Success story
National Creators Award: మొట్టమొదటి నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ ను ప్రదానం చేసిన ప్రధాని మోదీ; ఏమిటీ అవార్డ్స్?
![](https://infoline.one/wp-content/uploads/2024/03/national-creators-award-2024-winners-list.webp)
National Creators Award: మొట్టమొదటి నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ ను ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీలోని భారత్ మందిర్ వేదికగా వివిధ సృజనాత్మక విభాగాల్లో విజయం సాధించిన వారికి ప్రదానం చేశారు. స్టోరీ టెల్లింగ్, ఫిట్ నెస్, ఎడ్యుకేషన్, గేమింగ్ వంటి రంగాల్లోని సృజనాత్మక విజేతలను ఈ అవార్డ్ లకు ఎంపిక చేశారు.
శుక్రవారం ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ ‘నేషనల్ క్రియేటర్స్ అవార్డు’లను ప్రదానం చేశారు. స్టోరీ టెల్లింగ్, ఎన్విరాన్మెంటల్ సస్టెయినబిలిటీ, ఎడ్యుకేషన్, ఫిట్ నెస్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్.. వంటి వివిధ రంగాల్లోని సృజనాత్మకతను, ప్రతిభను గౌరవించడమే ఈ అవార్డులను ప్రకటించడం వెనుక ప్రధాన లక్ష్యం.
20 కేటగిరీలు.. 1.5 లక్షల నామినేషన్లు విజేతల జాబితా అంకిత్ బయాన్ పురియా – ఉత్తమ హెల్త్ అండ్ ఫిట్ నెస్ క్రియేటర్ నమన్ దేశ్ ముఖ్ – ఎడ్యుకేషన్ కేటగిరీలో ఉత్తమ సృష్టికర్త
కబితా సింగ్ (కబితా కిచెన్) – ఫుడ్ కేటగిరీలో ఉత్తమ సృష్టికర్త
ఆర్జే రౌనాక్ (బావా) – మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్-మేల్
శ్రద్ధా – మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్-ఫిమేల్
జాన్వీ సింగ్ – హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్ అవార్డు మల్హర్ కలంబే – స్వచ్ఛతా అవార్డు
అంబాసిడర్ గౌరవ్ చౌదరి – టెక్ కేటగిరీలో ఉత్తమ సృష్టికర్త
కామియా జానీ – ఫేవరెట్ ట్రావెల్ క్రియేటర్ మైథిలి ఠాకూర్ – కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్
జయ కిషోరి – సోషల్ ఛేంజ్ కు ఉత్తమ సృష్టికర్త పంక్తి పాండే – ఫేవరెట్ గ్రీన్ ఛాంపియన్
రణ్ వీర్ అల్హాబాదియా (బీర్ బైక్స్) – డిస్ట్రప్టర్ ఆఫ్ ది ఇయర్ అరిదామన్ – బెస్ట్ మైక్రో క్రియేటర్
క్రియేటర్ అమన్ గుప్తా – సెలబ్రిటీ క్రియేటర్ ఆఫ్ ది ఇయర్
లక్షయ్ దబాస్ – అత్యంత ప్రభావవంతమైన వ్యవసాయ విధాన సృష్టికర్త
ఉత్తమ కథకుడు, డిస్ట్రప్టర్ ఆఫ్ ది ఇయర్, సెలబ్రిటీ క్రియేటర్ ఆఫ్ ది ఇయర్, గ్రీన్ ఛాంపియన్, బెస్ట్ క్రియేటర్ ఫర్ సోషల్ ఛేంజ్, మోస్ట్ ఇంపాక్టివ్ అగ్రి క్రియేటర్, కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్, ఇంటర్నేషనల్ క్రియేటర్ సహా ఇరవై కేటగిరీలను ఈ అవార్డులో చేర్చారు. భారతీయ శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతంలో శిక్షణ పొందిన నేపథ్య గాయని మైథిలి ఠాకూర్ ను ‘కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్’ విజేతగా ప్రకటించారు.
ఈ అవార్డులకు 20 కేటగిరీల్లో 1,50,000కు పైగా నామినేషన్లు వచ్చాయి. ఈ అవార్డు కేటగిరీల్లో డిజిటల్ క్రియేటర్లకు ఓటింగ్ దశలో సుమారు 1 మిలియన్ ఓట్లు పోలయ్యాయి. చివరకు, ముగ్గురు ఇంటర్నేషనల్ క్రియేటర్స్ సహా 23 మంది విజేతలను ఎంపిక చేశారు.
నిశ్చాయ్ – గేమింగ్ కేటగిరీలో ఉత్తమ సృష్టికర్త
డ్రూ హిక్స్ – బెస్ట్ ఇంటర్నేషనల్ క్రియేటర్
పియూష్ పురోహిత్ – బెస్ట్ నానో క్రియేటర్
Andhrapradesh
ఎంతో సొమ్ము….2000 ఎకరాలు… రామోజీరావు గారి పట్టుదల
![](https://infoline.one/wp-content/uploads/2024/06/n6155302801717808906789316861789a9ad3a7378b6199ae577334ff9758baad6a649ef638adacecc6bf8f.jpg)
మీడియా మొఘల్గానే కాకుండా.. సినీ పరిశ్రమలోనూ తనకంటూ వైవిధ్యాన్ని ప్రదర్శించిన రామోజీ రావు…. భౌతికంగా అస్తమించారు. కానీ, ఆయన ఆత్మ.. ఈనాడు, రామోజీ ఫిల్మ్ సిటీల రూపంలో చిరస్థాయిగా తెలుగు నేలపై మరికొన్ని దశాబ్దాల పాటు నిలిచిపోతాయి.
ఈనాడును ఎలా అయితే.. ప్రేమించారో.. ఆయన జీవితంగా ఫిల్మ్ సిటీని అంతకు మించి ప్రేమించారు. అది 1980-90ల మధ్య పరిస్థితి. ఏ చిన్న షూటింగ్ చేయాలన్నా.. ఎక్కడెక్కడకో వెళ్లాల్సి వచ్చేది.
ఉదాహరణకు ఒక పాట కోసం.. వేరే ప్రాంతాలకు.. ఒక సీన్ సీన్ కోసం.. పొరుగు రాష్ట్రాలకు నిర్మాతలు పరుగులు పెట్టాల్సి వచ్చేది. ఒక నిర్మాతకు ఇవన్నీ.. తడిసిమోపెడు భారం. దీనికితోడు ఇంత పెట్టుబడి పెట్టినా.. సదరు సినిమాలు ఆడకపోతే.. నిర్మాత నష్టపోవడం ఖాయం. ఒక సహజ నిర్మాతగా రామోజీరావు ను ఇవన్నీ.. కదిలించాయి. నిర్మాత కష్టాలు ఎలా ఉంటాయో.. తెలిసిన వ్యక్తిగా.. వీటిని ఆయన ఔపోసన పట్టారు. నిర్మాత కష్టాలు తగ్గించాలన్న దృఢ సంకల్పంతో మనకంటూ.. ఒక ఫిల్మ్సిటీ ఉండాలని కలలు గన్నారు.
ఈ క్రమంలోనే ఆయన 1982-86 మధ్యనాలుగు సంవత్సరాల పాటు.. ప్రపంచంలోని అతి పెద్ద ఫిల్మ్ సిటీలను సందర్శించారు. వాటిలాగానే.. ఏపీలోనూ ఒకచిత్ర నగరిని రూపొందించాలని నిర్ణయించుకు న్నారు. కానీ, ఎలా? సాధ్యమేనా? అని అనుకున్నప్పుడు.. ఎందుకు సాధ్యం కాదనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. అక్కడే రామోజీ ఫిల్మ్ సిటీకి అంకురార్పణ జరిగింది. ఏకంగా.. నాలుగు గ్రామాలు.. 2000లకు ఎకరాల స్థలం తనకు కావాలంటూ.. ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు.
అప్పటి చంద్రబాబు ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ శివారులో స్థలం విడతల వారీగా అప్పగించారు. అక్కడ రూపుదిద్దుకున్నదే రామోజీఫిల్మ్ సిటీ. ఇదేమీ తేలికగా అయిపోలేదు. కోట్లకు కోట్ల సొమ్ము.. లారీల్లో తరలించినట్టు తరలించారు. కానీ, మరోవైపు..కుటుంబం వారించింది. ఇంత సొమ్మును ఖర్చు పెడితే.. ఎలా? అది హిట్ కాకపోతే.. ఏం జరుగుతుందనే వాదన కూడా తెరమీదికి వచ్చింది. అయినా.. రామోజీ వెనుకడుగు వేయలేదు.
అనేక మంది సహకారం తీసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీని దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే నెంబర్ 1గా తీర్చి దిద్దారు. ఈ క్రమంలో 2004లో ప్రభుత్వం మారిపోయింది. దీంతో న్యాయపరమైన సమస్యలు కూడా.. చుట్టుకున్నాయి. అయినా.. వాటిని ఎదిరించి ముందుకు సాగారు. రామోజీ ఫిల్మ్ సిటీని సాకారం చేసుకున్నారు. అనధికార అంచనాప్రకారం.. రోజుకు 100 కోట్ల రూపాయల వ్యాపారం.. ఇక్కడే జరుగుతోంది.
Cricket
IPL 2024: ‘అమ్మ తన నగలను అమ్మి షూస్ కొనిచ్చింది’.. కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ సక్సెస్ స్టోరీ.. వీడియో
![](https://infoline.one/wp-content/uploads/2024/05/kkr-pacer-shakib-hussain.webp)
IPL 2024 చివరి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం (చెపాక్) స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్లో కేకేఆర్ తరఫున యువ పేసర్ షకీబ్ హుస్సేన్ బరిలోకి దిగే సూచనలున్నాయి. షకీబ్ ది హల్క్ బాడీ… బాడీబిల్డింగ్తో కూడిన సిక్స్ ప్యాక్ బాడీ. ఒక్క సారి ఈ కుర్రాడిని చూస్తే ఆర్మీకి సరిగ్గా సరిపోతాడని చెప్పొచ్చు. కానీ తన కలను కాదని కోల్కతా నైట్ రైడర్స్ శిబిరంలో షకీబ్ కనిపించడం గమనార్హం. అయితే ఈ ఫిజిక్ వెనుక సైన్యంలో చేరాలనే పెద్ద కల కూడా ఉంది. బిహార్లోని గోపాల్గంజ్కు చెందిన షకీబ్ హుస్సేన్ ది వ్యవసాయ కుటుంబం. తండ్రి అహ్మద్ హుస్సేన్ ఒక్కరోజు పని చేయకపోయినా కుటుంబమంతా సగం కడుపుతో గడపాల్సిందే. అందుకే యుక్తవయస్సు రాకముందే షకీబ్ హుస్సేన్ ఒక నిర్ణయానికి వచ్చాడు. భారత సైన్యంలో పనిచేయాలనుకున్నాడు. తద్వారా తన కటుంబ ఆర్థిక పరిస్థితి మారుతుందనుకున్నాడు. ఈ పెద్ద కలతో, షకీబ్ హుస్సేన్ తన ఇంటి సమీపంలోని మైదానంలో ప్రతిరోజూ ఉదయాన్నే రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. ఆర్మీ ఎంపిక కోసం కసరత్తు కూడా మొదలుపెట్టాడు. ఈ సమయంలో అతడిని గమనించిన కొందరు క్రికెట్ ఆడమని సలహా ఇచ్చారు.
క్రికెట్ ప్రముఖులైన తునవ్ గిరి, కుమార్ గిరి, జావేద్ సర్, రాబిన్ సర్.. అహ్మద్ హుస్సేన్ కొడుకును క్రికెటర్ ను చేయమని చెప్పారు. ఎందుకంటే అతనికి అద్భుతమైన వేగం ఉంది. మెరుగైన బౌలర్గా ఎదగగలడని అన్నాడు. ఇంతకు ముందు షకీబ్ హుస్సేన్ టెన్నిస్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడాడు. అయితే, అతను క్రికెట్పై చాలా ఆసక్తిని కలిగి ఉన్నాడు. కానీ లెదర్ బాల్ క్రికెట్ ఆడాలంటే మంచి స్పైక్డ్ షూస్ అవసరం.స్పైక్డ్ షూస్ కొనడానికి 10,000 నుండి 15,000 అవసరం. అయితే, తల్లి తన బంగారు ఆభరణాలను విక్రయించి, తన కొడుకు కోసం స్పైక్డ్ షూలను కొనుగోలు చేసింది. ఈ బూట్లతో కొత్త కలను నిర్మించుకున్న షకీబ్.. తన ఫాస్ట్ బౌలింగ్ తో బిహార్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
A story of hard work, resilience and inspiration! 🫡
From Gopalganj to Eden Gardens…Sakib Hussain is a Knight! 💜 pic.twitter.com/oyMxDZnSsM
— KolkataKnightRiders (@KKRiders) May 25, 2024
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కనిపించి 4 వికెట్లు పడగొట్టాడు షకీబ్. ఈ ప్రదర్శన ఫలితంగా, అతను IPL 2023లో CSK జట్టు ద్వారా నెట్ బౌలర్గా ఎంపికయ్యాడు. అయితే ఐపీఎల్ జట్టులో చోటు దక్కించుకోవాలన్నది షకీబ్ కల. అందుకే ఈసారి కూడా తన పేరును ఐపీఎల్ వేలానికి పెట్టాడు. కానీ తొలి రౌండ్లో ఏ ఫ్రాంచైజీని కొనుగోలు చేయలేదు. దీంతో ఈసారి కూడా షకీబ్ హుస్సేన్ తన ఐపీఎల్ కలను వదులుకున్నాడు. కోచ్ రాబిన్ సింగ్కు కూడా ఫోన్ చేసి తన నిరాశను పంచుకున్నాడు. అయితే కొద్ది క్షణాల్లో జరిగిన చివరి రౌండ్లో షకీబ్ హుస్సేన్ను కోల్కతా నైట్ రైడర్స్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. షకీబ్ సాధించిన విజయానికి ఊరంతా సంబరాలు చేసుకుంది.
‘మా అబ్బాయి తన తల్లిదండ్రుల కష్టాలను బాగా అర్థం చేసుకున్నాడు. చాలా మంచి అబ్బాయి. మాకు ఇంతకంటే ఏం కావాలి’ అంటున్నారు షకీబ్ హుస్సేన్ తండ్రి అహ్మద్. 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సత్తా ఉన్న షకీబ్ హుస్సేన్ ఇప్పుడు కేకేఆర్ జట్టులో ఉన్నాడు. కానీ ఈ ఐపీఎల్లో యువ స్పీడ్స్టర్కు మ్యాచ ్ఆడే అవకాశం రాలేదు. అయితే షకీబ్ తన స్పీడుతో కేకేఆర్ శిబిరంలో సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్న షకీబ్ హుస్సేన్ వయసు 20 ఏళ్లు మాత్రమే. అందుకే రానున్న రోజుల్లో భారత జట్టుకు మరో స్పీడ్ మాస్టర్ దొరికినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Business
Success Story: ఒకప్పుడు వెయ్యి నెలజీతంతో పాట్లు.. రూ.5,000 కోట్ల కంపెనీకి యజమాని..
![](https://infoline.one/wp-content/uploads/2024/04/chandhubhaivirani-1714382556.webp)
Virani Brothers: సక్సెస్ సాధించటం అంటే కేవలం డబ్బు సంపాదించటం మాత్రమే కాదు. దేశంలో అత్యుత్తమ కంపెనీల్లో ఒకటిగా నిలిచే స్థాయికి తన కలలను నిర్మించటం అని కొందరి సక్సెస్ స్టోరీ నిరూపిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది స్నాక్ వ్యాపారంలో దిగ్గజ కంపెనీని నిర్మించిన విరానీ సోదరుల గురించే. ఒకప్పుడు వందల రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించిన వీరు ప్రస్తుతం అత్యంత ప్రజాధరణ పొందిన బాలాజీ వేఫర్స్ సంస్థను స్థాపించటంతో పాటు విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నారు. సందుభాయ్ విరానీ 1974లో తన సోదరుడితో కలిసి ఉద్యోగం కోసం రాజ్కోట్కు వచ్చారు. ఆ సమయంలో వారు సినిమా థియేటర్లలో స్నాక్స్ అమ్మే పనిలో చేరారు. అప్పుడు వారి నెల జీతం రూ.1000. సవాళ్ల ప్రయాణం తర్వాత రిస్క్ తీసుకుని సొంత వ్యాపారాన్ని ప్రారంభించే దిశగా వారు అడుగులువేశారు.
