Cricket

IND vs AUS Pitch Report: డారెన్ సామీ స్టేడియంలో భారత్, ఆసీస్ మ్యాచ్.. పిచ్ రిపోర్ట్ చూస్తే పరేషానే.. ఎందుకో తెలుసా?

Published

on

ఓటమి ఎరుగని టీమిండియా నేడు అంటే జూన్ 24న T20 వరల్డ్ కప్ 2024 సూపర్ 8 స్టేజ్‌లో తమ చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్‌పై ఆశ్చర్యకరమైన ఓటమి తర్వాత ఆస్ట్రేలియాకు ఇది ‘డూ ఆర్ డై’ మ్యాచ్. భారత జట్టు ఇప్పుడు వరుసగా మూడో విజయంతో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు చేరుకోవాలనుకుంటోంది. సెయింట్ లూసియాలోని గ్రాస్ ఐలెట్‌లోని డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియం మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది.

డారెన్ సామీ స్టేడియం పిచ్ నివేదిక..
ఈ టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు డారెన్ సామీ స్టేడియంలో నమోదైంది. ఈ మైదానంలో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడగా, 6 సార్లు 180 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లు నమోదయ్యాయి. కానీ, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు కష్టంగా మారింది. పగటిపూట ఈ మైదానంలో జరిగిన ఏకైక మ్యాచ్ ఇదే. పగటిపూట భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ కూడా జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిచ్ స్పిన్ బౌలర్లకు సహకరించే అవకాశం ఉంది.

భారత్ గెలిస్తే ఆస్ట్రేలియా ఔట్..
ఆఫ్ఘనిస్తాన్‌పై ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు భారత్‌పై గెలవలేమనే ఒత్తిడితో సోమవారం రాత్రి బంగ్లాదేశ్‌పై రషీద్ ఖాన్ జట్టు ఓడిపోవాలని ప్రార్థించవలసి ఉంది. ఐసీసీ టోర్నీల్లో తరచూ ఆస్ట్రేలియాపై ఓడిపోయే భారత జట్టు.. ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను ఓడించేందుకు కంకణం కట్టుకుంది.

రెండు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యస్సవి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version