Spiritual

Yadadri Temple : యాదాద్రి భక్తులకు శుభవార్త -ఇక కొండపై నిద్రించే సౌకర్యం, ఈ రోజు నుంచే అమలు..!

Published

on

Yadadri Temple Latest News: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు యాదాద్రి ఆలయ అధికారులు. గతంలో మాదిరిగా యాదగిరిగుట్ట కొండపై నిద్రించే సౌకర్యాన్ని పునరుద్ధరించారు. ఈ మేరకు ప్రత్యేకంగా డార్మెంటరీ హాల్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

యాదాద్రి లక్ష్మీనర్సింహ్మా స్వామి(Yadadri Temple) భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. గతంలో మాదిరిగా కొండపైన భక్తులు నిద్రించే సౌకర్యాన్ని మళ్లీ పునరుద్ధరించింది. ఈ మేరకు కొండపైన ప్రత్యేకంగా డార్మెటరీ హాల్ ను ఏర్పాటు చేసింది. ఇందులో వెయ్యి మందికిపైగా భక్తులు నిద్రించే అవకాశం ఉంటుంది. ఈ డార్మెటరీ హాల్ ను స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇవాళ ప్రారంభించారు. ఇవాళ్టి నుంచే ఈ హాల్ భక్తులకు అందుబాటులోకి రానుందని వైటీడీఏ(YTDA) అధికారులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం… యాదగిరిగుట్టను సమూలంగా మార్చేసింది. 2015లో పునర్ నిర్మాణ పనులను మొదలుపెట్టింది. ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి…. కొత్త నిర్మాణాలను చేపట్టింది. ఈ పనులు 2022లో పూర్తి అయ్యాయి. ఇందులో భాగంగానే ఆలయ పేరును యాదాద్రిగా మార్చారు. గతంలో యాదగిరిగుట్టగా(Yadagirigutta Temple) ఆ ఆలయం ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. పునర్ నిర్మాణానికి ముందు భక్తులు కొండపై నిద్రించే అవకాశం ఉండేది. ఆటోలు కూడా పైకి వెళ్లివి. కొండపై నిద్రించి… స్వామివారికి మొక్కులు చెల్లించుకునేవారు భక్తులు. కానీ పునర్ నిర్మాణ పనుల తర్వాత… కొండపై అనేక మార్పులు చేశారు. నిద్రించే అవకాశం లేకుండా పోయింది. అదే కాకుండా ఆటోలను కూడా నిషేధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version