International
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
భారీగా సరుకు రవాణా చేయాలంటే పెద్ద పెద్ద షిప్లలో సముద్రాల గుండా తరలిస్తూ ఉంటారు. అయితే 300 ఏళ్ల క్రితం.. 200 టన్నుల బంగారం, వజ్రాలు, ఇతర లోహాలతో ప్రయాణిస్తున్న ఓ భారీ నౌకపై దాడి జరిగింది. ఆ దాడిలో దెబ్బతిన్న ఆ షిప్.. సముద్రంలో మునిగిపోయింది. అయితే దాన్ని కొన్నేళ్ల క్రితమే గుర్తించినా.. ఆ సొత్తును ఎవరు తీసుకోవాలో తేల్చుకోలేక.. ఆ నౌకను బయటికి తీసే ప్రక్రియను విరమించుకున్నారు. అయితే ఇప్పుడు దాన్ని వెలికి తీసేందుకు అక్కడి ప్రభుత్వం తెగ ఆరాటపడుతోంది. ఒక వేళ.. ఆ మునిగిపోయిన నౌకలో ఉన్న వజ్రవైఢుర్యాలు వెలికి తీస్తే.. భారీగా సొత్తు స్వాధీనం చేసుకోవచ్చని భావిస్తోంది. అయితే ఆ సంపద ఎవరిదీ అని తేల్చుకునేందుకు కోర్టుల్లో కేసులు ఉండగానే.. దాన్ని ఎలా బయటికి తీయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.
1708 సంవత్సరంలో పెరూ నుంచి స్పెయిన్కు బయల్దేరిన స్పానిష్కు చెందిన శాన్ జోస్ అనే పురాతన నౌక కరేబియన్ సముద్రంలో మునిగింది. బంగారం, వెండి, రత్నాలతో కూడిన 200 టన్నుల సొత్తుతో ప్రారంభమైన ఆ నౌక.. పనామా కాలువ మీదుగా కొలంబోకు 600 మంది సెక్యూరిటీ సిబ్బందితో బయల్దేరింది. అయితే ఈ నౌకపై శత్రువులు దాడి చేశారు. ఈ దాడిలో శాన్ జోస్ నౌకలో ఉన్న భద్రతా సిబ్బందిలో చాలా మంది మృత్యువాత పడ్డారు. మిగిలిన వారు ప్రాణ భయంతో ఎట్టకేలకు సురక్షితంగా బయటపడి ఒడ్డుకు చేరారు.
ఈ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న శాన్ జోస్ నౌక.. కరేబియన్ సముద్రంలో మునిగిపోయింది. కరేబియన్ సముద్రంలో 600 మీటర్ల లోతులో శిథిలాల కింద చిక్కుకుంది. అయితే శాన్ జోస్ షిప్ను సముద్ర గర్భం నుంచి వెలికితీస్తామని కొలంబియా ఇటీవల ఒక ప్రకటన చేసింది. కొలంబియా ప్రకటనతో అమెరికా, స్పెయిన్, పెరూ సహా పలు దేశాలు అలర్ట్ అయ్యాయి. ఎందుకంటే ఆ షిప్.. స్పెయిన్కు చెందింది కాగా.. పెరూలోని బంగారం, వెండి, రత్నాలను.. పనామా కాల్వ మీదుగా కొలంబియాకు తరలిస్తుండగా.. మునిగిపోయింది. దీంతో అందులో ఉన్న సంపద తమదే అంటూ వివిధ దేశాలు కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్నాయి.
ఇక కరేబియన్ సముద్రంలో శాన్ జోస్ మునిగిపోయిన ప్రాంతంలో పరిశోధన ప్రారంభించినట్లు కొలంబియా ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ది కొలంబియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ సంస్థ-ఐసీఏఎన్హెచ్.. స్పెషల్ రిమోట్ సెన్సర్లను ఉపయోగించి.. శాన్ జోస్ ఫోటోలను తీయనుంది. ఆ ఫోటోల ఆధారంగా తర్వాత పరిశోధన, వెలికితీత కొనసాగుతాయని తెలిపింది. ఇక శాన్ జోస్ మునిగిపోయిన ప్రాంతాన్ని ఇప్పటికే ఐసీఏఎన్హెచ్ రక్షిత పురాతత్వ ప్రదేశంగా గుర్తించింది.
అయితే గతంలోనే శాన్ జోస్ ఆనవాళ్లను కనిపెట్టారు. 1981లో అమెరికాకు చెందిన సముద్ర గర్భంలో అన్వేషణ సంస్థ సీసెర్చి ఆర్మడా.. శాన్ జోస్ నౌక శకలాలు గుర్తించినట్లు తెలిపింది. అయితే కొలంబియా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలం కావడంతో.. కొలంబియా పార్లమెంట్ ఈ నిధిపై పూర్తి హక్కు తమదేనని ప్రకటించింది. కేవలం 5 శాతం ఫీజు కింద సీసెర్చి ఆర్మడా సంస్థకు ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో ఆ సంస్థ అమెరికా కోర్టులో కేసు వేయగా.. రెండుసార్లు ఆ సంపదపై కొలంబియాదే హక్కు అని కోర్టు తేల్చిచెప్పింది.
ఈ ఘటన జరిగిన కొన్ని దశాబ్దాల తర్వాత 2015లో శాన్ జోస్ శకలాలను తామే స్వయంగా కనుగొన్నట్లు కొలంబియా ప్రకటించింది. భారీ రాగి తుపాకులు వంటి పరికరాలు ఆ ప్రాంతంలో ఉన్నట్లు తెలిపింది. దీని కోసం బ్రిటిష్, అమెరికా కంపెనీల సాయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో ఎస్ఎస్ఏ సంస్థ పర్మినెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో 10 బిలియన్ డాలర్లకు కొలంబియాపై కేసు వేసింది. మరోవైపు స్పెయిన్, పెరూ ప్రభుత్వాలు కూడా ఆ నౌకపై యాజమాన్య హక్కులు తమవే అని వాదిస్తున్నాయి. అయితే శాన్ జోస్ మునిగిన ప్రాంతాన్ని కొలంబియా ప్రభుత్వం, ఎస్ఎస్ఏ కంపెనీ ఇప్పటివరకు ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచాయి.
International
యుద్ధం ముగించేందుకు సిద్ధం- జెలెన్స్కీతో మాత్రం మాట్లాడం: పుతిన్ – PUTIN ON RUSSIA UKRAINE WAR
Putin On Russia Ukraine War : ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఇందుకోసం ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎలాంటి ముందస్తు షరతులు కూడా పెట్టబోమని చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాత్రం మాట్లాడే ప్రసక్తి లేదని పుతిన్ స్పష్టం చేశారు. ఆ దేశ పార్లమెంటుతో మాత్రమే తాము చర్చలు జరుపుతామని చెప్పారు.
‘భూభాగాన్ని ఆక్రమిస్తూనే ఉన్నాం’
అయితే ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాదికి వాయిదా పడ్డాయని తెలిపారు. జెలెన్స్కీని తాము చట్టబద్ధ అధ్యక్షుడిగా చూడటం లేదని అన్నారు. గురువారం పుతిన్ నాలుగున్నర గంటల పాటు సాగిన వార్షిక విలేకరుల సమావేశంలో వివిధ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఉక్రెయిన్తో యుద్ధంలో తాము విజయానికి చేరువలో ఉన్నామని తెలిపారు. తమ దళాలు రోజుకొక చదరపు కిలోమీటర్ భూభాగాన్ని ఆక్రమిస్తూనే ఉన్నామని పుతిన్ చెప్పారు. తాము చేపట్టిన ప్రత్యేక సైనిక ఆపరేషన్ విజయవంతమవుతోందని అన్నారు.
‘ట్రంప్ను కలవడానికి నేను సిద్ధం’
మరోవైపు, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్తో నాలుగేళ్లుగా తాను మాట్లాడలేదని అయితే ఆయన్ను కలవడానికి తాను సిద్ధంగా ఉన్నానని పుతిన్ చెప్పారు. అంతకుముందు అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడిపై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. ఆయన తెలివైన రాజకీయ నేత అని అన్నారు. అయితే, ఇటీవల ఆయనపై జరిగిన హత్యాయత్నాలు దిగ్భ్రాంతి కలిగించాయన్న పుతిన్, ప్రస్తుతం ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల ప్రచారంలో జరిగిన ఘటనలను గుర్తుచేసుకున్నారు.
“అమెరికా ఎన్నికల్లో ట్రంప్పై పోరాడేందుకు కొందరు అనాగరిక పద్ధతులు పాటించారు. ఆయన కుటుంబాన్ని, పిల్లలను లక్ష్యంగా చేసుకొని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడం దిగ్భ్రాంతి కలిగించింది. ఒకటికంటే ఎక్కువసార్లు ఆయనపై హత్యాయత్నాలు జరగడం విచారకరం. నా ఆలోచన ప్రకారం ఇప్పుడు ట్రంప్ ఏమాత్రం సురక్షితంగా లేరు. అయితే ఆయన తెలివైన వ్యక్తి. ముప్పును అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉంటారని విశ్వసిస్తున్నా” అని పుతిన్ తెలిపారు.
International
అమెరికాకు తప్పిన షట్ డౌన్ ముప్పు! నిధుల బిల్లుకు చివరి క్షణంలో ఆమోదం – US SHUTDOWN 2024
US Shutdown 2024 : అమెరికా షట్డౌన్ గండం నుంచి తప్పించుకున్నట్లే కనిపిస్తోంది. ట్రంప్ డిమాండ్లతో నిలిచిపోయిన కీలక నిధుల బిల్లును ప్రతినిధుల సభ చివరి క్షణంలో ఆమోదం తెలిపింది. శుక్రవారం అర్ధరాత్రిలోగా ఉన్న గడువుకు కొన్ని గంటల ముందు అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశపెట్టిన కొత్త ప్రణాళికకు ప్రతినిధుల సభ ఆమోదించింది. అయితే, అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేవనెత్తిన డిమాండ్లను ఈ ప్లాన్ నుంచి తొలగించింది. అనంతరం ఈ బిల్లును సెనెట్కు పంపింది. అక్కడ కూడా ఆమోదం లభిస్తే అమెరికాకు షట్డౌన్ ముప్పు తొలగిపోతుంది.
బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన రిపబ్లికన్లు
ప్రభుత్వ కార్యకలాపాలు, జీతాలకు సంబంధించి ప్రభుత్వానికి నిధులు సమకూర్చేలా బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును తొలుత ట్రంప్ తిరస్కరించారు. సమాఖ్య ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం సహా వివిధ ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించేందుకు ఈ బిల్లులో రెండేళ్లపాటు రుణాలపై పరిమితిని ఎత్తివేయాలంటూ కోరారు. దీంతో ట్రంప్ ప్రతిపాదనను చేరుస్తూ ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ గురువారం సరికొత్త బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే, దీన్ని ప్రతినిధుల సభ 235-174తో తిరస్కరించింది. ఏకంగా 38 మంది రిపబ్లికన్ సభ్యులే డెమొక్రాట్లతో కలిసి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.
‘అధికార మార్పిడికి అంతరాయం’
అయితే తాజా పరిణామాలపై వైట్ హౌస్ స్పందించింది. షట్డౌన్ వస్తే అధికార మార్పిడికి అంతరాయం కలుగుతుందని వ్యాఖ్యానించింది. దీంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అటు రిపబ్లికన్ల నుంచే వ్యతిరేకత రావడం వల్ల ఈ బిల్లులో మళ్లీ మార్పులు చేశారు. ట్రంప్ చేసిన డిమాండ్లను తొలగించి సమాఖ్య కార్యకలాపాలకు నిధులు, విపత్తు సహకారం వంటి అంశాలతో 118 పేజీల మరో కొత్త ప్యాకేజీ బిల్లును స్పీకర్ మైక్ జాన్సన్ శుక్రవారం సభలో ప్రవేశపెట్టారు. దీనికి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఈ బిల్లుకు 366-34తో ప్రతినిధుల సభ ఆమోదం లభించింది. మెజారిటీ రిపబ్లికన్లు ఈ కొత్త బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. అనంతరం దీన్ని సెనెట్కు పంపించారు. ప్రస్తుతం సెనెట్లో డెమొక్రాట్లకు ఆధిక్యం ఉంది. దీంతో అక్కడ కూడా బిల్లు సునాయాశంగా ఆమోదం పొందే అవకాశం ఉంది. శుక్రవారం అర్ధరాత్రిలోగా (అమెరికా కాలమానం ప్రకారం) సెనెట్ ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది.
ట్రంప్ హయాంలో షట్డౌన్
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు ప్రభుత్వం మూతపడింది. దేశ చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్డౌన్గా నిలిచింది. ఈ సారి కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయనుకున్నా ఆఖరి నిమిషంలో అమెరికాకు షట్డౌన్ ముప్పు తప్పింది.
International
భారత్, చైనాల మధ్య శాంతికి రోడ్ మ్యాప్.. సంబంధాల బలోపేతానికి ఆరు సూత్రాల ప్రణాళిక
సరిహద్దుల్లోని తూర్పు లడఖ్ వద్ద ఘర్షణతో భారత్, చైనాల మధ్య దాదాపు ఐదేళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు స్తంభించిపోయాయి. ఈ తరుణంలో సంబంధాల పునరుద్దరణకు ఇరు దేశాలూ ముందుడుగు వేశాయి. బీజింగ్లో బుధవారం భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధులు భేటీ అయ్యాయి. ఈ ప్రతినిధుల బృందానికి భారత్ నుంచి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా నుంచి విదేశాంగ మంత్రి వాంగ్ యీ నేతృత్వం వహించారు. చర్చల్లో శాంతి స్థాపనకు రోడ్ మ్యాప్, సంబంధాల బలోపేతానికి ఆరు సూత్రాల ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించారు. టిబేట్ మీదుగా కైలాస మానసరోవర యాత్ర పునరుద్ధరణ, నదీజలాల వివరాలను పంచుకోవడం, పరస్పరం వాణిజ్యం పెంపు వంటి అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు.
సానుకూల వాతావరణంలో ఈ చర్చలు సాగాయని, ఆరు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చైనా ప్రకటించింది. ‘దశల వారీగా రోడ్మ్యాప్పై అంగీకారానికి వచ్చాం… ఇది వివాదాస్పద అంశాలను పక్కనబెట్టి సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సమస్యలను సులభంగా పరిష్కరించడానికి సహకరిస్తుంది’ అని చైనా తెలిపింది.అయితే, భారత్ మాత్రం దానిని ప్రస్తావించకపోవడం గమనార్హం. సైనిక బలగాల ఉపసంహరణపై అక్టోబరు 21న జరిగిన ఒప్పందం అమలు ఫలితంగా సరిహద్దుల్లో పెట్రోలింగ్ మొదలైందని భారత్ పేర్కొంది.
మొత్తం ద్వైపాక్షిక సంబంధాల నుంచి సరిహద్దు వివాదాలను వేరుచూసి.. సరైన రీతిలో పరిష్కరించుకోవాలని తద్వారా ఆ ప్రభావం సంబంధాలపై పడకుండా చూసుకోవాలని నిర్ణయించారు. సముచిత, సహేతుక, పరస్పర ఆమోదయోగ్యమైన ప్యాకేజీలకు ఇకపైనా కట్టుబడి ఉండాలని, శాంతికి విఘాతం కలగకుండా చూసుకోవాలని తీర్మానించారు.
అలాగే, ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, సైనిక-దౌత్యపరమైన చర్చలను సమన్వయంతో మెరుగుపరచాలని నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో ప్రతినిధుల సమావేశాన్ని వచ్చే ఏడాది భారత్లో నిర్వహించాలని అవగాహనకు వచ్చారు. కాగా, సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు ప్రత్యేక ప్రతినిధులు 2003 నుంచి ఇప్పటివరకు 22సార్లు భేటీ అయ్యి చర్చలు జరిపారు. ప్రస్తుతం జరిగింది 23వ సమావేశం. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిని నెలకొల్పడం, ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్దరణ ఈ చర్చల లక్ష్యం.
వివాదాస్పద పాయింట్ల దెమ్చోక్, దెప్సాంగ్ల నుంచి సైన్యాల ఉపసంహరణకు అక్టోబరు 21న ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో పాటు అక్టోబరు 24న రష్యాలోని కజాన్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రత్యేకంగా భేటీ అయి సయోధ్యకు మార్గం వేశారు.
-
Business8 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career8 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News8 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business8 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National9 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business8 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International8 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education7 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National7 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh7 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Crime News7 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh7 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana8 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
National8 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Spiritual7 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
Railways7 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National7 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Andhrapradesh7 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh7 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
National7 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Andhrapradesh7 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
National7 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh11 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Political7 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
National8 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh7 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Political7 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh7 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Andhrapradesh7 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
National8 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Business8 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Cinema10 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Andhrapradesh7 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh6 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
Education7 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Weather7 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
International8 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
News8 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
News7 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh7 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
Railways6 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh7 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Business8 months ago
Bank Holidays June-2024: జూన్లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Andhrapradesh8 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
News7 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
International7 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Andhrapradesh7 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
Cinema8 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
-
Andhrapradesh7 months ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
Education11 months ago
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు