Education
J E E–2024 ఫలితాలు విడుదల…final key విడుదల
JEE Advanced 2024 Results: దేశంలో ఐఐటీలు సహా ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు మే 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాయి.
జూన్ 9న ఉదయం 10 గంటలకు ఫలితాలను ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ రూల్ నెంబరు, పుట్టినతేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. ఈ ఏడాది మే 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2024 పరీక్షకు దేశవ్యాప్తంగా 1.91 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 26, తెలంగాణలో 13 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మంది వరకు పరీక్షకు హాజరయ్యారు.
జేఈఈ అడ్వాన్స్డ్ – 2024 ఫలితాలు ఇలా చూసుకోండి..
* ఫలితాల కోసం విద్యార్థులు మొదటి అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి. – https://jeeadv.ac.in/
* అక్కడ హోంపేజీలో కనిపించే JEE (Advanced) 2024 Results లింక్ మీద క్లిక్ చేయాలి.
* ఫలితాలకు సంబంధించిన లాగిన్ పేజీలో విద్యార్థులు తమ రూల్ నెంబరు, పుట్టినతేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు వివరాలు నమోదుచేయాలి.
* జేఈఈ అడ్వాన్స్డ్ – 2024 ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
* ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
జేఈఈ అడ్వాన్స్డ్ – 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి..
Paper 1 Final Key
Paper 2 Final Key
జేఈఈ అడ్వాన్స్డ్-2024 పరీక్షకు హాజరైనవారిలో ఈసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే అధికంగా ఉన్నారు. దాదాపు 40 వేల వరకు విద్యార్థులు పరీక్ష రాశారు. జేఈఈ మెయిన్ను రెండు సెషన్లు కలిపి 14.10 లక్షల మంది పరీక్షలకు హాజరైన సంగతి తెలిసిందే. వీరిలో క్వాలిఫై కటాఫ్ మార్కులు సాధించిన వారిలో 2.5 లక్షల మందికి అడ్వాన్స్డ్కు అర్హత కల్పిస్తారు. మొత్తం 2,50,284 మంది అభ్యర్థులు అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించగా.. మొత్తం 1.91 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష కోసం అభ్యర్థులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. 2022లో 1.60 లక్షల మంది, 2023లో 1.89 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా.. ఈసారి ఏకంగా 1.91 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఏపీ, తెలంగాణల నుంచి అత్యధిక శాతం మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 45,965 మంది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించగా.. 40 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.
జేఈఈ మెయిన్ 2024 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్లో 2.50 లక్షల మంది విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్డ్కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్ తుది ఫలితాలను ఏప్రిల్ 25న వెల్లడించగా… జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 27న ప్రారంభమైంది. మే 7 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. మే 26న దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహించింది. జేఈఈ అడ్వాన్స్డ్ – 2024 పరీక్ష రెస్పాన్స్ షీట్లను ఐఐటీ మద్రాస్ మే 31న విడుదల చేసిన సంగతి తెలిసిందే. జేఈఈ అడ్వాన్స్డ్ – 2024కు సంబంధించి పేపర్-1, పేపర్-2 ప్రశ్నపత్రాలను ఇప్పటికే అందుబాటులో ఉంచింది. పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ని జూన్ 2న విడుదల చేసింది. జూన్ 3న సాయంత్రం 5 గంటలకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించారు. తాజాగా జూన్ 9న ఫలితాలను వెల్లడించింది.
జూన్ 10 నుంచి జోసా కౌన్సెలింగ్..
ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BS), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి జోసా (JoSAA) పేరిట సంయుక్త కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 10 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. జులై 23 వరకు 44 రోజులపాటు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ ద్వారా ఎన్ఐటీల్లో దాదాపు 24 వేల సీట్లు, ఐఐటీల్లో 17,385, ట్రిపుల్ ఐటీల్లో మరో 16 వేల సీట్లను భర్తీచేయనున్నారు. ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకుతోపాటు అభ్యర్థులు బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలన్న నిబంధన అమల్లో ఉంది. ఈసారి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ కౌన్సెలింగ్లో పాల్గొనే విద్యాసంస్థల సంఖ్య పెరిగింది. గతేడాది 114 ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 121కి పెరిగింది.
Education
తెలంగాణ హైస్కూలు టైమింగ్ లో మార్పు
ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు
హైదరాబాద్, రాష్ట్రంలో స్కూళ్ల టైమింగ్స్ను ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు హైస్కూల్ వేళల్లో మార్పు లు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు హైస్కూల్ టైమింగ్స్ఉం డగా.. ఇప్పుడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటలకు మార్చారు.
ఇక హైదరాబాద్లో అప్పర్ ప్రైమరీ స్కూళ్ల టైమింగ్స్కూడా మార్చారు. సిటీలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అప్పర్ ప్రైమరీ స్కూళ్లను ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడపాలని సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Education
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై ఉచితం.. నేరుగా వారికే..
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై ఉచితం.. నేరుగా వారికే..
ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీవ్యాప్తంగా ఉన్న గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను నేరుగా అందించాలని నిర్ణయం తీసుకుంది. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పేస్ట్, బ్రష్, షాంపూ వంటి కాస్మొటిక్ వస్తువులను ఉచితంగా అందివ్వనున్నారు. అయితే గతంలోనూ విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను ఉచితంగా అందించేవారు. అయితే నేరుగా ఇవ్వకుండా వారి తల్లుల ఖాతాల్లో ఈ మొత్తం జమ చేస్తూ వచ్చారు. అయితే ఈ ఛార్జీలు సకాలంలో అందక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారనే వార్తలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాస్మొటిక్ వస్తువులను విద్యార్థులకు నేరుగా ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది.
గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాఠశాల విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను నేరుగా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం కాస్మొటిక్ వస్తువులను నేరుగా ఇవ్వకుండా.. కాస్మొటిక్ ఛార్జీలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేస్తూ వచ్చింది. అయితే ఆ నగదు సకాలంలో విడుదల చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. దీంతో కాస్మొటిక్ వస్తువులు అందక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే పేస్టు, బ్రష్, షాంపూ వంటి కాస్మొటిక్ వస్తువులను నేరుగా వారికి ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ అధికారులు తమ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు పంపారు. సీఎం చంద్రబాబు ఆమోదిస్తే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
Andhrapradesh
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
ఆమరావతి, జూన్ 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన సోమవారం (జూన్ 24) కొలువైన మంత్రిమండలి మెగా డీఎస్సీ పాటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) కూడా నిర్వహించేందుకు అమోదం తెలిపింది.
ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు నిర్వహించిన టెట్లో అర్హత సాధించని వారితో పాటు, ఈ ఏడాది కొత్తగా బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు కూడా మెగా డీఎస్సీ రాసేంందుకు అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో మరోమారు టెట్ పరీక్ష నిర్వహించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ జులై 1వ తేదీన విడుదలకానుంది. కొంచెం అటుఇటుగా టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు. కొంచెం తేదీల మార్పుతో ఒకేసారి దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డీఎస్సీ కంటే ముందే మొదట టెట్ పరీక్ష నిర్వహించి.. ఆ తర్వాత డీఎస్సీకి సన్నద్ధమయ్యేందుకు 30 రోజులు సమయం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. టెట్ ఫలితాలు వెలువడిన తర్వాత డీఎస్సీ పరీక్ష ఉంటుంది.
అన్నీ అనుకున్నట్లు కుదిరితే జులై 1వ తేదీనే మెగా డీఎస్సీతోపాటు టెట్కు కూడా ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటనను రద్దు చేసి, కొత్తగా 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ ప్రకటన ఇస్తారు. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడగా.. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,72,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఎన్నికల కోడ్ కారణంగా పరీక్ష నిర్వహించకుండానే వాయిదా పడింది. ఆ తర్వాత అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ను రద్దు చేసి పోస్టుల సంఖ్య పెంచి.. మెగా డీఎస్సీకి నోటిఫికేసన్ వెలువరించనున్నట్లు ప్రకటించింది.
సోమవారం మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి ఏడాదీ డీఎస్సీ నిర్వహించే అంశంపై కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఏ విద్యా సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చే ఖాళీలను ఎప్పటికప్పుడు అవసరం మేరకు డీఎస్సీ నిర్వహించాలనే యోచన కూడా చేస్తుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిచాలంటే రాష్ట్రంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండాలని నిపుణులు సైతం అభిప్రాయ పడుతున్నారు.
-
Business2 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career2 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
Business2 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
National3 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business2 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
News2 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Education2 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National2 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Crime News2 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh2 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Spiritual2 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National2 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Andhrapradesh2 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
National2 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh2 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Political1 month ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
National2 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
National2 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Andhrapradesh2 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Railways1 month ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
Andhrapradesh1 month ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Telangana2 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Andhrapradesh2 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Political2 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh2 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh2 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Andhrapradesh1 month ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh1 month ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
International2 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Business2 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
News3 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
News2 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Spiritual2 months ago
Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?
-
National2 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
International1 month ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Education1 month ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Andhrapradesh2 months ago
AP Schools Reopen Date 2024: ఏపీలో వేసవి సెలవుల పొడిగింపు.. తిరిగి బడి గంట మోగేది అప్పుడే!
-
News2 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Hyderabad1 month ago
ఏపీలో చంద్రబాబు వస్తే హైదరాబాదుకు వచ్చిన నష్టం ఏమీ లేదు… పొంగులేటి
-
Cinema4 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Cinema2 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
-
Andhrapradesh1 month ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
Andhrapradesh2 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Andhrapradesh5 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Weather1 month ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
National2 months ago
ఒకే కుటుంబంలో 165మంది- ఓట్ల కోసం ఫ్యామిలీ చుట్టూ నేతలు! అందరూ చర్చించే ఓటేస్తారట! – Voters In One Family In Bihar
-
Railways2 weeks ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh2 months ago
ఏపీలో ఆ శాఖ ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ మరో రెండేళ్లు పొడిగింపు
-
National2 months ago
Loksabha : ఈనెల 24 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు….. స్పీకర్ ఎన్నిక!
-
Life Style2 months ago
Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు