Andhrapradesh
రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ..పూడి- ఏర్పేడు మధ్య నూతన రైలుమార్గం
ఏపీ ప్రజలకు శుభవార్త. చిత్తూరు జిల్లాలోని పూడి- ఏర్పేడు రైల్వేస్టేషన్ల మధ్య నూతన రైలు మార్గం అందుబాటులోకి రాబోతోంది. దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతంలోని ప్రధాన నగరాల మధ్య తక్కువ సమయంలో సరకు రవాణా చేయడానికి ఈ మార్గం ఉపయోగపడనుంది. ప్రస్తుతం నడుస్తున్న గూడ్స్ రైళ్లు పూడి నుంచి రేణిగుంట చేరుకొని అక్కడి నుంచి విజయవాడ, ముంబయివైపు ప్రయాణిస్తున్నాయి. దీనికి సంబంధించిన అన్ని పనులను భారతీయ రైల్వే సిద్ధం చేస్తోంది.
సరకు రవాణా చేసేందుకు ఎక్కువ సమయం పడుతోందని, రేణిగుంట రైల్వే జంక్షన్ లో ప్రధాన ఆలస్యం జరుగుతోందని అధికారులు గుర్తించారు. ఈమేరకు రైల్వేబోర్డు నివేదిక తయారుచేసింది. పూడి నుంచి ఏర్పేడు వరకు 27 కిలోమీటర్ల దూరం సర్వే చేసి ప్రాథమిక నివేదికను రూపొందించారు. గూడ్స్ రైళ్లతోపాటు సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా నడవనున్నాయి.