Connect with us

Spiritual

Shravan Masam 2024: ఐదు సోమవారాలు, నాలుగు మంగళవారాలు.. ఈసారి శ్రావణం చాలా ప్రత్యేకం..

Published

on

మరి కొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మహిళలు పూజలు, వ్రతాలతో బిజీ బిజీగా కాలం గడిపేయనున్నారు. ఎందుకంటే రాబోయేది శ్రావణమాసం. ఈసారి శ్రావణ మాసానికి ఓ ప్రత్యేక విశిష్టత సంతరించుకుంది. ఈసారి శ్రావణమాసంలో ఐదు సోమవారాలు రానున్నాయి. అంతేకాక నాలుగు మంగళవారాలు, నాలుగు శుక్రవారాలు ఉన్నాయి. దాంతో శ్రావణమాసం మొత్తం పూజలే పూజలు… పూజలు వ్రతాలు నోములతో మహిళలు అంతా బిజీ షెడ్యూల్. అసలు శ్రావణ మాసంలో ఏ పూజలు చేస్తారు ?.. ఎందుకు చేస్తారు ?… చేయటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం… శ్రావణమాసం మహిళలకు ఎంతో ఇష్టమైన నెల… ఆ నెల అంతా మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో సందడిగా తెలుగు సాంప్రదాయాలు ఉట్టి పడేటట్టుగా పూజలు వ్రతాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శ్రావణమాసంలో శ్రావణ వరలక్ష్మీ వ్రతాలతో పాటు, శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు కూడా నిర్వహించడం మహిళలకు పరిపాటి. వాటితోపాటు సోమవారం కూడా ఎంతో విశిష్టమైన రోజు. ఈసారి శ్రావణమాసం జులై 22 సోమవారం నాడు ప్రారంభమై ఆగస్టు 19 సోమవారం నాడు ముగుస్తుంది. అంటే ఈసారి శ్రావణమాసంలో ఐదు సోమవారాలు ఉన్నాయి. అలాగే నాలుగు మంగళవారాలు, నాలుగు శుక్రవారాలు వస్తాయి. మహిళలు వరాలిచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు.

అష్టలక్ష్ములలో వరలక్ష్మి దేవికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వివాహం అయిన మహిళలు నిత్య సుమంగళీగా జీవించాలనే సంకల్పంతో ప్రతి ఏట శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం తప్పనిసరిగా ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం శాశ్వతంగా తమపై ఉండి ఏటువంటి కష్టనష్టాలకు లోను కాకుండా సంతోషంగా జీవిస్తామని మహిళల నమ్మకం. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటారు. సాధారణంగా శ్రావణమాసంలో నాలుగు శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. అయితే ముఖ్యంగా శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని పెద్ద ఎత్తున మహిళలు చేసుకుంటారు. ఈ వ్రతాన్ని ఎక్కువగా పెళ్లయిన మహిళలు మాత్రమే జరుపుకుంటారు. కొత్త జంటలు సంతానం, ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు ఉండాలని లక్ష్మీదేవిని పూజిస్తారు. వరలక్ష్మి దేవిని పూజిస్తే అష్టలక్ష్మిలను పూజించినంత ఫలితం వస్తుందని మహిళల విశ్వాసం. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే నిద్ర లేచి తల స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకుని, తర్వాత పూజ గదిలో బియ్యపు పిండితో ముగ్గు వేసి, కలశం ఏర్పాటు చేసుకుంటారు. లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని సిద్ధం చేసుకుని పూజా సామాగ్రి, తోరాలు, అక్షితలు, పసుపు గణపతిని సిద్ధం చేసుకుని వరలక్ష్మీ వ్రతం కథను చదువుతూ పూజ చేస్తారు.

అదేవిధంగా శ్రావణమాసంలో మంగళవారాలకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. శ్రావణమాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ముఖ్యంగా మహిళలు తమ సౌభాగ్యాల కోసం పార్వతి దేవిని పూజిస్తూ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం చేయడం ద్వారా తమ సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని వారి నమ్మకం. అందుకే కొత్తగా పెళ్లయిన మహిళలు ఎక్కువగా మంగళ గౌరీ వ్రతం చేస్తారు. అత్యంత భక్తి శ్రద్దలతో గౌరీదేవిని పూజిస్తారు. ముఖ్యంగా వివాహమైన సంవత్సరం నుండి ఐదు సంవత్సరాలపాటు కచ్చితంగా ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింట్లో, ఆ తరువాత అత్తవారింట్లో జరుపుకుంటారు. ముఖ్యంగా పురాణాల ప్రకారం చూస్తే పరమ శివుడు కూడా మంగళ గౌరి దేవిని ఆరాధించి త్రిపురాంతర సంహారం చేశారని చెబుతారు. తొలిసారిగా వ్రతాన్ని చేసే మహిళలు తమ తల్లిని పక్కన పెట్టుకొని పూజ చేసి తొలి వాయనాన్ని తల్లికే అందిస్తే మంచిదని వారి నమ్మకం. అలా కాని పక్షంలో తమ అత్తకు కానీ, లేదా ఇతర ముత్తైదువలకు గాని వాయనం అందిస్తారు.

మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించడానికి ముందు వ్రత నియమాలు భక్తిశ్రద్ధలతో పాటిస్తారు. వ్రతం చేసుకునే ముందు రోజు, వ్రతం రోజు కూడా భార్యాభర్తలు దాంపత్య సుఖానికి దూరంగా ఉంటారు. వ్రతం రోజు వ్రతం చేసుకునే మహిళలు ఉపవాసం చేస్తారు. వ్రతానికి ఐదుగురు ముత్తైదువులను పిలిచి వాయనం ఇస్తారు. వ్రతం చేసుకునే అన్ని మంగళవారాలలో ఒకే మంగళ గౌరీ దేవి విగ్రహాన్ని ఉపయోగిస్తారు. అంతేకాకుండా ముఖ్యంగా వాయినం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వరు. ఎందుకంటే సౌభోగ్యం కోసం చేసే వ్రతం కాబట్టి పసుపు కుంకుమలు ఇవ్వడం మంచిది కాదని భావిస్తారు. ఇలా మహిళలు వ్రతాలు పూజలతో శ్రావణమాసం మొత్తం బిజీగా గడిపేయనున్నారు.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Spiritual

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ టికెట్ల విడుదల తేదీలను మార్చిన టీటీడీ

Published

on

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల తేదీలలో టీటీడీ మార్పులు చేసింది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో ఈ టికెట్ల విడుదల తేదీలను టీటీడీ మార్చింది. మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను డిసెంబర్ 25వ తేదీన.. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను డిసెంబర్ 26వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. 2025 మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల తేదీలను టీటీడీ మార్చింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం 2025 మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయాల్సి ఉంది. అలాగే 2025 మార్చి నెలకు సంబంధించిన రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను డిసెంబరు 24న ఉదయం పది గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని టీటీడీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ తేదీలలో మార్పులు చేశారు.

మార్చి నెల శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీలలో మార్పులు చేశారు. డిసెంబరు 25వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను, డిసెంబరు 26వ తేదీ ఉదయం 11 గంటలకు 2025 మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేస్తామని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది.

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ టికెట్ల విడుదల తేదీలను మార్చిన టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల తేదీలలో టీటీడీ మార్పులు చేసింది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో ఈ టికెట్ల విడుదల తేదీలను టీటీడీ మార్చింది. మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను డిసెంబర్ 25వ తేదీన.. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను డిసెంబర్ 26వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. 2025 మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల తేదీలను టీటీడీ మార్చింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం 2025 మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయాల్సి ఉంది. అలాగే 2025 మార్చి నెలకు సంబంధించిన రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను డిసెంబరు 24న ఉదయం పది గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని టీటీడీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ తేదీలలో మార్పులు చేశారు
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ టికెట్ల విడుదల తేదీలను మార్చిన టీటీడీ

Advertisement

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ టికెట్ల విడుదల తేదీలను మార్చిన టీటీడీ

మార్చి నెల శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీలలో మార్పులు చేశారు. డిసెంబరు 25వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను, డిసెంబరు 26వ తేదీ ఉదయం 11 గంటలకు 2025 మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేస్తామని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది.

మరోవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి 19 వరకూ తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాలకు అనుమతించనున్నారు. ఈ పదిరోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన శ్రీవాణి టికెట్లను డిసెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబరు 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీవారి భక్తులు టీటీడీ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని భక్తులను కోరింది.

Continue Reading

Andhrapradesh

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ – మార్చి నెల దర్శన టికెట్ల విడుదల తేదీల్లో మార్పులు

Published

on

Tirumala Tirupati Devasthanam Updates : మార్చి నెల దర్శన టిక్కెట్ల విడుదల తేదీల్లో టీటీడీ మార్పులు చేసింది. ఈనెల 25వ తేదీన ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు తాజా ప్రకటనలో పేర్కొంది. 26వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనుంది.

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. మార్చి నెల దర్శన టిక్కెట్ల విడుదల తేదీల్లో మార్పులు చేసింది. ఈ మేరకు తాజా ప్రకటన విడుదల చేసింది.

తేదీలు మార్పు…
డిసెంబర్ 25వ తేదీన ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇక డిసెంబర్ 26వ తేదీన ఉదయం 11 గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి, తిరుమలలోని వసతి గదులు కోటా టికెట్లను విడుదల చేయనుంది.

ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… మార్చి నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబరు 24న విడుదల కావాల్సి ఉంది. ఇక డిసెంబర్ 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తామని పేర్కొంది. కానీ తాజా ప్రకటనలో పలు మార్పులు చేసింది.

మార్పులకు అనుగుణంగా భక్తులు టికెట్లను బుకింగ్ చేసుకోవాలని టీటీడీ కోరింది. https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది. ఇతర సైట్లను నమ్మవద్దని కోరింది.

Advertisement
    డిసెంబ‌రు 21న ఆర్జిత సేవా టికెట్లు : కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను డిసెంబ‌రు 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

    డిసెంబ‌రు 21న వర్చువల్ సేవల కోటా : వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన 2025 మార్చి నెల కోటాను డిసెంబరు 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

    డిసెంబరు 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు: మార్చి నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను డిసెంబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

    వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా : వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను డిసెంబరు 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

Continue Reading

Spiritual

శబరిమలకు పోటెత్తిన భక్తులు- ఒక్క రోజులో 96 వేల మంది దర్శనం – SABARIMALA DEVOTEES

Published

on

Sabarimala Devotees : కేరళలో ప్రసిద్ధి చెందిన శబరిమల అయ్యప్ప దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఇరుముడితో శబరిమలలో అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. డిసెంబర్ 19(గురువారం) ఒక్కరోజే 96,000పైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ సీజన్​లో అత్యధికంగా గురువారం ఒక్కరోజులోనే 96,007 మంది భక్తులు శబరిమలకు వచ్చినట్లు ఆలయ అధికారులు ఓ ప్రకటను విడుదల చేశారు. వారిలో 70,000 మంది వర్చువల్ బుకింగ్స్, స్పాట్ బుకింగ్స్ ద్వారా 22,121 మంది, పుల్మేడ్​ మీదుగా 3,016 మంది, ఎరుమేలి అటవీ మార్గం నుంచి 504 మంది భక్తులు వచ్చినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం కూడా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగందని, సాయంత్రం 5 గంటల వరకు 70,964 మంది భక్తులు వచ్చినట్లు తెలిపారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 19 వరకు మొత్తం 4,46130 మంది భక్తులు స్పాట్​ బుకింగ్ చేసుకున్నట్లు పేర్కొన్నారు.

మండల పూజ నేపథ్యంలో!
మండల పూజ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. నవంబరు 16న ప్రారంభమైన మండల పూజ సీజన్, డిసెంబరు 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగియనుంది. ఈ క్రమంలో తొలుత అయ్యప్ప స్వామిని ‘తంకా అంకి’తో అలంకరించిన తర్వాత, పవిత్రమైన బంగారు వస్త్రాన్ని ఉత్సవ ఊరేగింపుతో ఆలయానికి తీసుకొస్తారు. తర్వాత మండల పూజ నిర్వహిస్తారు.

ఈ మండల పూజ సందర్భంగా డిసెంబర్ 22 నుంచి అయ్యప్ప దర్శనానికి దాదాపు లక్ష మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పరీక్షలు ముగియడం, క్రిస్మస్ సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులు కావడం వల్ల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భక్తులు ప్రశాంతంగా అయ్యప్పను దర్శించుకునేలా ఏర్పాట్లు చేశాలని ఏడీఎం అధికారులను ఆదేశించారు. భక్తుల సంఖ్య పెరిగినప్పటికీ, ఎలాంటి అదనపు ఆంక్షలు విధించకుండా భక్తులకు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు సన్నిధానం స్పెషల్‌ పోలీస్‌ అధికారి బీ కృష్ణకుమార్‌ తెలిపారు.

Continue Reading
Andhrapradesh2 weeks ago

ఏపీలో కొత్తగా అక్కడ రైల్వే స్టేషన్ రెడీ.. ఈ రూట్‌లో పట్టాలెక్కనున్న రైళ్లు, ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది

Andhrapradesh3 months ago

చెస్‌లో సీఎం చంద్రబాబు మనవడు వరల్డ్ రికార్డ్ – సంతోషంలో నారా కుటుంబం – CHANDRA BABU GRAND SON WORLD RECORD

International3 months ago

యుద్ధం ముగించేందుకు సిద్ధం- జెలెన్‌స్కీతో మాత్రం మాట్లాడం: పుతిన్ – PUTIN ON RUSSIA UKRAINE WAR

Spiritual3 months ago

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ టికెట్ల విడుదల తేదీలను మార్చిన టీటీడీ

International3 months ago

అమెరికాకు తప్పిన షట్ డౌన్ ముప్పు! నిధుల బిల్లుకు చివరి క్షణంలో ఆమోదం – US SHUTDOWN 2024

Andhrapradesh3 months ago

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ – మార్చి నెల దర్శన టికెట్ల విడుదల తేదీల్లో మార్పులు

Spiritual3 months ago

శబరిమలకు పోటెత్తిన భక్తులు- ఒక్క రోజులో 96 వేల మంది దర్శనం – SABARIMALA DEVOTEES

International3 months ago

భారత్, చైనాల మధ్య శాంతికి రోడ్ మ్యాప్.. సంబంధాల బలోపేతానికి ఆరు సూత్రాల ప్రణాళిక

Telangana3 months ago

గుడ్​ న్యూస్​: హైదరాబాద్​ బుక్​ ఫెయిర్ ప్రారంభం- ఇక పది రోజులు పుస్తక ప్రియులకు పండగే! – HYDERABAD BOOK FAIR 2024

Andhrapradesh5 months ago

విజయవాడ వాసులకు అద్దిరిపోయే తీపికబురు.. ఏపీకి ఇది కదా కావాల్సింది.!

Latest5 months ago

ఏపీ మంత్రివర్గ భేటీ – వాలంటీర్లు, ఉద్యోగుల పీఆర్సీపై కీలక నిర్ణయం..!!

Education5 months ago

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఐఐటీ.. అన్నీ కుదిరితే అక్కడే.. ఎన్నాళ్లకెన్నాళకు!

Spiritual5 months ago

తిరుమల లడ్డూ వివాదంతో అయోధ్య రామాలయం సంచలన నిర్ణయం!

Andhrapradesh7 months ago

Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా?

Andhrapradesh7 months ago

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఆర్జిత సేవా టికెట్లు విడుదల ఎప్పుడంటే..?

Andhrapradesh7 months ago

Musi River: వివాదంగా మారిన మూసీ బ్యూటిఫికేషన్.. తమ ఇళ్లను కూల్చివేయొద్దంటూ..

Spiritual7 months ago

కృష్ణాష్టమి అంటే కన్నయ్య జన్మదినమే.. ఈ ప్రదేశాలలో జన్మాష్టమి పండుగను భిన్నంగా జరుపుకుంటారు

National7 months ago

స్తంభం పైన ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. ఇంతలో అటుగా వచ్చిన ఓ పక్షి…

National7 months ago

Railway Jobs: క్రీడాకారులకు సదావకాశం.. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

National7 months ago

ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ఏం సందేశం ఇచ్చారో తెలుసా?

Andhrapradesh7 months ago

NTR Health University: ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలకు యాజమాన్య కోటా నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

International7 months ago

యుద్ధం వస్తే ఎలా? టెక్నాలజీపరంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌ ఎవరు స్ట్రాంగ్‌?

Hashtag7 months ago

Pen Hospital: పెన్నుల కోసం ఓ స్పెషల్ హాస్పిటల్.. ఇచ్చట అన్ని పెన్నులు రిపేర్ చేయబడును..!

International7 months ago

రష్యాలోకి 30 కి.మీ. దూసుకెళ్లిన యుక్రెయిన్ సైన్యం.. సేఫ్ జోన్లకు 76 వేల మంది తరలింపు

National7 months ago

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలో హైఅలర్ట్ .. ఎర్రకోట వద్ద పటిష్ఠ భద్రత

National7 months ago

UPSC Civils Mains 2024: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసిందోచ్

Andhrapradesh7 months ago

AP Police Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్‌

International7 months ago

ఇజ్రాయెల్​పై దాడికి ఇరాన్‌ సన్నాహాలు – అణు జలాంతర్గామిని పంపిస్తున్న అమెరికా – Iran backed Attack On Israel

International7 months ago

‘రాక్షసి వెళ్లిపోయింది’ – హసీనాపై ముహమ్మద్ యూనుస్​ ఘాటు వ్యాఖ్య – Yunus Comments On Hasina

International7 months ago

Donald Trump : ‘ఎక్స్‌’లో డొనాల్డ్ ట్రంప్‌తో ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ.. ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Business10 months ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career10 months ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

News10 months ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

Business10 months ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

National10 months ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

Business10 months ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

International10 months ago

‘పోస్ట్​ స్టడీ వర్క్​ ఆఫర్​ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్​ వెళ్లే విద్యార్థులకు గుడ్​ న్యూస్​ – UK Graduate Route Visa

National9 months ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

Education9 months ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

Crime News9 months ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

Andhrapradesh9 months ago

జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

Telangana10 months ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

National9 months ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

Andhrapradesh9 months ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

Railways9 months ago

పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే

National10 months ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Spiritual9 months ago

Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

Andhrapradesh9 months ago

సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల

Andhrapradesh9 months ago

పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

Andhrapradesh1 year ago

మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ

Andhrapradesh9 months ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

National9 months ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

National9 months ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

Political9 months ago

కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

Andhrapradesh9 months ago

ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత

Andhrapradesh8 months ago

ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు

Andhrapradesh9 months ago

వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

International10 months ago

Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం

National10 months ago

Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్

Andhrapradesh9 months ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

Trending