Hyderabad
Greater Hyderabad: గ్రేటర్లో ఓటర్ ఎటు వైపు… లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పట్టు నిలుపుకుంటుందా?

Greater Hyderabad: లోక్సభ ఎన్నికల్లో గ్రేటర్ ఓటర్ ఎటు వైపు ఉంటాడనే చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో అత్యధిక స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గ్రేటర్ లో ఇవే ఫలితాలు పునరావృతం కానున్నాయా లేక గ్రేటర్ ఓటర్లు Greater Voters మరోలా తీర్పును ఇస్తారా అనేది ప్రస్తుతం ఆసక్తి కరంగా మారింది.
గ్రేటర్ ఓటరు ఎటు వైపు…
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ Secunderabad ,చేవెళ్ల Chevella, మల్కాజ్ గిరి Malkajgiri. గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో నాలుగు పార్టీలు గెలుచుకున్నాయి.
హైదరాబాద్లో ఎంఐఎం విజయం సాధించగా, సికింద్రాబాద్లో బీజేపీ, చేవెళ్లలో బిఆర్ఎస్, మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీలు విజయం సాధించాయి. వీటిలో చేవెళ్ల, మల్కాజ్గిరి స్థానాల్లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే గ్రేటర్ కు దగ్గరగా ఉంటాయి.
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇందులోని మలక్ పేట,కార్వాన్ చార్మినార్, చంద్రాయణ గుట్ట,యాకుత్పురా , బహదూర్పురాలో ఎంఐఎం పార్టీ గెలిచింది. గోషామహల్ స్థానం మాత్రం బీజేపీ దక్కించుకుంది.
సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ముషీరాబాద్, అంబర్ పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ , సనత్ నగర్, సికింద్రాబాద్ నియోజక వర్గాల్లో టిఆర్ఎస్ గెలిచింది. నాంపల్లిలో మాత్రమే ఎంఐఎం గెలిచింది.
అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీదే హవా…
చేవెళ్ల లోకసభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మహేశ్వరం ,రాజేంద్రనగర్ , శేరి లింగంపల్లి ,చేవెళ్ళలో బిఆర్ఎస్ విజయం సాధించింది. ఈ స్థానాలు గ్రేటర్ కు దగ్గరగా ఉంటాయి. మిగిలిన పరిగి ,వికారాబాద్, తాండూర్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది.
మల్కాజ్ గిరి లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి . మేడ్చల్ , మల్కాజ్గిరి ,కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్ ,సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాల్లో గులాబీ పార్టీ విజయం సాధించింది. ఈసారి మాత్రం పార్లమెంట్ ఎన్నికలను అన్నీ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఈ కీలక సమయంలో బిఆర్ఎస్ పార్టీకి మాత్రం వరుస ఎదురు దెబ్బలు తప్పడం లేదు. అధికారం కోల్పోవడంతో ఒక్కొక్కరుగా కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి వివిధ కారణాలతో బీజేపీ,కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
గ్రేటర్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తారా?
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 150 డివిజన్ లలో గులాబీ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకోగా….42 డివిజన్ లలో ఎంఐఎం, 40 డివిజన్లలో బీజేపీ, 11 డివిజన్ లలో కాంగ్రెస్ విజయం సాధించింది. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు ముందు గ్రేటర్ హైదరాబాద్ లో కారును ఖాళీ చేయాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటికే గ్రేటర్ వ్యాప్తంగా మెజారిటీ నేతలు రేవంత్ తో టచ్ లో ఉన్నట్లు వార్తలు వస్తూ ఉండడంతో బిఆర్ఎస్ లో ఆందోళనలకు దారి తీసింది.
ఆ స్థానాల్లో కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్…
పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మేడ్చల్ స్థానాలను ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
సికింద్రాబాద్ ప్రస్తుతం బీజేపీ ఖాతాలో ఉంది. అక్కడి నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఈసారి సికింద్రాబాద్ స్థానంపై కూడా కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. మాజీ మేయర్ రామ్మోహన్కు సికింద్రాబాద్ టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది.
మరోవైపు మల్కాజ్గిరి ఎంపీ స్థానం ఎటూ కాంగ్రెస్ ఖాతాలోనే ఉంది.ఇక్కడి నుంచి గత లో సభ ఎన్నికల్లో విజయం సాధించిన రేవంత్ రెడ్డి ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచి సీఎం పదవి దక్కించుకున్నారు. దీనిని కూడా చేజారిపోకుండా భారీ మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
ఇందులో భాగంగానే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ టికెట్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది.బిఆర్ఎస్ ఖాతాలో ఉన్న చేవెళ్ల సీటును కూడా దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.
అధికారం చేపట్టినప్పటి నుంచి అనూహ్య నిర్ణయాలతో ఆశ్చర్యపరుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నే మరోవైపు పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నారు.
ఇప్పటికే హామీ ఇచ్చిన ఆరు గ్యారంటిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం,రూ.500 లకే గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల ఉచిత విద్యుత్,ఆరోగ్య శ్రీ భీమా పెంపు,ఇందిరమ్మ ఇండ్ల వంటి పథకలను రేవంత్ ప్రారంభించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యంగా ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారం కోసం అడుగులు వేయడం ప్రభుత్వానికి ప్లస్ అయింది. అన్ని వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతానికి మంచి స్పందన వస్తుండటం ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపుతోంది.
గ్రేటర్ ఓటర్లపై కాంగ్రెస్ పాలన ప్రభావం ఉండవచ్చని ఈసారి గ్రేటర్ ఓటరు మనసు మారి కాంగ్రెస్ వైపు చూడవచ్చనే అంచనాలు ఉన్నాయి. గ్రేటర్ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో తెలియడానికి మరికొంత సమయం పట్టనుంది.
Hyderabad
ఏపీలో చంద్రబాబు వస్తే హైదరాబాదుకు వచ్చిన నష్టం ఏమీ లేదు… పొంగులేటి

హైదరాబాద్: పక్క రాష్ట్రంలో ఏదో జరగబోతుందనో, దేశంలో ఎక్కడో ఏదో జరిగిందనో.. హైదరాబాద్కు వచ్చిన నష్టమేమీ లేదని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, ఇతరత్రా వసతుల దృష్ట్యా హైదరాబాద్ నగరం దేశంలోనే బెస్ట్ ప్లేస్ అని ఆయన స్పష్టం చేశారు. ఇది తాను చెబుతున్న మాట కాదని, మేధావులు, వివిధ సంస్థల ప్రతినిధులు చెప్పిన మాట అని ఆయన అన్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిందని, హైదరాబాద్కు ఏదో నష్టం జరగబోతోందనే వార్తలు కరెక్ట్ కాదని మంత్రి పొంగులేటి అన్నారు. హైదరాబాద్ భవిష్యత్తుకు ఢోకా లేదని చెప్పారు. ఎందుకంటే ఈ నగరానికి ఉన్న భౌగోళిక వనరులు, ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలే అందుక్కారణమని తెలిపారు. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై లాంటి నగరాల కంటే హైదరాబాద్ ఉత్తమమని పలు సంస్థల ప్రతినిధులే చెప్పారని మంత్రి గుర్తుచేశారు.
Andhrapradesh
Metro Rail: గుడ్ న్యూస్ చెప్పిన మెట్రో.. ఇక హైదరాబాద్ వాసులకు నో టెన్షన్

హైదరాబాద్ నగరవాసులకు మెట్రో శుభవార్త చెప్పింది. మెట్రో రైల్ నడిచే టైమింగ్స్ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో మెట్రో ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాక నిత్యం లక్షలాది మంది ఈ సేవలు ఉపయోగించుకుంటున్నారు. నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటున్నాయి. వీటి ద్వారా ప్రయాణం చేసే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది
మరోవైపు ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో యాజమాన్యం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ వాసులకు శుభవార్త చెప్పింది మెట్రో యాజమాన్యం. మెట్రో రైళ్ల సేవల వేళల్లో మార్పులు చేస్తూ కీలక ప్రకటన చేసింది.
ప్రస్తుతం చివరి మెట్రో ట్రైన్ రాత్రి 11 గంటలకు బయల్దేరనుండగా.. ఇప్పుడు ఆ సమయాన్ని యాజమాన్యం ఇంకాస్త పెంచింది. ఇక నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు సర్వీసు పొడిగిస్తున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. దీంతో హైదరాబాద్ వాసులకు ఆర్థ్రత్రి దాటాక కూడా మెట్రో ట్రైన్ అందుబాటులో ఉండబోతోందని చెప్పుకోవచ్చు.
ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్ నిర్వహణ సాధ్యాసాధ్యాలను బట్టి పలు నిర్ణయాలు తీసుకుంటున్న మెట్రో రైల్ అధికారులు.. తాజాగా శుక్రవారాల్లో రాత్రి 11.45 గంటల వరకు సర్వీసును పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. రీసెంట్ గా ఈ సమయానికి నడిపిన ట్రయల్స్ లో మంచి రెస్పాన్స్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.
Hyderabad
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్లోనే, త్వరలోనే పనులు ప్రారంభం..!

తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్
బీబీనగర్-గుంటూరు మధ్య రెండో లైన్
త్వరలోనే పనులు ప్రారంభమయ్యే
తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్-గుంటూరు రెండో రైల్వే లైన్ పనులు తర్వలోనే ప్రారంభం కానున్నాయి. రెండు, మూడు నెలల్లో పనులు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ మార్గంలో సింగిల్ లైన్ మాత్రమే ఉండగా.. డబ్లింగ్ ప్రాజెక్టు గతేడాది మంజూరైంది. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ తుది దశలో ఉంది. దాఖలైన బిడ్లను పరిశీలిస్తున్నట్లు.. త్వరలోనే కాంట్రాక్టర్ను ఎంపిక చేయనున్నట్లు రైల్వేవర్గాలు వెల్లడిస్తున్నాయి.
బీబీనగర్-గుంటూరు రెండో ట్రైన్ లైన్ నిర్మాణానికి రూ.2,853 కోట్ల వ్యయం అవుతుందని రైల్వేశాఖ గతంలోనే అంచనా వేసింది. 293 కిలోమీటర్ల లైన్ నిర్మాణం తర్వాత రేట్ ఆఫ్ రిటర్న్ 11.02 శాతం వస్తుందని రైల్వేశాఖ రీసెర్చ్లో తేలింది. బీబీనగర్-గుంటూరు రైల్వే మార్గంలో ఇప్పటికే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్, సికింద్రాబాద్-విశాఖపట్నం దురంతో ఎక్స్ప్రెస్ సహా విజయవాడ ఇంటర్సిటీ, గుంటూరు ఇంటర్సిటీ, శబరి, ఫలక్నుమా, నారాయణాద్రి, నర్సాపూర్, గోల్కొండ, పల్నాడు, జన్మభూమి, విశాఖ ఎక్స్ప్రెస్ వంటి ముఖ్యమైన ట్రైన్లు రాకపోకలు సాగిస్తున్నాయి.
-
Business9 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career9 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News9 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business8 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National9 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business9 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International9 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education8 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National8 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh8 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Crime News8 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh8 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana9 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Railways8 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National9 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
National8 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Spiritual8 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
Andhrapradesh8 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh8 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh8 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
National8 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Andhrapradesh12 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
National8 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Political8 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh8 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Andhrapradesh8 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
National9 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh8 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Political8 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
National9 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Andhrapradesh8 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh7 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
Business9 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Cinema11 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
International9 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
International9 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
News9 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Education8 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Weather8 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Andhrapradesh8 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Andhrapradesh8 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
News8 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Railways7 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Business9 months ago
Bank Holidays June-2024: జూన్లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Andhrapradesh8 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
News8 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh8 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
Education12 months ago
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు
-
International8 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Andhrapradesh12 months ago
ప్రమాదపుటంచుల్లో ప్రపంచం