Cricket
IPL 2024 : చెన్నైకి తప్పని ఓటమి.. 35 పరుగుల తేడాతో గుజరాత్ ఘన విజయం
IPL 2024 – CSK vs GT : ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఆసక్తికర పోరులో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. 232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులకే సీఎస్కే పరాజయం పాలైంది.
హాఫ్ సెంచరీలతో మెరిసిన మిచెల్, మెయిన్ అలీ :
చెన్నై ఆటగాళ్లలో డారిల్ మిచెల్ (63; 34 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్స్), మెయిన్ అలీ (56; 36 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్) హాఫ్ సెంచరీలతో విజృంభించారు. మోహిత్ శర్మ బౌలింగ్లో షాట్ ఆడిన మిచెల్.. షారూక్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా, మెయిన్ అలీ కూడా నూర్ అహ్మద్కు క్యాచ్ ఇచ్చి నిష్ర్కమించాడు. శివమ్ ధూబే (21) పరుగులతో రాణించగా, ఓపెనర్ అజింక్య రహానే (1), రచిన్ రవీంద్ర (1) పేలవ ప్రదర్శనతో చేతులేత్తేశారు. రుత్రాజ్ గైక్వాడ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు.
𝗠𝗶𝗹𝗲𝘀𝘁𝗼𝗻𝗲 𝗨𝗻𝗹𝗼𝗰𝗸𝗲𝗱 🔓
MS Dhoni completes 2️⃣5️⃣0️⃣ sixes in the IPL 👏
Scorecard ▶️ https://t.co/PBZfdYswwj#TATAIPL | #GTvCSK pic.twitter.com/gNUGS0Jhs8
— IndianPremierLeague (@IPL) May 10, 2024
ధోని ఖాతాలో 250 సిక్స్లు :
మిగతా ఆటగాళ్లలో రవీంద్ర జడేజా (18) పరుగులకే పరిమితం అయ్యాడు. ఎంఎస్ ధోని (26 నాటౌట్), శార్దూల్ ఠాకూర్ (3) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ ఏకంగా 3 వికెట్లు తీసుకోగా, రషీద్ ఖాన్ 2 వికెట్లు, ఉమేష్ యాదవ్, సందీప్ వారియర్ తలో వికెట్ తీసుకున్నారు. ఇదిలా ఉండగా, ఐపీఎల్ అన్ని సీజన్లతో కలిపి ఎంఎస్ ధోనీ మొత్తం 250 సిక్స్లను పూర్తి చేశాడు. గుజరాత్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ధోని ఈ ఫీట్ సాధించాడు.