Telangana
TG Govt Schools : బడి పిల్లలకు సర్కార్ శుభవార్త, కొత్తగా 206 ప్రభుత్వ పాఠశాలలు!
![](https://infoline.one/wp-content/uploads/2024/05/schools_1716907999748_1716908006228.jpeg)
TG Govt Schools : తెలంగాణలో మొత్తం 265 గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు లేవని విద్యాశాఖ అధికారులు లెక్కలో తేలింది. విద్యార్థులు లేని కారణంగా గత ప్రభుత్వ హయంలో మూతబడ్డ పాఠశాలలే ఇందులో ఎక్కువగా ఉన్నాయి. వీటిలో మెజారిటీ పాఠశాలలను తిరిగి ఓపెన్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మరో వైపు ఇప్పటివరకు అసలు పాఠశాలలు లేని గ్రామాల్లో కొత్తవి కట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ప్రతీ ఊరులో తప్పకుండా బడి ఉండాలన్న సీఎం నిర్ణయం మేరకు ప్రభుత్వం ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు రాష్ట్రంలో మూతపడ్డ పాఠశాలల వివరాలు సేకరించడంలో నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగానే గతేడాది డిసెంబర్ లో విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా నూతన పాఠశాలల ఏర్పాటుపై వివరాలు సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ పాఠశాల నిమిత్తం పక్క గ్రామానికి వెళ్లే దుస్థితి రాకుండా ప్రతీ గ్రామ పంచాయతీల్లో ఓ పాఠశాల తప్పనిసరిగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీచేశారు. దీంతో గత నాలుగైదు నెలలుగా సీఎం ఆదేశానుసారం విద్యాశాఖ అధికారులు మూసివేసిన పాఠశాలల పునరుద్ధరణకు కసరత్తులు చేస్తున్నారు.
నల్గొండలో కొత్తగా 24 పాఠశాలలు
రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా……265 గ్రామ పంచాయతీలో ప్రభుత్వ పాఠశాలలు లేవని తేలింది. వీటిలో 206 గ్రామ పంచాయతీలో ప్రభుత్వ పాఠశాలలు తప్పనిసరిగా అవసరమని విద్యాశాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరో 62 గ్రామాల్లో పిల్లలు లేకపోవడంతో పాఠశాలల ఏర్పాటుకు అవసరం లేదని అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో 206 గ్రామ పంచాయతీల్లో కొన్ని కొత్తగా నిర్మించాల్సిన అవసరం ఉండగా… మరికొన్ని పునరుద్ధరణ చేయాల్సి ఉందని అధికారులు తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే నల్గొండ జిల్లాల్లో కొత్తగా 24 పాఠశాలలను ప్రభుత్వం ప్రారంభించనుంది. కరీంనగర్, యాదాద్రి భువనగిరి జిల్లాలో 21, వరంగల్ జిల్లాలో 16 నూతన పాఠశాలలను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇటు నిజామాబాద్ జిల్లాలో మొత్తం 14 గ్రామ పంచాయతీల్లో అసలు పాఠశాలలు లేవని అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లాలో 24 గ్రామ పంచాయతీల్లో పాఠశాలలు లేకపోగా…. అందులో 12 గ్రామాల్లో అసలు కొత్త బడులు అవసరం లేదని వెల్లడించారు.
1748 ప్రభుత్వ పాఠశాలలో జీరో ఎన్ రోల్
హైదరాబాద్, మేడ్చల్, ఆసిఫాబాద్ జిల్లాలు మినహా ప్రతి జిల్లాల్లోనూ ఒకటి కన్నా ఎక్కువ స్కూళ్లు మూతపడినట్టు విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. గ్రామాల్లో కొత్త పాఠశాలలను ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే దానిపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జూన్ లో జరిగే బడిబాటలో భాగంగా ఆయా గ్రామాల్లో పిల్లలను గుర్తించి వారికి పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పించాలని అధికారులు భావిస్తున్నారు. అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులనే కొత్త బడుల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యాశా పై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో భాగంగా గ్రామంలో పాఠశాల ఉండాలని ఇప్పుడు వివరాలు సేకరిస్తున్నామని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఎక్కడ పాఠశాల అవసరం? పిల్లలు ఎన్రోల్మెంట్ తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండి ఆ గ్రామానికి దగ్గరగా ఉంటే సదరు పాఠశాలలో ఉపాధ్యాయుని సర్దుబాటు చేసేలాగా కసరత్త చేస్తున్నామని, ప్రస్తుతం 1748 పాఠశాలలో జీరో ఎన్రోల్ ఉందని ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.
Telangana
అరుదైన పురస్కారానికి ఎంపికైన చేనేత కళాకారుడు.. తెలంగాణ నుంచే ఎందుకంటే..
![](https://infoline.one/wp-content/uploads/2024/07/telangana-10.webp)
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, కంచిపట్టు చీరలకు యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి కేరాఫ్ అడ్రస్. చేనేత కార్మికుల నైపుణ్యానికి ప్రతీక ఇక్కడి ఈ చీరలు. సృజనాత్మకత, నూతన డిజైన్లతో వస్త్రాల తయారీ ఇక్కడి చేనేత కార్మికుల అద్భుత కళారూపానికి నిదర్శనం. ఎన్నో ప్రత్యేకతలతో పర్యావరణహితంగా చీరను రూపొందించి మరోసారి జాతీయ స్థాయిలో తెలంగాణ చేనేత ఘనతను ఓ కళాకారుడు చాటిచెప్పారు.
యాదాద్రి జిల్లా చేనేత కార్మికులకు పుట్టినిల్లు..
ఇక్కడి చేనేత కార్మికుల అద్భుత కళారూపాలు ఖండాంతర ఖ్యాతిని సాధించాయి. ఈ ప్రాంతంలోని నేతన్నలు ఎన్నో చేనేత పురస్కారాలను అందుకున్నారు. తాజాగా ఓ చేనేత కార్మికుడు పర్యావరణహితమైన చీరను రూపొందించి.. జాతీయస్థాయిలో తెలంగాణ చేనేత ఘనతను చాటాడు. చౌటుప్పల్ మండలం కొయ్యల గూడెంకు చెందిన కర్నాటి ముఖేశ్ ఈ అరుదైన నేతను నేసాడు. కేంద్ర చేనేత, జౌళి శాఖ 2023 సంవత్సరానికి జాతీయ స్థాయిలో 14 మందిని జాతీయ పురస్కారానికి ఎంపిక చేయగా.. వారిలో తెలంగాణ నుంచి ముఖేశ్ ఈ అవార్డు సాధించారు. బీటెక్ ఎలక్ట్రానిక్స్ చదివిన ముఖేశ్ బాల్యం నుండి తాత, తండ్రి వారసత్వంగా చేనేత వృత్తిని కొనసాగించారు. 15 ఏళ్లుగా ముఖేష్ పలు ప్రయోగాలను చేస్తూ ఈ రంగంలోనే ఉన్నారు. ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఇచ్చే జాతీయ పురస్కారానికి రాష్ట్రం నుంచి 27 మంది చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. వారందరిలో ముఖేష్ ఒక్కరే రాష్ట్రం నుంచి జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికయ్యాడు.
![](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/handloom.jpg)
పర్యావరణహితమైన చీర..
కర్నాటి ముఖేష్ రెండేళ్లపాటు శ్రమించి ప్రకృతి నుంచి సేకరించిన పది రకాల రంగులు అద్ది, వందపూల డిజైన్లతో ప్రత్యేకంగా నేసిన డబుల్ ఇక్కత్ ప్రకృతి రంగుల చీరను జాతీయ పురస్కారానికి నిపుణుల కమిటీ ఎంపిక చేసింది. నాణ్యమైన పత్తితో తయారైన సన్నటి నూలు దారాన్ని చీర తయారీకి ఉపయోగించారు. నూలును ఆయుర్వేద గుణాలున్న కరక్కాయ పొడి, కుంకుడుకాయ రసంతో శుద్ధిచేశారు. మగ్గంపై పడుగు, పేక ఒక్కో పోగును అల్లుతూ రెండేళ్లు శ్రమించి 46 అంగుళాల వెడల్పు, ఏడు మీటర్ల పొడవుతో 600 గ్రాముల బరువుండే చీరను నేశారు. కర్నాటి ముఖేష్ చేనేత ఇక్కత్ చీరల తయారీలో నూతన ఆవిష్కరణల కోసం నిరంతరం ప్రయత్నిస్తుండేవాడు. 2022లో రాష్ట్రప్రభుత్వం నుంచి కొండా లక్ష్మణ్ చేనేత పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఈ జాతీయ చేనేత పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. తెలంగాణ నుంచి జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు కర్నాటి ముఖేష్ జాతీయ చేనేత పురస్కారానికి ఎంపిక కావడం పట్ల చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Telangana
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూల్ సమయాల్లో మార్పులు..
![](https://infoline.one/wp-content/uploads/2024/07/school-timings.webp)
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పాఠశాలల పనివేళల్లో మార్పు చేసింది. ముఖ్యంగా హైస్కూల్ వేళల్లో మార్పులు చేసింది. ఇందులో భాగంగానే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమయాలతో సమానంగా హైస్కూల్ వేళలను మారస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. ఇకపై ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఉదయం 9.00 నుంచి సాయంత్రం 4.15ల వరకు పనివేళలు మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇప్పటి వరకు పనివేళలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45గా ఉండేవి. అయితే తాజాగా ఈ సమయాన్ని ఉదయం 9.00 నుంచి సాయంత్రం 4.15 వరకు మారుస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే మాత్రం జంట నగరాల్లో యథావిధిగా ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలల నిర్వహణ కొనసాగనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్లో సాయంత్రం ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంగన్వాడీల్లోనూ మార్పులు..
ఇదిలా ఉంటే విద్యావస్థల్లోనూ పలు మార్పులు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా అంగన్వాడీలను మరింత తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్లే స్కూల్స్తో తరహాలో అంగన్వాడీలను తీర్దిదిద్దనున్నారు. అంగన్వాడీల్లోనే బోధన అందించనున్నారు. ఇందులో భాగంగానే అంగన్వాడీలో ఒక టీచర్ను నియమించే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఇక వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. విద్యా వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి.. సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని తెలిపారు.
Andhrapradesh
Chandrababu – Revanth Reddy: బిగ్ డే.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీపై ఉత్కంఠ.. విభజన సమస్యలకు చెక్ పడుతుందా?
![](https://infoline.one/wp-content/uploads/2024/07/chandrababu-revanth-reddy.webp)
తెలుగు రాష్ట్రాలకు ఇవాళ బిగ్ డే.. విభజన సమస్యలకు చెక్ పడుతుందా? జలాలవాటా నుంచి ఆస్తుల పంపకాల దాకా.. అన్ని కొలిక్కి వస్తాయా..? CMల ఫస్ట్ మీటింగ్లో జరిగేదేంటి? అనేది.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది.. రెండు రాష్ట్రాల విభజన అంశాలను తేల్చేయడానికి ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ హైదరాబాద్లోని ప్రజాభవన్లో చర్చించబోతున్నారు. ఇదివరకటి ముఖ్యమంత్రుల సమావేశానికి, ఈ సమావేశానికి ఎలాంటి మార్పులు ఉంటాయన్నది ఆసక్తిగా మారింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లయిపోయింది. అయినా విభజన చట్టం ప్రకారం జరగాల్సిన.. పంపకాలు మాత్రం పూర్తి కాలేదు. తాజాగా, ఇదే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతుండటం తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ముందుగా విభజన అంశాలపై చర్చించుకుందామంటూ… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడం.. మళ్లీ రేవంత్ రెడ్డి చర్చించుకుందామంటూ చంద్రబాబుకు లేఖ రాయడం చకచకా జరిగిపోయాయి.. ఇవాళ సాయంత్రం ఆరుగంటలకు ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రజాభవన్ లో భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా.. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవాలని చంద్రబాబు, రేవంత్ రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది.
తొలిసారి విభజన అంశాలపై చర్చించేందుకు ప్రజాభవన్లో సాయంత్రం 6గంటలకు చంద్రబాబు, రేవంత్రెడ్డి సమావేశంకానున్నారు.. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు భట్టి విక్రమార్క, పవన్ కల్యాణ్, ఇరు రాష్ట్రాల్లో సీఎస్లు, పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఏపీ నుంచి మంత్రులు అనగాని, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరుకానున్నారు. అధికారుల బృందంలో ఏపీ వైపు నుంచి సీఎస్, ఆర్దిక శాఖ సహా కీలక విభాగాల కార్యదర్శుల హాజరవుతారు.
మొత్తం పది అంశాల అజెండాను తెలుగు రాష్ట్రాలు సిద్ధం చేశాయి.. వీటిపైనే ప్రధానంగా చర్చ జరగనుంది..
షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనపై ప్రధానంగా చర్చ జరగనుంది.. 9వ షెడ్యూల్లో పెండింగ్లో 23 సంస్థల పంపిణీ, 10వ షెడ్యూల్లో పెండింగ్లోని 30 సంస్థల పంపిణీ గురించి చర్చించనున్నారు.
షీలా బీడే కమిటీ సిఫార్సులపై కూడా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమీక్షించనున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి రావలసిన విద్యుత్ బకాయిలు రూ. 7,200 వేల కోట్లు, ఏపీఎఫ్సీ అంశాల పై చర్చ జరగనుంది.
ఏపీ-తెలంగాణ మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై, ఉద్యోగుల పరస్పర బదిలీలు, లేబర్ సెస్ పంపకాలు, ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులపై, హైదరాబాదులోని మూడు భవనాలను ఏపీకి కేటాయించేలా చర్చ జరగనుంది..
ఏపీ తెలంగాణ మధ్య గత 10 ఏళ్లుగా సంస్థల విభజన సమస్యలు కొలిక్కిరాకపోవడంతో.. పలు సంస్థలకు చెందిన రూ. 8,000 కోట్లను రెండు రాష్ట్రాలు వినియోగించుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఉంది.. దీనిపై చర్చజరగనుంది..
9వ షెడ్యూల్లో ఉన్న అగ్రస్థాయి సంస్థల్లో ఏపి జెన్కో విలువ రూ.2,448 కోట్లుగా నిర్ధారించారు. అత్యల్పంగా ఏపి మార్కెటింగ్ ఫెడరేషన్ మార్క్ ఫెడ్ విలువ ఉంది..
10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల్లో రూ.2,994 కోట్ల నిధులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే రూ.1,559 కోట్లను ఏపి తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికే పంచుకున్నాయి.. రూ.1,435 కోట్ల రూపాయల విషయంలో ఇంకా పంచాయితీ తేలలేదు.. కావున విభజన చట్టంలో పేర్కొన్న సంస్థల విభజనపై సీఎంల సమీక్ష జరగనుంది.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఇవే..
రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కలుపబడ్డ 7 మండలాలు తిరిగి తెలంగాణలో చేర్చాలి.
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుపతి వేంకటేశ్వరస్వామి. తెలంగాణకు కూడా టీ.టీ.డీ. పాలకవర్గంలో ప్రాధాన్యత , టిటిడి దర్శనాలలో తెలంగాణ స్పెషల్ కోటా డిమాండ్..
కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్ మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలి. అదేవిధంగా తెలంగాణకు 558 టీఎంసీ నీటిని కేటాయింపు చేయాలి.
తెలంగాణ విద్యుత్ సంస్థలకు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు రూ.24,000 కోట్ల బకాయిలు సత్వరమే చెల్లించాలి. దానిలో భాగంగా ఆంధ్రాకు ఏమైనా చెల్లించాల్సి ఉంటే, వాటిని చెల్లించడం జరుగుతుంది.
తెలంగాణకు ఓడరేవులు లేవు. అందువల్ల విభజనలో భాగంగా ఆంధ్రాలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్ట్స్లలో తెలంగాణకు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కు తెలంగాణకు కోటా ఇవ్వాలి..
డిన్నర్ ఏర్పాటు..
కాగా.. ఇవాళ సాయంత్రం ప్రజా భవన్లో ఏపీ సీఎం చంద్రబాబుకి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి డిన్నర్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడితో పాటు సమావేశంలో పాల్గొనే వారికి కూడా డిన్నర్ ఏర్పాటు చేయనున్నారు.
-
Business2 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career2 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
Business2 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
Business2 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National3 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
News2 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Education2 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National2 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Crime News2 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh2 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Spiritual2 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National2 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Andhrapradesh2 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
National2 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh2 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Political1 month ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
National1 month ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
National2 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Andhrapradesh2 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Railways1 month ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
Andhrapradesh1 month ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Andhrapradesh2 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Telangana2 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Andhrapradesh1 month ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Political2 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh2 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Andhrapradesh1 month ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
International2 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Andhrapradesh1 month ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Spiritual2 months ago
Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?
-
Business2 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
News3 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
News2 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
National2 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
International1 month ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Education1 month ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
News2 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh2 months ago
AP Schools Reopen Date 2024: ఏపీలో వేసవి సెలవుల పొడిగింపు.. తిరిగి బడి గంట మోగేది అప్పుడే!
-
Hyderabad1 month ago
ఏపీలో చంద్రబాబు వస్తే హైదరాబాదుకు వచ్చిన నష్టం ఏమీ లేదు… పొంగులేటి
-
Cinema2 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
-
Cinema4 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Andhrapradesh1 month ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
Andhrapradesh5 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Andhrapradesh2 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Weather1 month ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Railways2 weeks ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh2 months ago
ఏపీలో ఆ శాఖ ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ మరో రెండేళ్లు పొడిగింపు
-
National2 months ago
ఒకే కుటుంబంలో 165మంది- ఓట్ల కోసం ఫ్యామిలీ చుట్టూ నేతలు! అందరూ చర్చించే ఓటేస్తారట! – Voters In One Family In Bihar
-
Life Style2 months ago
Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు
-
National2 months ago
Loksabha : ఈనెల 24 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు….. స్పీకర్ ఎన్నిక!