National
Lok Sabha Elections 2024: మూడో విడత పోలింగ్లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..

ఇప్పటికే 2 విడతల పోలింగ్ ముగించుకున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో.. మూడో పోలింగ్ కోసం ఏర్పాటు చకచకా సాగుతున్నాయి. మంగళవారం (మే 7న) 13 రాష్ట్రాల్లో 94 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, అస్సాం, గుజరాత్, పశ్చిమ బెంగాల్ సహా మొత్తం 13 రాష్ట్రాలున్నాయి. భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని I.N.D.I.A కూటమి మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. ఈ దశలో ఈ రెండు కూటములతో పాటు కాంగ్రెస్, బీజేపీ సీనియర్ నేతలు తమ సొంత నియోజకవర్గాల్లో అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్నారు. ఇదొక్కటే కాదు, దేశంలోని అనేక రాజకీయ కుటుంబాలు సైతం ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.
ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ సహా ములాయం కుటుంబానికి చెందిన ముగ్గురు మూడో దశలో ఎన్నికలు ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్రలో శరద్ పవార్ కుటుంబం సైతం తమ రాజకీయ సత్తాను చాటుకోవాల్సి ఉంటుంది. మోడీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా, డా. మన్సుఖ్ మాండవియా, విజయ్ రూపాలా, ఎస్పీ సింగ్ బఘేల్తో పాటు బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం మూడో దశలో ఎన్నికలు ఎదుర్కొంటున్నారు. బీజేపీ నేత, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్లు సైతం మూడో దశలో ఎన్నికల పరీక్ష ఎదుర్కోనున్నారు. మొత్తంగా మూడవ దశ ఎన్నికల బరిలో ఉన్న హై ప్రొఫైల్ నేతల్లో ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి.. ఎవరు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోనున్నారో చూద్దాం.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. గత పర్యాయం ఈ స్థానం నుంచి గెలిచి ఎంపీ అయిన షా ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ పటేల్తో తలపడుతున్నారు. గాంధీనగర్ స్థానం భారతీయ జనతా పార్టీకి బలమైన కోటగా పరిగణిస్తారు. అమిత్ షా కంటే ముందు లాల్ కృష్ణ అద్వానీ ఇక్కడ నుంచే ఎంపిగా ప్రాతినిథ్యం వహించారు. అమిత్ షా 2019 లోక్సభ ఎన్నికల్లో గాంధీనగర్ స్థానం నుంచి తొలిసారిగా పోటీ చేసి గెలవగా.. ఇప్పుడు రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
జ్యోతిరాదిత్య సింధియా..
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈసారి ఎన్నికల్లో తన పాత కోట ‘గుణ’ లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. సింధియా ఈసారి ఎన్నికల్లో బీజేపీ గుర్తుపై పోటీ చేయగా, గత పర్యాయం కాంగ్రెస్ టికెట్పై ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి సింధియా బీజేపీ అభ్యర్థిగా పునరాగమనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి యదువేంద్ర సింగ్ యాదవ్ నుంచి సింధియా పోటీ ఎదుర్కొంటున్నారు. యదువేంద్ర యాదవ్ బీజేపీలో ఉండి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరారు.
మన్సుఖ్ మాండవియా..
మోదీ ప్రభుత్వంలో కీలక శాఖలను నిర్వహించిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా మూడో దశ పోలింగ్లో అగ్నిపరీక్షను ఎదుర్కోనున్నారు. మాండవ్య గుజరాత్లోని పోర్బందర్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లలిత్ భాయ్ వసోయాతో తలపడుతున్నారు. పోర్బందర్ లోక్సభ స్థానం బీజేపీకి బలమైన స్థానాల్లో ఒకటి. నిరంతరం విజయాలను నమోదు చేస్తోంది. అయితే ఈసారి ఇక్కడ గట్టి పోటీ నెలకుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎస్పీ సింగ్ బఘేల్..
మోడీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఎస్పీ సింగ్ బఘేల్ మూడో దశలో ఎన్నికల పరీక్ష ఎదుర్కొంటున్నారు. ఆగ్రా రిజర్వ్డ్ స్థానం నుంచి ఎస్పీ బఘేల్పై సమాజ్వాదీ పార్టీ (SP) నుంచి సురేశ్ చంద్ర కదమ్, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నుంచి పూజా అమ్రోహి బరిలోకి దిగడంతో త్రిముఖ పోరుకు దారితీసినట్టయింది. దళితుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ స్థానంలో బీఎస్పీ ఎన్నడూ గెలవలేకపోయింది. అయితే ప్రతిసారీ రెండో స్థానంలోనే కొనసాగుతూ వచ్చింది. పూజా అమ్రోహి వ్యక్తిగత ఇమేజి తోడవడంతో ఈసారి పోటీ మరింత రసవత్తరంగా మారింది.
సుప్రియా సూలే..
మూడో దశ లోక్సభ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) వ్యవస్థాపకులు శరద్ పవార్ కుటుంబం అగ్నిపరీక్షను ఎదుర్కోనుంది. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే తన సాంప్రదాయ బారామతి స్థానం నుంచి మూడోసారి పోటీ చేశారు. సూలేపై అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీ చేస్తున్నారు. ఎన్సీపీలో చీలిక తర్వాత శరద్ పవార్, అజిత్ పవార్ రెండు వర్గాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో సీటు కాపాడుకోవడమే సుప్రియా సూలేకు ఒక పెద్ద సవాల్గా మారింది.
శివరాజ్ సింగ్ చౌహాన్..
మధ్యప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన శివరాజ్సింగ్ చౌహాన్ ఈసారి ‘విదిశ’ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ భాను శర్మతో పోటీ పడుతున్నారు. శివరాజ్ సింగ్ 20 ఏళ్ల తర్వాత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అంతకు ముందు 2005 వరకు ఈ స్థానం నుంచి ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు బీజేపీ ఆయనను జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించుకుని మళ్లీ విదిశ స్థానం నుంచే బరిలోకి దింపింది.
డింపుల్ యాదవ్..
మైన్పురి లోక్సభ స్థానం నుంచి ములాయం సింగ్ యాదవ్ రాజకీయ వారసత్వాన్ని కైవసం చేసుకునేందుకు అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ను బరిలోకి దించారు. ఈ స్థానంలో బీజేపీ జైవీర్ సింగ్ను బరిలోకి దించగా, బీఎస్పీ నుంచి శివప్రసాద్ యాదవ్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1996 నుంచి ఈ సీటును సమాజ్వాదీ పార్టీయే గెలుచుకుంటూ కంచుకోటగా మార్చుకుంది. మోడీ హవాలోనూ ఆ పార్టీ ఈ సీటును నిలుపుకోగలిగింది. ములాయం సింగ్ యాదవ్ మరణం తర్వాత డింపుల్ యాదవ్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ముక్కోణపు పోటీలో బీజేపీ ఈసారి ఈ సీటును గెలుపొందాలని ప్రయత్నిస్తోంది.
దీంతో పాటు ములాయం కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలు కూడా ఈ దశలోనే ఎన్నికలు ఎదుర్కొంటున్నారు. శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్ ‘బదౌన్’ స్థానం నుంచి, రామ్ గోపాల్ యాదవ్ కుమారుడు అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో సమాజ్వాదీ పార్టీ ఈ రెండు స్థానాల్లోనూ ఓడిపోయినా ఈసారి హోరాహోరీ పోరు నెలకొంది. ఈ పరిస్థితుల్లో ములాయం కుటుంబం సీట్లు కాపాడుకుంటుందో లేదో చూడాలి.
దిగ్విజయ్ సింగ్..
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత రాజ్గఢ్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. 1991లో దిగ్విజయ్ ఈ స్థానం నుంచి పోటీ చేసి భారీ ఓట్లతో గెలుపొందారు. రాజ్గఢ్ ఆయన సంప్రదాయ స్థానం, అందుకే కాంగ్రెస్ ఆయనను పోటీకి దింపింది. ఈసారి ఆయన బీజేపీ అభ్యర్థి రోడ్మల్ నాగర్ నుంచి పోటీ ఎదుర్కొంటున్నారు. మోడీ వేవ్లో ఈ సీటును బీజేపీ కైవసం చేసుకున్నప్పటికీ దిగ్విజయ్ సింగ్ ఎంట్రీతో పోటీ ఆసక్తికరంగా మారింది.
