Business

సెల్ టవర్లు లేకుండానే మొబైల్ కమ్యూనికేషన్స్..

Published

on

మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌లో ‘శాటిలైట్’ కనెక్టివిటీని సాధించడంలో చైనా శాస్త్రవేత్తలు విజయం సాధించారు. సెల్ టవర్లు లేకుండా ఫోన్లలో మాట్లాడుకోవచ్చు అని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చైనా కక్ష్యలోకి పంపిన ‘టియాంటాంగ్-1’ సిరీస్ ఉపగ్రహాల సంఖ్య మూడుకు చేరింది. ఇది ఆసియా-పసిఫిక్ ప్రాంతం అంతటా మొబైల్ ఉపగ్రహ కనెక్టివిటీకి మార్గం సుగమం చేసింది. భూకంపాలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ‘శాటిలైట్ కనెక్టివిటీ’ కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా, శాటిలైట్ కనెక్టివిటీకి సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చిన ప్రపంచంలోనే మొదటి కంపెనీగా Huawei ఇప్పటికే గుర్తింపు పొందింది. Xiaomi, Honor, Oppo స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తాజాగా ఈ జాబితాలో చేరాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version