Andhrapradesh

బంగాళాఖాతంలో అల్పపీడనం – నేడు వాయుగుండంగా మారే అవకాశం

Published

on

Rain Alert in Andhra Pradesh : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని, శని, ఆదివారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. నేడు మన్యం, అల్లూరి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వర్ష సూచన ఉందని తెలిపారు. అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్‌, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version