Connect with us

Technology

టార్గెట్ బీజేపీ? ఈవీఎంలపై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణల వెనుక అనేక అనుమానాలు

Published

on

Evm Hacking Row : ఈవీఎంలపై మస్క్ వ్యాఖ్యలను ఇండియా కూటమి సమర్థిస్తోంటే అధికార బీజేపీ, దాని మిత్రపక్షాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. మస్క్ వ్యాఖ్యలను కేంద్రం తరపున ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తోసిపుచ్చారు. హ్యాకింగ్‌పై ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ మస్క్ చాలా తేలిగ్గా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎంలను హ్యాకింగ్ చేయగలిగినప్పుడు టెస్లా కార్లనూ హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది కదా అని కౌంటర్ ఇచ్చారు. రాహుల్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌శిండే స్పందించారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తంచేస్తున్న రాహుల్ గాంధీ తాను పోటీ చేసిన రెండు స్థానాల నుంచి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు.

భారత్‌లో ఈవీఎంల వాడకం 2004లో మొదలు..
భారత్‌లో ఈవీఎంల వాడకం 2004లో మొదలైంది. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఈవీఎంలను ఉపయోగించారు. ఆ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న NDA ఓడిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ఘోర పరాజయం పొందింది. కేంద్రంలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలిచి యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

బీజేపీ ఘనవిజయం తర్వాత ఈవీఎంలకు వ్యతిరేకంగా బలంగా వాదనలు..
2004 నుంచి దేశంలో ఎన్నికలన్నీ ఈవీఎంల ద్వారానే జరుగుతున్నాయి. మొదటినుంచీ ఈవీఎంలపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయితే 2014 ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం తర్వాత ప్రతిపక్షాలు ఈవీఎంలకు వ్యతిరేకంగా బలంగా వాదనలు వినిపించడం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో ఓడిన పలు పార్టీలు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తంచేస్తూనే ఉన్నాయి. అలాగే తాము గెలిచినప్పుడు ఒకలా, ఓడినప్పుడు మరోలా మాటలు మారుస్తూనే ఉన్నాయి.

ఎప్పటిలాగే ఎన్నికలు ముగియగానే ఈవీఎంలపై ఆరోపణలు..
2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాహుల్ గాంధీ ఈవీఎంలపైనా, ఎన్నికల కమిషన్‌పైనా ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో నిజానికి కాంగ్రెస్ బాగా బలపడింది. 2014 తర్వాత తొలిసారి 99 స్థానాలను సొంతంగా సాధించింది. కాంగ్రెస్ ప్రధాన భాగంగా ఉన్న ఇండియా కూటమి విజయం సాధించలేనప్పటికీ.. ఊహించని దాని కన్నా బలపడింది. అయినప్పటికీ ఈవీఎంలపై విమర్శలు ప్రతిపక్షం తరుపు నుంచి ఆగలేదు. ఈవీఎంలను ప్రవేశపెట్టిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ వ్యవస్థపై ఇంకా అనుమానాలు వ్యక్తం చేయడం తగదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయినప్పటికీ ఎప్పటిలానే ఎన్నికలు ముగియగానే ఈవీఎంలపై విమర్శలు, విశ్లేషణలు, ఆరోపణలు మొదలయ్యాయి. ఈవీఎంలలో పోలైన ఓట్లకు, కౌంటింగ్ రోజు లెక్కించిన ఓట్లకు మధ్య అంతరం ఉందని కొన్ని వార్తా సంస్థలు కథనాలు రాశాయి. మొత్తం 542 నియోజకవర్గాల్లో 538 నియోజకవర్గాల్లో ఈ తేడాలున్నాయని తెలిపాయి.

ఈవీఎంలపై కొన్ని జాతీయ మీడియా సంస్థల్లో పరిశోధనాత్మక కథనాలు ప్రచురితమవవడం, ఆ తర్వాత మస్క్ వ్యాఖ్యలు చేయడం మరింత గందరగోళానికి తావిచ్చాయి. ఇది చాలదన్నట్టు ఈవీఎంలకు సంబంధించిన ఓ కేసులో మంగేశ్ పాండిల్కర్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాయువ్య ముంబై లోక్‌సభ స్థానంలో ఈ ఎన్నికల్లో శివసేన షిండే వర్గం అభ్యర్థి రవీంద్ర వైకర్ 48 ఓట్ల తేడాతో గెలిచారు. శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన అమోల్ గజానన్‌ కీర్తికర్‌పై స్వల్ప మెజార్టీతో వైకర్ గెలిచిన దగ్గరి నుంచి.. ఆ పార్టీలో నేతలు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తంచేయడం మొదలుపెట్టారు.

Advertisement

ఫోన్ ద్వారా ఈవీఎం ఓపెన్ చేశారని ఆరోపణలు..
నిజానికి మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన షిండే వర్గం కన్నా శివసేన ఉద్ధవ్ వర్గమే ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అయినా వారు ఈవీఎంల విశ్వసనీయత, భద్రతపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మంగేశ్ పాండిల్కర్ గోరేగావ్ కౌంటింగ్ కేంద్రంలో ఫోన్‌ను ఉపయోగించి ఓటీపీ జనరేట్ చేసి ఈవీఎంను తెరిచారన్నది శివసేన ఉద్ధవ్ వర్గం ఉపయోగం. ఈ ఫోన్‌ను ఎంపీ బంధువులు ఇంకా ఉపయోగిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు ఉద్ధవ్ వర్గం నేతలు. కౌంటింగ్ కేంద్రంలో ఫోన్ ఉపయోగించారన్నదానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఫోన్ ద్వారా ఈవీఎంలు తెరిచే అవకాశమే ఉంటే.. రవీంద్ర వైకర్ 48 ఓట్ల మెజార్టీతో ఎందుకు ఆగిపోతారని, భారీ మెజార్టీ సాధించేలా ఈవీఎంలను హ్యాకింగ్ చేసి ఉండేవారు కదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈవీఎంను తెరిచేందుకు ఓటీపీని జనరేట్ చేశారన్న ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. డేటా ఎంట్రీకి తప్ప అసలు ఈవీఎంలను తెరిచేందుకు ఓటీపీ అవసరమే లేదని చెప్పింది. గోరేగావ్ కౌంటింగ్ కేంద్రంపై తప్పుడు కథనం ప్రచురించిన పత్రికకు పరువు నష్టం నోటీసు పంపామని తెలిపింది.

ఇంటర్నెట్ లేకుండా ఈవీఎం హ్యాకింగ్ అసాధ్యం..
మస్క్ ట్వీట్, మహారాష్ట్ర ఘటనపై కేంద్రం స్పందించింది. హ్యాకింగ్‌పై ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ మస్క్ చాలా తేలిగ్గా ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. ఈవీఎంలకు ఇతర ఏ పరికరాలతో అనుసంధానం ఉండదని, విద్యుత్ సరఫరాతో పని లేకుండా బ్యాటరీ ఆధారంగా పని చేస్తాయని, కనెక్టివిటీ, బ్లూ టూత్, వైఫై, ఇంటర్నెట్ లేకుండా హ్యాకింగ్ అసాధ్యమని, వీటికి రీ ప్రోగ్రామింగ్ కూడా ఉండదని మాజీ మంత్రి తేల్చి చెప్పారు. పేపర్ బ్యాలెట్లతో పోలిస్తే ఇది విశ్వసనీయమైన ఓటింగ్ పద్ధతని స్పష్టం చేశారు. అవసరమైతే మస్క్‌కు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

టెస్లా కార్లను కూడా హ్యాక్ చేయవచ్చని మస్క్ కు కౌంటర్..
సాధారణ కంప్యూటర్లు వాడి, ఇంటర్నెట్‌కు అనుసంధానించేలా తయారు చేసిన ఈవీఎంలను ఉపయోగించే అమెరికా, ఇతర దేశాలకు మస్క్ వ్యాఖ్యలను అన్వయించవచ్చు కానీ భారత్‌లో ఉపయోగించే ఈవీఎంలకు కాదని అన్నారు. రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యల తర్వాత మస్క్ దేన్నయినా హ్యాక్ చేయవచ్చు అంటూ మరో ట్వీట్ చేశారు. అయితే టెస్లా కార్లను కూడా హ్యాక్ చేయవచ్చని ఎవరైనా చెప్పొచ్చంటూ రాజీవ్ చంద్రశేఖర్ కౌంటర్ వేశారు. కాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ టోస్టర్ వంటి వాటిని హ్యాక్ చేయలేమని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. మస్క్ వ్యాఖ్యలను సమర్థిస్తున్న రాహుల్ గాంధీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు.

ఎలాన్ మస్క్ వ్యాఖ్యలను మరో కోణంలో చూడాలని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. టెస్లా కార్లను భారత్‌లో అమ్మకాలకు వీలుగా దిగుమతి సుంకం తగ్గించాలని మస్క్ చేస్తున్న విజ్ఞప్తిని భారత్ పట్టించుకోవడం లేదని, అలాగే చైనాలో తయారుచేసి భారత్‌లో అమ్ముతామన్న ప్రతిపాదననూ తోసిపుచ్చిందని, భారత్‌లో తయారీ యూనిట్ పెట్టాల్సిందేనని మస్క్‌కు షరతు విధించిందని.. ప్రపంచాన్ని శాసిస్తున్నట్టుగా తనకు తాను భావించుకునే మస్క్.. భారత్ నిబంధనలపై ఆగ్రహంతో బీజేపీని ఇరుకున పెట్టేందుకు అదను చూసి ఈవీఎంలపై ఆరోపణలు చేశారని విశ్లేషిస్తున్నారు.

Advertisement

కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు మస్క్ ఉచ్చులో పడరాదని సూచిస్తున్నారు. అలాగే ఈవీఎంలు హ్యాక్ చేయగలిగితే, బీజేపీపై చేసే ఆరోపణలు నిజమైతే… 370 స్థానాలు సాధించాలన్న లక్ష్యాన్ని ఎందుకు సాధించలేకపోయిందని ప్రశ్నిస్తున్నారు. అయితే మరోవైపు ఎన్నికల ప్రక్రియ కోసం 60లక్షల ఈవీఎంలను దిగుమతి చేసుకున్నారని, వాటిలో 40లక్షలే ఉపయోగించారని, మిగిలిన 20లక్షల ఈవీఎంలు ఏమయ్యాయని కొన్ని పార్టీలు, కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే కేంద్రం కానీ, ఈసీగానీ దీనిపై స్పందించడం లేదు. మొత్తంగా గతంతో పోలిస్తే ఈ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ఈవీఎంలపై రచ్చ ఎక్కువగా ఉందనేది నిజం.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Technology

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరు గ్రూప్‌లో చేరడానికి ముందే అన్నీ తెలుసుకోవచ్చు!

Published

on

Whatsapp New Feature: వాట్సాప్‌ దీని గురించి తెలియని వారంటూ ఉండరేమో. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు చాటింగ్‌లు, వీడియోలు, మెసేజ్‌లతో మునిగి తేలుతుంటారు. వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. వీరి కోసం మెటా అనేక ఫీచర్లను విడుదల చేస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా వాట్సాప్‌లో ఓ కొత్త ఫీచర్‌ని చేర్చింది. నిజానికి, గ్రూప్ డిస్క్రిప్షన్ ఫీచర్ కమ్యూనిటీల్లో భాగమైంది. ఈ ఫీచర్ సహాయంతో వినియోగదారులు ఇప్పుడు గ్రూప్‌లో చేరడానికి ముందే దాని గురించిన సమాచారాన్ని పొందుతారు.

వాట్సాప్ అందుకున్న అప్‌డేట్‌ల గురించి సమాచారాన్ని అందించే ప్లాట్‌ఫారమ్ అయిన WABetaInfo, గ్రూప్ డిస్క్రిప్షన్ ఫీచర్ ఇప్పుడు వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తోందని తెలిపింది. ఈ కొత్త మార్పు iOS వెర్షన్ 24.16.75లో వచ్చింది.

ఈ ఫీచర్ ఇలా పని చేస్తుంది:

ఇప్పుడు ఈ క్రొత్త ఫీచర్ పని గురించి మాట్లాడినట్లయితే, ఇంతకు ముందు గ్రూప్‌లో వ్యక్తులను జోడించినప్పుడు గ్రూప్‌ నినాదం, ఇది దేని కోసం సృష్టించబడిందో తెలుసుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ వచ్చిన తర్వాత గ్రూప్‌లో ఏ వ్యక్తిని యాడ్ చేసే ముందు అతను గ్రూప్‌కు సంబంధించిన వివరణను పొందుతాడు. దీంతో ఆ వ్యక్తి తనను గ్రూప్‌లో చేర్చుకోవాలనుకుంటున్నాడో లేదో అర్థం చేసుకోవచ్చు.

మీ సమాచారం కోసం ప్రస్తుతం ఈ కొత్త గ్రూప్ డిస్క్రిప్షన్ ఫీచర్ iOS యాప్ వెర్షన్‌లో అందుబాటులో ఉంది. అటువంటి పరిస్థితిలో ఆపిల్ వినియోగదారులు వాట్సాప్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా ఈ కొత్త ఫీచర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఇతర వినియోగదారుల కోసం ఈ ఫీచర్ వచ్చే వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

ఈ ఫీచర్ పరిచయంతో వినియోగదారులు ఇప్పుడు గ్రూప్‌ క్రియాశీలత, దాని ప్రయోజనం గురించి ముందుగానే తెలుసుకోగలుగుతారు. దీంతో గ్రూపులో చేర్చుకోవాలా వద్దా అన్నది తన ఇష్టానుసారం. అదే సమయంలో మెటా వాట్సాప్‌లోని ప్రొఫైల్ చిత్రంలో యానిమేటెడ్ అవతార్ కోసం కొత్త ఫీచర్‌ను కూడా సిద్ధం చేస్తోంది. ఇది త్వరలో వినియోగదారులందరికీ అమల్లోకి రానుంది.

Continue Reading

Technology

WhatsApp Context Card : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. కొత్త గ్రూపు సభ్యుల సేఫ్టీ కోసం కాంటెక్స్ట్ కార్డులు!

Published

on

WhatsApp Context Card : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. గ్రూపు మెసేజింగ్ ఫీచర్ల భద్రతను మెరుగుపర్చేందుకు రూపొందించిన కొత్త ఫీచర్ రిలీజ్ చేసింది. మెటా యాజమాన్యంలోని మెసేజ్ ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు గుర్తుతెలియని యూజర్ల ద్వారా గ్రూపునకు యాడ్ చేసినప్పుడు వెంటనే ఒక అలర్ట్ మెసేజ్ డిస్‌ప్లే అవుతుంది.

గ్రూప్ నుంచి నిష్క్రమించడానికి షార్ట్‌కట్‌తో పాటు, వాట్సాప్ వినియోగదారులకు వారు జోడించిన గ్రూప్ గురించి సంబంధిత సమాచారాన్ని అందించడానికి ఈ ఫీచర్ రూపొందించింది. అపరిచితులను గ్రూపులకు యాడ్ చేయకుండా నిరోధించడానికి వినియోగదారులను అనుమతించే సెట్టింగ్‌ సర్వీసును ఇప్పటికే అందిస్తుంది.

వాట్సాప్ గ్రూప్ సేఫ్టీ కాంటెక్స్ట్ కార్డ్‌లు :
అందిన వివరాల ప్రకారం.. వాట్సాప్ గ్రూప్ చాట్‌ల కోసం కొత్త కార్డ్‌ను విడుదల చేస్తోంది. యూజర్లు తమ కాంటాక్ట్‌లలో లేని యూజర్లను గ్రూప్‌కు యాడ్ చేసిన తర్వాత ఈ కార్డు డిస్‌ప్లే అవుతుంది. ఈ కార్డ్ చాట్ విండోలో కనిపిస్తుంది. గ్రూపు గురించిన సమాచారాన్ని కలిగి ఉంటుంది. వినియోగదారులకు గ్రూపు గురించి సందర్భాన్ని అందిస్తుంది. గ్రూప్ చాట్‌ల కోసం కొత్త కాంటెక్స్ట్ కార్డ్‌లు గ్రూప్‌కి యాడ్ చేసిన వాట్సాప్ యూజర్ నేమ్ ప్రదర్శిస్తాయి. వాట్సాప్ ఫీచర్‌ను చూపించే గ్రూపు స్క్రీన్‌షాట్, కార్డ్ యూజర్ సెట్ చేసిన పేరును ప్రదర్శిస్తుందని వెల్లడిస్తుంది.

గుర్తుతెలియని యూజర్ గ్రూప్ చాట్‌లో మెసేజ్ పంపినప్పుడు టిల్డే చిహ్నం (~)తో సూచిస్తుంది. వినియోగదారులు గ్రూపునకు ‘కాంటాక్టులో లేని యూజర్ కనెక్ట్ అయ్యాడు’ అని కూడా ప్రాంప్ట్ మెసేజ్ వస్తుంది. కాంటెక్స్ట్ కార్డ్ కొత్త సభ్యునికి గ్రూపులో క్రియేట్ చేసిన యూజర్ పేరును కూడా సూచిస్తుంది.

వాస్తవానికి, గ్రూప్ క్రియేటర్ వాట్సాప్ సెట్టింగ్‌లకు యాడ్ చేసిన దానిపై ఆధారపడి ఉంటుంది. వాట్సాప్ యూజర్లు ఉండకూడదనుకునే గ్రూపులో జాయిన్ అయితే సమస్యాత్మక కంటెంట్‌ను రిపోర్టు చేయడానికి కాంటెక్స్ట్ కార్డ్ సెక్యూరిటీ టూల్స్ ఆప్షన్ కలిగి ఉంటుంది. వాట్సాప్ యూజర్లు గ్రూపు నుంచి నిష్క్రమించడానికి నిష్క్రమించు బటన్‌ను కూడా క్లిక్ చేయొచ్చు.

Advertisement

ప్రస్తుత వాట్సాప్ గ్రూప్ సెక్యూరిటీ యాక్షన్స్ :
2019లో, వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్‌ల ద్వారా అపరిచితులను గ్రూప్‌లో జాయిన్ కాకుండా నిరోధించడానికి యూజర్లను అనుమతించే Settings > Account> Privacy > గ్రూపుల కింద ఈజీ ఆప్షన్ ప్రవేశపెట్టింది. ఎనేబుల్ చేసినప్పుడు వినియోగదారులు తమ కాంటాక్ట్ లిస్ట్ వెలుపల ఉన్న యూజర్ వారిని గ్రూప్‌కి యాడ్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు గ్రూప్‌లలో జాయిన్ అయ్యేందుకు ఇన్విటేషన్ అందుకుంటారు.

Continue Reading

Technology

విజయవంతమైన పుష్పక్ విమానం

Published

on

పునర్‌ వినియోగానికి అవకాశం ఉండే అంతరిక్ష వాహనం (రీ యూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌) ‘పుష్పక్‌’ను ఇస్రో మూడోసారి ప్రయోగించి పనితీరును సమీక్షించింది.
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెళ్లకెర తాలూకా నాయకనహట్టిలోని డీఆర్‌డీవో ఆవరణలో ఆదివారం ఈ సన్నాహక పరీక్షను నిర్వహించారు. ప్రయోగంలో భాగంగా వాయుసేనకు చెందిన చినూక్‌ హెలికాప్టర్‌.. పుష్పక్‌ను 4.5 కి.మీ. ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టింది.

స్వయంచాలిత వ్యవస్థల ద్వారా రన్‌వేను కనుగొన్న పుష్పక్‌.. నిర్దేశిత ప్రదేశంలో సురక్షితంగా దిగింది. రన్‌వేపై తొలుత దాని వేగం గంటకు 320 కి.మీ. ఉండగా.. పారాచూట్‌ సాయంతో 100 కి.మీ.కు వేగాన్ని కుదించుకుంది. అనంతరం బ్రేకులు ఉపయోగించుకుని నిశ్చల స్థితికి చేరుకుంది. పుష్పక్‌ చివరి సన్నాహక ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది.

Continue Reading
Andhrapradesh3 weeks ago

విజయవాడ వాసులకు అద్దిరిపోయే తీపికబురు.. ఏపీకి ఇది కదా కావాల్సింది.!

Latest3 weeks ago

ఏపీ మంత్రివర్గ భేటీ – వాలంటీర్లు, ఉద్యోగుల పీఆర్సీపై కీలక నిర్ణయం..!!

Education3 weeks ago

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఐఐటీ.. అన్నీ కుదిరితే అక్కడే.. ఎన్నాళ్లకెన్నాళకు!

Spiritual3 weeks ago

తిరుమల లడ్డూ వివాదంతో అయోధ్య రామాలయం సంచలన నిర్ణయం!

Andhrapradesh2 months ago

Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా?

Andhrapradesh2 months ago

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఆర్జిత సేవా టికెట్లు విడుదల ఎప్పుడంటే..?

Andhrapradesh2 months ago

Musi River: వివాదంగా మారిన మూసీ బ్యూటిఫికేషన్.. తమ ఇళ్లను కూల్చివేయొద్దంటూ..

Spiritual2 months ago

కృష్ణాష్టమి అంటే కన్నయ్య జన్మదినమే.. ఈ ప్రదేశాలలో జన్మాష్టమి పండుగను భిన్నంగా జరుపుకుంటారు

National2 months ago

స్తంభం పైన ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. ఇంతలో అటుగా వచ్చిన ఓ పక్షి…

National2 months ago

Railway Jobs: క్రీడాకారులకు సదావకాశం.. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

National2 months ago

ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ఏం సందేశం ఇచ్చారో తెలుసా?

Andhrapradesh2 months ago

NTR Health University: ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలకు యాజమాన్య కోటా నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

International2 months ago

యుద్ధం వస్తే ఎలా? టెక్నాలజీపరంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌ ఎవరు స్ట్రాంగ్‌?

Hashtag2 months ago

Pen Hospital: పెన్నుల కోసం ఓ స్పెషల్ హాస్పిటల్.. ఇచ్చట అన్ని పెన్నులు రిపేర్ చేయబడును..!

International2 months ago

రష్యాలోకి 30 కి.మీ. దూసుకెళ్లిన యుక్రెయిన్ సైన్యం.. సేఫ్ జోన్లకు 76 వేల మంది తరలింపు

National2 months ago

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలో హైఅలర్ట్ .. ఎర్రకోట వద్ద పటిష్ఠ భద్రత

National2 months ago

UPSC Civils Mains 2024: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసిందోచ్

Andhrapradesh2 months ago

AP Police Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్‌

International2 months ago

ఇజ్రాయెల్​పై దాడికి ఇరాన్‌ సన్నాహాలు – అణు జలాంతర్గామిని పంపిస్తున్న అమెరికా – Iran backed Attack On Israel

International2 months ago

‘రాక్షసి వెళ్లిపోయింది’ – హసీనాపై ముహమ్మద్ యూనుస్​ ఘాటు వ్యాఖ్య – Yunus Comments On Hasina

International2 months ago

Donald Trump : ‘ఎక్స్‌’లో డొనాల్డ్ ట్రంప్‌తో ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ.. ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Technology2 months ago

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరు గ్రూప్‌లో చేరడానికి ముందే అన్నీ తెలుసుకోవచ్చు!

National2 months ago

2036 నాటికి భారత జనాభా 152 కోట్లు – పెరగనున్న మహిళలు – తగ్గనున్న యువత – INDIA POPULATION 2036

National2 months ago

ఐఐటీ మద్రాస్ దేశంలోనే బెస్ట్​- వరుసగా ఆరోసారి- టాప్​ కాలేజీల లిస్ట్​ ఇదే! – NIRF Ranking 2024

International2 months ago

Israel Hamas war : గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 100మందికిపైగా మృతి

National2 months ago

PM Modi: భారీ వర్షంలో రైతులతో ప్రధాని మోదీ భేటీ.. సింప్లిసిటీ చూస్తే వావ్ అనాల్సిందే.. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి..

Telangana2 months ago

Yadadri: యాదగిరిగుట్టలో మరిన్ని మార్పులకు ప్రభుత్వం సిద్ధం..!

Andhrapradesh2 months ago

PG Medical Courses: మెడికల్‌ విద్యార్ధులకు బిగ్‌షాక్‌.. పీజీ వైద్య విద్య ఫీజులు పెంచిన సర్కార్!

Andhrapradesh2 months ago

Tungabhadra Dam: 69 ఏళ్ల చరిత్రలో ఫస్ట్‌టైమ్‌ ప్రమాదం.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు

Cricket2 months ago

Team India: ఇకపై టెస్ట్ జట్టులో కనిపించని ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు.. చివరి మ్యాచ్ ఎప్పుడు ఆడారంటే?

Business5 months ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career5 months ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

National6 months ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

Business5 months ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

News5 months ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

Business5 months ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

International5 months ago

‘పోస్ట్​ స్టడీ వర్క్​ ఆఫర్​ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్​ వెళ్లే విద్యార్థులకు గుడ్​ న్యూస్​ – UK Graduate Route Visa

Education5 months ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

National5 months ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

Andhrapradesh4 months ago

జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

Andhrapradesh5 months ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

Telangana5 months ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

Spiritual5 months ago

Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

Crime News5 months ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

National5 months ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Railways4 months ago

పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే

National5 months ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

Andhrapradesh5 months ago

పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

National4 months ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

National5 months ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

Andhrapradesh5 months ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

Andhrapradesh5 months ago

వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

Political5 months ago

పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

Political4 months ago

కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

Andhrapradesh4 months ago

సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల

Andhrapradesh5 months ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

Andhrapradesh5 months ago

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

National5 months ago

Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!

Weather4 months ago

జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…

Cinema7 months ago

Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.

Trending