International
భారత్, చైనాల మధ్య శాంతికి రోడ్ మ్యాప్.. సంబంధాల బలోపేతానికి ఆరు సూత్రాల ప్రణాళిక

సరిహద్దుల్లోని తూర్పు లడఖ్ వద్ద ఘర్షణతో భారత్, చైనాల మధ్య దాదాపు ఐదేళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు స్తంభించిపోయాయి. ఈ తరుణంలో సంబంధాల పునరుద్దరణకు ఇరు దేశాలూ ముందుడుగు వేశాయి. బీజింగ్లో బుధవారం భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధులు భేటీ అయ్యాయి. ఈ ప్రతినిధుల బృందానికి భారత్ నుంచి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా నుంచి విదేశాంగ మంత్రి వాంగ్ యీ నేతృత్వం వహించారు. చర్చల్లో శాంతి స్థాపనకు రోడ్ మ్యాప్, సంబంధాల బలోపేతానికి ఆరు సూత్రాల ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించారు. టిబేట్ మీదుగా కైలాస మానసరోవర యాత్ర పునరుద్ధరణ, నదీజలాల వివరాలను పంచుకోవడం, పరస్పరం వాణిజ్యం పెంపు వంటి అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు.
సానుకూల వాతావరణంలో ఈ చర్చలు సాగాయని, ఆరు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చైనా ప్రకటించింది. ‘దశల వారీగా రోడ్మ్యాప్పై అంగీకారానికి వచ్చాం… ఇది వివాదాస్పద అంశాలను పక్కనబెట్టి సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సమస్యలను సులభంగా పరిష్కరించడానికి సహకరిస్తుంది’ అని చైనా తెలిపింది.అయితే, భారత్ మాత్రం దానిని ప్రస్తావించకపోవడం గమనార్హం. సైనిక బలగాల ఉపసంహరణపై అక్టోబరు 21న జరిగిన ఒప్పందం అమలు ఫలితంగా సరిహద్దుల్లో పెట్రోలింగ్ మొదలైందని భారత్ పేర్కొంది.
మొత్తం ద్వైపాక్షిక సంబంధాల నుంచి సరిహద్దు వివాదాలను వేరుచూసి.. సరైన రీతిలో పరిష్కరించుకోవాలని తద్వారా ఆ ప్రభావం సంబంధాలపై పడకుండా చూసుకోవాలని నిర్ణయించారు. సముచిత, సహేతుక, పరస్పర ఆమోదయోగ్యమైన ప్యాకేజీలకు ఇకపైనా కట్టుబడి ఉండాలని, శాంతికి విఘాతం కలగకుండా చూసుకోవాలని తీర్మానించారు.
అలాగే, ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, సైనిక-దౌత్యపరమైన చర్చలను సమన్వయంతో మెరుగుపరచాలని నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో ప్రతినిధుల సమావేశాన్ని వచ్చే ఏడాది భారత్లో నిర్వహించాలని అవగాహనకు వచ్చారు. కాగా, సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు ప్రత్యేక ప్రతినిధులు 2003 నుంచి ఇప్పటివరకు 22సార్లు భేటీ అయ్యి చర్చలు జరిపారు. ప్రస్తుతం జరిగింది 23వ సమావేశం. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిని నెలకొల్పడం, ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్దరణ ఈ చర్చల లక్ష్యం.
వివాదాస్పద పాయింట్ల దెమ్చోక్, దెప్సాంగ్ల నుంచి సైన్యాల ఉపసంహరణకు అక్టోబరు 21న ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో పాటు అక్టోబరు 24న రష్యాలోని కజాన్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రత్యేకంగా భేటీ అయి సయోధ్యకు మార్గం వేశారు.
National
స్తంభం పైన ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. ఇంతలో అటుగా వచ్చిన ఓ పక్షి…

కొన్ని దృశ్యాలు చూస్తే.. నమ్మశక్యంగా అనిపించవు. అరె.. ఇది ఏమైనా మ్యాజిక్కా లేక కనికట్టా అనిపిస్తుంది. తాజాగా 78వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. కేరళలో జాతీయ జెండా ఎగురవేస్తుండగా.. పైభాగంలో ఇరుక్కుపోయింది. ఈ సమయంలో అటుగా వచ్చిన ఒక పక్షి.. ఇరుక్కుపోయిన పైభాగాన్ని విప్పేసింది. నమ్మశక్యం కాని ఈ ఘటన కేరళలో వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Kerala – National Flag got stuck at the top while hoisting. A bird came from nowhere and unfurled it!! ✨ pic.twitter.com/lRFR2TeShK
— Shilpa (@shilpa_cn) August 16, 2024
ఇండిపెండెన్స్ డే శుభ సందర్భంగా, కొందరు పిల్లలు, పెద్దలు కలిసి జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో జాతీయ జెండా ఎగరవేస్తుండగా.. దురదృష్టవశాత్తు అది పైభాగంలో చిక్కుకుపోయింది. క్షణాల్లో, ఎక్కడి నుంచో ఎగురుతూ ఒక పక్షి వచ్చి చిక్కుకుపోయిన త్రివర్ణ పతాకాన్ని విప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆపై పక్షి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇది “దైవిక జోక్యం!” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “ఈ ప్రకృతి ఏదో దాగి ఉంది. మనుషులే అర్థం చేసుకోలేకపోతున్నారు” అని మరొకరు వ్యాఖ్యానించారు. “ఇలా జరగడానికి ఆస్కారం లేదు.. ఇది ఎడిట్ చేసిన వీడియో కావొచ్చు” అని మరొక వ్యక్తి అనుమానం వ్యక్తం చేశారు.
National
Railway Jobs: క్రీడాకారులకు సదావకాశం.. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024-25 సంవత్సరానికి గాను వెస్ట్రన్ రైల్వేలో గ్రూప్ ‘సి’, గ్రూప్ ‘డి’ ఖాళీల భర్తీకి ఈ ప్రకటన వెలువరించింది. అర్హులైన పురుష, మహిళా క్రీడాకారులు ఈ పోస్టుకలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 14, 2024వ తేదీలోని చివరి తేదీగా నిర్ణయించారు. మొత్తం 64 గ్రూప్ ‘సి’, గ్రూప్ ‘డి’ పోస్టులను స్పోర్ట్స్ కోటాలో ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. లెవెల్-4/5 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లెవెల్-2/3 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ, పన్నెండో తరగతిలో, లెవెల్-1 పోస్టులకు పదో తరగతి, ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బాస్కెట్బాల్, క్రికెట్, రెజ్లింగ్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాడీ బిల్డింగ్, సైక్లింగ్, హాకీ, ఖో-ఖో, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్.. వంటి క్రీడాంశాల్లో ఏదైనా ఒక దానిలో వివిధ స్థాయుల్లో విజయాలు సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు జనవరి 01, 2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. పురుష, మహిళా క్రీడాకారులు ఇరువురూ దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు ఇలా..
లెవెల్-4/5 పోస్టులు: 5
లెవెల్-2/3 పోస్టులు: 16
లెవెల్-1 పోస్టులు: 43
ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 16, 2024వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 14, 2024వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తుంది. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.500లు తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్ఎం/ దివ్యాంగులు/ మహిళలు/ మైనారిటీలు/ ఈబీసీ అభ్యర్థులు రూ.250లు రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్, ట్రయల్స్ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
-
Business10 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career10 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News10 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business10 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National11 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business10 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International10 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
National9 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Education9 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
Crime News9 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh9 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
National9 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Andhrapradesh9 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana10 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Railways9 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National10 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Spiritual9 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
Andhrapradesh9 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh9 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh1 year ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Andhrapradesh9 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
National9 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
National9 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Political9 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh9 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh8 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
International10 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Andhrapradesh9 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
National10 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh9 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Political9 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh9 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
National10 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Business10 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
International10 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
Cinema1 year ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
News11 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Education9 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Weather9 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Andhrapradesh9 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Education1 year ago
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు
-
Andhrapradesh9 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
News9 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Railways8 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Business10 months ago
Bank Holidays June-2024: జూన్లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Andhrapradesh1 year ago
ప్రమాదపుటంచుల్లో ప్రపంచం
-
Andhrapradesh10 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Andhrapradesh9 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
News9 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
International9 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం