Connect with us

Success story

ట్రిపుల్‌ఐటీ స్టూడెంట్‌కు రూ.85 లక్షల ప్యాకేజీ.. ఐఐటీ, ఐఐఎంలకు గట్టి పోటీ

Published

on

Success Story: జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఐఐటీ(IIT), ఐఐఎం(IIM), ఎన్‌ఐటీ(NIT)ల్లోనే చదవాల్సిన అవసరం లేదు. పట్టుదల, కృషి, తెలివితేటలు ఉంటే సాధారణ ఇన్‌స్టిట్యూట్‌ల్లో చేరి కూడా చదువులో అద్భుతంగా రాణించి, ఇంటర్వ్యూలో ప్రతిభను చాటుకోవచ్చు.
ఇలాంటి విద్యార్థులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. బీటెక్ గ్రాడ్యుయేట్ రాశి బగ్గా కూడా ఇదే కోవకు చెందుతుంది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఆమె భారీ ప్యాకేజీతో ఉద్యోగం సొంతం చేసుకుంది.

85లక్షల ప్యాకేజీ..

సాధారణంగా ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో చదివిన విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో భారీ ప్యాకేజీలతో ఉద్యోగ ఆఫర్ సొంతం చేసుకున్నట్లు మనం తరచుగా వింటుంటాం. అయితే ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- నయా రాయ్‌పూర్ (IIIT-NR)కు చెందిన విద్యార్థిని రాశి బగ్గా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. గతేడాది జరిగిన ఇంటర్వ్యూలో ఐఐటీ, ఐఐఎం విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా ఆకట్టుకుంది. రూ.85 లక్షల వార్షిక ప్యాకేజీతో జాబ్ ఆఫర్ పొంది ప్రత్యేకత చాటుకుంది.

* చాలా ఇంటర్వ్యూలకు హాజరు

ప్రముఖ కంపెనీ నుంచి లాభదాయకమైన ఉద్యోగ ఆఫర్ ఉన్నప్పటికీ, రాశి బగ్గా పట్టుదలతో అదనపు అవకాశాల కోసం ప్రయత్నించింది. చివరికి రికార్డు స్థాయిలో రూ. 85 లక్షల ఆఫర్‌ను సొంతం చేసుకుంది. ఈ అద్భుత ప్రయాణంలో రాశి బగ్గా వరుసగా ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరైంది. అన్ని చోట్ల తిరుగులేని నిబద్ధత, అద్భుతమైన పనితీరుతో రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించింది.

Advertisement

* కలిసొచ్చిన ఇంటర్న్‌షిప్

ఇంటర్వ్యూలకు ముందు వివిధ సంస్థల్లో రాశి బగ్గా (Rashi Bagga)ఇంటర్న్‌గా పనిచేసింది. భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించడంలో ఇంటర్న్‌షిప్స్ ఆమెకు బాగా కలిసివచ్చాయి. బెంగళూరు(Banglore)లోని ఇన్‌ట్యూట్(Intuit)లో SDE ఇంటర్న్‌గా పనిచేసింది. ఆ తరువాత అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఇంటర్న్‌గా విలువైన ఎక్స్‌పీరియన్స్ సొంతం చేసుకుంది. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. 2023 జులై నుంచి అట్లాసియన్‌లో ప్రొడక్ట్ సెక్యూరిటీ ఇంజనీర్‌గా ఉద్యోగ బాధతలు నిర్వర్తిస్తోంది.

* మునుపటి విద్యార్థుల రికార్డు

ట్రిపుల్‌ఐటీ-నయా రాయ్‌పూర్‌కు చెందిన మరో విద్యార్థి చింకీ కర్దా, అంతకుముందు సంవత్సరంలో రూ.57 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ పొందాడు. ఈ రికార్డ్‌ను రాశి బగ్గా బద్దలుకొట్టింది. మునుపటి రికార్డును నెలకొల్పాడు. యోగేష్ కుమార్ అనే మరో విద్యార్థి ఓ మల్టినేషన్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ రోల్ కోసం సంవత్సరానికి రూ. 56 లక్షల ప్యాకేజీని అందుకున్నాడు. 2020లో ట్రిపుల్‌ఐటీ నయా రాయ్‌పూర్‌కు చెందిన రవి కుశాశ్వ అనే విద్యార్థి ఒక బహుళజాతి కంపెనీ నుంచి సంవత్సరానికి కోటి రూపాయల జాబ్ ఆఫర్‌ అందుకున్నాడు. అయితే కరోనా మహమ్మారి కారణంగా అతను కంపెనీలో చేరలేకపోయాడు.

