Andhrapradesh

విశాఖలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి తెగిపోయిన ఏసీ బోగీల లింక్

Published

on

విశాఖపట్నం నుంచి లింగంపల్లికి బయల్దేరిన జన్మభూమి సూపర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఈ రైలు విశాఖపట్నంలో ఉదయం 6.15కి బయల్దేరింది.. అయితే కొద్దిసేపటికే సమస్య తలెత్తడంతో ఆగిపోయింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది రైలును వెంటనే స్టేషన్‌కు తీసుకొచ్చి మరమ్మత్తులు చేపట్టారు.. ఏసీ బోగీ లింక్ తెగిపోవడంతోనే రైలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో రైలు నిదానంగానే వెళుతున్నట్లు సమాచారం.. ఒకవేళ రన్నింగ్‌లో తెగిపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. సాంకేతిక సమస్యతో 2 బోగీలు రైలు నుంచి విడిపోయాయని అధికారులు తెలిపారు. సమస్యను పరిష్కరించాక రైలును పంపిస్తామని వారు చెబుతున్నారు. మరమ్మత్తుల తర్వాత రైలు అక్కడి నుంచి బయల్దేరనుంది.. ఇవాళ రైలు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని చెబుతున్నారు.

జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ ప్రతి రోజూ ఉదయం 6.15 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుంది. రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా లింగంపల్లికి రాత్రి 7.40 గంటలకు చేరుకుంటుంది. ఇటు జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ లింగంపల్లి నుంచి ప్రతి రోజూ ఉదయం 6.15కి బయల్దేరుతుంది.. విశాఖపట్నంకు రాత్రి 7.40కు చేరుకుంటుంది. విశాఖపట్నం నుంచి ఎక్కువమంది ఈ రైల్లో హైదరాబాద్ వస్తుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version