Agriculture
ఎన్నో ఏళ్లుగా తండ్రి, తల్లి పేరుతో భూమి ఉన్న వారికి ఈ రోజే కొత్త ఆర్డర్

భూమి ఆన్లైన్ (2024): ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని వ్యవసాయ పనులు చేసుకుంటున్న లేదా నివాసయోగ్యమైన ఇల్లు లేకపోవటంతో ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకోవడం వంటి పనులు చేసిన రైతులకు శుభవార్త అని చెప్పవచ్చు. భూమి లేకపోవడం. భూమి తాత, నాయనమ్మ పేరు మీద ఉన్నా.. దానికి సంబంధించిన పత్రం లేకపోయినా.. రైతు పేరు మీదకు బదలాయించైనా.. ప్రభుత్వం నుంచి రైతులకు శుభవార్త అందనున్న సంగతి తెలిసిందే.
రైతులకు సరైన పత్రాలు అందడం లేదని, దీని కోసం కార్యాలయాల నుంచి కార్యాలయాలకు తిరుగుతున్నామని, ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అలాంటి రైతులకు శుభవార్త చెప్పబోతోంది. ఇక నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సులువుగా ఈ ప్రక్రియలు చేసుకునేందుకు వీలుగా కొత్త పథకాన్ని తక్షణమే అమలు చేస్తామని ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. దీని ద్వారా బీగర్ హుకుం సాగుదారులకు కూడా పవన్ కళ్యాణ్ శుభవార్త అందించారని చెప్పవచ్చు. భూమి ఆధార్ ఆన్లైన్ (2024)
ఇలాంటి పత్రాల బదిలీలు జరిగితే, మీరు వీలైనంత త్వరగా మీ శాఖకు సంబంధించిన అధికారులను సంప్రదించాలి, వారు తప్పకుండా మీ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ మంత్రి ఈ సమస్యను అధికారులకు నేరుగా తెలియజేసారు.
ఇలాంటప్పుడు బగర్ హుకుం సాగుకు కూడా శాఖలో చాలా అభివృద్ధి జరుగుతోందని, ఈ విషయంలోనూ రైతులు సద్వినియోగం చేసుకుని సరైన మార్గంలో లబ్ధిదారులుగా మారాలన్నారు. కాబట్టి మీ వద్ద మీ వారసత్వంగా వచ్చిన ఆస్తికి సంబంధించిన సరైన పత్రాలు ( Documents ) లేకపోయినా భూ శాఖ మరియు రెవెన్యూ శాఖ సహాయంతో మీరు ఈ భూమిని మీ పేరు మీద బదిలీ చేసుకోవచ్చు.
Agriculture
సింహాచలం గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి.. మధ్యాహ్నం బయలుదేరనున్న స్వామివారి పుష్పరథం..భారీగా తరలివస్తున్న భక్తగణం..

సింహాచలం అప్పన్న గిరిప్రదక్షిణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శనివారం మధ్యాహ్నం సంప్రదాయబద్ధంగా గిరి ప్రదక్షణ ప్రారంభం కానుంది. ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణను ప్రారంభించి పౌర్ణమి నాడు స్వామిని దర్శించుకోవడం ఆనం వాయితీగా వస్తోంది. ఆ క్రమంలోనే గిరి ప్రదక్షిణ చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారు. 32 కిలోమీటర్ల మేర కాలినడకన చేసే గిరి ప్రదక్షిణలో లక్షలాదిమంది భక్తులు పాల్గొంటారు. గిరి ప్రదక్షిణ కోసం సింహాచలం దేవస్థానం, జిల్లా అధి కార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశారు.
గిరి ప్రదక్షిణ చేస్తే భువి ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం వస్తుందని భక్తుల నమ్మకం. దీనికి తోడు వనమూలికలతో కూడిన కొండ చుట్టూ 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చేస్తే ఆయురారోగ్యాలు ఉంటాయని భక్తుల విశ్వాసం. సింహాచలం తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి.. 32 కిలోమీటర్ల కాలినడకన గిరిప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటే ఆ భాగ్యమే వేరు. అందుకే ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే గిరిప్రదక్షిణలో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు.
శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కొండ దిగువన తొలిపావంచా వద్ద స్వామివారి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. ఆలయ అనువంశిక ధర్మకర్తలు రథాన్ని ప్రారంభిస్తారు. రథం తొలిపావంచా నుంచి పాత అడివివరం మీదుగా సెంట్రల్ జైల్, ముడసర్లోవ, చినగదిలి, హనుమం తవాక, విశాలక్షినగర్ మీదుగా జోడుగుళ్లు పాలెం బీచ్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి అప్పుఘర్, ఎంవీపీ డబుల్ రోడ్డు మీదుగా వెంకోజీపాలెం, ఇసుకతోట, హెచ్బీకాలనీ, సీతమ్మధార, కంచరపాలెం, డీఎల్బీ క్వార్టర్స్, మాధవధార, మురళీ నగర్, ఆర్ అండ్ బీ, ఎన్ఏడీ జంక్షన్, గోపాలపట్నం. బంకు, ప్రహ్లాదపురం, గోశాల మీదుగా తిరిగి తొలిపావంచా వద్దకు చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ ముగుస్తుంది.
గిరి ప్రదక్షణకు ఏపీ తెలంగాణ నుంచి కర్ణాటక ఒరిస్సా తమిళనాడు నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారు. ఇప్పటికే ఈ గిరిప్రదక్షిణాకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది అధికార యంత్రంగం. భక్తులు నడిచే 32 కిలోమీటర్ల మేర ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. స్టాళ్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఫలహారాలు ప్రసాదం అందే ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా అంబులెన్సులు, మెడికల్ క్యాంపు లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సింహాచలం రెవెన్యూ జీవీఎంసీ పోలీస్ వైద్య ఆరోగ్యశాఖ ఆర్టీసీ విద్యుత్ ఫైర్ ఎక్సైజ్ శాఖ సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుల సేదదీరేందుకు 25 ప్రాంతాల్లో స్టాళ్లు 22 ప్రదేశంలో మహిళలు పురుషులకు వేరువేరుగా 300 వరకు తాత్కాలిగా మరుగుదొడ్లు 11 ప్రాంతాల్లో వైద్య శిబిరాలు 12 చోట్ల 17 అంబులెన్స్ తొమ్మిది జనరేటర్లు, ఆరు పబ్లిక్ అడ్రస్ సింగ్ సిస్టం లను ఏర్పాటు చేశారు.
గిరి ప్రదక్షిణ చేసే భక్తులు మాధవధార, అప్పుఘర్ ప్రాంతాల్లో స్నానాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుంది. సముద్ర స్నానాలు చేసే చోట ప్రత్యేక స్విమర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మాధవధార లో బోర్ తో పాటు జల్లుల స్నానం ఏర్పాటు చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని కూడా తీసుకుంటున్నారు అధికారులు.
కొండ దిగువన తొలిప్రేవంచ నుంచి స్వామివారి పుష్పరతం శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది. స్వామివారి మూలవిరాట్ ఉత్సవమూర్తులు కొలవదీరిన ప్రచార రథం బయలుదేరుతుంది. గిరి ప్రదక్షణలో పాల్గొనే భక్తులంతా ఆ సమయానికి తొలిప్రేమంచే వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. తొలిరోజు ఉదయాన్నే గిరిప్రదక్షిణ ప్రారంభించి అదే రోజు రాత్రికి తిరిగి సింహాచలం చేరుకునే భక్తులకు రాత్రి పది గంటల వరకు దర్శనాలు లభిస్తాయి. ఆదివారం ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నెరవేరామంగా దర్శనాలుమతాయి. తిరిగి సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 వరకు రాత్రి 8:30 నుంచి రాత్రి 9:00 వరకు భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. ఆదివారం నాడు ఆలయ ప్రదర్శన చేసే భక్తులకు తెల్లవారుజామున మూడు గంటల నుంచి అనుమతిస్తారు.