* సక్సెస్ స్టోరీ ..

Advertisement

IIIT-NR ప్లేస్‌మెంట్ ఆఫీస్ ప్రకారం.. ప్రస్తుత బ్యాచ్‌కి సగటు CTC సంవత్సరానికి రూ.16.5 లక్షలకు చేరింది. గతంలో ఇది సంవత్సరానికి రూ. 13.6 లక్షలుగా ఉండేది. ఆ లెక్కన విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భారీ ప్యాకేజీలను సొంతం చేసుకుంటున్నారని అర్థమవుతుంది.

* అరుదైన గౌరవం..

ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- నయా రాయ్‌పూర్ (IIIT-NR)కు చెందిన విద్యార్థిని రాశి బగ్గా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. రూ.85 లక్షల వార్షిక ప్యాకేజీతో జాబ్ ఆఫర్ పొంది ప్రత్యేకత చాటుకుంది.

Andhrapradesh

ఎంతో సొమ్ము….2000 ఎకరాలు… రామోజీరావు గారి పట్టుదల

Published

on

మీడియా మొఘల్‌గానే కాకుండా.. సినీ పరిశ్రమలోనూ తనకంటూ వైవిధ్యాన్ని ప్రదర్శించిన రామోజీ రావు…. భౌతికంగా అస్తమించారు. కానీ, ఆయన ఆత్మ.. ఈనాడు, రామోజీ ఫిల్మ్ సిటీల రూపంలో చిరస్థాయిగా తెలుగు నేలపై మరికొన్ని దశాబ్దాల పాటు నిలిచిపోతాయి.
ఈనాడును ఎలా అయితే.. ప్రేమించారో.. ఆయన జీవితంగా ఫిల్మ్ సిటీని అంతకు మించి ప్రేమించారు. అది 1980-90ల మధ్య పరిస్థితి. ఏ చిన్న షూటింగ్ చేయాలన్నా.. ఎక్కడెక్కడకో వెళ్లాల్సి వచ్చేది.

ఉదాహరణకు ఒక పాట కోసం.. వేరే ప్రాంతాలకు.. ఒక సీన్ సీన్ కోసం.. పొరుగు రాష్ట్రాలకు నిర్మాతలు పరుగులు పెట్టాల్సి వచ్చేది. ఒక నిర్మాతకు ఇవన్నీ.. తడిసిమోపెడు భారం. దీనికితోడు ఇంత పెట్టుబడి పెట్టినా.. సదరు సినిమాలు ఆడకపోతే.. నిర్మాత నష్టపోవడం ఖాయం. ఒక సహజ నిర్మాతగా రామోజీరావు ను ఇవన్నీ.. కదిలించాయి. నిర్మాత కష్టాలు ఎలా ఉంటాయో.. తెలిసిన వ్యక్తిగా.. వీటిని ఆయన ఔపోసన పట్టారు. నిర్మాత కష్టాలు తగ్గించాలన్న దృఢ సంకల్పంతో మనకంటూ.. ఒక ఫిల్మ్‌సిటీ ఉండాలని కలలు గన్నారు.

ఈ క్రమంలోనే ఆయన 1982-86 మధ్యనాలుగు సంవత్సరాల పాటు.. ప్రపంచంలోని అతి పెద్ద ఫిల్మ్ సిటీలను సందర్శించారు. వాటిలాగానే.. ఏపీలోనూ ఒకచిత్ర నగరిని రూపొందించాలని నిర్ణయించుకు న్నారు. కానీ, ఎలా? సాధ్యమేనా? అని అనుకున్నప్పుడు.. ఎందుకు సాధ్యం కాదనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. అక్కడే రామోజీ ఫిల్మ్ సిటీకి అంకురార్పణ జరిగింది. ఏకంగా.. నాలుగు గ్రామాలు.. 2000లకు ఎకరాల స్థలం తనకు కావాలంటూ.. ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు.

అప్పటి చంద్రబాబు ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ శివారులో స్థలం విడతల వారీగా అప్పగించారు. అక్కడ రూపుదిద్దుకున్నదే రామోజీఫిల్మ్ సిటీ. ఇదేమీ తేలికగా అయిపోలేదు. కోట్లకు కోట్ల సొమ్ము.. లారీల్లో తరలించినట్టు తరలించారు. కానీ, మరోవైపు..కుటుంబం వారించింది. ఇంత సొమ్మును ఖర్చు పెడితే.. ఎలా? అది హిట్ కాకపోతే.. ఏం జరుగుతుందనే వాదన కూడా తెరమీదికి వచ్చింది. అయినా.. రామోజీ వెనుకడుగు వేయలేదు.

అనేక మంది సహకారం తీసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీని దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే నెంబర్ 1గా తీర్చి దిద్దారు. ఈ క్రమంలో 2004లో ప్రభుత్వం మారిపోయింది. దీంతో న్యాయపరమైన సమస్యలు కూడా.. చుట్టుకున్నాయి. అయినా.. వాటిని ఎదిరించి ముందుకు సాగారు. రామోజీ ఫిల్మ్ సిటీని సాకారం చేసుకున్నారు. అనధికార అంచనాప్రకారం.. రోజుకు 100 కోట్ల రూపాయల వ్యాపారం.. ఇక్కడే జరుగుతోంది.

Advertisement
Continue Reading

Cricket

IPL 2024: ‘అమ్మ తన నగలను అమ్మి షూస్ కొనిచ్చింది’.. కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ సక్సెస్ స్టోరీ.. వీడియో

Published

on

IPL 2024 చివరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం (చెపాక్) స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో కేకేఆర్ తరఫున యువ పేసర్ షకీబ్ హుస్సేన్ బరిలోకి దిగే సూచనలున్నాయి. షకీబ్ ది హల్క్ బాడీ… బాడీబిల్డింగ్‌తో కూడిన సిక్స్ ప్యాక్ బాడీ. ఒక్క సారి ఈ కుర్రాడిని చూస్తే ఆర్మీకి సరిగ్గా సరిపోతాడని చెప్పొచ్చు. కానీ తన కలను కాదని కోల్‌కతా నైట్ రైడర్స్ శిబిరంలో షకీబ్ కనిపించడం గమనార్హం. అయితే ఈ ఫిజిక్ వెనుక సైన్యంలో చేరాలనే పెద్ద కల కూడా ఉంది. బిహార్‌లోని గోపాల్‌గంజ్‌కు చెందిన షకీబ్ హుస్సేన్ ది వ్యవసాయ కుటుంబం. తండ్రి అహ్మద్ హుస్సేన్ ఒక్కరోజు పని చేయకపోయినా కుటుంబమంతా సగం కడుపుతో గడపాల్సిందే. అందుకే యుక్తవయస్సు రాకముందే షకీబ్ హుస్సేన్ ఒక నిర్ణయానికి వచ్చాడు. భారత సైన్యంలో పనిచేయాలనుకున్నాడు. తద్వారా తన కటుంబ ఆర్థిక పరిస్థితి మారుతుందనుకున్నాడు. ఈ పెద్ద కలతో, షకీబ్ హుస్సేన్ తన ఇంటి సమీపంలోని మైదానంలో ప్రతిరోజూ ఉదయాన్నే రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. ఆర్మీ ఎంపిక కోసం కసరత్తు కూడా మొదలుపెట్టాడు. ఈ సమయంలో అతడిని గమనించిన కొందరు క్రికెట్ ఆడమని సలహా ఇచ్చారు.

