Business
Tax on electric vehicles : అలర్ట్.. ఈవీలపై కొత్త ట్యాక్స్ విధించిన ప్రభుత్వం!
Karnataka government imposes Tax on electric vehicles : ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈవీ సెక్టార్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. పర్యావరణ పరిక్షణకు ఇది మంచి విషయం అని అందరు భావిస్తున్న సమయంలో.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది! ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలపై అదనంగా ట్యాక్స్లను వసూలు చేయాలని ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు.. కర్ణాటక మోటార్ వెహికిల్ ట్యాక్సేషన్ యాక్ట్ 2024ని సవరించింది. ఫలితంగా.. ప్రస్తుతం ఉన్న రోడ్డు ట్యాక్స్కు అదనంగా.. ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలపై 10శాతం లైఫ్టైమ్ ట్యాక్స్ కూడా పడనుంది. ఇది.. ఈవీ సేల్స్పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనలపై ట్యాక్స్ పెంపు..
కర్ణాటక మోటార్ వెహికిల్ ట్యాక్సేషన్ యాక్ట్ 2024కి చేసిన సవరణ ప్రకారం.. రూ. 25లక్షల కన్నా ఎక్కువ ధర ఉండే ఈవీలపై అదనంగా 10శాతం లైఫ్టైమ్ ట్యాక్స్ పడుతుంది. రిజిస్ట్రేషన్ సమయంలో ట్యాక్స్ వేస్తారు.
“ఎలక్ట్రిసిటీపై నడిచే.. మోటార్ కార్స్, జీప్స్, ఓమ్నీబస్సులు, ప్రైవేట్ సర్వీస్ వెహికిల్స్పై, వాటి ధరల మీద అదనంగా 10శాతం లైఫ్టైమ్ ట్యాక్స్ వేస్తున్నాము. రూ. 25లక్షల కన్నా ఎక్కువ ధర ఉండే ఈవీలపై ఇది వర్తిస్తుంది,,” అని కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఉంది.
Tax on electric vehicles in Karnataka : ఈ కొత్త ట్యాక్స్కి ముందే.. దేశంలోనే రోడ్డు ట్యాక్స్లు అధికంగా ఉన్న రాష్ట్రంగా నిలిచింది కర్ణాటక. ఇక్కడ.. వాహనాలపై 13శాతం నుంచి 20శాతం మధ్యలో ట్యాక్స్ వస్తోంది ప్రభుత్వం. ఇక ఇప్పుడు 10 పర్సెంట్ లైఫ్టైమ్ ట్యాక్స్తో ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికిల్స్ ధరలు మరింత పెరగనున్నాయి. అయితే.. ప్యూర్ ఈవీలను రోడ్డు ట్యాక్స్ నుంచి మినహాయించిన కర్ణాటక ప్రభుత్వం.. హై ఎండ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్పై ఇnewలా అదనంగా పన్నులు విధిస్తుండటం గమనార్హం. ఇక ఈవీలకు జీరో రిజిస్ట్రేషన్ ఫీజుతో రోడ్డు ట్యాక్స్ మినహాయింపును కూడా ఇస్తోంది కర్ణాటక ప్రభుతవం. ఇతర రాష్ట్రాల్లో.. ఈవీ పాలసీలతో సబ్సిడీలు ఇస్తున్నాయి.
ఇక కర్ణాటక ప్రభుత్వం తాజా నిర్ణయంతో.. ఎలక్ట్రిక్ కార్లపై ప్రభావం చూపుతుంది. కానీ.. రానున్న సంవత్సరాల్లో ఈవీ సెగ్మెంట్కు డిమాండ్ మరింత పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2030 నాటికి.. కర్ణాటకలో 23 లక్షలకుపైగా ఈవీలు అమ్ముడుపోతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇప్పటికే ఈ నెంబర్ 3లక్షలు దాటిపోయింది.
Business
18 నెలల తర్వాత విప్రోలో పెరిగిన ఉద్యోగులు.. ట్రెండ్ మార్చేసిందిగా.. మరో అదిరిపోయే గుడ్న్యూస్ కూడా..
దేశంలోని నాలుగో అతిపెద్ద ఐటీ సంస్థ విప్రో.. శుక్రవారం రోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించింది. అంతకుముందుతో పోలిస్తే ఈ Q1 నికర లాభం 4.6 శాతం పెరిగి రూ. 3003.2 కోట్లకు చేరింది. ఇదే సమయంలో గతంలో ఉన్న ట్రెండ్ మార్చేసింది. వరుసగా 6 త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గగా ఈ సారి మాత్రం పెరిగింది. మరోవైపు కొత్త నియామకాల ప్రణాళికల్ని కూడా వివరించింద
18 నెలల తర్వాత విప్రోలో పెరిగిన ఉద్యోగులు.. ట్రెండ్ మార్చేసిందిగా.. మరో అదిరిపోయే గుడ్న్యూస్ కూడా..!
