Hashtag

Hot Summer : ఇవేం ఎండలు రా నాయనా..! తెలుగు రాష్ట్రాల్లో 40డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, జూన్ వరకూ అగ్నిగుండమే..

Published

on

Hot Summer : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. రామగుండంలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు, విజయవాడ, అనంతపురం, నెల్లూరు, తిరుపతిలోనూ 40 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయ్యింది. ఏపీలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు 42, తిరుపతి 41, నెల్లూరు, విజయవాడలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది.

మాడు పగిలిపోయేలా ఉన్న ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున.. అవసరమైతేనే బయటకు రావాలని వైద్యులు అంటున్నారు. వడదెబ్బ బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version