క్రికెట్ ప్రముఖులైన తునవ్ గిరి, కుమార్ గిరి, జావేద్ సర్, రాబిన్ సర్.. అహ్మద్ హుస్సేన్ కొడుకును క్రికెటర్ ను చేయమని చెప్పారు. ఎందుకంటే అతనికి అద్భుతమైన వేగం ఉంది. మెరుగైన బౌలర్‌గా ఎదగగలడని అన్నాడు. ఇంతకు ముందు షకీబ్ హుస్సేన్ టెన్నిస్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడాడు. అయితే, అతను క్రికెట్‌పై చాలా ఆసక్తిని కలిగి ఉన్నాడు. కానీ లెదర్ బాల్ క్రికెట్ ఆడాలంటే మంచి స్పైక్డ్ షూస్ అవసరం.స్పైక్డ్ షూస్ కొనడానికి 10,000 నుండి 15,000 అవసరం. అయితే, తల్లి తన బంగారు ఆభరణాలను విక్రయించి, తన కొడుకు కోసం స్పైక్డ్ షూలను కొనుగోలు చేసింది. ఈ బూట్లతో కొత్త కలను నిర్మించుకున్న షకీబ్.. తన ఫాస్ట్ బౌలింగ్ తో బిహార్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.


సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కనిపించి 4 వికెట్లు పడగొట్టాడు షకీబ్. ఈ ప్రదర్శన ఫలితంగా, అతను IPL 2023లో CSK జట్టు ద్వారా నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. అయితే ఐపీఎల్ జట్టులో చోటు దక్కించుకోవాలన్నది షకీబ్ కల. అందుకే ఈసారి కూడా తన పేరును ఐపీఎల్ వేలానికి పెట్టాడు. కానీ తొలి రౌండ్‌లో ఏ ఫ్రాంచైజీని కొనుగోలు చేయలేదు. దీంతో ఈసారి కూడా షకీబ్ హుస్సేన్ తన ఐపీఎల్ కలను వదులుకున్నాడు. కోచ్ రాబిన్ సింగ్‌కు కూడా ఫోన్ చేసి తన నిరాశను పంచుకున్నాడు. అయితే కొద్ది క్షణాల్లో జరిగిన చివరి రౌండ్‌లో షకీబ్ హుస్సేన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. షకీబ్ సాధించిన విజయానికి ఊరంతా సంబరాలు చేసుకుంది.

Advertisement

‘మా అబ్బాయి తన తల్లిదండ్రుల కష్టాలను బాగా అర్థం చేసుకున్నాడు. చాలా మంచి అబ్బాయి. మాకు ఇంతకంటే ఏం కావాలి’ అంటున్నారు షకీబ్ హుస్సేన్ తండ్రి అహ్మద్. 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సత్తా ఉన్న షకీబ్ హుస్సేన్ ఇప్పుడు కేకేఆర్ జట్టులో ఉన్నాడు. కానీ ఈ ఐపీఎల్‌లో యువ స్పీడ్‌స్టర్‌కు మ్యాచ ్ఆడే అవకాశం రాలేదు. అయితే షకీబ్ తన స్పీడుతో కేకేఆర్ శిబిరంలో సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్న షకీబ్ హుస్సేన్ వయసు 20 ఏళ్లు మాత్రమే. అందుకే రానున్న రోజుల్లో భారత జట్టుకు మరో స్పీడ్ మాస్టర్ దొరికినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Continue Reading

Business

Success Story: ఒకప్పుడు వెయ్యి నెలజీతంతో పాట్లు.. రూ.5,000 కోట్ల కంపెనీకి యజమాని..

Published

on

Virani Brothers: సక్సెస్ సాధించటం అంటే కేవలం డబ్బు సంపాదించటం మాత్రమే కాదు. దేశంలో అత్యుత్తమ కంపెనీల్లో ఒకటిగా నిలిచే స్థాయికి తన కలలను నిర్మించటం అని కొందరి సక్సెస్ స్టోరీ నిరూపిస్తోంది.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది స్నాక్ వ్యాపారంలో దిగ్గజ కంపెనీని నిర్మించిన విరానీ సోదరుల గురించే. ఒకప్పుడు వందల రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించిన వీరు ప్రస్తుతం అత్యంత ప్రజాధరణ పొందిన బాలాజీ వేఫర్స్ సంస్థను స్థాపించటంతో పాటు విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నారు. సందుభాయ్ విరానీ 1974లో తన సోదరుడితో కలిసి ఉద్యోగం కోసం రాజ్‌కోట్‌కు వచ్చారు. ఆ సమయంలో వారు సినిమా థియేటర్లలో స్నాక్స్ అమ్మే పనిలో చేరారు. అప్పుడు వారి నెల జీతం రూ.1000. సవాళ్ల ప్రయాణం తర్వాత రిస్క్ తీసుకుని సొంత వ్యాపారాన్ని ప్రారంభించే దిశగా వారు అడుగులువేశారు.

