Connect with us

Agriculture

Erravalli Farmers: వరి వెదసాగు పద్ధతితో సిరులు పండిస్తున్న ఎర్రవల్లి రైతులు, వెదజల్లే పద్ధతిలో అధిక దిగుబడులు..

Published

on

వెదసాగు paddy తో పంట కాలం, సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా మంచి దిగుబడులు సాధించి అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. వెదజల్లే పద్దతి ద్వారా రైతులకు 1 ఎకరాకు 34.2 క్వింటాళ్ల వరకు దిగుబడిని వచ్చిందని రైతులు, వ్యవసాయ అధికారులు తెలిపారు.

మర్కుక్ మండలంలోని లోని ఎర్రవల్లి గ్రామంలో వెదజల్లే పద్దతి ద్వారా వరి సాగు చేసి మంచి దిగుబడులు సాధించిన రైతుల పొలంలో వ్యవసాయ శాఖ అధికారులు ఇటీవల క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు.

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన వరంగల్ ఉప సంచాలకుడు ఉమారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంలో రోజురోజుకూ పెట్టుబడులు పెరిగి చిన్న, సన్నకారు రైతులు నష్టపోతున్నారన్నారు. వీటిని అధిగమించేందుకు కొందరు రైతులు భిన్నంగా ఆలోచించి వరిసాగులో వెదజల్లే పద్ధతి వైపు మొగ్గుచూపుతున్నారని తెలిపారు.

వెదసాగు Veda Method పద్దతితో కూలీల కొరతను అధిగమించడంతో పాటు పెట్టుబడి ఖర్చును కూడా తగ్గించుకుంటున్నారని చెప్పారు. ఈ పద్ధతిపై వ్యవసాయ అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారని ఆయన తెలియజేశారు. యాసంగి లో వెదసాగు పద్ధతి ద్వారా పంటవేసిన ఒక రైతు పొలంలో ఒక గుంట విస్తీర్ణంలో నిర్వహించిన పంట కోత ద్వారా, ఎకరాకు ఎంతపంట వస్తుందోనని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు.

NP-9153 పుష్కల్ రకం, డిసెంబర్ 27, 2023న రైతు తన పొలంలో విత్తడం జరిగింది. సరిగ్గా, 124 రోజుల తర్వాత పంట చేతికి వచ్చింది, ఎకరాకు 34.2 క్వింటాళ్ల వరకు దిగుబడిని వచ్చిందని అయన తెలియజేశారు.

Advertisement

ఖర్చు తక్కువ లాభాలు అధికం .…
మర్కుక్ మండలంలో 605 ఎకరాలలో రైతులు వెద సాగు పద్ధతి ద్వారా ఈ యాసంగి వరి సాగు చేశారు. ఈ పద్దతితో రైతులు అనేక లాభాలు పొందుతున్నారు. నారుమడి పద్ధతిలో ఎకరాకు 25–30 కేజీల విత్తనం అవసరం ఉంటుంది. నారు పెరగడానికి 30 రోజుల సమయం పడుతుంది. నారు మడి పెంచడానికి రూ. రెండువేలకు పైగా ఖర్చవుతుంది.

వరినాటు కోసం కూలీలకు ఎకరానికి రూ.5వేల నుంచి రూ. 6వేలు ఖర్చు అవుతుంది. వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయడానికి ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనం మాత్రమే అవసరమవుతుంది. కూలీల ఖర్చు అసలే ఉండదు. ఒక వ్యక్తి రోజుకి మూడెకరాల వరకు విత్తనం వేసుకోవచ్చు. దీంతో ఎకరాకు రూ. 6వేల నుంచి రూ. 8వేల వరకు ఖర్చు మిగులుతుందని తెలిపారు.

యాసంగిలో వరికి బదులుగా గింజలు, కూరగాయల సాగు..
రైతులు వెద పద్ధతిలో మరింత దిగుబడి సాధించాలంటే ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం తప్పనిసరిగా పాటించాలని తెలియజేశారు. Yasangi యాసంగిలో వరికి బదులుగా అపరాలు, నూనె గింజ పంటలను, కూరగాయలను సాగు చేసుకోవాలని ఉమారెడ్డి సూచించారు.

కలుపు యాజమాన్యంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని విత్తిన 3 రోజుల లోపు, 20 రోజుల లోపు కలుపు మందులను పిచికారి చేసుకోవాలని అయన సూచించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద దాదాపు 200 ఎకరాలకు ఉచితంగా విత్తనాలను మరియు కలుపు మందులను అందించినందుకు రైతుల తరఫున మండల వ్యవసాయ అధికారి నాగేందర్ రెడ్డి నూజివీడు సీడ్స్ ప్రతినిధి నరసింహారెడ్డి మరియు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఒక గుంట విస్తీర్ణంలో నిర్వహించిన పంట కోత ప్రయోగం మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి విష్ణు వర్ధన్, రజినీకాంత్, భాను శ్రీ, రైతులు , నూజివీడు కంపెనీ ప్రతినిధులు ప్రవీణ్ రెడ్డి, రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Agriculture

సింహాచలం గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి.. మధ్యాహ్నం బయలుదేరనున్న స్వామివారి పుష్పరథం..భారీగా తరలివస్తున్న భక్తగణం..

Published

on

సింహాచలం అప్పన్న గిరిప్రదక్షిణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శనివారం మధ్యాహ్నం సంప్రదాయబద్ధంగా గిరి ప్రదక్షణ ప్రారంభం కానుంది. ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణను ప్రారంభించి పౌర్ణమి నాడు స్వామిని దర్శించుకోవడం ఆనం వాయితీగా వస్తోంది. ఆ క్రమంలోనే గిరి ప్రదక్షిణ చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారు. 32 కిలోమీటర్ల మేర కాలినడకన చేసే గిరి ప్రదక్షిణలో లక్షలాదిమంది భక్తులు పాల్గొంటారు. గిరి ప్రదక్షిణ కోసం సింహాచలం దేవస్థానం, జిల్లా అధి కార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశారు.

గిరి ప్రదక్షిణ చేస్తే భువి ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం వస్తుందని భక్తుల నమ్మకం. దీనికి తోడు వనమూలికలతో కూడిన కొండ చుట్టూ 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చేస్తే ఆయురారోగ్యాలు ఉంటాయని భక్తుల విశ్వాసం. సింహాచలం తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి.. 32 కిలోమీటర్ల కాలినడకన గిరిప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటే ఆ భాగ్యమే వేరు. అందుకే ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే గిరిప్రదక్షిణలో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు.

శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కొండ దిగువన తొలిపావంచా వద్ద స్వామివారి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. ఆలయ అనువంశిక ధర్మకర్తలు రథాన్ని ప్రారంభిస్తారు. రథం తొలిపావంచా నుంచి పాత అడివివరం మీదుగా సెంట్రల్ జైల్, ముడసర్లోవ, చినగదిలి, హనుమం తవాక, విశాలక్షినగర్ మీదుగా జోడుగుళ్లు పాలెం బీచ్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి అప్పుఘర్, ఎంవీపీ డబుల్ రోడ్డు మీదుగా వెంకోజీపాలెం, ఇసుకతోట, హెచ్బీకాలనీ, సీతమ్మధార, కంచరపాలెం, డీఎల్బీ క్వార్టర్స్, మాధవధార, మురళీ నగర్, ఆర్ అండ్ బీ, ఎన్ఏడీ జంక్షన్, గోపాలపట్నం. బంకు, ప్రహ్లాదపురం, గోశాల మీదుగా తిరిగి తొలిపావంచా వద్దకు చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ ముగుస్తుంది.

గిరి ప్రదక్షణకు ఏపీ తెలంగాణ నుంచి కర్ణాటక ఒరిస్సా తమిళనాడు నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారు. ఇప్పటికే ఈ గిరిప్రదక్షిణాకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది అధికార యంత్రంగం. భక్తులు నడిచే 32 కిలోమీటర్ల మేర ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. స్టాళ్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఫలహారాలు ప్రసాదం అందే ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా అంబులెన్సులు, మెడికల్ క్యాంపు లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సింహాచలం రెవెన్యూ జీవీఎంసీ పోలీస్ వైద్య ఆరోగ్యశాఖ ఆర్టీసీ విద్యుత్ ఫైర్ ఎక్సైజ్ శాఖ సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుల సేదదీరేందుకు 25 ప్రాంతాల్లో స్టాళ్లు 22 ప్రదేశంలో మహిళలు పురుషులకు వేరువేరుగా 300 వరకు తాత్కాలిగా మరుగుదొడ్లు 11 ప్రాంతాల్లో వైద్య శిబిరాలు 12 చోట్ల 17 అంబులెన్స్ తొమ్మిది జనరేటర్లు, ఆరు పబ్లిక్ అడ్రస్ సింగ్ సిస్టం లను ఏర్పాటు చేశారు.

గిరి ప్రదక్షిణ చేసే భక్తులు మాధవధార, అప్పుఘర్ ప్రాంతాల్లో స్నానాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుంది. సముద్ర స్నానాలు చేసే చోట ప్రత్యేక స్విమర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మాధవధార లో బోర్ తో పాటు జల్లుల స్నానం ఏర్పాటు చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని కూడా తీసుకుంటున్నారు అధికారులు.

Advertisement

కొండ దిగువన తొలిప్రేవంచ నుంచి స్వామివారి పుష్పరతం శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది. స్వామివారి మూలవిరాట్ ఉత్సవమూర్తులు కొలవదీరిన ప్రచార రథం బయలుదేరుతుంది. గిరి ప్రదక్షణలో పాల్గొనే భక్తులంతా ఆ సమయానికి తొలిప్రేమంచే వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. తొలిరోజు ఉదయాన్నే గిరిప్రదక్షిణ ప్రారంభించి అదే రోజు రాత్రికి తిరిగి సింహాచలం చేరుకునే భక్తులకు రాత్రి పది గంటల వరకు దర్శనాలు లభిస్తాయి. ఆదివారం ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నెరవేరామంగా దర్శనాలుమతాయి. తిరిగి సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 వరకు రాత్రి 8:30 నుంచి రాత్రి 9:00 వరకు భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. ఆదివారం నాడు ఆలయ ప్రదర్శన చేసే భక్తులకు తెల్లవారుజామున మూడు గంటల నుంచి అనుమతిస్తారు.

సింహాచలంలోని తొలపావంచ వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టేందుకు 50 క్యూలు 80 గడ్డర్లు సిద్ధం చేస్తున్నారు. ఆలయ ప్రదక్షిణ కు సంబంధించి ఉత్తర రాజగోపురం దక్షిణ రాజగోపురం వద్ద వంతెన సిద్ధం చేస్తున్నారు. బ్రిడ్జ్ లపై నుంచి ప్రదక్షిణాలు చేసే భక్తులు కింద నుంచి దర్శనానికి భక్తులు వెళ్ళేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

గిరి ప్రదక్షణ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో కిలోమీటర్లకు మూడు పాయింట్లు ప్రత్యేక పర్యవేక్షకుడిని పెడుతున్నారు. భక్తుల్లో ఎవరికైనా అస్వస్థత గురైతే… అంబులెన్స్లకు అదనంగా పోలీసులు వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. 21వ తేదీ ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొండపై నుంచి దిగువకు భక్తులకు దేవస్థానం బస్సులతో పాటు దేవస్థానం నగదు చెల్లించిన 45 ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా చేరవేస్తారు.

గిరి ప్రదక్షిణ నేపథ్యంలో శనివారం ఆదివారంలో నగరంలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. కాలినడకన రోడ్లపై గిరిప్రదక్షిణ చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తుతో పాటు ముందస్తు ప్రణాళికలతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. గిరి ప్రదక్షిణ జరిగే ప్రాంతాల్లో శని ఆదివారాల్లో ప్రత్యామ్నాయం రహదారుల్లో ప్రయాణించాలని సూచించారు పోలీసులు. సింహాచలం గిరిప్రదక్షిణను ప్రతిష్టాత్మక తీసుకున్నారు జిల్లా అధికార యంత్రంగం. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
Continue Reading

Agriculture

ఎన్నో ఏళ్లుగా తండ్రి, తల్లి పేరుతో భూమి ఉన్న వారికి ఈ రోజే కొత్త ఆర్డర్

Published

on

భూమి ఆన్‌లైన్ (2024): ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని వ్యవసాయ పనులు చేసుకుంటున్న లేదా నివాసయోగ్యమైన ఇల్లు లేకపోవటంతో ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకోవడం వంటి పనులు చేసిన రైతులకు శుభవార్త అని చెప్పవచ్చు. భూమి లేకపోవడం. భూమి తాత, నాయనమ్మ పేరు మీద ఉన్నా.. దానికి సంబంధించిన పత్రం లేకపోయినా.. రైతు పేరు మీదకు బదలాయించైనా.. ప్రభుత్వం నుంచి రైతులకు శుభవార్త అందనున్న సంగతి తెలిసిందే.

రైతులకు సరైన పత్రాలు అందడం లేదని, దీని కోసం కార్యాలయాల నుంచి కార్యాలయాలకు తిరుగుతున్నామని, ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అలాంటి రైతులకు శుభవార్త చెప్పబోతోంది. ఇక నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సులువుగా ఈ ప్రక్రియలు చేసుకునేందుకు వీలుగా కొత్త పథకాన్ని తక్షణమే అమలు చేస్తామని ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. దీని ద్వారా బీగర్ హుకుం సాగుదారులకు కూడా పవన్ కళ్యాణ్ శుభవార్త అందించారని చెప్పవచ్చు. భూమి ఆధార్ ఆన్‌లైన్ (2024)

ఇలాంటి పత్రాల బదిలీలు జరిగితే, మీరు వీలైనంత త్వరగా మీ శాఖకు సంబంధించిన అధికారులను సంప్రదించాలి, వారు తప్పకుండా మీ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ మంత్రి ఈ సమస్యను అధికారులకు నేరుగా తెలియజేసారు.

ఇలాంటప్పుడు బగర్ హుకుం సాగుకు కూడా శాఖలో చాలా అభివృద్ధి జరుగుతోందని, ఈ విషయంలోనూ రైతులు సద్వినియోగం చేసుకుని సరైన మార్గంలో లబ్ధిదారులుగా మారాలన్నారు. కాబట్టి మీ వద్ద మీ వారసత్వంగా వచ్చిన ఆస్తికి సంబంధించిన సరైన పత్రాలు ( Documents ) లేకపోయినా భూ శాఖ మరియు రెవెన్యూ శాఖ సహాయంతో మీరు ఈ భూమిని మీ పేరు మీద బదిలీ చేసుకోవచ్చు.

Continue Reading

Agriculture

PM Kisan: నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ డబ్బులు..స్టేటస్‌ చెక్‌ చేసుకోవడం ఎలా?

Published

on

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంది. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల పథకాలను సైతం అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్‌ స్కీమ్‌ ఒకటి. ఈ పథకంలో భాగంగా రైతుకు ఏడాదికి రూ.6000 అందుతాయి. ఈ మొత్తం ఒకేసారి కాకుండా ఏడాదిలో మూడు విడతలుగా అంటే రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది మోడీ సర్కార్‌. ఇప్పటి వరకు రైతులకు 16వ విడత డబ్బులు అందుకోగా, ఇప్పుడు 17వ విడత రావాల్సి ఉంటుంది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ ఈ మొత్తాన్ని విడుదల చేయనున్నారు. వారణాసి పర్యటనలో భాగంగా మోడీ ఈ డబ్బులు విడుదల చేస్తారు. ఈ పథకం ద్వారా మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్ల మొత్తాన్ని జమ కానున్నాయి.

డబ్బుల స్టేటస్​ చెక్‌ చేసుకోవడం ఎలా?

ముందుగా పీఎం కిసాన్ బెనిఫీషియరీ స్టేటస్, ఇన్​స్టాల్​మెంట్ స్టేటస్​ చెక్​ చేసుకోవడానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్​ను ఓపెన్ చేయండి.
ఆ తర్వాత Know Your Status అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్​ను ఎంటర్​ చేసి, క్యాప్చా కోడ్​ను ఎంటర్‌ చేయాలి.
ఇప్పుడు Get Data అనే ఆప్షన్​పై క్లిక్ చేస్తే స్క్రీన్​పై మీ బెనిషియరీ స్టేటస్​ కనిపిస్తుంది.

కేవైసీ తప్పనిసరి

పీఎం కిసాన్‌ యోజన ప్రయోజనం అందుకునే రైతులు కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. కేవైసీ చేయని రైతులకు 17వ విడత డబ్బులు అందవని కేంద్రం చెబుతోంది. అలాగే బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకుంటే వాయిదా ఆగిపోతుంది. రైతులు కేవైసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు చెబుతూ వస్తోంది. కొందరు రైతులు కేవైసీ చేయలేదని, వారికి వచ్చే విడత డబ్బులు అందవని స్పష్టం చేస్తోంది. అందుకే ఈ విడత డబ్బులు రావాలంటే తప్పకుండా కేవైసీ పూర్తి చేసుకున్నవారికే వస్తుందని గుర్తించుకోండి.

Advertisement
Continue Reading
Andhrapradesh3 weeks ago

Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా?

Andhrapradesh3 weeks ago

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఆర్జిత సేవా టికెట్లు విడుదల ఎప్పుడంటే..?

Andhrapradesh3 weeks ago

Musi River: వివాదంగా మారిన మూసీ బ్యూటిఫికేషన్.. తమ ఇళ్లను కూల్చివేయొద్దంటూ..

Spiritual3 weeks ago

కృష్ణాష్టమి అంటే కన్నయ్య జన్మదినమే.. ఈ ప్రదేశాలలో జన్మాష్టమి పండుగను భిన్నంగా జరుపుకుంటారు

National3 weeks ago

స్తంభం పైన ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. ఇంతలో అటుగా వచ్చిన ఓ పక్షి…

National3 weeks ago

Railway Jobs: క్రీడాకారులకు సదావకాశం.. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

National3 weeks ago

ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ఏం సందేశం ఇచ్చారో తెలుసా?

Andhrapradesh3 weeks ago

NTR Health University: ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలకు యాజమాన్య కోటా నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

International4 weeks ago

యుద్ధం వస్తే ఎలా? టెక్నాలజీపరంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌ ఎవరు స్ట్రాంగ్‌?

Hashtag4 weeks ago

Pen Hospital: పెన్నుల కోసం ఓ స్పెషల్ హాస్పిటల్.. ఇచ్చట అన్ని పెన్నులు రిపేర్ చేయబడును..!

International4 weeks ago

రష్యాలోకి 30 కి.మీ. దూసుకెళ్లిన యుక్రెయిన్ సైన్యం.. సేఫ్ జోన్లకు 76 వేల మంది తరలింపు

National4 weeks ago

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలో హైఅలర్ట్ .. ఎర్రకోట వద్ద పటిష్ఠ భద్రత

National4 weeks ago

UPSC Civils Mains 2024: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసిందోచ్

Andhrapradesh4 weeks ago

AP Police Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్‌

International4 weeks ago

ఇజ్రాయెల్​పై దాడికి ఇరాన్‌ సన్నాహాలు – అణు జలాంతర్గామిని పంపిస్తున్న అమెరికా – Iran backed Attack On Israel

International4 weeks ago

‘రాక్షసి వెళ్లిపోయింది’ – హసీనాపై ముహమ్మద్ యూనుస్​ ఘాటు వ్యాఖ్య – Yunus Comments On Hasina

International4 weeks ago

Donald Trump : ‘ఎక్స్‌’లో డొనాల్డ్ ట్రంప్‌తో ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ.. ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Technology4 weeks ago

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరు గ్రూప్‌లో చేరడానికి ముందే అన్నీ తెలుసుకోవచ్చు!

National4 weeks ago

2036 నాటికి భారత జనాభా 152 కోట్లు – పెరగనున్న మహిళలు – తగ్గనున్న యువత – INDIA POPULATION 2036

National4 weeks ago

ఐఐటీ మద్రాస్ దేశంలోనే బెస్ట్​- వరుసగా ఆరోసారి- టాప్​ కాలేజీల లిస్ట్​ ఇదే! – NIRF Ranking 2024

International4 weeks ago

Israel Hamas war : గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 100మందికిపైగా మృతి

National4 weeks ago

PM Modi: భారీ వర్షంలో రైతులతో ప్రధాని మోదీ భేటీ.. సింప్లిసిటీ చూస్తే వావ్ అనాల్సిందే.. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి..

Telangana4 weeks ago

Yadadri: యాదగిరిగుట్టలో మరిన్ని మార్పులకు ప్రభుత్వం సిద్ధం..!

Andhrapradesh4 weeks ago

PG Medical Courses: మెడికల్‌ విద్యార్ధులకు బిగ్‌షాక్‌.. పీజీ వైద్య విద్య ఫీజులు పెంచిన సర్కార్!

Andhrapradesh4 weeks ago

Tungabhadra Dam: 69 ఏళ్ల చరిత్రలో ఫస్ట్‌టైమ్‌ ప్రమాదం.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు

Cricket4 weeks ago

Team India: ఇకపై టెస్ట్ జట్టులో కనిపించని ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు.. చివరి మ్యాచ్ ఎప్పుడు ఆడారంటే?

National4 weeks ago

17 నెలల తర్వాత.. జైలు నుంచి విడుదలైన సిసోడియా..

National4 weeks ago

New rule : విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ఆగ‌స్టు 15 నుంచి పాఠ‌శాల్లో కొత్త రూల్‌.. ‘గుడ్ మార్నింగ్ చెప్పొద్దు..’

Andhrapradesh4 weeks ago

Andhra Pradesh: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పట్నుంచంటే..?

Spiritual4 weeks ago

ఈ సంవత్సరం కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు?ఆగస్టు 26నా, 27నా? మధుర, బృందావనంలో ఎప్పుడు జరుపుతారంటే?

Business3 months ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career3 months ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

Business3 months ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

National4 months ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

News3 months ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

Business3 months ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

Education3 months ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

National3 months ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

National3 months ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Andhrapradesh3 months ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

Spiritual3 months ago

Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

Telangana3 months ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

Crime News3 months ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

Andhrapradesh2 months ago

జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

National3 months ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

Railways3 months ago

పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే

National3 months ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

Andhrapradesh3 months ago

పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

National3 months ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

Andhrapradesh3 months ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

Political3 months ago

కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

Political3 months ago

పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

Andhrapradesh3 months ago

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

Andhrapradesh3 months ago

వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

Weather3 months ago

జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…

National3 months ago

Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!

Education3 months ago

ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త

Andhrapradesh3 months ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

Business3 months ago

ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ

Andhrapradesh3 months ago

సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల

Trending