IT Employees: దేశంలోని నాలుగో అతిపెద్ద ఐటీ సంస్థ విప్రో.. శుక్రవారం రోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించింది. అంతకుముందుతో పోలిస్తే ఈ Q1 నికర లాభం 4.6 శాతం పెరిగి రూ. 3003.2 కోట్లకు చేరింది. ఇదే సమయంలో గతంలో ఉన్న ట్రెండ్ మార్చేసింది. వరుసగా 6 త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గగా ఈ సారి మాత్రం పెరిగింది. మరోవైపు కొత్త నియామకాల ప్రణాళికల్ని కూడా వివరించింది
Wipro Hiring Plans: భారత దిగ్గజ ఐటీ సంస్థలు వరుసగా 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాల్ని ప్రకటిస్తున్నాయి. తొలుత అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, తర్వాత వరుసగా హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ కూడా ఫలితాలు వెల్లడించగా ఇప్పుడు శుక్రవారం రోజు విప్రో కూడా Q1 ఫలితాల్ని వెల్లడించింది. ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో విప్రో నికర లాభం రూ. 3003.2 కోట్లుగా నమోదైంది. కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఇది 4.6 శాతం మేర పెరిగింది. ఇక ఆదాయం 3.8 శాతం తగ్గి రూ. 21,963.8 కోట్లకు చేరింది. అంతకుముందు ఇది రూ. 22,831.10 కోట్లుగా ఉండేది. ఇటీవలి కొన్ని త్రైమాసికాలతో పోలిస్తే విప్రో ఈసారి అంచనాల్ని మించి రాణించిందని చెప్పొచ్చ
విప్రో ఉద్యోగులు
ఇక విప్రోను గత కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన అతిపెద్ద సమస్య కంపెనీలో ఉద్యోగుల సంఖ్య తగ్గుతుండటం. ముఖ్యంగా గడిచిన 6 త్రైమాసికాలు అంటే మొత్తం 18 నెలలు.. విప్రోలో ఉద్యోగుల సంఖ్య తగ్గుతూనే వచ్చింది. అయితే ఈసారి మాత్రం ట్రెండ్ మార్చేసింది. గత 6 త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గగా ఈసారి మాత్రం అది పెరిగింది.
విప్రో ఉద్యోగుల సంఖ్య..
ఈ ఏప్రిల్- జూన్ సమయంలో విప్రోలో ఉద్యోగుల సంఖ్య 337 పెరిగింది. జూన్ 30 తో ముగిసిన నాటికి ఈ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,34,391 గా ఉంది. అయినప్పటికీ కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలోని ఉద్యోగుల సంఖ్యతో చూస్తే 15,367 తక్కువే. అప్పుడు ఉద్యోగుల సంఖ్య 2,49,758 గా ఉండగా.. వరుసగా 3 త్రైమాసికాల్లో ఈ మేర తగ్గిందన్నమాట. ఇక ఫలితాల సందర్భంగానే అట్రిషన్ రేటు గురించి కూడా ప్రకటించింది సంస్థ. ఇది 14.2 శాతం నుంచి 14.1 శాతానికి దిగొచ్చింది.
విప్రో నియామకాలు..
