Cricket

యూఎస్‌లో విరాట్ కోహ్లీ భద్రత చూశారా..? గుర్రాలతో చుట్టుముట్టారు.. వీడియో వైరల్

Published

on

T20 World Cup 2024 : టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిధ్యమిస్తున్నాయి. ఈ టోర్నీలో ఏకంగా 20 దేశాల జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటికే వరల్డ్ కప్ మ్యాచ్ ప్రారంభం కాగా.. జూన్ 5న టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఐర్లాండ్ జట్టుతో ఆడనుంది. భారత్ జట్టు శనివారం బంగ్లాదేశ్ తో వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ కు కోహ్లీ గౌర్హాజరయ్యాడు. ఆలస్యంగా విరాట్ కోహ్లీ అమెరికాకు చేరుకోవటంతో వార్మప్ మ్యాచ్ లో ఆడలేక పోయారు. అయితే, విరాట్ కోహ్లీ టీం సభ్యుల్లో చేరేందుకు నసావు కౌంటీలోని మైదానానికి చేరుకున్నప్పుడు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోహ్లీకి స్థానిక పోలీసులు కల్పించిన భద్రతను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.


టీ20 ప్రపంచ కప్ కోసం యూఎస్ చేరుకున్న టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి స్థానిక పోలీసులు పటిష్ఠ భద్రతను కల్పించారు. హోటల్ నుంచి మైదానంకు చేరుకునే సమయంలో కోహ్లీకి కల్పించిన భద్రతకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో కోహ్లీ చుట్టూ భద్రతా సిబ్బంది ఉన్నారు. వారిపక్కనే గుర్రాలపై భద్రతా సిబ్బంది పహారాగా ఉండగా కోహ్లీ మైదానంలోకి వెళ్లాడు. కోహ్లీ వెంట మరో టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ కూడా ఉన్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేశారు. ఇప్పుడే భద్రత ఇలాఉంటే జూన్ 9న పాకిస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా అధికారులు ఎలాంటి భద్రత కల్పిస్తారో ఉంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version