Hashtag
ఇంట్లోకి దూరి లేపేస్తాం.. మాటల్లోనే కాదు.. చేతల్లోనూ చూపిన భారత్
యావత్ ప్రపంచం ఏదో ఒక రూపంలో ఉగ్రవాద ముప్పు ఎదుర్కొంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కు ఈ ముప్పు దశాబ్దాలుగా ఉంది. భారత్లో విధ్వంసాలు సృష్టించి అశాంతి నెలకొల్పడం, ఆర్థికంగా పతనం చేయడమే తమ ఏకైక విదేశీ విధానంగా పొరుగుదేశం పాకిస్తాన్ పెంచిపోషించిన సీమాంతర ఉగ్రవాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై సహా దేశంలోని అనేక నగరాలు ఉగ్రవాద దాడులను ఎదుర్కొన్నాయి. ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంట్పైనే ఉగ్రవాదులు దాడికి తెగబడ్డ ఘటనలను దేశం చూసింది. ముంబై మారణహోమం యావత్ ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ఆ దాడిలో ప్రాణాలతో చిక్కిన కసబ్ కారణంగా పాకిస్తాన్ పన్నాగం ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇలాంటి వరుస ఉగ్రవాద దాడులతో దేశంలోని ఏమూల ఏక్షణం ఏ బాంబు పేలుతుందోన్న భయం ప్రజల్లో నెలకొంది. మరీ ముఖ్యంగా నగరాల్లో ప్రజలు రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లాలంటేనే భయంతో వణికిపోయే పరిస్థితులు ఉండేవి.
ఈ ఉగ్రవాదం సృష్టించే భయోత్పాతం మనుషుల ప్రాణాలకే కాదు, యావద్దేశ ఆర్థిక పురోగతికే ప్రమాదంగా మారింది. అయితే ఇదంతా గతం. భద్రతా బలగాల కళ్లుగప్పి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సరిహద్దులు దాటి వచ్చే సీమాంతర ఉగ్రవాదులైనా, పాకిస్తాన్ ఆదేశాలతో దేశంలోనే ఉగ్రవాద భావజాలాన్ని పెంపొందించే సంస్థలైనా భారత ప్రభుత్వ చర్యలతో వణికిపోయే పరిస్థితి నెలకొంది. ఇంకా చెప్పాలంటే భారత్లో విధ్వంసాలకు పథక రచన చేసే అనేక మంది పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల అగ్రనేతలు అనూహ్యంగా అంతమైపోతున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో కాల్పులకు గురవుతున్నారు. ఆ గుర్తుతెలియని వ్యక్తులు ఎవరన్నది భారత ప్రజలందరికీ తెలుసు. “భారత్లో విధ్వంసానికి ప్రయత్నించేవారు ఎవరైనా సరే.. ఎక్కడున్నా సరే.. ఇంట్లోకి దూరి మరీ లేపేస్తాం (ఘర్ మే ఘుస్గే మారేంగే)” వంటి వ్యాఖ్యలు భారత ప్రధాని నోటి నుంచి వస్తున్నాయి. ఇవి కేవలం మాటలే కాదు, చేతల్లోనూ జరుగుతోందని అని చెప్పేలా పాకిస్తాన్లో భారత వ్యతిరేక శక్తులు తుడిచిపెట్టుకుపోతున్నాయి.
నాటికీ.. నేటికీ..
నాడు ఉగ్రవాదులు దేశంలో ఎప్పుడు ఎలా విరుచుకపడతారో తెలియని భయాందోళనల్లో భారత్ ఉంటే, నేడు భారత రహస్య ఏజెంట్లు ఏ రూపంలో వచ్చి అంతం చేస్తారోనని భారత్కు వ్యతిరేకంగా విధ్వంసాలకు కుట్రలు పన్నే ఉగ్రవాదులు భయాందోళనలో ఉన్నారు. ఈ మార్పు పదేళ్ల కాలంలో వచ్చింది. అంతకు ముందు సెక్యులరిజం పేరుతో, కొన్ని వర్గాల మెప్పు కోసమో ఉగ్రవాదంపై ఉక్కపాదం ఉండేది కాదు. దాడులు జరిగిన తర్వాత విచారణ జరపడానికే దర్యాప్తు సంస్థలు అష్టకష్టాలు పడాల్సిన స్థితి నుంచి, కుట్రలను ముందుగానే పసిగట్టి కుట్రదారులను ఏరిపారేసే స్థితికి భారత్ చేరుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తమ స్థావరంగా మార్చుకుని భారత్లో దాడులకు, విధ్వంసాలకు పాల్పడుతున్న ఉగ్రవాద స్థావరాలపై మొట్టమొదటి సారిగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి గట్టి జవాబు ఇచ్చింది. ఈ మార్పు రాత్రికి రాత్రే వచ్చిందేమీ కాదు. ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా అనుసరిస్తున్న కఠిన వైఖరితో పాటు అమలు చేస్తున్న విధానాలు ఇందుకు దోహదం చేశాయి. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా భారత్ నిరూపించగల్గింది. పాకిస్తాన్ అభివృద్ధి కోసం కొన్ని దేశాలు ఇచ్చే నిధులు, ఆయుధాలను ఉగ్రవాదం కోసం వినియోగిస్తున్న తీరును ఎండగట్టింది. కశ్మీర్లో జరిగే ఎన్కౌంటర్లలో చనిపోతున్న ఉగ్రవాదుల చేతుల్లో లభించే అధునాతన ఆయుధాలన్నీ పాకిస్తాన్ మిలటరీ సరఫరా చేస్తున్నవేనని ఆధారాలతో సహా నిరూపించగలిగింది.
భారత్లోకి జరిగే చొరబాట్లను అడ్డుకోవడం, చొరబడినవారిని ఏరిపారేయడం మన భద్రతా బలగాలకు కొత్తేమీ కాదు. సరిహద్దులు దాటి.. కుట్రదారులను అంతం చేయడం కూడా కొత్త కాకపోవచ్చు. రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (R&AW)ను ఏర్పాటు చేసిన ఉద్దేశమే సరిహద్దుల అవతల శత్రువులను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడం కోసం. కానీ ఇంత పెద్ద సంఖ్యలో వరుసపెట్టి శత్రువులను తుదమొట్టించడం మాత్రం ఇదే ప్రథమం. బ్రిటీష్ పత్రిక ‘ది గార్డియన్’లో ఏప్రిల్ 4న ప్రచురితమైన ఓ వార్తాకథనమే ఇందజుకు నిదర్శనం. పాకిస్తాన్లో జరుగుతున్న ఉగ్రవాద నేతల వరుస హత్యల వెనుక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నారంటూ ఆ కథనం ఆరోపించింది. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, భారత వ్యతిరేక శక్తులు ఎక్కడున్నా సరే వారి ఇళ్లళ్లోకి దూరి మరీ అంతం చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. బిహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాలను మోదీ తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ పాలనలో ఉగ్రవాదం, వేర్పాటువాదం వంటి మొక్కలకు నీరు పోసి పెంచి పెద్దచేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలోనే వామపక్ష తీవ్రవాదం (నక్సలిజం) దేశ అంతర్గత భద్రతకు ఒక పెను సవాలుగా మారిందని ఆరోపించారు.
ఉగ్రవాదంపై ఉక్కుపాదమే విధానంగా..
ప్రధాని మోదీ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచార సభల్లోనే కాదు, అంతర్జాతీయ వేదికలపై సైతం ఉగ్రవాదంపై తమ వైఖరిని చాటిచెబుతూ వచ్చారు. భారత్లో కాంగ్రెస్ అనుసరించిన విధానాలనే కాదు, ప్రపంచ నేతల ఆత్మవంచనను కూడా పలు సందర్భాల్లో ఎండగట్టారు. జీ-20 సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఉగ్రవాదం అతి పెద్ద సవాల్ అన్న విషయాన్ని ప్రపంచం ఇప్పుడు గ్రహిస్తోంది. ఏ కారణంతోనైనా, ఏ రూపంలోనైనా సరే ఉగ్రవాదం మానవత్వానికి వ్యతిరేకం. అలాంటప్పుడు మనమంతా ఉగ్రవాదంపై కలసికట్టుగా కఠినంగా వ్యవహరించాలి. అయితే ఉగ్రవాదానికి నిర్వచనం విషయంలో ప్రపంచ దేశాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం దురదృష్టకరం” అన్నారు. బ్రిక్స్ సమావేశంలో మాట్లాడుతూ.. “ఉగ్రవాదం, తీవ్రవాదం, రాడికలైజేషన్ వంటివి కేవలం ప్రాంతీయంగానో, ఒకట్రెండు దేశాలతో పరిమితమైన సమస్య కాదు. ఇవి యావత్ ప్రపంచ శాంతికి విఘాతం కల్గించే అంశాలు. వాటి కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి కుంటుపడుతుంది. మానవత్వానికే పెను ముప్పుగా మారుతోంది. ఈ ముప్పుపై మనమంతా కలసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అన్నారు. ఉగ్రవాద సంస్థలకు అందుతున్న ఆర్థిక సహాయాన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు. అలాగే ఉగ్రవాదులకు జరిగే మారణాయుధాల సరఫరా, ఇతర సాంకేతిక సహకారంపై కూడా దృష్టి పెట్టి అడ్డుకోవాలని కోరారు. ఉగ్రవాదులను పెంచి పోషించి, ఆర్థిక, ఆయుధ వనరులు సమకూర్చే దేశాలు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరం అని నొక్కి చెప్పారు.
అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న సమయంలో 2016లో అమెరికా పర్యటన చేపట్టిన మోదీ.. న్యూక్లియర్ సెక్యూరిటీ (అణు భద్రత) అంశంపై జరిగిన చర్చలో సైతం ఉగ్రవాదం గురించి ప్రస్తావించారు. “ఉగ్రవాదం కొన్ని సరిహద్దులకు లోబడి లేదు. ఇదొక గ్లోబల్ నెట్వర్క్. కానీ దాన్ని ఎదుర్కొనేందుకు ఆయా దేశాలు, దేశ స్థాయిలోనే ప్రయత్నిస్తున్నాయి. నిజానికి ఉగ్రవాదంపై ప్రపంచస్థాయిలో పోరాటం జరగితే తప్ప ఆ ముప్పును అడ్డుకోలేం. ఉగ్రవాదాన్ని అరికట్టకుండా అణు ఉగ్రవాదం ముప్పును తొలగించలేం. ఉగ్రవాదం మన సమస్య కాదు అని ఎవరూ అనుకోడానికి వీల్లేదు. ఉగ్రవాదానికి తన, మన భేదాల్లేవు” అంటూ లోతుగా సమస్యను విశ్లేషించారు. అలాగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్లో కూడా పాకిస్తాన్ తమ దేశంలో ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తూ కాశ్మీర్ లోయలో అశాంతి సృష్టిస్తుందో వివరించారు. ఇలా ఒక అవకాశం ఉన్న ప్రతి చోటా ప్రధాని మోదీ ఉగ్రవాదంపై మాట్లాడుతూ వచ్చారు. ఉగ్రవాదంపై భారత వైఖరి కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడి ప్రణాళికతో సంయుక్త కార్యాచరణతో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం సహా ఏ రూపంలో సహాయం అందకుండా చూడాలని మోదీ గట్టి పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. వాటి ఫలితమే ఉగ్రవాదుల ఖార్ఖానా పాకిస్తాన్లో కూర్చుకుని భారత్కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న ఉగ్రవాద సంస్థల అగ్రనేతలు వరుసగా హతమవడం.
Hashtag
Pen Hospital: పెన్నుల కోసం ఓ స్పెషల్ హాస్పిటల్.. ఇచ్చట అన్ని పెన్నులు రిపేర్ చేయబడును..!
మాటల్లో చెప్పలేని భావాలకు కలమే ఓ వరం. ధైర్యంగా అడగలేని ప్రశ్నలకు కలమే ఓ సమాధానం. కన్నీరు తీర్చలేని సమస్యలకు కలమే ఓ పరిష్కారం. ఎవరూ నిలదీయలేని వికృత చేష్టలకు కలమే ఓ చెప్పుదెబ్బ. బారసాలలో పిల్లల ముందుంచే వస్తువులలో కలం కూడా ఒకటి. డబ్బు, బంగారం కాకుండా కలం పట్టుకుంటే ఆ బిడ్డ గొప్ప విద్యావంతుడవుతాడని నమ్ముతారు. అన్నట్లు కోర్టులో నేరస్తుడికి మరణశిక్ష విధించిన సందర్భంలో ఆ తీర్పు చదివిన వెంటనే.. న్యాయమూర్తి ఆ తీర్పు రాసిన పెన్ను పాళీని వంచేసి విరగొట్టే సంప్రదాయము కోర్టుల్లో ఉండేది. పలువురికి కలం ఒక సెంటిమెంట్ కూడా. అందుకే కలం అంటే ప్రాణంగా ఇష్టపడేవారు ఉన్నారు. బ్రాండెడ్ వాచీలు, బట్టలు, ఇతర వస్తువులు ఎలాగో అలాగే విలువైన పెన్నులకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. పెన్నుని కొంతకాలం వాడేసి పారేసే వారు కొందరైతే… తమ సెంటిమెంట్ గా వాటిని కలకాలం ఉంచుకునే వారు మరికొందరు. అలాంటి వారి కోసమే శ్రీకాకుళంలో ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది పెన్ హాస్పిటల్.
నేటి తరానికి పాలి పెన్నులు… పెన్నులలో ఇంకు పోసుకోవటo, పెన్నుని క్లీన్ చేసుకోవడం, నిబ్ పాడయితే దానిని మార్చుకోవటం వంటివి పెద్దగా తెలియదు. యూజ్ అండ్ త్రో యుగంలో ఉన్న నేటి యువత మొబైల్ ఫోన్ మొదలుకుని ఏ వస్తువునైనా ఏడాది వాడటం తరువాత దానిని పక్కన పడేసి కొత్త దానిని కొనుక్కోవడం పట్లే ఆసక్తి చూపుతున్నారు. కానీ శ్రీకాకుళంలో మాత్రం పెన్నులు పాడయితే దానిని హాస్పిటల్ కి తీసుకు వెళతారు. అదేంటి మనుషులు, పశువులు అయితే హాస్పిటల్ కి తీసుకు వెళతారు కానీ పెన్నులు బాగుచేసే చోటుని హాస్పిటల్ అంటారేoటని అనుకుంటున్నారా….? అయితే ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి.
ఇక్కడ కలానికి ఎనలేని గౌరవం ఇస్తారు. పైగా జీవమున్న మనుషులను, పశువులను ఎలా అయితే ట్రీట్ చేస్తారారో అలాగే అనేక భావోద్వేగాలు, సెంటిమెంట్లతో తమ వద్దకు వచ్చే పెన్నులను సున్నితంగానే ట్రీట్ చేస్తారు ఇక్కడ. అలాఅని ఈ పెన్ హాస్పిటల్ ఈ మధ్యకాలంలో వచ్చిందయితే కాదు.. 1975 నుంచి ఈ పెన్ హాస్పిటల్ శ్రీకాకుళం 2టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్వహిస్తున్నారు. పొట్నూరు రాజారావు అనే వ్యక్తి ఈ పెన్ హాస్పిటల్ కి ఆద్యడు. కరోనా సమయంలో అతను మరణించగా వారసుడుగా అతని కుమారుడు నాగరాజు స్టేషనరీ, గిఫ్ట్ ఆర్టికల్స్ అమ్మటంతో పాటు అందులోనే ఈ పెన్ హాస్పిటల్ ను నిర్వహిస్తూ వస్తున్నాడు. ఎంత కాస్ట్లి పెన్ అయినా తండ్రికి ఇచ్చిన మాట బట్టి ఫ్రీగానే రిపేర్ చేసి ఇస్తాడు నాగరాజు. కొత్త, పాత అని తేడా లేకుండా అన్ని రకాల పెన్స్ను సరిచేసి ఇవ్వడం వీరి స్పెషాలిటీ.
ఈ పెన్ హాస్పటల్లో పెన్నులకు రిపేర్ చెయ్యటమే కాదు రూపాయి నుంచి లక్ష రూపాయిలు విలువ చేసే పెన్ను వరకు అనేక రకాల పెన్నులు అమ్మకానికి ఉంటాయి. ఈ పెన్ హాస్పిటల్ లో షీఫర్స్, మౌంట్ బ్లాక్ ,క్రాస్, వాటర్ మెన్, పార్కర్, పిన్ లైన్, పెరి కార్డెన్ కంపెనీలకు చెందిన ఎంతో విలువైన దేశ విదేశాల పెన్నులు అమ్మకానికి ఉంటాయి. మనుషుల మాదిరిగానే జీరో సైజ్ పెన్నులు, A4 సైజ్ పేపర్ అంతా బరువు మాత్రమే ఉండే వెయిట్ లాస్ పెన్నులు ఉన్నాయి. 80 ఏళ్ల పాటు ఇంకు గాని, రీఫిల్ గాని మార్చాల్సిన పని లేకుండా వాడే ఇన్ఫినిటీ పెన్ ఇక్కడ ఓ ప్రత్యేకం. ఈ పెన్నులో ఇంకుకు బదులు కార్భనిక్ గ్యాస్ ఉంటుంది. ఈ పెన్ ధర రూ.20,700.
ఇక AK 47 బుల్లెట్ తో రూపొందించిన బుల్లెట్ పెన్ కూడా పెన్ లవర్స్ తో పాటు సాధారణ ప్రజానీకాన్ని సైతం ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. అటు 24 కేరట్స్ గోల్డ్ ప్లేటెడ్ తో రూపొందించిన షీఫర్స్ కంపెనీ పెన్ను ధర అక్షరాలా రూ.75 వేలు. అయితే ఇంత ధర పెట్టీ కొన్న పెన్నులకు, సాధారణ పెన్నులకు సౌలభ్యం, హ్యాండ్ రైటింగ్ పరంగా చాలా వ్యత్యాసం ఉంటుందని అంటున్నారు పెన్ హాస్పిటల్ నిర్వాహకులు. ఒకసారి ఈ పెన్నులకు అలవాటు పడితే వదలలేరని చెబుతున్నారు.
ముఖ్యంగా కవులు, రచయితలు తమకు సౌలభ్యంగా ఉన్న కలం విషయంలో ఎంత ధర అయినా వెనక్కి తగ్గరని అంటున్నారు. ఇక చాలా మంది తమ సొంతానికి వాడుకునేoదుకు ఇష్టపడి ఈ కాస్ట్లీ పెన్నులు కొనుగోలు చేస్తే….మరికొంతమంది తల్లిదండ్రులకు, ప్రేయసి, ప్రియులకి, పై అధికారులకు గిఫ్ట్ గా కొనుగోలు చేసి ఇస్తారని అంటున్నారు.
సిరా అనే ఇంధనంతో అక్షరం అనే ఆయుధాన్ని వెంటపెట్టుకొని ప్రపంచాన్ని జయించేది కలం. అందుకే ఆత్రేయ,ఆరుద్ర, ఓల్గా లాంటి ఎందరో ప్రముఖ రచయితలు, కవులు వారి రచనలను కలం పేర్లతో ప్రచురించి ఫేమస్ అయ్యారు. కలం స్నేహం పేరిట పరిచయాలు అవుతున్నారు.కలానికి కాలం చెల్లి కంప్యూటర్ కి దగ్గరైన ఈ రోజుల్లో శ్రీకాకుళంలో ఇంకా పెన్ హాస్పిటల్ ఆదరణ పొందటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Hashtag
బర్రె కోసం 10 కిలోల బంగారు చైన్ చేయించి.. దాని మెడలో వేసిన వ్యక్తి
అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి తల్లీదండ్రులు బంగారు గొలుసులు చేయిస్తుండడం చూస్తూనే ఉంటాయి. ఓ వృద్ధుడు మాత్రం తన బర్రెకి బంగారు గొలుసు చేయించాడు. గొలుసు అంటే ఏదో రూ.10 వేలదో తులం బంగారంతోనో చేయించింది కాదు. 10 కిలోల బంగారంతో చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజికి మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తన బర్రెకు గొలుసు తొడుగుతూ అతడు మురిసిపోయాడు. ఆ సమయంలో మరొకరు అతడికి సాయం చేశారు. మరో వ్యక్తి ఇందుకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించాడు. అయితే, ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వ్యక్తి.. ‘మాషాల్లా.. ఆవుకి 10 కిలోల బంగారు గొలుసు. దాని ధర ఎంతో?’ అని పేర్కొన్నాడు.
అయితే, వీడియోలో ఉన్నది బర్రె అయితే పోస్ట్ చేసిన వ్యక్తి మాత్రం ఆవు అంటూ రాసుకురావడం నెటిజన్లను తికమకకు గురిచేస్తోంది. ఆవుగా భావించి బర్రెకు 10 కిలోల బంగారం చేయించారా ఏంటి? అంటూ కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయినా పశువులకు అంత ఖర్చు చేసి బంగారు గొలుసులు చేయించడం ఏంటంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.
Hashtag
Mystery Mummy: ఈజిప్ట్ రాజు సమాధిలో ప్రవేశించిన 20 మంది మృతి.. 100 ఏళ్ల రహస్యం నేడు బట్టబయలు
ఈజిప్టు రాజులకు సంబంధించిన రహస్య కథలు ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉన్నాయి. పురాతన ఈజిప్ట్ రాజులలో ఒకరు టుటన్ఖామున్. ఈ రాజు సమాధి, చావు నేటికీ రహస్యంగానే ఉంది. ఈ రాజు సమాధి దగ్గరకు వెళ్లిన వారు ఇప్పటివరకు శపించబడ్డారని చెబుతూ ఉంటారు. టుటన్ఖామున్ సమాధిని రహస్యంగా తెరిచిన వ్యక్తులు మరణించారని నమ్ముతారు. 20 మంది టుటన్ఖామున్ సమాధిని తెరిచారని, వారందరూ మరణించారని పేర్కొన్నారు. ఈ రహస్య మరణాల పరంపర 1922 సంవత్సరంలో ప్రారంభమైంది. 100 సంవత్సరాల తర్వాత టుటన్ఖామున్ సమాధిని తెరిచిన తర్వాత ప్రజలు ఎలా చనిపోయారనే నిజం శాస్త్రవేత్తలకు తెలిసింది.
పురాతన ఈజిప్షియన్ గ్రంథాలు మమ్మీ అవశేషాలను భద్రపరిచే వ్యక్తులు ‘ఏ వైద్యుడు నయం చేయలేని వ్యాధితో మరణానికి గురయ్యారని’ చదివినట్లు లెడ్బైబుల్ నివేదించింది. అయినప్పటికీ అటువంటి భయంకరమైన హెచ్చరికలు ఉన్నాయి. అయితే జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్లో రాస్ ఫెలోస్ రాసిన కొత్త అధ్యయనం ప్రకారం 100 సంవత్సరాల క్రితం నిజంగా ఏమి జరిగింది, అంటే సమాధిని తెరిచిన తర్వాత ప్రజలు ఎందుకు మరణించారు అనే ప్రశ్నకు సమాధానం దొరికింది.
మనుషులు ఎలా చనిపోయారు?
సమాధి తెరచిన ప్రజల మరణాలకు కారణం యురేనియం, విషపూరిత వ్యర్థాలను కలిగి ఉన్న సహజ మూలకాల నుంచి వచ్చే రేడియేషన్ విషప్రయోగం అని నమ్ముతారు. ఈ కణాలు క్యాన్సర్కు కారణమవుతాయి. నివేదికల ప్రకారం 1922లో టుటన్ఖామున్ సమాధిలోకి ప్రవేశించిన మొదటి వ్యక్తిగా పేరుగాంచిన హోవార్డ్ కార్టర్ అనే పురావస్తు శాస్త్రవేత్త కూడా ఇదే విధంగా మరణించి ఉండవచ్చు. అంతేకాదు హాడ్కిన్స్ లింఫోమా కూడా సమాధిలోకి ప్రవేశించారు. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడి సుమారు 11 సంవత్సరాల పాటు క్యాన్సర్ తో పోరాడి మరణించారు.
వివిధ వ్యాధులతో మరణించారు
నివేదికల ప్రకారం సమాధిలోకి ప్రవేశించిన వ్యక్తులలో లార్డ్ కార్నార్వోన్ రక్తం విష తుల్యంగా మారడంతో మరణించాడు. అదేవిధంగా సమాధిలోకి ప్రవేశించిన ఇతర వ్యక్తులు కూడా వివిధ వ్యాధులతో మరణించారు. ఆ తర్వాత ఇది శాపంగా భావించడం మొదలు పెట్టారు. అయితే నేడు ఈ మరణాలకు గల అసలు కారణం, ఇప్పుడు ఆ నిజం ప్రపంచం ముందు వెల్లడైంది.
-
Business3 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career3 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
Business3 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
National4 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
News3 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business3 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
Education3 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National3 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
National3 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Andhrapradesh3 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Spiritual3 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
Telangana4 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Crime News3 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh2 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
National3 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Railways3 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National3 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh3 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh3 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
National3 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Political3 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Political3 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh3 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Andhrapradesh3 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
National3 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Weather3 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Andhrapradesh3 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Business4 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Education3 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Andhrapradesh3 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh3 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
National4 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh3 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
News3 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
International4 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
News4 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
International4 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Andhrapradesh3 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Spiritual3 months ago
చార్ ధామ్ యాత్రకు పొటెత్తిన భక్తులు.. గత ఏడాదికంటే ఎక్కువే!
-
Cinema6 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Andhrapradesh3 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Railways2 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh3 months ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
News3 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Cinema3 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
-
Andhrapradesh3 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
International3 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Andhrapradesh7 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Spiritual3 months ago
Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?
-
Business4 months ago
Bank Holidays June-2024: జూన్లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?