News

డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…

Published

on

ఆరంభంలోనే రాజకీయ పార్టీలకు చేదు అనుభవం

ఓటు రూ.3వేల నుంచి 5వేలతో కొనుగోలుకు ప్రయత్నం

ప్రలోభాలకు లొంగబోమని తేల్చిచెప్పిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట
ర్లు. ఉద్యోగుల్లో నెలకొన్న ఉత్సాహం ఆరంభంలోనే బయటపడింది. వారి ఓట్ల కోసం సామ, దాన,భేద దండోపా యాలు ఉపయో గించిన రాజకీయ పార్టీలు చివరికి డబ్బుతో కొనుగోలుకు విఫలయత్నం చేశాయి. అయినా అధికశాతం ఉద్యోగులు ప్రలోభాలకు తాము లొంగమని పలుచోట్ల బహిరంగంగా వ్యాఖ్యానించడం కనిపించింది. గతం కన్నా ఈ పర్యాయం ఒక్కో బ్యాలెట్‌ ఓటుకు రూ.3వేల నుంచి రూ.5వేలు వరకు ఆయా ప్రాంతాలను బట్టి కొనుగోళ్లకు ప్రయత్నించారు. అయితే గతం కన్నా భిన్నంగా ఎక్కువశాతం మంది ఉద్యోగులు నేతలు ఇచ్చే డబ్బులను తిరస్కరించారు. మొత్తంగా రాష్ట్రంలో ప్రారంభమైన ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల పోలింగ్‌ బాగా జరిగింది.
పోలింగ్‌ విధానం మార్పుతో..
గత పోస్టల్‌ బ్యాలెట్‌ విధానాన్ని మార్చి ఉద్యోగులు నేరుగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి అక్కడే ఓటు వేసి వెళ్లాలని ఈ పర్యాయం ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. గతంలో ఉద్యోగులు ఇంటి వద్ద ఓటువేసి దాన్ని సంబంధిత అధికారులకు నేరుగా కానీ, పోస్టల్‌లో కానీ ఇతరత్రా ద్వారా కానీ పంపించే అవకాశం ఉండేది. ఈ పర్యాయం కేటాయించిన పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లి బ్యాలెట్‌ పేపరు తీసుకుని అక్కడే ఓటు వేసి బాక్సులో వేయాల్సి ఉంది. దీంతో శనివారం నుంచి నాలుగురోజులపాటు ముందుగా ఓటు వేసుకోవాలనుకున్న ఉద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పించారు.
కొన్ని రాజకీయ పార్టీలు డబ్బుకు ప్రలోభ పెడితే ఆ డబ్బుని అనాధ శరణాలయాలకైనా ఇస్తాం కానీ మేము తీసుకోము
అంటూ పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, మాట్లాడడాన్ని సమాజంలోని పలువర్గాలు హర్షిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version