Cricket

RCB Womens : ఆర్సీబీ ఉమెన్స్ టీం విన్.. మెన్స్ టీంపై సోషల్ మీడియా ట్రోల్స్..

Published

on

RCB Womens : ‘ఆర్సీబీ’కి ట్రోఫీ రావడం అనేది ఐపీల్ చరిత్రలో ఒక తీరని కలలా మిగిలిపోతుంది అనుకున్న విషయం. కానీ ఆ కలని ఆర్సీబీ ఉమెన్స్ టీం నిజం చేసింది. లక్షలాది మంది ఫ్యాన్స్ కోరికను నిజం చేస్తూ.. నిన్న జరిగిన ఫైనల్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆర్సీబీ ఘన విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకున్నారు. కానీ ఆర్సీబీ వాళ్ళకి మాత్రం ట్రోల్స్ తప్పడం లేదు.

అయితే ఈ ట్రోల్స్.. ట్రోఫీ సాధించిన ఉమెన్స్ టీం పై కాదు, ఇప్పటివరకు ట్రోఫీని లిఫ్ట్ చేయలేకపోయిన మెన్స్ టీంని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడేసుకుంటుంటారు. ఎన్నో ఏళ్లగా మెన్స్ టీం ట్రోఫీ కోసం కష్టపడుతుంటే.. ఉమెన్స్ టీం కేవలం రెండేళ్లలోనే ఆ కలని నిజం చేసిందంటూ మెన్స్ టీంని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ ట్రోల్స్ చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్.. మమ్మల్ని ఇలా కూడా వదలరా అంటూ బాధ పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version