National
ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టొచ్చు? అసలేంటీ వ్యయ పరిమితి? – Lok Sabha Elections 2024
India Election Expenditure : నిష్పాక్షిక, పారదర్శక, ప్రలోభాలకు తావులేని ఎన్నికలే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువులు. అలాంటి స్ఫూర్తికి అంగబలం, ధనబలం రూపంలో అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ధనప్రభావం ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోంది. దీన్ని కట్టడి చేయడానికి ఎన్నికల కమిషన్ (ఈసీ) వద్ద ఉన్న అస్త్రమే అభ్యర్థుల వ్యయ నియంత్రణ. ఎన్ని చర్యలు చేపడుతున్నా, పార్టీలు పట్టపగ్గాల్లేకుండా ఎన్నికల్లో డబ్బులను ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా ఎన్నికలు నానాటికీ వ్యయభరిత మవుతున్నాయి.
ఏమిటి వ్యయ పరిమితి?
ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా అభ్యర్థులందరికీ సమానావకాశాలు కల్పించడానికే ఎన్నికల ప్రచార ఖర్చుపై ఈసీ నియంత్రణ పెట్టింది. ఒక అభ్యర్థి తన ఎన్నికల ప్రచారం కోసం చట్టబద్ధంగా వెచ్చించదగిన మొత్తాన్ని వ్యయపరిమితిగా పేర్కొంటారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 77(1) ప్రకారం, అభ్యర్థుల తమ ప్రచార ఖర్చుకు సంబంధించిన లెక్కలను పక్కాగా నిర్వహించాలి. నామినేషన్ వేసిన తేదీ నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు వీటిని కొనసాగించాల్సి ఉంటుంది. అందులో బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాలకు సంబంధించిన వ్యయాన్ని నమోదు చేయాలి. అభ్యర్థులంతా తమ వ్యయ ప్రకటనలను ఎన్నికలు ముగిశాక ఈసీకి సమర్పించాలి. అయితే, ఈ పరిమితి కేవలం అభ్యర్థుల ప్రచార ఖర్చులపై మాత్రమే ఉంది. ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు వెచ్చించే మొత్తాలపై ఎలాంటి ఆంక్షలు లేవు.
ప్రాతిపదిక ఏమిటి?
భారత ఎన్నికల సంఘం తరచూ ఈ వ్యయపరిమితిని సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ఖర్చు, ఓటర్ల సంఖ్య ఆధారంగా ఈ పరిమితిలో మార్పులు చేస్తుంది. ద్రవ్యోల్బణం కారణంగా ఏటా సరకులు, వస్తువుల ధరల్లో పెరుగుదలను అంచనావేయడానికి ధరల ద్రవ్యోల్బణ సూచీ (సీఎఫ్ఐ)ని ప్రామాణికంగా తీసుకుంటారు. 2014-15లో అది 240గా ఉండగా, 2021-22కు 317కు పెరిగింది. ఆ మేరకు 2022లో చివరిసారిగా అభ్యర్థుల వ్యయపరిమితిని ఈసీ సవరించింది.
పెరిగింది ఇలా
స్వతంత్ర భారత తొలి సార్వత్రిక ఎన్నికలు 1951-52లో జరిగినప్పుడు లోక్సభ అభ్యర్థి వ్యయ పరిమితి రూ.25వేలుగా ఉంది. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో దాన్ని రూ.10వేలుగా నిర్ణయించారు. 1971లో ప్రధాన రాష్ట్రాల్లో దాన్ని రూ.35వేలుగా ఈసీ నిర్ధరించింది. దానిని 1980లో రూ.లక్షకు పెంచింది. 1984లో దాన్ని పెద్ద రాష్ట్రాల్లో రూ.1.5లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.1.3 లక్షలుగా సవరించింది. 1-2 లోక్సభ స్థానాలున్న రాష్ట్రాలకు రూ.లక్షగా, చండీగఢ్ వంటి కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.50వేలుగా నిర్ణయించింది ఎన్నికల సంఘం. 1996లో వ్యయ పరిమితిని పెద్ద రాష్ట్రాల్లో రూ.4.5లక్షలకు పెంచారు. 1998లో దాన్ని ఏకంగా రూ.15లక్షలకు నిర్ణయించారు. 2004కు వచ్చే సరికి రూ.25లక్షలకు చేరింది. పదేళ్లపాటు ఈ పరిమితిలో ఎలాంటి సవరణలు చేయలేదు. 2014లో అది రూ.70లక్షలకు పెరిగింది. 2022లో మరోసారి ఈసీ ఈ పరిమితిలో సవరణ చేసింది.
ఇవి తప్పనిసరి
అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతా ద్వారా నిర్వహించాలి. ప్రచార సామగ్రిని సరఫరాదారులు, ముద్రణదారుల ఫొటోలతో ఒక డిక్లరేషన్ ఫారంను సమర్పించాలి. దీంతో పాటు రూ.10 లక్షలకు మించిన అనుమానాస్పద లావాదేవీల గురించి బ్యాంకులు సంబంధిత జిల్లా కలెక్టర్లకు తెలియజేయాలి. సమర్పించిన ఖర్చు వివరాల్లో తేడాలున్నా లేక నిర్దేశించిన పరిమితిని దాటినా, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 10(ఎ) కింద సంబంధిత అభ్యర్థిపై అనర్హతవేటు పడుతుంది.
పట్టుబడుతున్న సొమ్మూ భారీగానే
2019 ఎన్నికల సమయంలో నగదు, ఇతర వస్తువులు భారీగా పట్టుబడ్డాయి. వాటి విలువ రూ.3,475 కోట్లు. 2014 ఎన్నికల్లో పట్టుబడ్డ సొమ్ముతో పోలిస్తే ఇది మూడింతలు కావడం విశేషం. ధన ప్రభావ కట్టడి కోసం ఈసీ ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ ఎన్నికలు అంతకంతకూ ఖరీదవుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు ఏకంగా రూ.55,000 కోట్ల నుంచి 60,000 కోట్ల మధ్య ఖర్చుపెట్టాయని ‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్’ అనే స్వచ్ఛంద సంస్థ పరిశీలనలో తేలింది. దాదాపు 85 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులు రూ.40 కోట్లపైబడి వెచ్చించారని తెలిపింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులు రూ.30వేల కోట్లను ఖర్చుపెట్టినట్లు అంచనా. ఆ తర్వాత ఐదేళ్లకు జరిగిన ఎన్నికల్లో అది రెట్టింపు కావడం గమనార్హం. 1999లో ఈ వ్యయం రూ.10వేల కోట్లుగా ఉండగా, 2004కు అది రూ.14వేల కోట్లకు, 2009కి రూ.20వేల కోట్లకు, 2014లో రూ.30వేల కోట్లకు పెరిగింది.
ఎంత ఖర్చుపెట్టవచ్చు?
ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో లోక్సభ అభ్యర్థికి గరిష్ఠ వ్యయపరిమితిని రూ.95 లక్షలుగా నిర్ణయించారు. అరుణాచల్ప్రదేశ్, గోవా, సిక్కింలో దాన్ని 75 లక్షలుగా నిర్ధారించారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ పరిమితి రూ.75-95 లక్షల మధ్య ఉంది. ఇక పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ అభ్యర్థి రూ.40 లక్షలు, చిన్నరాష్ట్రాల్లో రూ.28 లక్షలు ఖర్చుపెట్టవచ్చు. అయితే అభ్యర్థుల ఈ ప్రచార ఖర్చులను పర్యవేక్షించడానికి ఈసీ వ్యయ పరిశీలకులతోపాటు రాష్ట్ర, కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు రంగంలోకి దిగుతాయి. ఇందులో ఫ్లయింగ్ స్క్వాడ్లు, నిఘా బృందాలు, వీడియో నిఘా బృందాలు ఉంటాయి.
International
భారత్, చైనాల మధ్య శాంతికి రోడ్ మ్యాప్.. సంబంధాల బలోపేతానికి ఆరు సూత్రాల ప్రణాళిక
సరిహద్దుల్లోని తూర్పు లడఖ్ వద్ద ఘర్షణతో భారత్, చైనాల మధ్య దాదాపు ఐదేళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు స్తంభించిపోయాయి. ఈ తరుణంలో సంబంధాల పునరుద్దరణకు ఇరు దేశాలూ ముందుడుగు వేశాయి. బీజింగ్లో బుధవారం భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధులు భేటీ అయ్యాయి. ఈ ప్రతినిధుల బృందానికి భారత్ నుంచి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా నుంచి విదేశాంగ మంత్రి వాంగ్ యీ నేతృత్వం వహించారు. చర్చల్లో శాంతి స్థాపనకు రోడ్ మ్యాప్, సంబంధాల బలోపేతానికి ఆరు సూత్రాల ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించారు. టిబేట్ మీదుగా కైలాస మానసరోవర యాత్ర పునరుద్ధరణ, నదీజలాల వివరాలను పంచుకోవడం, పరస్పరం వాణిజ్యం పెంపు వంటి అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు.
సానుకూల వాతావరణంలో ఈ చర్చలు సాగాయని, ఆరు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చైనా ప్రకటించింది. ‘దశల వారీగా రోడ్మ్యాప్పై అంగీకారానికి వచ్చాం… ఇది వివాదాస్పద అంశాలను పక్కనబెట్టి సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సమస్యలను సులభంగా పరిష్కరించడానికి సహకరిస్తుంది’ అని చైనా తెలిపింది.అయితే, భారత్ మాత్రం దానిని ప్రస్తావించకపోవడం గమనార్హం. సైనిక బలగాల ఉపసంహరణపై అక్టోబరు 21న జరిగిన ఒప్పందం అమలు ఫలితంగా సరిహద్దుల్లో పెట్రోలింగ్ మొదలైందని భారత్ పేర్కొంది.
మొత్తం ద్వైపాక్షిక సంబంధాల నుంచి సరిహద్దు వివాదాలను వేరుచూసి.. సరైన రీతిలో పరిష్కరించుకోవాలని తద్వారా ఆ ప్రభావం సంబంధాలపై పడకుండా చూసుకోవాలని నిర్ణయించారు. సముచిత, సహేతుక, పరస్పర ఆమోదయోగ్యమైన ప్యాకేజీలకు ఇకపైనా కట్టుబడి ఉండాలని, శాంతికి విఘాతం కలగకుండా చూసుకోవాలని తీర్మానించారు.
అలాగే, ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, సైనిక-దౌత్యపరమైన చర్చలను సమన్వయంతో మెరుగుపరచాలని నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో ప్రతినిధుల సమావేశాన్ని వచ్చే ఏడాది భారత్లో నిర్వహించాలని అవగాహనకు వచ్చారు. కాగా, సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు ప్రత్యేక ప్రతినిధులు 2003 నుంచి ఇప్పటివరకు 22సార్లు భేటీ అయ్యి చర్చలు జరిపారు. ప్రస్తుతం జరిగింది 23వ సమావేశం. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిని నెలకొల్పడం, ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్దరణ ఈ చర్చల లక్ష్యం.
వివాదాస్పద పాయింట్ల దెమ్చోక్, దెప్సాంగ్ల నుంచి సైన్యాల ఉపసంహరణకు అక్టోబరు 21న ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో పాటు అక్టోబరు 24న రష్యాలోని కజాన్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రత్యేకంగా భేటీ అయి సయోధ్యకు మార్గం వేశారు.
National
స్తంభం పైన ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. ఇంతలో అటుగా వచ్చిన ఓ పక్షి…
కొన్ని దృశ్యాలు చూస్తే.. నమ్మశక్యంగా అనిపించవు. అరె.. ఇది ఏమైనా మ్యాజిక్కా లేక కనికట్టా అనిపిస్తుంది. తాజాగా 78వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. కేరళలో జాతీయ జెండా ఎగురవేస్తుండగా.. పైభాగంలో ఇరుక్కుపోయింది. ఈ సమయంలో అటుగా వచ్చిన ఒక పక్షి.. ఇరుక్కుపోయిన పైభాగాన్ని విప్పేసింది. నమ్మశక్యం కాని ఈ ఘటన కేరళలో వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Kerala – National Flag got stuck at the top while hoisting. A bird came from nowhere and unfurled it!! ✨ pic.twitter.com/lRFR2TeShK
— Shilpa (@shilpa_cn) August 16, 2024
ఇండిపెండెన్స్ డే శుభ సందర్భంగా, కొందరు పిల్లలు, పెద్దలు కలిసి జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో జాతీయ జెండా ఎగరవేస్తుండగా.. దురదృష్టవశాత్తు అది పైభాగంలో చిక్కుకుపోయింది. క్షణాల్లో, ఎక్కడి నుంచో ఎగురుతూ ఒక పక్షి వచ్చి చిక్కుకుపోయిన త్రివర్ణ పతాకాన్ని విప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆపై పక్షి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇది “దైవిక జోక్యం!” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “ఈ ప్రకృతి ఏదో దాగి ఉంది. మనుషులే అర్థం చేసుకోలేకపోతున్నారు” అని మరొకరు వ్యాఖ్యానించారు. “ఇలా జరగడానికి ఆస్కారం లేదు.. ఇది ఎడిట్ చేసిన వీడియో కావొచ్చు” అని మరొక వ్యక్తి అనుమానం వ్యక్తం చేశారు.
National
Railway Jobs: క్రీడాకారులకు సదావకాశం.. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024-25 సంవత్సరానికి గాను వెస్ట్రన్ రైల్వేలో గ్రూప్ ‘సి’, గ్రూప్ ‘డి’ ఖాళీల భర్తీకి ఈ ప్రకటన వెలువరించింది. అర్హులైన పురుష, మహిళా క్రీడాకారులు ఈ పోస్టుకలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 14, 2024వ తేదీలోని చివరి తేదీగా నిర్ణయించారు. మొత్తం 64 గ్రూప్ ‘సి’, గ్రూప్ ‘డి’ పోస్టులను స్పోర్ట్స్ కోటాలో ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. లెవెల్-4/5 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లెవెల్-2/3 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ, పన్నెండో తరగతిలో, లెవెల్-1 పోస్టులకు పదో తరగతి, ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బాస్కెట్బాల్, క్రికెట్, రెజ్లింగ్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాడీ బిల్డింగ్, సైక్లింగ్, హాకీ, ఖో-ఖో, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్.. వంటి క్రీడాంశాల్లో ఏదైనా ఒక దానిలో వివిధ స్థాయుల్లో విజయాలు సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు జనవరి 01, 2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. పురుష, మహిళా క్రీడాకారులు ఇరువురూ దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు ఇలా..
లెవెల్-4/5 పోస్టులు: 5
లెవెల్-2/3 పోస్టులు: 16
లెవెల్-1 పోస్టులు: 43
ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 16, 2024వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 14, 2024వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తుంది. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.500లు తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్ఎం/ దివ్యాంగులు/ మహిళలు/ మైనారిటీలు/ ఈబీసీ అభ్యర్థులు రూ.250లు రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్, ట్రయల్స్ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
-
Business8 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career8 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News8 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business8 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National9 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business8 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International8 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education7 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National7 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Crime News7 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh7 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Andhrapradesh7 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana8 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
National8 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Spiritual7 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
Railways7 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National7 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Andhrapradesh7 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh7 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Andhrapradesh7 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
National7 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
National7 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh11 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Political7 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh7 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
National8 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Political7 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh7 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Andhrapradesh7 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
National8 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Business8 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Cinema10 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Andhrapradesh6 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
Andhrapradesh7 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
International8 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Education7 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Weather7 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
News8 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
International8 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
Andhrapradesh7 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
News7 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Railways6 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh7 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Business8 months ago
Bank Holidays June-2024: జూన్లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Andhrapradesh8 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
News7 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
International7 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Andhrapradesh7 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
Cinema8 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
-
Andhrapradesh7 months ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…