Life Style
Electricity bill: ఈ సింపుల్ టిప్స్తో ఎండాకాలంలో మీ కరెంట్ బిల్లును సగానికి తగ్గించేయొచ్చు..
ఎండాకాలంలో సూర్యుడు మండిపోతున్నాడు. డే టైమ్లో అడుగు బయట పెట్టలేని పరిస్థితి. వేడి, ఉక్కపోతతో జనం చుక్కలు చూస్తున్నారు. ఈ సమయంలో బడ్జెట్ సహకరించినా, సహరించకపోయినా.. ఎలాగోలా కూలర్లు తెచ్చుకుంటున్నారు. ఏసీలు ఫిట్ చేయిస్తున్నారు. ఇక ఫ్రిజ్ లేకపోతే ఎండాకాలంలో చాలా కష్టం. ఇవన్నీ వాడుతుంటే.. కరెంట్ బిల్లు షాక్ కొడుతుంది. రెండు, మూడు నెలల్లో వచ్చే బిల్లు.. ఒక్క నెలలోనే వస్తుంది. అయితే, వీటిని వాడుతూ కూడా కరెంటు బిల్లు తక్కువగా వచ్చేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు. యూనిట్లు పెరిగితే శ్లాబు రేటు మారిపోతుంది. కరెంట్ బిల్ డబుల్ అవుతుంది. అందుకే క్రమపద్ధతిలో కరెంట్ వాడితే అధిక బిల్లులకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు.
1. ఏసీ వాడేవారు ఇలా చెయ్యండి
ఏసీ వాడటం కూడా ఒక ఆర్ట్ అండోయ్. ఏసీ పాయింట్లు బాగా తగ్గిస్తే, ఇల్లు త్వరగా కూల్ అవుతుందని భావిస్తుంటారు. కానీ ఏసీ పాయింట్లను ఇలా మరీ తగ్గించకూడదంటున్నారు నిపుణులు. ఏసీలను 24 నుంచి 26 డిగ్రీల మధ్యే ఉంచితే.. లోడ్ భారం అదుపులో ఉంటుందట. ఎప్పుడూ 24 నుంచి 26 మధ్య ఉంచితే రూ.300 వరకు బిల్లు తగ్గుతుందని పక్కాగా చెప్పేస్తున్నారు. ఇక ఏసీ ఉన్న రూమ్లో చల్లదనాన్ని గ్రహించే వస్తువులు లేకుండా చూసుకోవడం మరో మధ్య. బీరువా వంటి ఇనుప వస్తువులు ఏవి ఉన్నా అవి చల్లదనాన్ని గ్రహించడం వల్ల.. రూమ్ కూల్ అవ్వడం లేట్ అవుతుంది. అలాగే సూర్యకిరణాలు ఏసీ ఉన్న రూమ్లోకి రాకుండా ఏర్పాటు చేసుకోవాలి. ఏసీ ఆన్లో ఉన్నప్పుడు ఇంటి తలుపులు, డోర్లు క్లోజ్ చేసి ఉంచండి.
2. ఫ్రిజ్ విషయంలో ఈ జాగ్రత్తలు పాటించింది
మీరు ఇంట్లో యూజ్ చేస్తున్న రిఫ్రిజిరేటర్ పాతది అయితే.. నెలకు 160 యూనిట్లకు పైగానే విద్యుత్ కాలుతుంది. అదే స్మార్ట్ ఫ్రిజ్ అయితే అవసరమైనప్పుడే ఆన్ అవుతాయి. లేకుంటే ఆటోమేటిక్గా ఆగిపోతాయి. వీటివల్ల విద్యుత్ బిల్లు రూ.300 వరకు తగ్గే అవకాశముంది. ఫ్రిజ్ డోర్ని ఎల్లప్పుడూ ప్రొపర్గా క్లోజ్ చేసి ఉంచాలి.
3. LED బల్బులను వినియోగించండి…
చాలామంది ఇప్పుడు కూడా పాత ఫిలమెంట్ బల్బులు, సీఎఫ్ఎల్లను వాడుతున్నారు. ఈ పాత బల్బులు ఎక్కువ కరెంట్ తీసుకుంటాయి. LED బల్బులు వాడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది.
Life Style
గోడలపై పిల్లలు గీసిన గీతలు తొలగిపోవట్లేదా? – ఇలా చేస్తే ఒక్క నిమిషంలో క్లీన్ అవుతాయి! – How To Clean Crayon Stains On Walls
How To Remove Kids Scribbles From Walls : చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో గోడలపై మరకలు పడే సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. చిన్నారులు ఇంటి గోడల్నే కాన్వాస్గా మార్చుకుంటారు. క్రేయాన్స్, పెన్సిల్ వంటి వాటితో గీతలు గీయడం, బొమ్మలేయడం చేస్తుంటారు. దాంతో ఇలాంటి మరకలు(Stains) తొలగించడానికి తల్లులు తలలు పట్టుకుంటుంటారు. మీ పిల్లలు ఇలానే గోడలపై గీతలు గీస్తున్నారా? అవి తొలగిస్తే ఎంతకీ పోవట్లేదా? అయితే, మీకోసం అద్దిరిపోయే టిప్స్ తీసుకొచ్చాం. వాటితో ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా మరకల్ని తొలగించుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టూత్పేస్ట్ : ఇది గోడలపై మరకలను తొలగించడంలో చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా టూత్ పేస్ట్ను తీసుకొని గోడలపై గీసిన క్రేయాన్ గీతలు, రంగులు, ఆహార పదార్థాల మరకలపై కాస్తంత అప్లై చేయండి. అలా కాసేపు ఉంచి ఆపై తడి వస్త్రంతో తుడిస్తే మరకలు ఇట్టే తొలగిపోతాయని చెబుతున్నారు.
హెయిర్ డ్రయర్ : ఇంట్లోని గోడలపై పడిన క్రెయాన్స్ గీతలను హెయిర్ డ్రయర్ను వాడి ఈజీగా పోగొట్టుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం హెయిర్ డ్రయర్ని ఆన్ చేసి ఆ వేడి గాలిని కాసేపు ఆ మరకలపై తాకేలా చేస్తే చాలు. ఆపై సోప్ వాటర్లో ముంచిన క్లాత్తో తుడిచేస్తే గోడలు డ్యామేజ్ కాకుండానే క్రేయాన్ మరకల్ని సులభంగా తొలగించుకోవచ్చంటున్నారు.
వంటసోడా : ఇది కూడా గోడలపై గీసిన క్రేయాన్ గీతలు తొలగించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందట. ఇందుకోసం ఒక గిన్నెలో చెంచా వంట సోడా తీసుకొని అందులో కాసిన్ని వాటర్ పోసి మిశ్రమంలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆపై దాన్ని గోడపై గీతలు ఉన్న చోట రాసి పాత టూత్ బ్రష్తో రుద్ది, తడి గుడ్డతో తుడిస్తే చాలు. గీతలు ఈజీగా రిమూవ్ అవుతాయంటున్నారు నిపుణులు.
ఇంటి గోడలపై క్రెయాన్స్, పెన్సిల్ గీతలు మాత్రమే కాదు.. అప్పుడప్పుడు నూనె మరకలు పడుతుంటాయి. వీటిని తొలగించడానికి చాలా కష్టపడుతుంటారు మహిళలు. అయితే వాటిని కూడా ఇలా ఈజీగా తొలగించుకోవచ్చంటున్నారు నిపుణులు.
వెనిగర్ : వంటల్లో వాడే వెనిగర్ కూడా గోడలపై నూనె మరకలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. వెనిగర్, నీళ్లు సమాన పరిమాణంలో తీసుకోవాలి. ఒక స్పాంజ్ తీసుకుని మరకలున్న చోట ఆ మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత మెత్తని వస్త్రంతో తుడిస్తే సరి. మరకలు ఈజీగా తొలగిపోతాయి!
లిక్విడ్ డిష్వాషర్ : ఇది కూడా గోడలపై నూనె మరకలను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక స్ప్రే బాటిల్లో కాసింత లిక్విడ్ డిష్వాషర్ పోసుకొని గోడలపై మరకలు ఉన్న చోట అప్లై చేసి అలా గంటపాటు వదిలేయాలి. ఆపై వేడినీటితో కడిగి మెత్తని క్లాత్తో శుభ్రం చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.
Life Style
Yoga for Kids: ఈ ఆసనాలు వేస్తే పిల్లల బ్రెయిన్ కంప్యూటర్ కంటే షార్ప్ అవుతుంది!
యోగా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యోగా గురించి అందరికీ తెలుసు. యోగాతో నయం చేయలేని జబ్బు ఉండదు. పూర్వం ఎక్కువగా యోగాసనాలు వేసేవారు. దీంతో ఎంతో ఆరోగ్యకంగా ఉండేవారు. యోగా చేయడం వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. దీర్ఘకాలిక సమస్యలను సైతం యోగాతో తగ్గించుకోవచ్చు. అయితే యోగా ఎక్కువగా పెద్దలు మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ పిల్లలు కూడా చేయవచ్చు. వీరికంటూ కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి. వీటిని వేయడం వల్ల పిల్లలు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. అంతే కాకుండా వీరి బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుంది. తెలివి తేటలు బాగా పెరుగుతాయి. మరి పిల్లలు ఎలాంటి ఆసనాలు వేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సర్వాంగాసనం:
పిల్లలు తరచూ సర్వాంగాసనం వేయడం వ్లల వీరి మేధస్సు అనేది మెరుగు పడుతుంది. శరీరం బాగా సాగుతుంది. ఏమైనా నొప్పులు ఉంటే తగ్గుతాయి. అంతేకాకుండా రక్త ప్రసరణ కూడా సరిగ్గా జరుగుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది.
బాల బకాసన:
పేరుకు తగ్గట్టుగానే ఈ ఆసనం పిల్లలు వేస్తారు. ఈ ఆసనం వేయడం వల్ల శరీరం అనేది ఫ్లెక్సిబుల్ అవుతుంది. యోగాసనాలు వేయడం వల్ల వారు భవిష్యత్తులో డ్యాన్స్ నేర్చుకోవడంలో హెల్ప్ అవుతుంది. శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే బ్రెయిన్ యాక్టీవ్ అవుతుంది.
వృక్షాసనం:
వృక్షాసనం పెద్దలు, పిల్లలు కూడా వేయవచ్చు. ఈ యోగాసనం చేయడం చాలా సింపుల్. పిల్లలు ఈ ఆసనం చేయడం వల్ల వీరి శరీరం బ్యాలెన్స్ అవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
గరుడాసనం:
ఈ ఆసనం వేయడం కూడా చాలా సులభం. కానీ ఈ ఆసనంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. దీని వల్ల వీరికి ఏకాగ్రత, దృష్టి సారించడం పెరుగుతుంది. దీంతో మతి మరుపు దూరమై జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
పద్మాసనం:
పద్మాసనం వేయడం కూడా చాలా సులభం. ఈ ఆసనాన్ని ఎవరైనా చేయవచ్చు. పద్మాసనం అభిజ్ఞా పనితీరును మెరుగు పరుస్తుంది. మేధస్సును పెంచుతుంది. రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. తెలివి తేటలు కూడా పెరుగుతాయి.
(NOTE: ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు infoline.one బాధ్యత వహించదు.)
Life Style
Coffee mask: కాఫీ మాస్క్ గురించి ఎప్పుడైనా విన్నారా.? లాభాలేంటంటే..
కాఫీ.. మనలో చాలా మందికి ఇది లేకుండా రోజు గడవని పరిస్థితి ఉంటుంది. ప్రతీ రోజు కచ్చితంగా లేవగానే కాఫీ ఉండాల్సిందే. ఎంత ఒత్తిడితో ఉన్నా సరే ఒక్క కప్పు కాఫీ తాగితే చాలు జోష్ వచ్చేస్తుంది. అయితే కాఫీ కేవలం రుచికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా? అవును కాఫీతో చేసే ఫేస్ మాస్క్ ముఖ సౌందర్యాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
కాఫీ మాస్క్ ద్వారా చర్మ సంబంధిత సమస్యలు కూడా దరిచేరవని నిపుణులు చెబుతుంటారు. ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల ఫేస్ మాస్క్లను ఉపయోగిస్తుంటారు. అయితే వీటి వల్ల కొన్ని సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే ధర కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే కాఫీ మాస్క్ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా ముఖ అందాన్ని పెంచుకోవచ్చు. ఇంతకీ కాఫీ మాస్క్ను ఎలా తయారు చేసుకోవాలి.? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కాఫీ మాస్క్ను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో కొంత కాఫీ పొడి తీసుకోవాలి. అనంతరం అందులో కొంత తేనె వేసి చిక్కని పేస్ట్లా తయారు చేసుకోవాలి. అనంతరం ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం అంతకు ముందు తయారు చేసుకున్న క్రీమ్ను ముఖమంతా అప్లై చేసుకోవాలి. ఇలా 10 నుంచి 15 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. చివరిగా మాయిశ్చరైజర్ను అప్లై చేసుకుంటే సరిపోతుంది.
కాఫీ మాస్క్ ఉపయోగాలు..
* కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు డెడ్ స్కిన్ తొలగించడంలో సహాయపడతాయి. ఇది చర్మం అందంగా కనిపించేలా చేస్తుంది. చర్మం మృదువుగా మారుతుంది.
* ఇక కాఫీ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. ముఖానికి సహజంగా గ్లో లభిస్తుంది.
* ఆయిల్ స్కిన్ వాళ్లకి ఇది బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు. చర్మంలో అదనంగా ఉండే నూనెను తొలగించడంలో కాఫీ మాస్క్ ఉపయోగపడుతుంది.
* కాఫీలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి మొటిమలు, మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. ఇక కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి, తద్వారా ముఖం ముడుతలను తగ్గిస్తుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యులను సంప్రదించడమే ఉత్తమం.
-
Business8 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career8 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News8 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business8 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National9 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business9 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International9 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education8 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National8 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Crime News8 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh8 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Andhrapradesh8 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana9 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Railways8 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
Spiritual8 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National8 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
National8 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Andhrapradesh8 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh8 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh8 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Andhrapradesh12 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
National8 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
National8 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Political8 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh8 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
National9 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh8 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Political8 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh8 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
National8 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Business9 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Andhrapradesh8 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh7 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
Cinema11 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
International9 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
International8 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
News9 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Education8 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Weather8 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Andhrapradesh8 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
News8 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh8 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
Railways7 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh8 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Business9 months ago
Bank Holidays June-2024: జూన్లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
News8 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Education12 months ago
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు
-
Andhrapradesh8 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
International8 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Andhrapradesh12 months ago
ప్రమాదపుటంచుల్లో ప్రపంచం