తాము సినిమా హాళ్లలో విక్రయించిన పొటాటో చిప్స్ భారీగా ప్రజాధరణ పొందటంతో దానిని పూర్తి స్థాయిలో చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ చిన్న ప్రయత్నం నేడు విరానీ సోదరులను దేశంలో అతిపెద్ద స్నాక్స్ తయారీ కంపెనీ నిర్మాణం దాకా నడిపించింది. తొలుత చిన్న స్థాయిలో చిప్స్ తయారీ చేసిన వీరు చుట్టుపక్కల దుకాణాల్లో వాటిని విక్రయించారు. అలా తర్వాతి కాలంలో 1982లో రూ.1.5 లక్షల రుణం తీసుకుని బంగాళదుంప చిప్స్‌ తయారీకి తొలిసారిగా ఫ్యాక్టరీని స్థాపించారు. అయితే ఆ రోజుల్లో ఇంత భారీ పెట్టుబడితో ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్ణయం పెద్ద సాహసమనే చెప్పుకోవాలి. అలా 1992లో సోదరులు కలిసి బాలాజీ వేఫర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రత్యేక కంపెనీని స్థాపించారు.

బాలాజీ వేఫర్స్ దేశంలో మూడవ అతిపెద్ద స్నాక్ తయారీ కంపెనీ. భారతీయ స్నాక్స్ మార్కెట్‌లో కంపెనీకి ఏకంగా 12% మార్కెట్ వాటా ఉంది. ఒకానొక సమయంలో దీనిని అమెరికాకు చెందిన ప్రముఖ స్నాక్స్ తయారీదారు లేస్ తయారీ సంస్థ పెప్సికో కొనుగోలుకు ప్రయత్నాలు సైతం చేసింది. గడచిన ఏడాది కంపెనీ ఆదాయం రూ.5,000 కోట్ల మార్కుకు చేరుకుంది. ప్రస్తుతం 7000 మంది ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థ గంటకు 3,400 కిలోగ్రాముల చిప్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో 65 కంటే ఎక్కువ స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి. కంపెనీకి ఉన్న అద్భుతమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, నాణ్యమైన ఉత్పత్తి కారణంగా దేశంలోని మారుమూల గ్రామాల్లో సైతం కంపెనీ తన ఉత్పత్తులను విక్రయిస్తోంది.

Continue Reading
Andhrapradesh1 month ago

చెస్‌లో సీఎం చంద్రబాబు మనవడు వరల్డ్ రికార్డ్ – సంతోషంలో నారా కుటుంబం – CHANDRA BABU GRAND SON WORLD RECORD

International1 month ago

యుద్ధం ముగించేందుకు సిద్ధం- జెలెన్‌స్కీతో మాత్రం మాట్లాడం: పుతిన్ – PUTIN ON RUSSIA UKRAINE WAR

Spiritual2 months ago

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ టికెట్ల విడుదల తేదీలను మార్చిన టీటీడీ

International2 months ago

అమెరికాకు తప్పిన షట్ డౌన్ ముప్పు! నిధుల బిల్లుకు చివరి క్షణంలో ఆమోదం – US SHUTDOWN 2024

Andhrapradesh2 months ago

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ – మార్చి నెల దర్శన టికెట్ల విడుదల తేదీల్లో మార్పులు

Spiritual2 months ago

శబరిమలకు పోటెత్తిన భక్తులు- ఒక్క రోజులో 96 వేల మంది దర్శనం – SABARIMALA DEVOTEES

International2 months ago

భారత్, చైనాల మధ్య శాంతికి రోడ్ మ్యాప్.. సంబంధాల బలోపేతానికి ఆరు సూత్రాల ప్రణాళిక

Telangana2 months ago

గుడ్​ న్యూస్​: హైదరాబాద్​ బుక్​ ఫెయిర్ ప్రారంభం- ఇక పది రోజులు పుస్తక ప్రియులకు పండగే! – HYDERABAD BOOK FAIR 2024

Andhrapradesh4 months ago

విజయవాడ వాసులకు అద్దిరిపోయే తీపికబురు.. ఏపీకి ఇది కదా కావాల్సింది.!

Latest4 months ago

ఏపీ మంత్రివర్గ భేటీ – వాలంటీర్లు, ఉద్యోగుల పీఆర్సీపై కీలక నిర్ణయం..!!

Education4 months ago

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఐఐటీ.. అన్నీ కుదిరితే అక్కడే.. ఎన్నాళ్లకెన్నాళకు!

Spiritual4 months ago

తిరుమల లడ్డూ వివాదంతో అయోధ్య రామాలయం సంచలన నిర్ణయం!

Andhrapradesh6 months ago

Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా?

Andhrapradesh6 months ago

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఆర్జిత సేవా టికెట్లు విడుదల ఎప్పుడంటే..?

Andhrapradesh6 months ago

Musi River: వివాదంగా మారిన మూసీ బ్యూటిఫికేషన్.. తమ ఇళ్లను కూల్చివేయొద్దంటూ..

Spiritual6 months ago

కృష్ణాష్టమి అంటే కన్నయ్య జన్మదినమే.. ఈ ప్రదేశాలలో జన్మాష్టమి పండుగను భిన్నంగా జరుపుకుంటారు

National6 months ago

స్తంభం పైన ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. ఇంతలో అటుగా వచ్చిన ఓ పక్షి…

National6 months ago

Railway Jobs: క్రీడాకారులకు సదావకాశం.. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

National6 months ago

ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ఏం సందేశం ఇచ్చారో తెలుసా?

Andhrapradesh6 months ago

NTR Health University: ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలకు యాజమాన్య కోటా నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

International6 months ago

యుద్ధం వస్తే ఎలా? టెక్నాలజీపరంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌ ఎవరు స్ట్రాంగ్‌?

Hashtag6 months ago

Pen Hospital: పెన్నుల కోసం ఓ స్పెషల్ హాస్పిటల్.. ఇచ్చట అన్ని పెన్నులు రిపేర్ చేయబడును..!

International6 months ago

రష్యాలోకి 30 కి.మీ. దూసుకెళ్లిన యుక్రెయిన్ సైన్యం.. సేఫ్ జోన్లకు 76 వేల మంది తరలింపు

National6 months ago

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలో హైఅలర్ట్ .. ఎర్రకోట వద్ద పటిష్ఠ భద్రత

National6 months ago

UPSC Civils Mains 2024: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసిందోచ్

Andhrapradesh6 months ago

AP Police Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్‌

International6 months ago

ఇజ్రాయెల్​పై దాడికి ఇరాన్‌ సన్నాహాలు – అణు జలాంతర్గామిని పంపిస్తున్న అమెరికా – Iran backed Attack On Israel

International6 months ago

‘రాక్షసి వెళ్లిపోయింది’ – హసీనాపై ముహమ్మద్ యూనుస్​ ఘాటు వ్యాఖ్య – Yunus Comments On Hasina

International6 months ago

Donald Trump : ‘ఎక్స్‌’లో డొనాల్డ్ ట్రంప్‌తో ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ.. ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Technology6 months ago

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరు గ్రూప్‌లో చేరడానికి ముందే అన్నీ తెలుసుకోవచ్చు!

Business8 months ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career8 months ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

News8 months ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

Business8 months ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

National9 months ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

Business8 months ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

International9 months ago

‘పోస్ట్​ స్టడీ వర్క్​ ఆఫర్​ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్​ వెళ్లే విద్యార్థులకు గుడ్​ న్యూస్​ – UK Graduate Route Visa

Education8 months ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

National8 months ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

Crime News8 months ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

Andhrapradesh7 months ago

జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

Andhrapradesh8 months ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

Telangana8 months ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

Railways8 months ago

పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే

Spiritual8 months ago

Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

National8 months ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

National8 months ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Andhrapradesh8 months ago

పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

Andhrapradesh8 months ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

Andhrapradesh8 months ago

సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల

Andhrapradesh12 months ago

మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ

National8 months ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

National8 months ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

Political8 months ago

కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

Andhrapradesh8 months ago

వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

National9 months ago

Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్

Andhrapradesh8 months ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

Andhrapradesh8 months ago

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

Political8 months ago

పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

National8 months ago

Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!

Trending