సింహాచలంలోని తొలపావంచ వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టేందుకు 50 క్యూలు 80 గడ్డర్లు సిద్ధం చేస్తున్నారు. ఆలయ ప్రదక్షిణ కు సంబంధించి ఉత్తర రాజగోపురం దక్షిణ రాజగోపురం వద్ద వంతెన సిద్ధం చేస్తున్నారు. బ్రిడ్జ్ లపై నుంచి ప్రదక్షిణాలు చేసే భక్తులు కింద నుంచి దర్శనానికి భక్తులు వెళ్ళేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
గిరి ప్రదక్షణ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో కిలోమీటర్లకు మూడు పాయింట్లు ప్రత్యేక పర్యవేక్షకుడిని పెడుతున్నారు. భక్తుల్లో ఎవరికైనా అస్వస్థత గురైతే… అంబులెన్స్లకు అదనంగా పోలీసులు వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. 21వ తేదీ ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొండపై నుంచి దిగువకు భక్తులకు దేవస్థానం బస్సులతో పాటు దేవస్థానం నగదు చెల్లించిన 45 ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా చేరవేస్తారు.
గిరి ప్రదక్షిణ నేపథ్యంలో శనివారం ఆదివారంలో నగరంలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. కాలినడకన రోడ్లపై గిరిప్రదక్షిణ చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తుతో పాటు ముందస్తు ప్రణాళికలతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. గిరి ప్రదక్షిణ జరిగే ప్రాంతాల్లో శని ఆదివారాల్లో ప్రత్యామ్నాయం రహదారుల్లో ప్రయాణించాలని సూచించారు పోలీసులు. సింహాచలం గిరిప్రదక్షిణను ప్రతిష్టాత్మక తీసుకున్నారు జిల్లా అధికార యంత్రంగం. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు.
Agriculture
PM Kisan: నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు..స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా?

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంది. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల పథకాలను సైతం అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి. ఈ పథకంలో భాగంగా రైతుకు ఏడాదికి రూ.6000 అందుతాయి. ఈ మొత్తం ఒకేసారి కాకుండా ఏడాదిలో మూడు విడతలుగా అంటే రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది మోడీ సర్కార్. ఇప్పటి వరకు రైతులకు 16వ విడత డబ్బులు అందుకోగా, ఇప్పుడు 17వ విడత రావాల్సి ఉంటుంది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ ఈ మొత్తాన్ని విడుదల చేయనున్నారు. వారణాసి పర్యటనలో భాగంగా మోడీ ఈ డబ్బులు విడుదల చేస్తారు. ఈ పథకం ద్వారా మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్ల మొత్తాన్ని జమ కానున్నాయి.
డబ్బుల స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా?
ముందుగా పీఎం కిసాన్ బెనిఫీషియరీ స్టేటస్, ఇన్స్టాల్మెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్ను ఓపెన్ చేయండి.
ఆ తర్వాత Know Your Status అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి.
తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ను ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయాలి.
ఇప్పుడు Get Data అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే స్క్రీన్పై మీ బెనిషియరీ స్టేటస్ కనిపిస్తుంది.
కేవైసీ తప్పనిసరి
పీఎం కిసాన్ యోజన ప్రయోజనం అందుకునే రైతులు కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. కేవైసీ చేయని రైతులకు 17వ విడత డబ్బులు అందవని కేంద్రం చెబుతోంది. అలాగే బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకుంటే వాయిదా ఆగిపోతుంది. రైతులు కేవైసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు చెబుతూ వస్తోంది. కొందరు రైతులు కేవైసీ చేయలేదని, వారికి వచ్చే విడత డబ్బులు అందవని స్పష్టం చేస్తోంది. అందుకే ఈ విడత డబ్బులు రావాలంటే తప్పకుండా కేవైసీ పూర్తి చేసుకున్నవారికే వస్తుందని గుర్తించుకోండి.
Agriculture
ఈ ఒక్క ఆకుతో.. బియ్యం, పప్పుల్లో పురుగులు తరిమికొట్టొచ్చు..!

మనం ఇంట్లో నెలవారీ సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం. కానీ బియ్యం, పప్పు లాంటివి మాత్రం కాస్త ఎక్కువగానే ఇంట్లో స్టోర్ చేసుకుంటాం. అందుకే.. వీటికి ఎక్కుగా పురుగులు పడుతూ ఉంటాయి. బియ్యం, పప్పులకు పురుగులు పట్టడానికి కారణాలు చాలానే ఉంటాయి. పొరపాటున కొంచెం తడి చెయ్యి వాటికి తగిలినా చాలు.. పురుగులు పుట్టుకొచ్చేస్తాయి. ఇక వండేటప్పుడు వాటిని వదిలించుకోవడానికి నానా తిప్పలు పడాల్సిందే.

ఎన్ని సార్లు జల్లించినా, కడిగనా ఒక పట్టాన వదలవు. అలా అని… అలానే వండుకోనూలేం. ఈ పురుగులు వదిలించడానికి ఏమైనా మందులు కొడదామా అంటే… అది తినే ఆహారం అలాంటి సాహసాలు చేయలేం. మరి ఈ పురుగులు ఎలా వదిలించాలా అని అనుకుంటున్నారా..? కేవలం ఒక్క ఆకు వాడి వీటిని తరిమికొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
వేప ఆకులు మనకు ఈజీగానే దొరుకుతూ ఉంటాయి. ఈ వేప ఆకులను ఎండిపోయిన వాటిని వాడి ఈ పురుగులను తరిమికొట్టొచ్చు. మీరు బియ్యం ఉంచే డబ్బాలో కొన్ని వేప ఆకులను వేయాలి. ఈ వేప ఆకుల వాసనను పురుగులు తట్టుకోలేవు. దీంతో…తొందరగా పారిపోతాయి.మనకు ఈ పరుగుల బెడద కూడా తగ్గిపోతుంది. అయితే… పచ్చి వేపాకులంటే.. ఎండిపోయిన వేపాకులను వాడటం ఉత్తమం.
అయితే..వేపాకులు ఒకటి, రెండు వేస్తే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కాబట్టి.. కాస్త ఎక్కువ మొత్తంలోనే వేపాకులువేయాలి. అప్పుడే… తొందరగా పురుగులు వదలుతాయి. అంతేకాదు.. ఆ వేపాకులు కొంచెం కూడా తడిగా ఉండకూడదు అనే విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి.
వేపాకులు మాత్రమే కాదు.. వేపాకుల పొడి వాడి కూడా బియ్యం, పప్పుల్లో ఉన్న పురుగులను తరిమికొట్టొచ్చు. ఎండిన వేపాకులను పొడి చేసి వాడాలి. అలా అని డైరెక్ట్ గా బియ్యం డబ్బా, పప్పుల డబ్బాలో ఈ పొడి చల్లకూడదు. ఈ పొడిని ఏదైనా మూటలాగా కట్టి.. ఆ డబ్బాలే వేస్తే సరిపోతుంది. ఇలా కూడా ఆ వాసనకు పురుగులు పారిపోతాయి.
ఇక ఈ పురుగులు ఎక్కువగా తేమగా ఉన్నప్పుడే ప్రవేశిస్తాయి. అందుకే.. తేమ తగలకుండా చూసుకోవాలి. మీరు బియ్యాన్ని తేమ నుండి రక్షించాలనుకుంటే, కంటైనర్ను తెరిచి ఉంచవద్దు. పెట్టె మూత సరిగ్గా అమర్చబడిందా లేదా అనే దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి
-
Business9 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career9 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News9 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business9 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National9 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business9 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International9 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education8 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National8 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh8 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Crime News8 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh8 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana9 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
National9 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Railways8 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National8 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Spiritual8 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
Andhrapradesh8 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh8 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh8 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Andhrapradesh12 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
National8 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
National8 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Political8 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh8 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
National9 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh8 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Andhrapradesh8 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Political8 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
National9 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Andhrapradesh8 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
International9 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Business9 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Andhrapradesh7 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
Cinema11 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
International9 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
News9 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Education8 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Weather8 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Andhrapradesh8 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Andhrapradesh8 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
News8 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Railways7 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Business9 months ago
Bank Holidays June-2024: జూన్లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Andhrapradesh9 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Education12 months ago
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు
-
News8 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh8 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
Andhrapradesh12 months ago
ప్రమాదపుటంచుల్లో ప్రపంచం
-
International8 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం