International

200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు

Published

on

భారీగా సరుకు రవాణా చేయాలంటే పెద్ద పెద్ద షిప్‌లలో సముద్రాల గుండా తరలిస్తూ ఉంటారు. అయితే 300 ఏళ్ల క్రితం.. 200 టన్నుల బంగారం, వజ్రాలు, ఇతర లోహాలతో ప్రయాణిస్తున్న ఓ భారీ నౌకపై దాడి జరిగింది. ఆ దాడిలో దెబ్బతిన్న ఆ షిప్.. సముద్రంలో మునిగిపోయింది. అయితే దాన్ని కొన్నేళ్ల క్రితమే గుర్తించినా.. ఆ సొత్తును ఎవరు తీసుకోవాలో తేల్చుకోలేక.. ఆ నౌకను బయటికి తీసే ప్రక్రియను విరమించుకున్నారు. అయితే ఇప్పుడు దాన్ని వెలికి తీసేందుకు అక్కడి ప్రభుత్వం తెగ ఆరాటపడుతోంది. ఒక వేళ.. ఆ మునిగిపోయిన నౌకలో ఉన్న వజ్రవైఢుర్యాలు వెలికి తీస్తే.. భారీగా సొత్తు స్వాధీనం చేసుకోవచ్చని భావిస్తోంది. అయితే ఆ సంపద ఎవరిదీ అని తేల్చుకునేందుకు కోర్టుల్లో కేసులు ఉండగానే.. దాన్ని ఎలా బయటికి తీయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.

1708 సంవత్సరంలో పెరూ నుంచి స్పెయిన్‌కు బయల్దేరిన స్పానిష్‌కు చెందిన శాన్ జోస్ అనే పురాతన నౌక కరేబియన్‌ సముద్రంలో మునిగింది. బంగారం, వెండి, రత్నాలతో కూడిన 200 టన్నుల సొత్తుతో ప్రారంభమైన ఆ నౌక.. పనామా కాలువ మీదుగా కొలంబోకు 600 మంది సెక్యూరిటీ సిబ్బందితో బయల్దేరింది. అయితే ఈ నౌకపై శత్రువులు దాడి చేశారు. ఈ దాడిలో శాన్ జోస్ నౌకలో ఉన్న భద్రతా సిబ్బందిలో చాలా మంది మృత్యువాత పడ్డారు. మిగిలిన వారు ప్రాణ భయంతో ఎట్టకేలకు సురక్షితంగా బయటపడి ఒడ్డుకు చేరారు.

ఈ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న శాన్ జోస్ నౌక.. కరేబియన్ సముద్రంలో మునిగిపోయింది. కరేబియన్ సముద్రంలో 600 మీటర్ల లోతులో శిథిలాల కింద చిక్కుకుంది. అయితే శాన్ జోస్ షిప్‌ను సముద్ర గర్భం నుంచి వెలికితీస్తామని కొలంబియా ఇటీవల ఒక ప్రకటన చేసింది. కొలంబియా ప్రకటనతో అమెరికా, స్పెయిన్‌, పెరూ సహా పలు దేశాలు అలర్ట్ అయ్యాయి. ఎందుకంటే ఆ షిప్.. స్పెయిన్‌కు చెందింది కాగా.. పెరూలోని బంగారం, వెండి, రత్నాలను.. పనామా కాల్వ మీదుగా కొలంబియాకు తరలిస్తుండగా.. మునిగిపోయింది. దీంతో అందులో ఉన్న సంపద తమదే అంటూ వివిధ దేశాలు కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్నాయి.

A cannon found in the San Jose shipwreck.


ఇక కరేబియన్ సముద్రంలో శాన్ జోస్ మునిగిపోయిన ప్రాంతంలో పరిశోధన ప్రారంభించినట్లు కొలంబియా ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ది కొలంబియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంత్రోపాలజీ అండ్‌ హిస్టరీ సంస్థ-ఐసీఏఎన్‌హెచ్‌.. స్పెషల్ రిమోట్‌ సెన్సర్లను ఉపయోగించి.. శాన్ జోస్‌ ఫోటోలను తీయనుంది. ఆ ఫోటోల ఆధారంగా తర్వాత పరిశోధన, వెలికితీత కొనసాగుతాయని తెలిపింది. ఇక శాన్ జోస్ మునిగిపోయిన ప్రాంతాన్ని ఇప్పటికే ఐసీఏఎన్‌హెచ్‌ రక్షిత పురాతత్వ ప్రదేశంగా గుర్తించింది.

The San Jose galleon was believed to have been carrying billions worth of treasure when it was sunk in 1708.


అయితే గతంలోనే శాన్ జోస్ ఆనవాళ్లను కనిపెట్టారు. 1981లో అమెరికాకు చెందిన సముద్ర గర్భంలో అన్వేషణ సంస్థ సీసెర్చి ఆర్మడా.. శాన్ జోస్ నౌక శకలాలు గుర్తించినట్లు తెలిపింది. అయితే కొలంబియా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలం కావడంతో.. కొలంబియా పార్లమెంట్‌ ఈ నిధిపై పూర్తి హక్కు తమదేనని ప్రకటించింది. కేవలం 5 శాతం ఫీజు కింద సీసెర్చి ఆర్మడా సంస్థకు ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో ఆ సంస్థ అమెరికా కోర్టులో కేసు వేయగా.. రెండుసార్లు ఆ సంపదపై కొలంబియాదే హక్కు అని కోర్టు తేల్చిచెప్పింది.

Gold coins found in the San Jose shipwreck.


ఈ ఘటన జరిగిన కొన్ని దశాబ్దాల తర్వాత 2015లో శాన్‌ జోస్‌ శకలాలను తామే స్వయంగా కనుగొన్నట్లు కొలంబియా ప్రకటించింది. భారీ రాగి తుపాకులు వంటి పరికరాలు ఆ ప్రాంతంలో ఉన్నట్లు తెలిపింది. దీని కోసం బ్రిటిష్‌, అమెరికా కంపెనీల సాయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో ఎస్‌ఎస్‌ఏ సంస్థ పర్మినెంట్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌లో 10 బిలియన్‌ డాలర్లకు కొలంబియాపై కేసు వేసింది. మరోవైపు స్పెయిన్‌, పెరూ ప్రభుత్వాలు కూడా ఆ నౌకపై యాజమాన్య హక్కులు తమవే అని వాదిస్తున్నాయి. అయితే శాన్ జోస్ మునిగిన ప్రాంతాన్ని కొలంబియా ప్రభుత్వం, ఎస్ఎస్‌ఏ కంపెనీ ఇప్పటివరకు ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version