మరోవైపు కొత్త నియామకాలపైనా విప్రో కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 10 వేల మంది నుంచి 12 వేల వరకు తాజా ఉత్తీర్ణుల్ని (ఫ్రెషర్స్) క్యాంపస్ రిక్రూట్మెంట్లు (కళాశాల ప్రాంగణాలు), ఆఫ్ క్యాంపస్ ఎంపికల ద్వారా నియమించుకోబోతున్నట్లు స్పష్టం చేసింది. ఇక ఇప్పటివరకు ఆఫర్ లెటర్స్ ఇచ్చినవారికి కొలువులు ఇవ్వడం పూర్తి చేయనున్నట్లు విప్రో హెచ్ఆర్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ వెల్లడించారు. ఈ 3 నెలల సమయంలో 3 వేల మందిని కొత్తగా చేర్చుకున్నట్లు వివరించారు. గత త్రైమాసికంలో కొత్తగా 100 కోట్ల డాలర్ల విలువైన ఆర్డర్స్ దక్కించుకున్నట్లు తెలిపారు విప్రో సీఈఓ
Business
పోస్టాఫీసులో ఖాతా ఉన్న వారికి నిర్మలా సీతారామన్ ఊహించని శుభవార్త
ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకుల మాదిరిగానే, పోస్ట్ ఆఫీస్లు కూడా చాలా పొదుపు పథకాలను కలిగి ఉన్నాయి, కొన్ని పోస్టాఫీసు పథకాలు కస్టమర్ పెట్టుబడి కోసం బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి. ఈ విధంగా, జూలై 1 నుండి, పోస్ట్ ఆఫీస్లో అనేక కొత్తపథకాలు ప్రారంభమయ్యాయి, మీకు అద్భుతమైన రాబడిని ( Amazing Returns ) ఇచ్చే పెట్టుబడి వనరులో పెట్టుబడి పెట్టడానికి మీకు ప్రణాళిక ఉంటే, Post Office యొక్క ఈ new RD scheme మీ ఉత్తమ ఎంపిక.
పోస్టాఫీసు ( Post Office ) యొక్క ఈ కొత్త ఆర్డి పథకంలో మీరు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలనే నియమం లేదు. బదులుగా, మీరు వీలైనంత తక్కువ డబ్బుతో చిన్న పెట్టుబడిని ( Small Investment ) ప్రారంభించవచ్చు. ఇక్కడ వారు మీ పెట్టుబడికి తక్కువ స్థాయి పన్నులతో పూర్తి భద్రతను అందిస్తారు మరియు మెచ్యూరిటీ వ్యవధిలో మీ మొత్తం పెట్టుబడికి రాబడితో పాటు అద్భుతమైన రాబడిని అందిస్తారు.
Post Office Recurring Deposit Scheme:
పోస్టాఫీసు ( Post Office ) యొక్క ఈ కొత్త ఆర్డి పథకంలో మీరు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలనే నియమం లేదు. బదులుగా, మీరు వీలైనంత తక్కువ డబ్బుతో చిన్న పెట్టుబడిని ( Small Investment ) ప్రారంభించవచ్చు. ఇక్కడ వారు మీ పెట్టుబడికి తక్కువ స్థాయి పన్నులతో పూర్తి భద్రతను అందిస్తారు మరియు మెచ్యూరిటీ వ్యవధిలో మీ మొత్తం పెట్టుబడికి రాబడితో పాటు అద్భుతమైన రాబడిని అందిస్తారు.
ఈ ప్రత్యేక రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ( special recurring deposit scheme ) లో, పెట్టుబడిదారుల డబ్బుకు 7.5% వడ్డీ రేటు నిర్ణయించబడింది. కేవలం ఐదేళ్లపాటు ఇన్వెస్ట్ చేయండి మరియు మెచ్యూరిటీ వ్యవధిలో పొదుపుతో అధిక రాబడిని పొందండి.
కనీసం ₹100తో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి:
పోస్టాఫీసు ప్రత్యేక RD పథకంలో కేవలం వంద రూపాయల నుండి పెట్టుబడిని ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. మీరు అటువంటి ప్రత్యేక పథకాల ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, మీరు వెంటనే మీ సమీపంలోని పోస్టాఫీసు శాఖ Post Office ను సందర్శించి పెట్టుబడి ఖాతాను తెరవవచ్చు.
ఉదాహరణ: మీరు నెలవారీ ₹840 పెట్టుబడితో 5-సంవత్సరాల ప్లాన్ను ప్రారంభిస్తే, మీ మొత్తం పెట్టుబడి మొత్తం సంవత్సరానికి ₹10,080 అవుతుంది. దీని ప్రకారం ఐదు సంవత్సరాలకు ₹50,400. మెచ్యూరిటీ వ్యవధిలో 7.5% వడ్డీ ప్రాతిపదికన మొత్తం ₹72,665 విత్డ్రా చేసుకోవచ్చు.
Business
Wipro: ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. విప్రో జాక్పాట్.. అమెరికా కంపెనీతో రూ.4500 కోట్ల డీల్!
Wipro: కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రభావితమైన రంగాల్లో టెక్ కంపెనీలే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలే గతేడాది భారీగా ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. టెక్, ఐటీ కంపెనీలకు పెద్ద డీల్స్ అంతంమాత్రంగానే ఉంటుండడంతో చాలా కంపెనీలు వ్యయనియంత్రణ చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశీయ టెక్ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించాయి. దీంతో ఐటీ ఉద్యోగుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. కానీ, ఇటీవల భారతీయ టెక్ కంపెనీలకు గిరాకీ క్రమంగా పుంజుకుంటోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్ వంటి కంపెనీలు బిగ్ డీల్స్ సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు వాటి జాబితాలో చేరిపోయింది దేశీయ టెక్ దిగ్గజం విప్రో.
ఐటీ సర్వీసెస్ మేజర్ విప్రో తాజాగా అమెరికా కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి సుమారు 550 మిలియన్ డాలర్ల ఆర్డర్ అందుకుంది. ఈ డీల్పై ఇరు సంస్థలు సంతకాలు చేసినట్లు సమాచారం. ఈ కాంట్రాక్టు 5 ఏళ్ల పాటు ఉంటుందని, అమెరికా కంపెనీతో 550 మిలియన్ డాలర్ల డీల్ కుదిరినట్లు ఎక్స్చేంజీ ఫైలింగ్లో వెల్లడించింది విప్రో. భారత దేశ కరెన్సీలో చూసుకుంటే ఈ డీల్ విలువ సుమారు రూ.4500 కోట్లకుపైగా ఉంటుంది. ఈ డీల్ ద్వారా 5 ఏళ్ల పాటు అమెరికా కమ్యూనికేషన్ సర్వీసెస్ ప్రొవైడర్కు కొన్ని ప్రొడక్టులు, పరిశ్రమ నిర్దిష్ట పరిష్కారాల కోసం నిర్వహించే సేవలను అందిస్తుందని ఎక్స్చేంజీ ఫైలింగ్లో వెల్లడించింది. అయితే, ఈ డీల్కి సంబంధించిన ఇతర విషయాలేమీ విప్రో బహిర్గతం చేయలేదు.
ప్రస్తుతం ఐటీ పరిశ్రమ అనిశ్చితిలో ఉన్న క్రమంలో భారీ డీల్ కుదుర్చుకోవడం కంపెనీతో పాటు అందులో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులకు సైతం శుభవార్తగానే చెప్పవచ్చు. ప్రాజెక్టులు పెరగడం ద్వారా ఉద్యోగుల తొలగింపులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మరింత మందికి ఉపాధి లభిస్తుంది. మరోవైపు.. ఈ డీల్పై పూర్తి విప్రో కంపెనీ ప్రతినిధి ఒకరు పలు విషయాలు వెల్లడించారు. ఇది 5 ఏళ్ల టైమ్ పీరియడ్ కాంట్రాక్ట్ అని తెలిపారు. ఎంపిక చేసిన ప్రొడక్టులు, ఇండస్ట్రీకి సంబంధించిన నిర్దిష్ట సొల్యూషన్స్ కోసం సర్వీసులు అందించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న స్టేజీలో మిగిలిన వివరాలను కంపెనీ బహిర్గతం చేయాలనుకోవట్లేదని వెల్లడించారు.
500 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు ఉండే పెద్ద డీల్స్, కాంట్రాక్టులు అనేవి టాప్ టైప్ ఐటీ సర్వీసెస్ సంస్థలకు చాలా కీలకంగా ఐటీ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ డీల్స్ నేరుగా కంపెనీల రెవెన్యూ వృద్దిపై ప్రభావం చూపుతాయి. గత ఆర్థిక ఏడాది క్యూ4లో విప్రో ఇప్పటికే అతిపెద్ద డీల్ 1.2 బిలియన్ డాలర్ల డీల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇది ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన కంపెనీ రెవెన్యూ వృద్ధిని 9.5 శాతం మేర పెంచింది.
-
Business3 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career3 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
Business3 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
National4 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
News3 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business3 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
Education3 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National3 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
National3 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Andhrapradesh3 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Spiritual3 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
Crime News3 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Telangana3 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Andhrapradesh2 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
National3 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Railways3 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National3 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh3 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
National3 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Andhrapradesh3 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Political3 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Political3 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh3 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Andhrapradesh3 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
National3 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Weather3 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Andhrapradesh3 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Education3 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Andhrapradesh3 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Business4 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Andhrapradesh3 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
National4 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh3 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
News3 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
News4 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
International4 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Spiritual3 months ago
చార్ ధామ్ యాత్రకు పొటెత్తిన భక్తులు.. గత ఏడాదికంటే ఎక్కువే!
-
International4 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Andhrapradesh3 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Cinema6 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Andhrapradesh3 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Railways2 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh3 months ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
News3 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh3 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
International3 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Andhrapradesh7 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Cinema3 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
-
Spiritual3 months ago
Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?
-
Business4 months ago
Bank Holidays June-2024: జూన్లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?