Andhrapradesh
టార్గెట్ బాలయ్య.. ఎమ్మెల్యే బాలకృష్ణ ఓటమికి వైసీపీ భారీ స్కెచ్..! ఏంటా వ్యూహం

Target Balakrishna : చరిత్ర సృష్టించాలన్నా మేమే.. చరిత్ర తిరగరాయాలన్నా మేమే… నందమూరి నటసింహాం ఫేమస్ డైలాగ్ ఇది… సినిమాల్లో సూపర్ హిట్ అయిన డైలాగ్తో రాజకీయాల్లోనూ వర్కౌట్ చేయాలనుకుంటున్నారు బాలయ్య. ఓటమంటే తెలియని హిందూపురంలో మూడోసారి గెలిచి హాట్రిక్ కొట్టాలనుకుంటున్న బాలయ్యకు చెక్ చెప్పేందుకు భారీ స్కెచ్చే వేసింది వైసీపీ.
నాలుగు దశాబ్దాలుగా ఇతర పార్టీ జెండా ఎగరని చోట తొలిసారి విజయం సాధించి టీడీపీకి షాక్ ఇవ్వాలనుకుంటోంది. రాయలసీమకే పెద్ద దిక్కైన పెద్దిరెడ్డిని రంగంలోకి దింపింది. వైరిపక్షాలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో హిందూపురం ఎన్నిక హోరాహోరీగా మారింది. ఇంతకీ ఏ పార్టీ ఎత్తుగడ ఏంటి?
1983 నుంచి ఇప్పటివరకు టీడీపీదే విజయం..
రాష్ట్రంలో హిందూపురం నియోజకవర్గం పేరు చెబితే గుర్తొచ్చేది రెండే రెండు. ఒకటి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, రెండోది తెలుగుదేశం పార్టీ. టీడీపీ అంటే హిందూపురం.. హిందూపురం అంటే టీడీపీ అన్నట్లు ప్రజల మదిలో సుస్థిరమైపోయింది ఆ నియోజకవర్గం. 1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఆ నియోజకవర్గంలో మరోపార్టీ జెండా ఎగరలేదు. అంతేకాదు టీడీపీ వ్యవస్థాపకుడు, అన్న ఎన్టీఆర్ వరుసగా మూడుసార్లు హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తదనంతరం ఎన్టీఆర్ వారసుడిగా హరికృష్ణ, ఈయన తర్వాత మరో కుమారుడు బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ హాట్రిక్ ప్రయత్నాల్లో ఉన్నారు.
4 దశాబ్దాల టీడీపీ రికార్డుకు బ్రేక్ చేసే వ్యూహం
టీడీపీకి కంచుకోటగా మారిన హిందూపురంపై అధికార వైసీపీ భారీ స్కెచ్ రెడీ చేసింది. నాలుగు దశాబ్దాల టీడీపీ రికార్డును ఈ సారి బ్రేక్ చేసేందుకు పకడ్బందీ పావులు కదుపుతోంది. ఇన్నేళ్లుగా టీడీపీ గెలుస్తుందంటే దానికి ఆ పార్టీ బలంకన్నా.. ప్రత్యర్థుల మధ్య ఐక్యత లోపించడమే ప్రధాన కారణంగా గుర్తించిన వైసీపీ.. ఈ సారి హిందూపురంలో టీడీపీ వ్యతిరేకులు అందరినీ ఒకేతోవలో పెట్టేలా పావులు కదుపుతోంది. కొంతవరకు ఆ ప్రయత్నాల్లో సక్సెస్ అయింది. దీనికి కారణం వైసీపీలో నెంబర్ టూ లీడర్, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని అంటున్నారు. హిందూపురంలో గెలవాలన్న ఏకైక టార్గెట్గా పెట్టుకున్న సీఎం జగన్.. ఈ సారి కురవ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత దీపికను అభ్యర్థిగా ప్రకటించారు. దీపికను గెలిపించే బాధ్యతను పెద్దిరెడ్డికి అప్పగించారు సీఎం జగన్.