తాము సినిమా హాళ్లలో విక్రయించిన పొటాటో చిప్స్ భారీగా ప్రజాధరణ పొందటంతో దానిని పూర్తి స్థాయిలో చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ చిన్న ప్రయత్నం నేడు విరానీ సోదరులను దేశంలో అతిపెద్ద స్నాక్స్ తయారీ కంపెనీ నిర్మాణం దాకా నడిపించింది. తొలుత చిన్న స్థాయిలో చిప్స్ తయారీ చేసిన వీరు చుట్టుపక్కల దుకాణాల్లో వాటిని విక్రయించారు. అలా తర్వాతి కాలంలో 1982లో రూ.1.5 లక్షల రుణం తీసుకుని బంగాళదుంప చిప్స్ తయారీకి తొలిసారిగా ఫ్యాక్టరీని స్థాపించారు. అయితే ఆ రోజుల్లో ఇంత భారీ పెట్టుబడితో ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్ణయం పెద్ద సాహసమనే చెప్పుకోవాలి. అలా 1992లో సోదరులు కలిసి బాలాజీ వేఫర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రత్యేక కంపెనీని స్థాపించారు.
బాలాజీ వేఫర్స్ దేశంలో మూడవ అతిపెద్ద స్నాక్ తయారీ కంపెనీ. భారతీయ స్నాక్స్ మార్కెట్లో కంపెనీకి ఏకంగా 12% మార్కెట్ వాటా ఉంది. ఒకానొక సమయంలో దీనిని అమెరికాకు చెందిన ప్రముఖ స్నాక్స్ తయారీదారు లేస్ తయారీ సంస్థ పెప్సికో కొనుగోలుకు ప్రయత్నాలు సైతం చేసింది. గడచిన ఏడాది కంపెనీ ఆదాయం రూ.5,000 కోట్ల మార్కుకు చేరుకుంది. ప్రస్తుతం 7000 మంది ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థ గంటకు 3,400 కిలోగ్రాముల చిప్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ ఉత్పత్తుల పోర్ట్ఫోలియోలో 65 కంటే ఎక్కువ స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి. కంపెనీకి ఉన్న అద్భుతమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, నాణ్యమైన ఉత్పత్తి కారణంగా దేశంలోని మారుమూల గ్రామాల్లో సైతం కంపెనీ తన ఉత్పత్తులను విక్రయిస్తోంది.
-
Business2 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career2 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
Business2 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
Business2 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National3 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
News2 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Education2 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National2 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Crime News2 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh2 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Spiritual2 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National2 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
National2 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh2 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh2 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Political1 month ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
National1 month ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
National2 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Andhrapradesh2 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Andhrapradesh1 month ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Railways1 month ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
Telangana2 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Andhrapradesh2 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Andhrapradesh2 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Political2 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh2 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Andhrapradesh1 month ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh1 month ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
International2 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Business2 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
News3 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Spiritual2 months ago
Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?
-
National2 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
News2 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
International1 month ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Education1 month ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
News2 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh2 months ago
AP Schools Reopen Date 2024: ఏపీలో వేసవి సెలవుల పొడిగింపు.. తిరిగి బడి గంట మోగేది అప్పుడే!
-
Hyderabad1 month ago
ఏపీలో చంద్రబాబు వస్తే హైదరాబాదుకు వచ్చిన నష్టం ఏమీ లేదు… పొంగులేటి
-
Cinema2 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
-
Cinema4 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Andhrapradesh1 month ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
Andhrapradesh5 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Andhrapradesh2 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Weather1 month ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Andhrapradesh2 months ago
ఏపీలో ఆ శాఖ ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ మరో రెండేళ్లు పొడిగింపు
-
National2 months ago
ఒకే కుటుంబంలో 165మంది- ఓట్ల కోసం ఫ్యామిలీ చుట్టూ నేతలు! అందరూ చర్చించే ఓటేస్తారట! – Voters In One Family In Bihar
-
Railways2 weeks ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Life Style2 months ago
Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు
-
National2 months ago
Loksabha : ఈనెల 24 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు….. స్పీకర్ ఎన్నిక!