International
Pakistan: పాక్ ప్రధాని సంచలన నిర్ణయం.. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ
![](https://infoline.one/wp-content/uploads/2024/05/SAUDI-DAVOS-42_1715756531616_1715756583909.avif)
Pakistan: గత రెండేళ్లుగా ఆర్థిక, రాజకీయ సంక్షోభం, అంతర్గత ఘర్షణలతో దాయాది దేశం పాకిస్థాన్ కొట్టుమిట్టాడుతోంది. అయితే ఇటీవలె అక్కడ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల వేళ తీవ్ర హింస చెలరేగినా.. ప్రస్తుతం రాజకీయంగా మాత్రం కొంత శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఆర్థికంగా మాత్రం పాక్ తీవ్ర అధ్వాన్న పరిస్థితులను ఎదుర్కొంటోంది. విదేశీ మారక నిల్వల కోసం ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థల ముందు అడుక్కుంటోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాక్లో ఆర్థిక సంస్కరణలకు తెరతీశారు. ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించారు. అయితే ఒక్క వ్యూహాత్మక ప్రభుత్వ రంగ సంస్థలు తప్ప మిగిలిన వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
పాకిస్థాన్ను తీవ్ర ఆర్థిక సమస్యల నుంచి బయట పడేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తేల్చి చెప్పారు. తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ సంస్థల అంశంపై సమావేశం నిర్వహించిన తర్వాత షెహబాజ్ షరీఫ్ ఈ ప్రకటన చేశారు. అయితే పాకిస్థాన్కు దీర్ఘకాలం సాయం అందించేందుకు ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్-ఐఎంఎఫ్తో సోమవారం చర్చించిన తర్వాత.. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ చేయాలన్న పాక్ ప్రధాని నిర్ణయం బయటికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. బిజినెస్ చేయడం.. ప్రభుత్వం పని కాదని.. పెట్టుబడులు, వ్యాపారం చేసేవారికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వం చేయాల్సిన పని అని పాక్ ప్రధాని వెల్లడించారు. అంతేకాకుండా పాక్లోని అన్ని మంత్రిత్వ శాఖలు.. ప్రైవేటీకరణ కమిషన్కు సహకరిస్తూ.. చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
పాకిస్థాన్లో నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మాత్రమే ప్రైవేటీకరణ చేయాలని.. మొదట అక్కడి ప్రభుత్వం భావించగా.. ఆ తర్వాత మార్చుకుంది. లాభాల్లో ఉన్న సంస్థలైనా.. నష్టాల్లో ఉన్న సంస్థలైనా.. అన్నింటినీ ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించుకుంది. అయితే దేశంలో వ్యూహాత్మకమైన సంస్థలు, కంపెనీలకు మాత్రం ప్రైవేటీకరణ నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది.
అయితే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని పేర్కొన్న పాక్ సర్కార్.. బిడ్డింగ్ సహా అన్ని ప్రక్రియలను టీవీల్లో లైవ్ ప్రసారాలు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇప్పటికే తీవ్ర నష్టాలతో సతమతం అవుతున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్.. ప్రైవేటీకరణ ప్రక్రియ తుది దశలో ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పాక్లో మూడో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ నిలిచింది. ఈ సంస్థ అప్పులు తీర్చేందుకు ఆ దేశానికి నెలకు
11,500 కోట్ల పాకిస్థాన్ రూపాయలు అవసరం అవుతున్నాయి.
ఇక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొనసాగుతున్న గత నెలాఖరులో పాకిస్థాన్కు మరో 1.1 బిలియన్ డాలర్ల అప్పును ఇచ్చేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలుపుంది. 3 బిలియన్ డాలర్ల ప్యాకేజీపై పాకిస్థాన్, ఐఎంఎఫ్ మధ్య జరిగిన ఒప్పందం ఈ ఏప్రిల్తో ముగిసింది. దీంతో చివరి విడతగా రుణాన్ని మంజూరుచేసేందుకు అంగీకారం లభించింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటికే రెండు దశల్లో 1.9 బిలియన్ డాలర్లను పాక్కు ఐఎంఎఫ్ అందించింది.
International
ఆ లిస్ట్ ప్రకారమే పరేడ్ – భారత్ ఏ ప్లేస్లో రానుందంటే? – PARIS OLYMPICS 2024
![](https://infoline.one/wp-content/uploads/2024/07/1200-675-22050100-thumbnail-16x9-paris.jpg)
Paris Olympics 2024 Live Telecast : పారిస్ వేదికగా ఒలింపిక్ క్రీడా సంబరాలు నేడు (జులై 26) అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే పలు ఈవెంట్లు కూడా ప్రారంభం కాగా, అఫీషియల్ ఓపెనింగ్ సెరిమనీతో మిగతా ఈవెంట్లు కూడా గ్రాండ్గా మొదలవ్వనుంది. మరీ ఈ విశ్వ క్రీడల ప్రారంభ వేడుకను ఎప్పుడు ఎలా చూడొచ్చంటే?
జియో సినిమా, స్పోర్ట్స్18 నెట్వర్క్, లాంటి సంస్థలు ఈ వేడుకలను లైవ్ టెలికాస్ట్ చేయనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ ప్రారంభోత్సవ వేడుకలు రాత్రి 11 నుంచి టెలికాస్ట్ కానుంది. ఇక అథ్లెట్ల పరేడ్ పడవల్లో ఉంటుంది. ఇందులో సుమారు 94 పడవల్లో ప్లేయర్లు పయనిస్తారు.
ఇక ఈ పరేడ్లో గ్రీస్ ముందు వరసలో ఉండగా, ఆ తర్వాత ఆల్ఫాబెట్ వరుస క్రమంలో ఆయా దేశాల ప్రతినిథ్లు అనుసరిస్తారు. అయితే ఆతిథ్య దేశ జాతీయ భాషను ప్రామాణికంగా తీసుకోవడం వల్ల ఆతిథ్య దేశం పరేడ్ చివరిలో వస్తుంది. ఇక అంతకంటే ముందు వరుసలో రానున్న ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న దేశాలు ఉంటాయి. ఈ లెక్కన 203లో ఆస్ట్రేలియా (2032 ఒలింపిక్స్), 204లో అమెరికా (2028 ఒలింపిక్స్), 205లో ఫ్రాన్స్ (2024 ఒలింపిక్స్) వస్తాయి.
మరోవైపు ఈ పరేడ్లో భారత్ 84వ స్థానంలో రానుంది. ఇక ఈ ప్రారంభ వేడుకల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించనున్నారు. తనతో పాటు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్ మన త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని భారత అథ్లెట్ల బృందాన్ని ముందుండి నడిపించనున్నారు.
దాదాపు 10వేల 500 మంది అథ్లెట్లు ఈసారి విశ్వక్రీడల్లో ఆడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా షార్ట్ వీడియోల ట్రెండ్ నడుస్తున్న వేళ యువతరం కోసం ప్రత్యేక వేదికలు సిద్ధమయ్యాయి. ఉగ్రదాడులు, గాజా ఉక్రెయిన్ యుద్ధాలను దృష్టిలో ఉంచుకుని భద్రతను ఫ్రాన్స్ ప్రభుత్వం పటిష్టం చేసింది.
పారిస్కు 150 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రదేశాన్ని నోఫ్లై జోన్గా ప్రకటించారు. ఫ్రాన్స్ అతి పెద్ద స్టేడియమైన స్టేడ్డి ఫ్రాన్స్ను 2015లో ముష్కరులు లక్ష్యంగా చేసుకోవడంతో ఈసారి ప్రారంభోత్సవాలను అందులో నిర్వహించట్లేదు. ఎక్కడికక్కడ కృత్రిమ మేధతో కూడిన నిఘా వ్యవస్థను నెలకొల్పారు. 45వేలమంది పోలీసులు, 10 వేలమంది సైనికులు పారిస్కు పహారా కాస్తున్నారు.
124 ఏళ్ల క్రితం ఇదే పారిస్లో జరిగిన ఒలింపిక్స్లో 22 మంది మహిళలే ఆడగా, ఈసారి పాల్గొంటున్న క్రీడాకారుల్లో స్త్రీ పురుషుల సంఖ్య దాదాపు సమానంగా ఉంది. ‘మీ టూ’ ఉద్యమం తర్వాత జరుగుతున్న తొలి ఒలింపిక్స్ ఇవి. వాతావరణ పరిరక్షణకు కట్టుబడి తక్కువ కాలుష్యంలో విశ్వక్రీడలను నిర్వహించాలని ఫ్రాన్స్ భావిస్తోంది.
International
ముదిరిన ఉత్తర కొరియా ‘చెత్త’యుద్ధం! సౌత్ కొరియా అధ్యక్ష కార్యాలయంలో పడ్డ ట్రాష్ బెలూన్స్! – Korean Countries Balloons War
![](https://infoline.one/wp-content/uploads/2024/07/1200-675-22033176-thumbnail-16x9-korea.jpg)
Korean Countries Balloons War : ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య చెత్త బెలూన్ల యుద్ధం మరింత ముదిరింది. ఉత్తర కొరియా మళ్లీ పంపిన చెత్త బెలూన్లు సౌత్ కొరియా అధ్యక్ష కార్యాలయం ప్రాగణంలో పడ్డాయని ఆ దేశ మీడియా సంస్థ పేర్కొంది. బుధవారం ఉదయం ఉత్తర కొరియా, బెలూన్లు ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. అవి సరిహద్దు దాటిన తర్వాత సియోల్కు ఉత్తరంగా ఎగిరాయని పేర్కొంది. బెలూన్ల నుంచి పడే వస్తువుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే ఈ ‘చెత్త’ దాడిలో ఎలాంటి నష్టం జరగలేదని దక్షిణ కొరియా తెలిపింది.
మే నెల చివరి వారం నుంచి ఈ బెలూన్ల యుద్ధం రెండు దేశాల మధ్య సాగుతోంది. ఉత్తర కొరియా ఇలా బెలూన్లు పంపడం ఇది పదో సారి అని దక్షిణ కొరియా సైన్యం చెప్పింది. ఇప్పటి వరకు 2,000 కంటె ఎక్కువగానే బెలూన్లను ప్రయోగించినట్లు తెలిపింది. ఆ బెలూన్లలో ఎరువులు, సిగరెట్ పీకలు, చెత్త వస్తువులు, వ్యర్థాలు ఉన్నాయని వెల్లడించింది. అయితే దక్షిణకొరియా పంపిన బెలూన్లకు ప్రతీకారంగానే చెత్త బెలూన్లను పంపడం మళ్లీ ప్రారంభించామని ఉత్తర కొరియా పేర్కొంది.
లౌడ్స్పీకర్లతో సమాధానం
కొత్త కొరియా చెత్త బెలూన్లకు గతంలో దక్షిణ కొరియా గట్టి జవాబునిచ్చింది. సరిహద్దుల్లో పెద్ద పెద్ద లౌడ్స్పీకర్లను ఏర్పాటు చేసి ఉత్తర కొరియా వ్యతిరేక ప్రచారాలను ప్రారంభించింది. సైనిక స్థావరాలు ఉన్న ఉత్తర కొరియా ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా K-పాప్ సంగీతం, విదేశీ వార్తలతోపాటు, ప్యాంగ్యాంగ్ వ్యతిరేక ప్రసారాలను దక్షిణ కొరియా సైన్యం హోరెత్తిస్తోంది. ఉత్తర కొరియాలో విదేశీ వార్తలు, K-పాప్ సంగీత శ్రవనాన్ని తీవ్ర నేరాలుగా పరిగణిస్తారు. అవి తమ పౌర సమాజంలో ప్రభుత్వ వ్యతిరేక భావాలను నాటుతుందని, తన అధికారాన్ని బలహీనపరుస్తుందని నియంత కిమ్ జోంగ్ ఉన్ భావిస్తారు. 2015లో ఇలాగే దక్షిణ కొరియా లౌడ్ స్పీకర్లతో ఉత్తర కొరియా వ్యతిరేక ప్రచారం చేయగా ప్రతిచర్యగా కిమ్ ప్రభుత్వం ఫిరంగులను పేల్చింది. అప్పట్లో అది ఉద్రిక్త పరిస్థితులకు తావిచ్చింది. మళ్లీ ఆ పరిస్థితులే ఎదురైతే ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని దక్షిణ కొరియా రక్షణ మంత్రి సైనిక బలగాలను ఆదేశించారు.
International
మాల్లో వీధి పిల్లికి సెక్యూరిటీ గార్డ్ జాబ్.. ఈ ఐడియా అదుర్స్ కదూ..
![](https://infoline.one/wp-content/uploads/2024/07/wlwer-1721794262.jpg)
Philippines Mall: మాల్లో వీధి పిల్లికి సెక్యూరిటీ గార్డ్ జాబ్ వచ్చింది. మనుషులైనా తమ ఉద్యోగంలో అలసట, బద్ధకం ప్రదర్శిస్తారేమోగానీ ఈ పిల్లి మాత్రం విధుల్లో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా చేస్తోంది. ఫిలిప్పీన్స్లో ఆ పిల్లి విధులు నిర్వహిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
మాండలుయోంగ్ మెట్రో మనీలాలోని మాల్లో మెగావరల్డ్ కార్పొరేట్ సెంటర్ ఈ పిల్లిని సెక్యూరిటీ జాబ్ లో నియమించింది. ఆల్ డే సూపర్ మార్కెట్లోని గేట్ వద్ద ఈ పిల్లి ఉంటుంది. కోనన్ బ్యాగ్లను తనిఖీ చేయడంలో ఈ పిల్లి సాయపడుతుంది. అంతేగాక, ఎవరైనా మాల్కి పెంపుడు జంతువులను తెచ్చుకుంటే వాటిని కూడా స్వాగతిస్తుంది.
ఇంతకీ ఈ పిల్లి వయసు ఎంతో తెలుసా? కేవలం ఆరు నెలలు మాత్రమే. ఆ మాల్లో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందిలో ఈ పిల్లి భాగమైపోయింది. సెక్యూరిటీ సిబ్బంది ఒత్తిడిని కూడా ఈ పిల్లి తగ్గిస్తోంది. ఈ పిల్లిని సెక్యూరిటీ గార్డ్ కోనన్ అని పిలుస్తారు. ఈ పిల్లి పనితీరును చూసి ఇతర మాల్స్ కూడా పిల్లులను పనిలో పెట్టుకోవాలని యోచిస్తున్నాయి.
-
Business2 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career2 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
Business2 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
Business2 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National3 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
News2 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Education2 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National2 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Crime News2 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh2 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Spiritual2 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National2 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
National2 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Andhrapradesh2 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh2 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Political1 month ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
National1 month ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
National2 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Andhrapradesh2 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Railways1 month ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
Andhrapradesh1 month ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Telangana2 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Andhrapradesh2 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Political2 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh1 month ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh2 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Andhrapradesh1 month ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh1 month ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
International2 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Business2 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Spiritual2 months ago
Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?
-
News3 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
National2 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
News2 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Education1 month ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
International1 month ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
News2 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh2 months ago
AP Schools Reopen Date 2024: ఏపీలో వేసవి సెలవుల పొడిగింపు.. తిరిగి బడి గంట మోగేది అప్పుడే!
-
Hyderabad1 month ago
ఏపీలో చంద్రబాబు వస్తే హైదరాబాదుకు వచ్చిన నష్టం ఏమీ లేదు… పొంగులేటి
-
Cinema2 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
-
Cinema4 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Andhrapradesh1 month ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
Andhrapradesh5 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Andhrapradesh2 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Weather1 month ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Andhrapradesh2 months ago
ఏపీలో ఆ శాఖ ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ మరో రెండేళ్లు పొడిగింపు
-
National2 months ago
ఒకే కుటుంబంలో 165మంది- ఓట్ల కోసం ఫ్యామిలీ చుట్టూ నేతలు! అందరూ చర్చించే ఓటేస్తారట! – Voters In One Family In Bihar
-
Railways2 weeks ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Life Style2 months ago
Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు
-
National2 months ago
Loksabha : ఈనెల 24 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు….. స్పీకర్ ఎన్నిక!