Connect with us

Andhrapradesh

AP HC Stay On EC Orders: నేడు డిబిటి పథకాలకు నగదు చెల్లింపు, ఈసీ ఆదేశాలపై స్టే విధించిన హైకోర్టు

Published

on

AP HC Stay On EC Orders: పోలింగ్ పూర్తయ్యే వరకు నగదు బదిలీ పథకాలు నిలిపివేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలపై ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. విపక్షాల ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ నిలిపివేసిన నగదు బదిలీ పథకాలకు సంబంధించిన నిధులను లబ్దిదారులకు శుక్రవారం పంపిణీ చేయాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.

ఎన్నికలు పూర్తయ్యే వరకు నిధులు పంపిణీ చేయొద్దని ఈసీ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం 10వ తేదీన నిధుల పంపిణీకి అనుమతించింది. మే 11 -13 మధ్య కాలంలో మాత్రం నిధులు విడుదల చేయొద్దని ఆదేశించింది.

సంక్షేమ పథకాల్లో భాగంగా నిధుల విడుదల అంశాన్ని ఎన్నికల్లో ప్రచారం హైకోర్టు చేయొద్దని స్పష్టం చేసింది. .ఈ మేరకు జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకి, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణ జూన్ 27కు వాయిదా వేశారు.

రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, చేయూత, ఈబీసీ నేస్తం, ఆసరా, విద్య దీవెన పథకాల కింద మంజూరు చేసిన రూ.14,165 కోట్ల రుపాయలను లబ్దిదారులకు మంజూరు చేసేందుకు హైకోర్టు అనుమతించింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు మే 10వ తేదీ శుక్రవారం వరకు నిలిపివేసింది. మే 11 నుంచి 13వ తేదీ వరకు నిధుల పంపిణీ చేయకూడదని స్పష్టం చేసింది. నిధుల పంపిణీ అంశంపై ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఏపీలో వివిధ సంక్షేమ పథకాల్లో భాగంగా లబ్దిదారులకు నిధుల పంపిణీ విషయంలో రాజకీయ పార్టీలు నగదు బదిలీ చేయకుండా చూడాలని ఈసీని అభ్యర్థించాయి. ఈ వ్యవహారంపై ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత గురువారం రాత్రి పొద్దు పోయిన తర్వాత జస్టిస్ కృష్ణమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్ చేయూత, ఆసరా, జగనన్న విద్యాదీవెన, ఈబీసీ నేస్తం పథకాలకు నగదు పంపిణీని ఎన్నికలు పూర్తయ్యే వరకు చేపట్టొద్దని ఈసీ ఆదేశించడానికి సవాలు చేస్తూ రైతులు, మహిళలు, విద్యార్ధులు, వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. అయా పథకాలకు తక్షణమే నిధులు మంజూరు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

దీనిపై విచారణ జరిపిన జస్టిస్ కృష్ణమోహన్ నిధుల పంపిణీ అవసరాన్ని వివరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయాలని దానిపై తగిన నిర్ణయం తీసుకోవాలని ఈసీని ఆదేశించారు. ఈ పిటిషన్లపై గురువారం జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన పరిగణలోకి తీసుకుని పోలింగ్ పూర్తయ్యే వరకు నగదు పంపిణీ ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు ఈసీ తరపు న్యాయవాది అవినాష్ దేశాయ్ చెప్పారు.నిధుల పంపిణీ జరిగితే ఓటర్లను ప్రభావితం చేసినట్టు అవుతుందని అభ్యంతరం చెప్పారు.

పాత పథకాలనేనని వాదనలు…
పిటిషనర్ల తరపున వాదించిన సీవీ మోహన్ రెడ్డి వివిధ పథకాల కింద రైతులు, మహిళలు, విద్యార్ధులకు ఇచ్చిన నిధులు కొత్త పథకాలేమి కాదని, ఇప్పటికే కొనసాగుతున్న పథకాలని వివరించారు. ప్రభుత్వ బాధ్యతలో భాగమే తప్ప ఓటర్లను ప్రభావితం చేయడం కాదన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పసుపు, కుంకుమ నిధుల పంపిణీకి కోర్టు అనుమతించిన విషయం గుర్తు చేశారు. ఎన్నికల నియమావళి రాకముందే అమలవుతున్నందున అనుమతించారని గుర్తు చేశారు.

పసుపు కుంకుమ పథకంపై ప్రచారం చేయకుండా చూడాలని అప్పటి ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశించినట్టు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి రాకముందే అమల్లో ఉన్న పథకాల అమలుకు అభ్యంతరం చెప్పడం సరికాదన్నారు. పథకాలను అమల్లో ఉన్న వాటికా ఈసీ గుర్తిస్తూనే నగదు పంపిణీ అడ్డుకుంటోందని వాదించారు. పసుపు కుంకుమ పథకం అమలును అడ్డుకోవాలని ఈసీకి అప్పట్లో వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు.

పిటిషనర్ల వాదనలపై ఈసీ తరపున న్యాయవాది అవినాష్ దేశా‍్ అభ్యంతరం చెప్పారు. పోలింగ్ పూర్తయ్యే వరకు నిధుల పంపిణీ ఆపడం వల్ల ఎలాంటి నష్టం ఉండదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే మిగిలిన వారి అవకాశాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. నిధుల పంపిణీతో ఓటర్ల ప్రభావితం అవుతారన్నారు.

Advertisement

ఎన్నికల ప్రవర్తన నియమావళి పాత పథకాలతో పాటు కొత్త వాటికి వర్తిస్తుందని, ఎన్నికలకు మూడు రోజుల ముందు నిధుల పంపిణీ సరికాదన్నారు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా నిధుల పంపిణీ ఆపాలన్నారు. గురువారం ఉదయం 10.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ అంశంపై వాదనలు జరిగాయి.

ప్రభుత్వ పథకాల నిధులు బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతూందని పిటిషనర్లు వివరించారు. దీని ద్వారా రాజకీయ లబ్ది పొందే అవకాశం లేదని పిటిషనర్లు వాదించారు.ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత రాత్రి పదిన్నర తీర్పు వెలువరించారు. వెంటనే అడ్వాన్స్ తీర్పు కాపీని విడుదల చేశారు.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhrapradesh

చెస్‌లో సీఎం చంద్రబాబు మనవడు వరల్డ్ రికార్డ్ – సంతోషంలో నారా కుటుంబం – CHANDRA BABU GRAND SON WORLD RECORD

Published

on

CHANDRA BABU GRAND SON WORLD RECORD: సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ చదరంగంలో ప్రపంచ రికార్డ్ సాధించాడు. వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 9 ఏళ్ల దేవాన్ష్ “వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ – 175 పజిల్స్” ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధృవీకరణను దేవాన్ష్ అందుకున్నారు. దేవాన్ష్ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది.

“చెక్‌మేట్ మారథాన్” పేరుతో ప్రపంచ రికార్డు : వ్యూహాత్మకమైన ఆటతీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడిజీ నారా దేవాన్ష్ “చెక్‌మేట్ మారథాన్” పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డ్‌లో దేవాన్ష్ క్రమక్రమంగా సవాలు చేసే చెక్‌మేట్ పజీళ్ల క్రమాన్ని పరిష్కరించాడు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుంచి ఎంపిక చేసిన 5334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో దేవాన్ష్‌ ఈ రికార్డును సాధించగలిగాడు. ఇటీవల దేవాన్ష్ మరో రెండు ప్రపంచ రికార్డులను కూడా సాధించాడు.

అతను 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పూర్తి చేసాడు. 9 చెస్ బోర్డ్‌లను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 ముక్కలను వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచాడు. దేవాన్ష్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయనిర్ణేతలు, లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టుదల, కృషి ద్వారా తమ కలలను సాధించవచ్చని దేవాన్ష్ నిరూపించాడు. ఇది భారతీయ పిల్లల అపారమైన ప్రతిభకు, వారిలో దాగివున్న అత్యుత్తమ నైపుణ్యాలకు మచ్చుతునక. సరైన ఎక్స్‌పోజర్, మార్గదర్శకత్వంతో పిల్లలు ఉన్నతస్థానానికి చేరుతారనడానికి దేవాన్ష్ నిదర్శనమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సృజనాత్మకంగా నేర్చుకునే డైనమిక్ విద్యార్థి: దేవాన్ష్ లేజర్ షార్ప్ ఫోకస్‌తో శిక్షణ పొందడం తాను ప్రత్యక్షంగా చూశానని నారా లోకేశ్ తెలిపారు. దేవాన్ష్ ఈ ఘనత సాధించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దేవాన్ష్‌ ఈ క్రీడను ఎంతో ఇష్టంగా స్వీకరించాడని తెలిపారు. అతను గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మక ప్రదర్శనల నుంచి ప్రేరణ పొందాడని వెల్లడించారు. ఈ ఈవెంట్ కోసం దేవాన్ష్ గత కొన్ని వారాలుగా రోజుకు 5-6 గంటల పాటు శిక్షణ పొందాడని లోకేశ్ వెల్లడించారు. “దేవాన్ష్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి” అని ఆయన కోచ్ కె. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. 175 సంక్లిష్టమైన పజిల్స్‌ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన మానసిక చురుకుదనం దేవాన్ష్‌ సొంతమని తెలిపారు.

చంద్రబాబు ప్రశంసలు: వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్​గా 175 పజిల్స్​లో ప్రపంచ రికార్డ్‌ను దేవాన్ష్ సాధించటం ఎంతో ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, దేవాన్ష్ తల్లిదండ్రులు లోకేశ్, బ్రాహ్మణిలు హర్షం వ్యక్తం చేశారు. చిన్న గ్రాండ్ మాస్టర్ దేవాన్ష్ ప్రతిభను చూసి ఎంతో గర్విస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. చదరంగంలో 175 పజిల్స్‌ను పూర్తి చేయడం ద్వారా వేగవంతమైన చెక్‌మేట్​తో ప్రపంచ రికార్డును నెలకొల్పిన దేవాన్ష్​కు అభినందనలు తెలిపారు.

Advertisement

కృషి, అంకితభావం, పట్టుదల విజయానికి కీలకమన్న ఆయన, ఈ విజయం కోసం నెలలు తరబడి దేవాన్ష్ కృషి చేశారని చంద్రబాబు ప్రశంసించారు. లండన్‌లోని ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి అధికారిక ధృవీకరణను స్వీకరించినందుకు తాము సంతోషిస్తున్నట్లు బ్రాహ్మణి చెప్పారు. ఈ ఘనత కోసం దేవాన్ష్ అంకితభావం, పట్టుదలతో కృషి చేసినట్లు వెల్లడించారు. ఈ అద్భుతమైన విజయానికి మార్గనిర్దేశం చేసిన కోచ్ కె రాజశేఖర్ రెడ్డి, రాయ్ అకాడమీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రుల అభినందనలు: చదరంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచి ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న నారా లోకేశ్​ కుమారుడు దేవాన్ష్​ను మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, రామానాయుడు, కొల్లు రవీంద్ర, రాంప్రసాద్ రెడ్డి, పార్ధ సారధి, అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయస్వామిలు అభినందనలు తెలిపారు. వేగంగా పావులు కదపడం, వేగవంతమైన చెక్ మేట్ సాల్వర్-175 పజిల్స్ సాధించిన దేవాన్ష్​కు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దృవీకరణ అందుకున్న దేవాన్ష్‌ మున్ముందు మరిన్ని రికార్డులు సాధించాలని ఆకాంక్షించారు.

Continue Reading

Andhrapradesh

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ – మార్చి నెల దర్శన టికెట్ల విడుదల తేదీల్లో మార్పులు

Published

on

Tirumala Tirupati Devasthanam Updates : మార్చి నెల దర్శన టిక్కెట్ల విడుదల తేదీల్లో టీటీడీ మార్పులు చేసింది. ఈనెల 25వ తేదీన ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు తాజా ప్రకటనలో పేర్కొంది. 26వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనుంది.

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. మార్చి నెల దర్శన టిక్కెట్ల విడుదల తేదీల్లో మార్పులు చేసింది. ఈ మేరకు తాజా ప్రకటన విడుదల చేసింది.

తేదీలు మార్పు…
డిసెంబర్ 25వ తేదీన ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇక డిసెంబర్ 26వ తేదీన ఉదయం 11 గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి, తిరుమలలోని వసతి గదులు కోటా టికెట్లను విడుదల చేయనుంది.

ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… మార్చి నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబరు 24న విడుదల కావాల్సి ఉంది. ఇక డిసెంబర్ 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తామని పేర్కొంది. కానీ తాజా ప్రకటనలో పలు మార్పులు చేసింది.

మార్పులకు అనుగుణంగా భక్తులు టికెట్లను బుకింగ్ చేసుకోవాలని టీటీడీ కోరింది. https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది. ఇతర సైట్లను నమ్మవద్దని కోరింది.

Advertisement
    డిసెంబ‌రు 21న ఆర్జిత సేవా టికెట్లు : కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను డిసెంబ‌రు 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

    డిసెంబ‌రు 21న వర్చువల్ సేవల కోటా : వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన 2025 మార్చి నెల కోటాను డిసెంబరు 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

    డిసెంబరు 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు: మార్చి నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను డిసెంబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

    వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా : వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను డిసెంబరు 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

Continue Reading

Andhrapradesh

విజయవాడ వాసులకు అద్దిరిపోయే తీపికబురు.. ఏపీకి ఇది కదా కావాల్సింది.!

Published

on

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాలకులు తమతమ స్థాయిలలో ఎంత కృషి చేస్తున్నా.. ఇంకా కీలకమైన మౌళిక సదుపాయాల విషయంలో చాలా వెనకబడి ఉన్నాం. ఇలాంటి సందర్భాలలో ప్రస్తుతం..

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాలకులు తమతమ స్థాయిలలో ఎంత కృషి చేస్తున్నా.. ఇంకా కీలకమైన మౌళిక సదుపాయాల విషయంలో చాలా వెనకబడి ఉన్నాం. ఇలాంటి సందర్భాలలో ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా ఉన్న ప్రభుత్వం కావడంతో రాష్ట్రంలో కూడా కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లకు రంగం సిద్దమవుతోంది. అందులోనూ విజయవాడకు, ముఖ్యంగా అమరావతి రాజధానికి కీలకమైన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులు మంజూరు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పలు విజ్ఞప్తులు ఫలిస్తున్నాయి. అందులో ఇదొకటి.

విజయవాడ తూర్పు బైపాస్. ఇది విజయవాడ నగర ప్రజలకు సుదీర్ఘ కల. నగరం మధ్యలో జాతీయ రహదారి ఉండడం, చుట్టూ కొండ ప్రాంతాలు, మరోవైపు కృష్ణా నది కావడంతో విజయవాడలో ట్రాఫిక్ అంటే నరకమే అన్నట్టు ఇక్కడి ప్రజలు నిరంతరం ఆ బాధను అనుభవిస్తున్నారు. దీంతో తూర్పు బైపాస్ ఎప్పటినుంచో ప్రత్యామ్నాయంగా ఉంది. దీనికి సంబంధించి విజయవాడలో 7 కిలోమీటర్ల మేర సూపర్ స్ట్రక్చర్ వంతెన నిర్మాణం వంటి ప్రాజెక్టులను నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా 2024-25 వార్షిక ప్రణాళికలో చేర్చడంతో విజయవాడ వాసుల్లో సరికొత్త భరోసా ఏర్పడింది.

2,716 కోట్ల రూపాయలతో 50 కిలోమీటర్ల మేర తూర్పు బైపాస్..
గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి నుంచి ఇబ్రహీంపట్నం మండలం కాజా వరకు ప్రస్తుతం నిర్మిస్తున్న విజయవాడ బైపాస్‌కు పూర్తి అభిముఖంగా తూర్పువైపు మరో బైపాస్ నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇది మొత్తం 50 కిలోమీటర్ల మేర ఉండనుంది. ఈ బైపాస్ నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ 2,716 కోట్లు కేటాయించింది. దీనికోసం కన్సల్టెన్సీ మూడు ఎలైన్మెంట్లు సిద్ధంచేసింది. వాటి వివరాలను జాతీయ హైవేస్ అభివృద్ధి సంస్థ ఈ వారంలో కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి ప్రెజెంటేషన్ ఇవ్వనుంది.

Continue Reading
Andhrapradesh1 month ago

చెస్‌లో సీఎం చంద్రబాబు మనవడు వరల్డ్ రికార్డ్ – సంతోషంలో నారా కుటుంబం – CHANDRA BABU GRAND SON WORLD RECORD

International1 month ago

యుద్ధం ముగించేందుకు సిద్ధం- జెలెన్‌స్కీతో మాత్రం మాట్లాడం: పుతిన్ – PUTIN ON RUSSIA UKRAINE WAR

Spiritual2 months ago

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ టికెట్ల విడుదల తేదీలను మార్చిన టీటీడీ

International2 months ago

అమెరికాకు తప్పిన షట్ డౌన్ ముప్పు! నిధుల బిల్లుకు చివరి క్షణంలో ఆమోదం – US SHUTDOWN 2024

Andhrapradesh2 months ago

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ – మార్చి నెల దర్శన టికెట్ల విడుదల తేదీల్లో మార్పులు

Spiritual2 months ago

శబరిమలకు పోటెత్తిన భక్తులు- ఒక్క రోజులో 96 వేల మంది దర్శనం – SABARIMALA DEVOTEES

International2 months ago

భారత్, చైనాల మధ్య శాంతికి రోడ్ మ్యాప్.. సంబంధాల బలోపేతానికి ఆరు సూత్రాల ప్రణాళిక

Telangana2 months ago

గుడ్​ న్యూస్​: హైదరాబాద్​ బుక్​ ఫెయిర్ ప్రారంభం- ఇక పది రోజులు పుస్తక ప్రియులకు పండగే! – HYDERABAD BOOK FAIR 2024

Andhrapradesh4 months ago

విజయవాడ వాసులకు అద్దిరిపోయే తీపికబురు.. ఏపీకి ఇది కదా కావాల్సింది.!

Latest4 months ago

ఏపీ మంత్రివర్గ భేటీ – వాలంటీర్లు, ఉద్యోగుల పీఆర్సీపై కీలక నిర్ణయం..!!

Education4 months ago

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఐఐటీ.. అన్నీ కుదిరితే అక్కడే.. ఎన్నాళ్లకెన్నాళకు!

Spiritual4 months ago

తిరుమల లడ్డూ వివాదంతో అయోధ్య రామాలయం సంచలన నిర్ణయం!

Andhrapradesh6 months ago

Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా?

Andhrapradesh6 months ago

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఆర్జిత సేవా టికెట్లు విడుదల ఎప్పుడంటే..?

Andhrapradesh6 months ago

Musi River: వివాదంగా మారిన మూసీ బ్యూటిఫికేషన్.. తమ ఇళ్లను కూల్చివేయొద్దంటూ..

Spiritual6 months ago

కృష్ణాష్టమి అంటే కన్నయ్య జన్మదినమే.. ఈ ప్రదేశాలలో జన్మాష్టమి పండుగను భిన్నంగా జరుపుకుంటారు

National6 months ago

స్తంభం పైన ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. ఇంతలో అటుగా వచ్చిన ఓ పక్షి…

National6 months ago

Railway Jobs: క్రీడాకారులకు సదావకాశం.. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

National6 months ago

ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ఏం సందేశం ఇచ్చారో తెలుసా?

Andhrapradesh6 months ago

NTR Health University: ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలకు యాజమాన్య కోటా నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

International6 months ago

యుద్ధం వస్తే ఎలా? టెక్నాలజీపరంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌ ఎవరు స్ట్రాంగ్‌?

Hashtag6 months ago

Pen Hospital: పెన్నుల కోసం ఓ స్పెషల్ హాస్పిటల్.. ఇచ్చట అన్ని పెన్నులు రిపేర్ చేయబడును..!

International6 months ago

రష్యాలోకి 30 కి.మీ. దూసుకెళ్లిన యుక్రెయిన్ సైన్యం.. సేఫ్ జోన్లకు 76 వేల మంది తరలింపు

National6 months ago

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలో హైఅలర్ట్ .. ఎర్రకోట వద్ద పటిష్ఠ భద్రత

National6 months ago

UPSC Civils Mains 2024: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసిందోచ్

Andhrapradesh6 months ago

AP Police Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్‌

International6 months ago

ఇజ్రాయెల్​పై దాడికి ఇరాన్‌ సన్నాహాలు – అణు జలాంతర్గామిని పంపిస్తున్న అమెరికా – Iran backed Attack On Israel

International6 months ago

‘రాక్షసి వెళ్లిపోయింది’ – హసీనాపై ముహమ్మద్ యూనుస్​ ఘాటు వ్యాఖ్య – Yunus Comments On Hasina

International6 months ago

Donald Trump : ‘ఎక్స్‌’లో డొనాల్డ్ ట్రంప్‌తో ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ.. ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Technology6 months ago

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరు గ్రూప్‌లో చేరడానికి ముందే అన్నీ తెలుసుకోవచ్చు!

Business8 months ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career8 months ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

News8 months ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

Business8 months ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

National9 months ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

Business9 months ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

International9 months ago

‘పోస్ట్​ స్టడీ వర్క్​ ఆఫర్​ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్​ వెళ్లే విద్యార్థులకు గుడ్​ న్యూస్​ – UK Graduate Route Visa

Education8 months ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

National8 months ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

Crime News8 months ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

Andhrapradesh8 months ago

జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

Andhrapradesh8 months ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

Telangana9 months ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

Railways8 months ago

పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే

Spiritual8 months ago

Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

National8 months ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

National8 months ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

Andhrapradesh8 months ago

పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

Andhrapradesh8 months ago

సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల

Andhrapradesh8 months ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

Andhrapradesh12 months ago

మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ

National8 months ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

National8 months ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

Political8 months ago

కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

Andhrapradesh8 months ago

వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

National9 months ago

Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్

Andhrapradesh8 months ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

Andhrapradesh8 months ago

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

Political8 months ago

పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

National8 months ago

Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!

Trending