Andhrapradesh
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఓడినా కనీస స్థానాలు దక్కించుకోలేదు. టీడీపీ కూటమికి అనూహ్య మెజార్టీ దక్కింది. అటు కేంద్రంలోనూ ఇదే కూటమి భాగస్వామలుగా ఉన్నారు. దీంతో..జగన్ ఏం చేయబోతున్నారు. 2019 ఎన్నికల తరువాత చోటు చేసుకున్న పరిణామాలు జగన్ లో ఆలోచనకు కారణమవుతున్నాయి. దీంతో, నాడు చంద్రబాబు అమలు చేసిన ఫార్ములా ఇప్పుడు జగన్ అమలు చేస్తారనే చర్చ మొదలైంది.