National
Mysore Palace: మైసూరులో ఇప్పటికీ వాడుకలో ఉన్న రాజవంశ కాలం నాటి భవనాలు ఇవిగో
కర్ణాటకలోని మైసూరు వారసత్వ భవనాలకు నిలయం. కొన్ని ప్యాలెస్ ల రూపంలో ఉన్నాయి, మరికొన్ని ప్రభుత్వ భవనాలుగా ఉపయోగపడుతున్నాయి. ఒక్క మైసూరులోనే 100కు పైగా రాజ భవనాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు వాడుకలో ఉన్నాయి. వాటిలో ప్రధాన వారసత్వ భవనాలను ఇక్కడ చూద్దాం.
అంబా విలాస్ ప్యాలెస్ అని పిలిచే ఈ భవనం… పాత ప్యాలెస్ అగ్నికి ఆహుతైన తరువాత నిర్మించారు. ఇది ఇప్పుడు ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా ఉంది.
మైసూర్ కు వచ్చే అతిథుల కోసం లలిత్ మహల్ ను మహారాజా నిర్మించాడు. ఇప్పుడు ఇది ఒక హోటల్ గా మారింది. జంగిల్ రిసార్ట్ లలితా మహల్ దేశంలోని ప్రముఖ హోటళ్లలో ఒకటి.
మహారాజా ప్యాలెస్గా ఉన్న మైసూరులోని చలువాంబ ప్యాలెస్… ఇప్పుడు సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (సీఎఫ్ టీఆర్ ఐ)గా మారింది.
ఇది మైసూర్ జంతుప్రదర్శనశాలకు ఆనుకొని ఉన్న ఒక ముఖ్యమైన ప్యాలెస్. దీనిని మహారాజా సమ్మర్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు.
మైసూరులో మహారాజులు ఉపయోగించిన ప్యాలెస్ లలో జగన్మోహన్ ప్యాలెస్ ఒకటి, దీనిని ఇప్పుడు జగన్మోహన్ ఆర్ట్ గ్యాలరీగా ఉపయోగిస్తున్నారు.
ఇది మైసూరులోని మానస గంగోత్రి ప్రాంగణంలో ఉన్న జయలక్ష్మి ప్యాలెస్. ఇది జానపద మ్యూజియంగా ఉపయోగించబడుతోంది.
ఇది మైసూర్ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనం. దీనిని క్రాఫోర్డ్ హాల్ అని కూడా పిలుస్తారు.
మహారాజా కాలేజి మైసూరులోని అతి ముఖ్యమైన విద్యాకేంద్రాలలో ఒకటి. లక్షలాది మంది ఇక్కడ విద్యనభ్యసించారు. ఇది ఇప్పటికీ కర్ణాటకలో విద్యాకేంద్రంగా ఉంది.
మైసూరు ప్రజల కోసం మహారాజా కట్టించిన ఆసుపత్రి ఇది. దీని పేరు కృష్ణరాజేంద్ర ఆసుపత్రి. మైసూరుతో పాటు మండ్య, కొడగు, హసన్, చామరాజనగర్లో కూడా ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.
మైసూరులో ప్రజా కార్యక్రమాల కోసం మహారాజా నిర్మించిన టౌన్ హాల్ ఇప్పటికీ రంగాచార్యుల భవన్ గా వాడుకలో ఉంది.