Andhrapradesh
ప్రధాని అభ్యర్థిని ఎన్నుకున్న బీజేపీ: జాతీయ కార్యవర్గ భేటీలో..
![](https://infoline.one/wp-content/uploads/2024/02/n584193840170824568444474642577ee8610d7ec7fc9ec97357d5d792bbce3f38a1dfdd888e6d23d1530f6.jpg)
BJP National council meeting: లోక్సభ ఎన్నికల గడువు సమీపించి ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో భారతీయ జనత పార్టీ.. కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది.
ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించడానికి అవసరమైన అజెండాను ఖరారు చేస్తోంది.
దేశ రాజధానిలోని భారత్ మండప్ వేదికగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అన్ని రాష్ట్రాల కార్యదర్శులు, పదాధికారులు పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, వివిధ రాష్ట్ర శాఖ అధ్యక్షులు హాజరయ్యారు.
రెండో రోజు సమావేశాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సన్మానించారు బీజేపీ నేతలు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా.. ఆయనకు నిలువెత్తు పూలమాలను వేసి సత్కరించారు. మోదీజీకి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. మోదీని తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినట్టయింది.
అనంతరం అమిత్ షా ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో 400 లోక్సభ స్థానాలను గెలవాలని టార్గెట్గా పెట్టుకున్నామని, దీన్ని అవలీలగా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మోదీని మరోసారి ప్రధానిగా ఎన్నుకోవడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ముచ్చటగా మూడోసారి ఆయన ఈ దేశానికి నాయకత్వాన్ని వహిస్తారని చెప్పారు. ఇందులో ఎలాంటి సందేహాలు లేవని వ్యాఖ్యానించారు.
ఈ 75 సంవత్సరాల్లో ఈ దేశం 17 లోక్సభ ఎన్నికలు, 22 ప్రభుత్వాలు, 15 మంది ప్రధానమంత్రులను చూసిందని, ఎప్పుడూ జరగని అభివృద్ధి మాత్రం మోదీ హయాంలోనే చోటు చేసుకుందని అమిత్ షా అన్నారు. ప్రతి రంగం అభివృద్ధి చెందిందని, ప్రతి వ్యక్తి అవసరాలను మోదీ ప్రభుత్వం తీర్చిందని చెప్పారు. ఈ 10 సంవత్సరాలలో మాత్రమే అది సాధ్యపడిందని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా.. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఖతం చేసిందని ఆరోపించారు అమిత్ షా. అత్యంత అవినీతికరమైన కుటుంబ పాలనను ఈ దేశానికి అందించిందని విమర్శించారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులు, కులతత్వంతో ఇన్ని సంవత్సరాల పాటు పాలించారని ధ్వజమెత్తారు. దీన్ని నిర్మూలించి.. ఈ 10 సంవత్సరాలలో మోదీ ఎంతో అభివృద్ధిని సాధించారని ప్రశంసించారు.
Andhrapradesh
Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్… కెమెరాల ఈ-వేలానికి టీటీడీ ప్రకటన, ఇలా పొందవచ్చు!
![](https://infoline.one/wp-content/uploads/2024/07/tirumala_photo_1721990028536_1721990031275.jpeg)
Tirumala Tirupati Devasthanams Updates: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన పలు రకాల కెమెరాలను టీటీడీ వేలం వేయనుంది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన కెమెరాలు ఇందులో ఉన్నట్లు పేర్కొంది.
ఈ కెమెరాలను ఆగస్టు 1న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నారు. ఇందులో నైకాన్, కెనాన్, కొడాక్ తదితర కెమెరాలు ఉన్నాయి. ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న కెమెరాలు మొత్తం 10 లాట్లు ఈ-వేలంలో ఉంచారు.
ఈ- వేలానికి సంబంధించిన ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరు ద్వారా సంప్రదించవచ్చు. లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో వివరించింది.
ఆండాళ్ తిరువడిపురం ఉత్సవం :
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 29 నుండి ఆగష్టు 7వ తేదీ వరకు శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉత్సవ రోజుల్లో ఉదయం శ్రీ ఆండాళ్ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.
ఆగష్టు 7న శ్రీ ఆండాళ్ అమ్మవారి శాత్తుమొర సందర్భంగా ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారిని అలిపిరికి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు.
ప్రత్యేకపూజల అనంతరం అలిపిరి నుండి రామనగర్ క్వార్టర్స లోని గీతామందిరం, ఆర్ఎస్ మాడ వీధి లోని శ్రీ విఖనసాచార్యుల ఆలయం, శ్రీ చిన్నజీయర్ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. రాత్రి 8 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో శాత్తుమొర నిర్వహిస్తారు.
మరోవైపు తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 30వ తేదీన ఆడికృత్తిక పర్వదినం జరగనుంది. ఈ సందర్భంగా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
రూ.1.5 కోట్లు విరాళం
తెనాలికి చెందిన శ్రీ సత్య శ్రీనివాస్ (నేషనల్ స్టిల్స్, సిఎఫ్ఓ) ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1.5 కోట్లు విరాళం అందించారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం చెక్కును దాత టిటిడి ఈఓ జె.శ్యామల రావుకు అందజేశారు.
Andhrapradesh
అమరావతి రైతులకు గుడ్న్యూస్.. అకౌంట్లలోకి డబ్బులు, నెలాఖరుకు పక్కా
![](https://infoline.one/wp-content/uploads/2024/07/images-7.jpeg)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రైతుల కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. గత రెండేళ్లుగా పడుతున్న ఇబ్బందులపై రైతుల కూటమి ప్రభుత్వానికి వరుసగా విన్నవిస్తున్నారు. అమరావతి రైతులకు కౌలు బకాయి రూ.380 కోట్లని తేలగా.. ఆ చెల్లింపుల దిశగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరుగుతోంది.. ఈలోపే ప్రభుత్వం డబ్బులు చెల్లించేందుకు సిద్ధహవుతోంది.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
అమరావతి రైతులకు శుభవార్త.. రాజధాని రైతులకు చెల్లించాల్సిన కౌలుపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అమరావతి రైతుల నుంచి కౌలు చెల్లింపులపై వినతులు వస్తుండటంతో.. మున్సిపల్శాఖ మంత్రి పొంగూరు నారాయణ కౌలు చెల్లింపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు రాజధాని రైతులకు ప్రభుత్వం రూ.380 కోట్ల మేర కౌలు బకాయిలు ఉన్నట్లు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. కౌలు బకాయిల అంశాన్ని నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి.. నెలాఖరులోగా కౌలు చెల్లించేలా కృషి చేస్తానని మంత్రి నారాయణ అమరావతి రైతు జేఏసీ నేతలు తెలిపారు.
సకాలంలో కౌలు రాకపోవడంతో అప్పులపాలయ్యామని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన రెండేళ్లుగా కౌలు ప్రస్తావనే లేకుండా చేశారని.. ఇప్పుడు అప్పు పుట్టే పరిస్థితి కూడా లేకుండా పోయింది అన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు కౌలు చెల్లించి ఆదుకోవాలని కోరారు. కౌలు చెల్లించకపోవడంతో పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. ప్రభుత్వం ఇచ్చే కౌలుతో పిల్లల్ని చదివించుకుంటున్నామంటున్నారు పలువురు పోలీసులు.. ఇప్పుడు వారికి ఫీజులు కట్టే పరిస్థితి లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం 28,656 మంది రైతులు దాదాపు 34 వేల ఎకరాల భూములు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో కొందరు చిన్న, సన్నకారు రైతులు.. ఆర్థికపరమైన ఇబ్బందులతో రిటర్నబుల్ ప్లాట్లు అమ్ముకున్నారు. ఈ కారణంగా వారంతా కౌలుకు అనర్హులయ్యారు. తాజా లెక్క ప్రకారం 28,656 మందిలో కేవలం 22,980 మందికి మాత్రమే కౌలు వస్తుంది.. వీరిలో 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులతో పాటుగా.. గిరిజన, దళిత, బీసీ, మైనార్టీ, అసైన్డ్ రైతులే ఉన్నారు. అయితే రైతులకు కౌలు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు
మరోవైపు అమరావతి రైతులు కౌలు చెల్లింపులపై హైకోర్టును ఆశ్రయించారు. తమకు సకాలంలో కౌలు డబ్బులు చెల్లించేలా చూడాలని కోరారు.. హైకోర్టు విచారణ జరిపి కీలక ఆదేశాలు జారీ చేసింది.. కానీ తమకు మాత్రం కౌలు అందలేదంటున్నారు. రెండేళ్లుగా కౌలు ఎగవేయడంతో అప్పులు చేసినట్లు రైతులు చెబుతున్నారు. కొంతమంది ఈ కౌలు డబ్బులతో పిల్లల్ని చదివిస్తున్నారు. దీంతో ఫీజులు కట్టుకోవడం కూడా వారికి భారంగా మారింది. అందుకే కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కౌలు చెల్లింపులకు సంబందించి కసరత్తు మొదలుపెట్టడంతో.. రైతులు ఆనందంలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. అమరావతిలో పనులు కూడా ఊపందుకున్నాయి. ముందుగా ప్రభుత్వం జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించింది.. అలాగే పెండింగ్ పనుల్ని కూడా తిరిగి ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నారు.
Andhrapradesh
Andhra Pradesh: ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
![](https://infoline.one/wp-content/uploads/2024/07/dwcra-women.jpg)
ఏపీలో డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పనకు పెద్దపీట వేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది లక్షన్నర మందికి లోన్స్ అందించేలా ప్రణాళిక రూపొందిస్తుంది. ఈ రుణాలు ఒకే సమయంలో సంఘంలో గరిష్ఠంగా ముగ్గురికి అందించే వెసులుబాటు ఉంది.
ఏపీలో డ్వాక్రా సంఘాలకు మరింత చేయూత ఇవ్వాలని ఏపీలోని ఎన్డీయే సర్కార్ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ లోన్స్ మాత్రమే కాకుండా.. భారీగా పర్సనల్ లోన్స్ ఇవ్వాలని డిసైడ్ అయింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో లక్షన్నర మంది డ్వాక్రా మహిళలకు రూ.2 వేల కోట్ల మేర వ్యక్తిగత రుణాలు అందించాలని సెర్ప్ అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. 1.35 లక్షల మందికి రూ.లక్ష మేర, 15 వేల మందికి రూ.5 లక్షల లోన్స్ ఇవ్వనున్నారు. ఒక గ్రూప్లో ముగ్గురికి ఒకేసారి ఈ లోన్స్ ఇచ్చే వెసులుబాటు ఉంది. బ్యాంకులతో మాట్లాడి ఈ రుణాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తారు. కొత్తవారికి మాత్రమే కాదు.. ఇప్పటికే ఏదైనా జీవనోపాది పొందుతున్నవారికి సైతం లోన్స్ ఇస్తారు. లబ్ధిదారులు ఉత్సాహంతో ముందుకు సాగుతుంటే.. ఈ రుణాన్ని రూ 10 లక్షలు కూడా పెంచుతామని ప్రభుత్వం తెలిపింది
-
Business2 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career2 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
Business2 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
Business2 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National3 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
News2 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Education2 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National2 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Crime News2 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh2 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Spiritual2 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National2 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
National2 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh2 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh2 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Political1 month ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
National1 month ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
National2 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Andhrapradesh2 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Railways1 month ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
Andhrapradesh1 month ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Andhrapradesh2 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Telangana2 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Political2 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh2 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh2 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Andhrapradesh1 month ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh1 month ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
International2 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Business2 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
News3 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Spiritual2 months ago
Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?
-
National2 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
News2 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
International1 month ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Education1 month ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
News2 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh2 months ago
AP Schools Reopen Date 2024: ఏపీలో వేసవి సెలవుల పొడిగింపు.. తిరిగి బడి గంట మోగేది అప్పుడే!
-
Hyderabad1 month ago
ఏపీలో చంద్రబాబు వస్తే హైదరాబాదుకు వచ్చిన నష్టం ఏమీ లేదు… పొంగులేటి
-
Andhrapradesh1 month ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
Cinema2 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
-
Cinema4 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Andhrapradesh5 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Andhrapradesh2 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Weather1 month ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Railways2 weeks ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Life Style2 months ago
Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు
-
Andhrapradesh2 months ago
ఏపీలో ఆ శాఖ ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ మరో రెండేళ్లు పొడిగింపు
-
National2 months ago
ఒకే కుటుంబంలో 165మంది- ఓట్ల కోసం ఫ్యామిలీ చుట్టూ నేతలు! అందరూ చర్చించే ఓటేస్తారట! – Voters In One Family In Bihar
-
National2 months ago
Loksabha : ఈనెల 24 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు….. స్పీకర్ ఎన్నిక!