురుష, మహిళా క్రీడాకారులు ఇరువురూ దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు ఇలా..
లెవెల్-4/5 పోస్టులు: 5
లెవెల్-2/3 పోస్టులు: 16
లెవెల్-1 పోస్టులు: 43
ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 16, 2024వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 14, 2024వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తుంది. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.500లు తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్ఎం/ దివ్యాంగులు/ మహిళలు/ మైనారిటీలు/ ఈబీసీ అభ్యర్థులు రూ.250లు రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్, ట్రయల్స్ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
National
ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ఏం సందేశం ఇచ్చారో తెలుసా?
Independence Day 2024: ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎర్రకోట వద్ద ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా సైనికులు పూల వర్షం కురిపించారు. వికసిత భారత్ థీమ్తో స్వాతంత్ర్య వేడుకలను నిర్వహిస్తున్నారు. ఎర్రకోట పరిసరాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎర్రకోటలో వేడుకలకు ఆరు వేల మంది హాజరయ్యారు.
పంద్రాగస్టు సందర్భంగా మోదీ ఎర్రకోట వద్ద ప్రసంగిస్తూ.. హర్ ఘర్ తిరంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని తెలిపారు.
-
Business5 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career5 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
National6 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
News5 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business5 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
Business5 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
Education5 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
International5 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
National4 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh4 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Andhrapradesh5 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana5 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Spiritual5 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
Crime News5 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
National5 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Railways4 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
Andhrapradesh4 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
National4 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
National4 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
National5 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh5 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Andhrapradesh5 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Political4 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Political4 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh4 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh5 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Andhrapradesh4 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
National5 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Weather4 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Education4 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
National5 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Cinema7 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Business5 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Andhrapradesh8 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Andhrapradesh4 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
International5 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Railways3 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh4 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Andhrapradesh4 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
News5 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
News6 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Andhrapradesh5 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Andhrapradesh4 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
News5 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Business5 months ago
Bank Holidays June-2024: జూన్లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Andhrapradesh4 months ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
Spiritual5 months ago
చార్ ధామ్ యాత్రకు పొటెత్తిన భక్తులు.. గత ఏడాదికంటే ఎక్కువే!
-
Cinema5 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
-
International4 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Andhrapradesh3 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు