Connect with us

Andhrapradesh

Ap Social Welfare Schemes : సంక్షేమ పథకాలకు ఈసీ బ్రేక్ పై హైకోర్టులో లబ్దిదారుల పిటిషన్.. విచారణ వాయిదా

Published

on

Ap Social Welfare Schemes : ఏపీలో అమల్లో ఉన్న డీబీటీ పథకాలపై ఈసీ ఆంక్షలు విధించడంపై లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించారు. పథకాల అమలు కోరుతూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విద్యాదీవెన, ఇన్ పుట్ సబ్సిడీ, చేయూత.. పథకాలకు సంబంధించిన నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

జగనన్న విద్యదీవెన నిధులు విడుదలపై ఈసీ ఆంక్షలు విధించటం సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. జగనన్న విద్యాదీవెన కింద రూ.768 కోట్లు విడుదల చేయాల్సి ఉందని పిటిషనర్ తెలిపారు. ఇప్పటికే 97 కోట్లు విడుదల చేశామని మిగతా వారిపై ఈసీ ఆంక్షలు విధించినట్టు కోర్టుకు వెల్లడించారు. లబ్దిదారులు కొత్త వారు కాదని, రెండేళ్లుగా వాళ్లకి ఇస్తున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చివరి అకడమిక్ ఇయర్ కావటంతో విద్యార్దులు ఇబ్బంది పడతారని కోర్టుకు దృష్టికి తెచ్చారు పిటిషనర్. కొత్తగా వినతి పత్రం ఇవ్వాలని దీనిపై ఈసీ నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

ఏపీలో సంక్షేమ పథకాలకు బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వ పథకాలపై ఈసీ ఆంక్షలు విధించింది. సంక్షేమ పథకాల డబ్బుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది ఈసీ. ఎన్నికల కోడ్ పూర్తయ్యాకే నిధులు విడుదల చేసుకోవాలని ఆదేశించింది.

ఎన్నికల వేళ కావడంతో.. డీబీటీ విధానం ద్వారా పలు పథకాల లబ్దిదారులకు చెల్లింపులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. ఈ పథకాలన్నీ గత ఐదేళ్ల నుంచి అమల్లో ఉన్నవేనని.. కొత్త పథకాలు కావని పేర్కొంది. అమల్లో ఉన్న సంక్షేమ పథకాలు కాబట్టి నిధుల విడుదలకు అంగీకరించాలని కోరింది. అయితే, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అభ్యర్థనను ఈసీ తోసిపుచ్చింది. నిధుల విడుదలకు అనుమతి నిరాకరించింది. ఈసీ ఆంక్షలు, ఆదేశాలతో తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు అందాల్సిన సబ్సిడీ ఆగిపోయింది.

మరోవైపు ఖరీఫ్ కు సన్నద్ధమైన రైతులకు అందే సబ్సిడీ నిలిచిపోవడంతో రైతులు, ఫీజు రీయింబర్స్ మెంట్ కు బ్రేక్ పడటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా అమల్లో ఉన్న పథకాలపై ఈసీ ఆంక్షలు విధించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదులు, అభ్యంతరాలపై లబ్దిదారులు మండిపడుతున్నారు. పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తొలగించాలంటూ మాజీ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేశ్ ఫిర్యాదు చేయడంతో.. పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు చేయరాదంటూ ఈసీ ఆదేశాలు ఇచ్చింది. మిగతా ప్రభుత్వ పథకాలకు ఈసీ వర్తింప జేసింది. జగన్ ప్రభుత్వంలో అమలవుతున్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ విద్యాదీవెన, ఇన్ పుట్ సబ్సిడీ వంటి పథకాలు పేదలకు చేరలేదు. దీనికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబే అంటూ వైసీపీ ఆరోపిస్తుండగా.. లబ్దిదారులు ప్రతిపక్షాల తీరును తీవ్రంగా తప్పబడుతున్నారు.

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhrapradesh

Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా?

Published

on

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల పండుగ ప్రారంభం కానుంది. ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్స్‌పై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా లిఫ్ట్ చేసింది చంద్రబాబు సర్కార్. ఆగష్టు 19 వ తేదీ నుంచి 31 తేదీ వరకూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల పై నిషేధం తాత్కాలికం ఎత్తివేస్తునట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. పారదర్శక విధానంలో బదిలీలు జరగాలని ఆదేశించింది. రాజకీయ జోక్యం లేకుండా మెరిట్ ప్రకారమే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్టు సమాచారం.

మే నెలలోనే జరగాలి కానీ..
వాస్తవానికి ఉద్యోగుల సాధారణ బదిలీలు ప్రతీ ఏటా మే నెలలో జరగాలి. ఈసారి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మేలో బదిలీలు జరగకపోవడం, కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సెటిల్ అవ్వడానికి రెండు నెలలు పట్టింది. ఈలోపు ఉన్నత అధికారుల బదిలీలు పూర్తయిన నేపథ్యంలో తాజాగా సాధారణ బదిలీలపై దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి తాజాగా ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

మొత్తం 15 శాఖల్లో బదిలీలు
మొత్తం 15 శాఖల్లో బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెవెన్యూ, పంచాయితీ రాజ్, పురపాలక, గ్రామ వార్డు సచివాలయలు, గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఇంజినీరింగ్ ఉద్యోగులు, దేవాదాయ, అటవీ, రవాణా, పరిశ్రమలు, విద్యుత్, వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలోని ఉద్యోగుల బదిలీలకు అనుమతిచ్చింది.

ఉపాద్యాయులు, వైద్య సిబ్బంది కి నో..
మరోవైపు ఉపాధ్యాయులు, వైద్యారోగ్య సిబ్బంది బదిలీలకు దూరంగా ఉన్నారు. వీళ్ళను అకడమిక్ సంవత్సరం ప్రారంభం కాకముందే బదిలీలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అకడమిక్ ప్రారంభమై రెండు నెలలు పూర్తయిన నేపథ్యంలో ఈ సమయంలో మారిస్తే, అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. దీంతో ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలకు అనుమతించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నెలాఖరు లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెలాఖరు తర్వాత మళ్లీ బదిలీలపై నిషేధాన్ని విధించనుంది.

ఏజెన్సీలో రెండేళ్లు చేస్తే చాలు
ఎక్సైజ్ శాఖలో బదిలీలకు సెప్టెంబర్ 5 నుంచి 15వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏజెన్సీ ఏరియాల్లో రెండేళ్ల పాటు పని చేసిన ఉద్యోగులకూ బదిలీలను వర్తింపచేస్తారు. ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్య కారణాలు ఉన్నా బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని గైడ్ లైన్స్ లో స్పష్టం చేసింది ప్రభుత్వం. అంధులైన ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. వారు కోరుకున్న చోటకు బదిలీ చేసే వెసులుబాటు కల్పించారు. భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒకే ఊళ్లో పోస్టింగ్ లేదా సమీప ప్రాంతాల్లో పోస్టింగులకు అవకాశమిచ్చింది ప్రభుత్వం.

Advertisement

యూనియన్ ఆఫీస్ బేరర్స్ విషయంలో స్ట్రిక్ట్ గైడ్ లైన్స్
అదే సమయంలో ఉద్యోగ సంఘాలు ఇచ్చే ఆఫీస్‌ బేరర్ల లెటర్లపై ప్రత్యేక సూచనలు చేసింది ప్రభుత్వం. ఆఫీస్‌ బేరర్లుగా ఉన్న ఉద్యోగులకు తొమ్మిదేళ్ల పాటు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. ఇందుకోసం తాలూకా, జిల్లా స్థాయిల్లో ఆఫీస్‌ బేరర్ల లేఖలను జిల్లా కలెక్టర్లకు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్ల లేఖలను జీఏడీకి పంపాలని సూచించింది. ఆఫీస్ బేరర్ల లేఖలకు జిల్లా కలెక్టర్లు, జీఏడీ ఆమోదం తర్వాతే బదిలీల నుంచి వెసులుబాటు ఉంటుందని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. పరిశీలన తర్వాత కూడా పరిపాలనపరంగా అవసరం అనిపిస్తే తొమ్మిదేళ్ల కాల పరిమితి ముగియక పోయినా ఆఫీస్‌ బేరర్లను బదిలీలు చేయొచ్చని కూడా ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది ప్రభుత్వం.

రాజకీయ జోక్యం నో..
ఇదే సమయంలో బదిలీలు మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత పారదర్శకంగా జరగాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారట. ఎక్కడా అవినీతి కానీ, రాజకీయ జోక్యం గాని లేకుండా చూడాలని… అలాంటివి ఉంటే ఆ బదిలీలని రద్దు చేయాలని కూడా హెచ్చరించారట సీఎం చంద్రబాబు. దీంతో పూర్తిగా మెరిట్ ప్రకారమే బదిలీలు ఉండబోతున్నాయని స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆగస్ట్ నెలాఖరు వరకు ఇక అన్ని శాఖల్లో బదిలీల పండగే జరగబోతుంది.

Continue Reading

Andhrapradesh

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఆర్జిత సేవా టికెట్లు విడుదల ఎప్పుడంటే..?

Published

on

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవ, అంగప్రదక్షిణ తదితర సేవలతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనంకు సంబంధించి నవంబరు నెల కోటా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సోమవారం (ఆగస్టు 19) నుంచి విడుదల చేయనుంది. ఆర్జిత సేవా టికెట్లను సోమవారం (ఆగస్టు 19న) ఉదయం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్‌ డిప్‌ కోసం ఆగస్టు 21న ఉదయం 10 వరకు శ్రీవారి భక్తులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ డిప్‌లో ఈ సేవా టికెట్లు పొందినవారు ఆగస్టు 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

శ్రీవారి ఆలయంలో నవంబర్ మాసంలో జరిగే కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఆగస్టు 22న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఈ సేవలకు సంబంధించిన వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను ఆగస్టు 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

అలాగే శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణం టోకెన్లను ఆగస్టు 23 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవాణి ట్రస్టు టికెట్లను గస్టు 23 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

వృద్ధులు, దివ్యాంగులు శ్రీవారిని దర్శించుకునేందుకు కల్పిస్తున్న ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను ఆగస్టు 23 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

నవంబర్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 24న ఉదయం 10 గంటలకు, గదుల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.

Advertisement

తిరుమల-తిరుపతి శ్రీవారి సేవా కోటా ఆగస్టు 28న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లోనే విడుదల చేయనున్నారు. శ్రీవారి సేవా టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాల‌ని టీటీడీ సూచించింది.

Continue Reading

Andhrapradesh

Musi River: వివాదంగా మారిన మూసీ బ్యూటిఫికేషన్.. తమ ఇళ్లను కూల్చివేయొద్దంటూ..

Published

on

కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిలో మూసీ నదినే ప్రధాన ఎజెండాగా మార్చుకుంది. మూసీ నదిని ప్రక్షాళనే కాదు, పూర్తిగా సుందరీకరణ చేసి రాష్ట్రానికి చిహ్నాంగా చూపిస్తామని చెబుతోంది. వచ్చే ఐదేళ్లలో 1.5 లక్షల కోట్లు ఖర్చు చేసి మూసీతో హైదరాబాద్‌కు వన్నెతీసుకువస్తామని చెబుతోంది. అయితే మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో తమను రోడ్డున పడేస్తున్నారని నది పరివాహక ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు.

రూపాయి.. రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇళ్లు వదిలి వెళ్లే ప్రసక్తే లేదని ఆందోళనకు దిగారు. ఎప్పుడు బుల్డోజర్లు తీసుకొచ్చి తమ ఇంటిని కూల్చేస్తారోనని గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు మూసి నది ప్రాంతవాసులు. మూసీ ప్రాంతవాసుల ఆందోళనకు సీపీఎం మద్దతు తెలిపింది. పేదల ఇళ్లు కూల్చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. దీంతో పోలీసులు అలర్ట్‌ అయి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం గేట్‌ మూసివేశారు. ఇలా ఆందోళనలు మొదలు కావడంతో మూసీ వెంట ఉన్న ఆస్తుల సేకరణ అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Continue Reading
Andhrapradesh4 weeks ago

Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా?

Andhrapradesh4 weeks ago

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఆర్జిత సేవా టికెట్లు విడుదల ఎప్పుడంటే..?

Andhrapradesh4 weeks ago

Musi River: వివాదంగా మారిన మూసీ బ్యూటిఫికేషన్.. తమ ఇళ్లను కూల్చివేయొద్దంటూ..

Spiritual4 weeks ago

కృష్ణాష్టమి అంటే కన్నయ్య జన్మదినమే.. ఈ ప్రదేశాలలో జన్మాష్టమి పండుగను భిన్నంగా జరుపుకుంటారు

National4 weeks ago

స్తంభం పైన ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. ఇంతలో అటుగా వచ్చిన ఓ పక్షి…

National4 weeks ago

Railway Jobs: క్రీడాకారులకు సదావకాశం.. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

National1 month ago

ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ఏం సందేశం ఇచ్చారో తెలుసా?

Andhrapradesh1 month ago

NTR Health University: ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలకు యాజమాన్య కోటా నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

International1 month ago

యుద్ధం వస్తే ఎలా? టెక్నాలజీపరంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌ ఎవరు స్ట్రాంగ్‌?

Hashtag1 month ago

Pen Hospital: పెన్నుల కోసం ఓ స్పెషల్ హాస్పిటల్.. ఇచ్చట అన్ని పెన్నులు రిపేర్ చేయబడును..!

International1 month ago

రష్యాలోకి 30 కి.మీ. దూసుకెళ్లిన యుక్రెయిన్ సైన్యం.. సేఫ్ జోన్లకు 76 వేల మంది తరలింపు

National1 month ago

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలో హైఅలర్ట్ .. ఎర్రకోట వద్ద పటిష్ఠ భద్రత

National1 month ago

UPSC Civils Mains 2024: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసిందోచ్

Andhrapradesh1 month ago

AP Police Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్‌

International1 month ago

ఇజ్రాయెల్​పై దాడికి ఇరాన్‌ సన్నాహాలు – అణు జలాంతర్గామిని పంపిస్తున్న అమెరికా – Iran backed Attack On Israel

International1 month ago

‘రాక్షసి వెళ్లిపోయింది’ – హసీనాపై ముహమ్మద్ యూనుస్​ ఘాటు వ్యాఖ్య – Yunus Comments On Hasina

International1 month ago

Donald Trump : ‘ఎక్స్‌’లో డొనాల్డ్ ట్రంప్‌తో ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ.. ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Technology1 month ago

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరు గ్రూప్‌లో చేరడానికి ముందే అన్నీ తెలుసుకోవచ్చు!

National1 month ago

2036 నాటికి భారత జనాభా 152 కోట్లు – పెరగనున్న మహిళలు – తగ్గనున్న యువత – INDIA POPULATION 2036

National1 month ago

ఐఐటీ మద్రాస్ దేశంలోనే బెస్ట్​- వరుసగా ఆరోసారి- టాప్​ కాలేజీల లిస్ట్​ ఇదే! – NIRF Ranking 2024

International1 month ago

Israel Hamas war : గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 100మందికిపైగా మృతి

National1 month ago

PM Modi: భారీ వర్షంలో రైతులతో ప్రధాని మోదీ భేటీ.. సింప్లిసిటీ చూస్తే వావ్ అనాల్సిందే.. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి..

Telangana1 month ago

Yadadri: యాదగిరిగుట్టలో మరిన్ని మార్పులకు ప్రభుత్వం సిద్ధం..!

Andhrapradesh1 month ago

PG Medical Courses: మెడికల్‌ విద్యార్ధులకు బిగ్‌షాక్‌.. పీజీ వైద్య విద్య ఫీజులు పెంచిన సర్కార్!

Andhrapradesh1 month ago

Tungabhadra Dam: 69 ఏళ్ల చరిత్రలో ఫస్ట్‌టైమ్‌ ప్రమాదం.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు

Cricket1 month ago

Team India: ఇకపై టెస్ట్ జట్టులో కనిపించని ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు.. చివరి మ్యాచ్ ఎప్పుడు ఆడారంటే?

National1 month ago

17 నెలల తర్వాత.. జైలు నుంచి విడుదలైన సిసోడియా..

National1 month ago

New rule : విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ఆగ‌స్టు 15 నుంచి పాఠ‌శాల్లో కొత్త రూల్‌.. ‘గుడ్ మార్నింగ్ చెప్పొద్దు..’

Andhrapradesh1 month ago

Andhra Pradesh: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పట్నుంచంటే..?

Spiritual1 month ago

ఈ సంవత్సరం కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు?ఆగస్టు 26నా, 27నా? మధుర, బృందావనంలో ఎప్పుడు జరుపుతారంటే?

Business4 months ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career4 months ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

National4 months ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

News4 months ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

Business4 months ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

Business4 months ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

Education3 months ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

National3 months ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

National4 months ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Andhrapradesh3 months ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

Crime News3 months ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

Telangana4 months ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

Andhrapradesh3 months ago

జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

Spiritual3 months ago

Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

National3 months ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

Railways3 months ago

పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే

Andhrapradesh3 months ago

పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

National3 months ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

Andhrapradesh3 months ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

National3 months ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

Political3 months ago

కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

Andhrapradesh3 months ago

వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

Political3 months ago

పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

Andhrapradesh3 months ago

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

International4 months ago

‘పోస్ట్​ స్టడీ వర్క్​ ఆఫర్​ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్​ వెళ్లే విద్యార్థులకు గుడ్​ న్యూస్​ – UK Graduate Route Visa

Andhrapradesh3 months ago

సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల

National4 months ago

Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!

Weather3 months ago

జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…

Education3 months ago

ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త

Andhrapradesh3 months ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

Trending