ఈసారి వ్యూహం మార్చిన వైసీపీ..
ఎన్టీఆర్ వారసుడిగా రాజకీయాల్లో ప్రవేశించిన బాలకృష్ణ 2014లో హిందూపురంలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. సెంటిమెంట్ ప్రకారం తన తండ్రి, సోదరుడి మార్గంలోనే హిందూపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఆ ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో గెలిచిన బాలయ్య.. 2019 ఎన్నికల్లో కూడా మరోసారి జయకేతనం ఎగరేశారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధినేత జగన్ వేవ్ ఉన్నప్పటికీ హిందూపురంలో మాత్రం.. బాలయ్య హవానే కనిపించింది. అంతేకాదు 2014 కంటే ఎక్కువ మెజార్టీ తెచ్చుకున్నారు బాలయ్య. అందుకే ఈసారి వైసీపీ అధిష్టానం వ్యూహం మార్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూపురంలో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఏడాది క్రితం నుంచి పక్కా వ్యూహంతో ముందుకు కదులుతోంది.
వైసీపీలో గ్రూపుల గోలకు ఫుల్స్టాప్..
హిందూపురంలో బాలయ్య ప్రత్యర్థులుగా 2014లో నవీన్ నిశ్చల్, 2019లో మైనార్టీ నేత ఇక్బాల్ పోటీ చేశారు. ఐతే ఈ ఇద్దరికి నియోజకవర్గంలో ఇతర నేతలతో సఖ్యత లేకపోవడం వల్ల బాలయ్యపై విజయం సాధించలేకపోయారు. దీంతో ఈ సారి ఈ ఇద్దరినీ కాదని కురవ సామాజిక వర్గానికి చెందిన దీపికను బరిలోకి దించింది వైసీపీ. ఇప్పటివరకు నవీన్ నిశ్చల్, ఇక్బాల్, చౌళూరు రామకృష్ణారెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఉండేవి. చౌళూరు రామకృష్ణారెడ్డి హత్య, ఇక్బాల్ రాజీనామాతో ఇప్పుడు అంతా దీపిక వెనుక నడుస్తున్నారు. ఇలా హిందూపురంలో కేడర్ అంతా ఒకే గూటికి చేరడానికి తెరవెనుక తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డికి హిందూపురం బాధ్యతలు అప్పగించడం, ఆయన ఓ వారంపాటు నియోజకవర్గంలో తిష్ఠవేసి మొత్తం సెట్ చేయడంతో ప్రస్తుతానికి పార్టీ ఏకతాటిపై నడుస్తున్నట్లు కనిపిస్తోంది.
వారి వల్లే టీడీపీ విజయాలు!
హిందూపురంలో గెలుపు బాధ్యతలు తీసుకున్న రాష్ట్రమంత్రి పెద్దిరెడ్డి టార్గెట్ టీడీపీ అంటూ పావులు కదుపుతున్నారు. ఆయన ప్రయత్నాలన్నీ మంచి ఫలితాలివ్వడంతో ప్రస్తుతం నవీన్ నిశ్చల్, చౌళూరు వర్గీయులు దీపికకు మద్దతు పలుకున్నారు. వాస్తవానికి వైసీపీలో వర్గ విభేదాల వల్లే టీడీపీ విజయాలకు కారణమనే విశ్లేషణలు ఉన్నాయి. అందుకే ఈసారి అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన తర్వాత బాలకృష్ణకు పక్కా స్కెచ్ వేయాలని నిర్ణయించారు. పార్టీ నేతల అండదండలు లభిస్తుండటం, నియోజకవర్గంలో తన సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సారి పసుపు కోటను బద్ధలు కొడతానని అంటున్నారు దీపిక. బాలయ్యపై తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
చుట్టపుచూపు అనే విమర్శలు.. బాలయ్య పీఏల పాలనపై ప్రజల్లో విరక్తి
హిందూపురం ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన బాలకృష్ణ.. పార్టీ ఓటు బ్యాంకుపై ధీమాతో మూడోసారి గెలుపుపై నమ్మకంగా కనిపిస్తున్నారు. ఆయన హయాంలో నియోజకవర్గంలో చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్లస్ అవుతాయనే విశ్లేషణలు ఉన్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో వ్యక్తిగతంగా బాలయ్య చేసిన సాయం ప్రజల్లో మంచి గుర్తింపు తీసుకువచ్చింది. తాగునీటి సమస్య పరిష్కారం, ఆసుపత్రి నిర్మాణం వంటివి బాలకృష్ణకు మంచి పేరు తెచ్చి పెట్టాయని చెబుతున్నారు. అయితే ఆయనకు అంతకుమించిన మైనస్లు ఉన్నాయంటున్నారు. రెండు నెలలకో మూడు నెలలకు ఒకసారి చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వస్తుంటారని.. కార్యకర్తలకు సంబంధించిన శుభకార్యాలు ఉంటేనే కనిపిస్తారనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా బాలయ్యను నేరుగా కలిసే అవకాశం లభించడం లేదని, పీఏల పాలనపై ప్రజలు విరక్తిగా ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
తొలిసారి గట్టిపోటీ ఎదుర్కొంటోన్న టీడీపీ..
ఇదే సమయంలో వైసిపి అభ్యర్థి కురుబ దీపికకు కొన్ని సానుకూల, ప్రతికూల అంశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ క్యాడర్ అంతా ఏకతాటిపై ఉండటం ఆమెకు ప్లస్గా చెబుతున్నారు. ఇదే సమయంలో హిందూపురంలో టీడీపీని ఓడించేంత శక్తిని ఆమె సాధించారా? అనే సందేహం వెంటాడుతోంది. ఏదిఏమైనా హిందూపురంలో తొలిసారి గట్టిపోటీని ఎదుర్కొంటోంది టీడీపీ. నాలుగు దశాబ్దాల కంచుకోటను కాపాడుకోడానికి శక్తివంచన లేకుండా కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి వ్యూహం ప్రకారం నడుస్తున్న వైసీపీ.. హిందూపురంలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాల్సివుంది.
Andhrapradesh
ఏపీలో కొత్తగా అక్కడ రైల్వే స్టేషన్ రెడీ.. ఈ రూట్లో పట్టాలెక్కనున్న రైళ్లు, ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది

ఏపీలో కొత్త రైల్వే లైన్ల పనులు ఊపందుకున్నాయి.. ఈ పనుల్ని త్వరగా పూర్తి చేసి రైళ్లు పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో నడికుడి- శ్రీకాళహస్తి కొత్త రైల్వేలైన్ పనులు మరింత వేగవంతం చేశారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పనుల్లో స్పీడ్ పెంచారు. దర్శి, పొదిలి, కనిగిరి వైపు పనులు ముగింపు దశకు వస్తున్నాయి. ఈ పనుల్ని త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది చివరికి నాటికి దర్శికి రైళ్లు నడుపుతామంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే లైన్ల పనులు వేగవంతం అయ్యాయి.. ముఖ్యంగా నడికుడి- శ్రీకాళహస్తి రైల్వేలైన్ పనులపై ఫోకస్ పెట్టారు అధికారులు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో రైల్వే లైన్ పనుల్లో స్పీడ్ పెంచారు. ముఖ్యంగా దర్శి రైల్వే స్టేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రైల్వే లైన్లో మెయిన్ ట్రాక్ పూర్తి చేశారు.. లూప్లైన్, మూడు ట్రాక్ల పనులు చేపట్టారు. ఈ పనుల్ని పూర్తి చేసి ఈ ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో రైలు ప్రయాణం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు అధికారులు.
Andhrapradesh
చెస్లో సీఎం చంద్రబాబు మనవడు వరల్డ్ రికార్డ్ – సంతోషంలో నారా కుటుంబం – CHANDRA BABU GRAND SON WORLD RECORD

CHANDRA BABU GRAND SON WORLD RECORD: సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ చదరంగంలో ప్రపంచ రికార్డ్ సాధించాడు. వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 9 ఏళ్ల దేవాన్ష్ “వేగవంతమైన చెక్మేట్ సాల్వర్ – 175 పజిల్స్” ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధృవీకరణను దేవాన్ష్ అందుకున్నారు. దేవాన్ష్ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది.
“చెక్మేట్ మారథాన్” పేరుతో ప్రపంచ రికార్డు : వ్యూహాత్మకమైన ఆటతీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడిజీ నారా దేవాన్ష్ “చెక్మేట్ మారథాన్” పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డ్లో దేవాన్ష్ క్రమక్రమంగా సవాలు చేసే చెక్మేట్ పజీళ్ల క్రమాన్ని పరిష్కరించాడు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుంచి ఎంపిక చేసిన 5334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో దేవాన్ష్ ఈ రికార్డును సాధించగలిగాడు. ఇటీవల దేవాన్ష్ మరో రెండు ప్రపంచ రికార్డులను కూడా సాధించాడు.
అతను 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పూర్తి చేసాడు. 9 చెస్ బోర్డ్లను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 ముక్కలను వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచాడు. దేవాన్ష్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయనిర్ణేతలు, లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టుదల, కృషి ద్వారా తమ కలలను సాధించవచ్చని దేవాన్ష్ నిరూపించాడు. ఇది భారతీయ పిల్లల అపారమైన ప్రతిభకు, వారిలో దాగివున్న అత్యుత్తమ నైపుణ్యాలకు మచ్చుతునక. సరైన ఎక్స్పోజర్, మార్గదర్శకత్వంతో పిల్లలు ఉన్నతస్థానానికి చేరుతారనడానికి దేవాన్ష్ నిదర్శనమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సృజనాత్మకంగా నేర్చుకునే డైనమిక్ విద్యార్థి: దేవాన్ష్ లేజర్ షార్ప్ ఫోకస్తో శిక్షణ పొందడం తాను ప్రత్యక్షంగా చూశానని నారా లోకేశ్ తెలిపారు. దేవాన్ష్ ఈ ఘనత సాధించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దేవాన్ష్ ఈ క్రీడను ఎంతో ఇష్టంగా స్వీకరించాడని తెలిపారు. అతను గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మక ప్రదర్శనల నుంచి ప్రేరణ పొందాడని వెల్లడించారు. ఈ ఈవెంట్ కోసం దేవాన్ష్ గత కొన్ని వారాలుగా రోజుకు 5-6 గంటల పాటు శిక్షణ పొందాడని లోకేశ్ వెల్లడించారు. “దేవాన్ష్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి” అని ఆయన కోచ్ కె. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. 175 సంక్లిష్టమైన పజిల్స్ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన మానసిక చురుకుదనం దేవాన్ష్ సొంతమని తెలిపారు.
చంద్రబాబు ప్రశంసలు: వేగవంతమైన చెక్మేట్ సాల్వర్గా 175 పజిల్స్లో ప్రపంచ రికార్డ్ను దేవాన్ష్ సాధించటం ఎంతో ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, దేవాన్ష్ తల్లిదండ్రులు లోకేశ్, బ్రాహ్మణిలు హర్షం వ్యక్తం చేశారు. చిన్న గ్రాండ్ మాస్టర్ దేవాన్ష్ ప్రతిభను చూసి ఎంతో గర్విస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. చదరంగంలో 175 పజిల్స్ను పూర్తి చేయడం ద్వారా వేగవంతమైన చెక్మేట్తో ప్రపంచ రికార్డును నెలకొల్పిన దేవాన్ష్కు అభినందనలు తెలిపారు.
కృషి, అంకితభావం, పట్టుదల విజయానికి కీలకమన్న ఆయన, ఈ విజయం కోసం నెలలు తరబడి దేవాన్ష్ కృషి చేశారని చంద్రబాబు ప్రశంసించారు. లండన్లోని ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి అధికారిక ధృవీకరణను స్వీకరించినందుకు తాము సంతోషిస్తున్నట్లు బ్రాహ్మణి చెప్పారు. ఈ ఘనత కోసం దేవాన్ష్ అంకితభావం, పట్టుదలతో కృషి చేసినట్లు వెల్లడించారు. ఈ అద్భుతమైన విజయానికి మార్గనిర్దేశం చేసిన కోచ్ కె రాజశేఖర్ రెడ్డి, రాయ్ అకాడమీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రుల అభినందనలు: చదరంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచి ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న నారా లోకేశ్ కుమారుడు దేవాన్ష్ను మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, రామానాయుడు, కొల్లు రవీంద్ర, రాంప్రసాద్ రెడ్డి, పార్ధ సారధి, అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయస్వామిలు అభినందనలు తెలిపారు. వేగంగా పావులు కదపడం, వేగవంతమైన చెక్ మేట్ సాల్వర్-175 పజిల్స్ సాధించిన దేవాన్ష్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దృవీకరణ అందుకున్న దేవాన్ష్ మున్ముందు మరిన్ని రికార్డులు సాధించాలని ఆకాంక్షించారు.
Andhrapradesh
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ – మార్చి నెల దర్శన టికెట్ల విడుదల తేదీల్లో మార్పులు

Tirumala Tirupati Devasthanam Updates : మార్చి నెల దర్శన టిక్కెట్ల విడుదల తేదీల్లో టీటీడీ మార్పులు చేసింది. ఈనెల 25వ తేదీన ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు తాజా ప్రకటనలో పేర్కొంది. 26వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనుంది.
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. మార్చి నెల దర్శన టిక్కెట్ల విడుదల తేదీల్లో మార్పులు చేసింది. ఈ మేరకు తాజా ప్రకటన విడుదల చేసింది.
తేదీలు మార్పు…
డిసెంబర్ 25వ తేదీన ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇక డిసెంబర్ 26వ తేదీన ఉదయం 11 గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి, తిరుమలలోని వసతి గదులు కోటా టికెట్లను విడుదల చేయనుంది.
ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబరు 24న విడుదల కావాల్సి ఉంది. ఇక డిసెంబర్ 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తామని పేర్కొంది. కానీ తాజా ప్రకటనలో పలు మార్పులు చేసింది.
మార్పులకు అనుగుణంగా భక్తులు టికెట్లను బుకింగ్ చేసుకోవాలని టీటీడీ కోరింది. https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది. ఇతర సైట్లను నమ్మవద్దని కోరింది.
-
డిసెంబరు 21న ఆర్జిత సేవా టికెట్లు : కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను డిసెంబరు 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
డిసెంబరు 21న వర్చువల్ సేవల కోటా : వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన 2025 మార్చి నెల కోటాను డిసెంబరు 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
డిసెంబరు 23న అంగప్రదక్షిణం టోకెన్లు: మార్చి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను డిసెంబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా : వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను డిసెంబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
-
Business10 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career10 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News10 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business10 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National11 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business10 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International10 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
National9 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Education9 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
Crime News9 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh9 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Andhrapradesh9 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana10 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
National9 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Railways9 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National10 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Spiritual9 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
Andhrapradesh9 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh9 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh1 year ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Andhrapradesh9 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
National9 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
National9 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh8 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
Political9 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh9 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh9 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
International10 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
National10 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh9 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
National10 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Andhrapradesh9 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Political9 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Business10 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
International10 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
Cinema12 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
News10 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Education9 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Weather9 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Andhrapradesh9 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
News9 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Education1 year ago
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు
-
Andhrapradesh9 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
Business10 months ago
Bank Holidays June-2024: జూన్లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Railways8 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh1 year ago
ప్రమాదపుటంచుల్లో ప్రపంచం
-
Andhrapradesh10 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Andhrapradesh9 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
International9 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
News9 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు