Study
BharatGPT: మన ‘హనూమ్యాన్’ వచ్చేస్తున్నాడు! చాట్ జీపీటీకి మించిన రేంజ్లో..
![](https://infoline.one/wp-content/uploads/2024/02/bharatgpt-hanooman.webp)
ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన చాట్ జీపీటీ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతితకతతో వచ్చిన ఈ అధునాతన సెర్చ్ ఇంజిన్ మొత్తం వ్యవస్థనే మార్చేసింది. ఈ క్రమంలో అన్ని టెక్ దిగ్గజాలు అనివార్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను వినియోగించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. ఈ క్రమంలో మన దేశీయ ఏఐ టూల్ ఒకటి త్వరలో అందుబాటులోకి రానుంది. చాట్ జీపీటీ స్టైల్లోనే సేవలు అందించే విధంగా దానిని తీర్చిదిద్దారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ భారత్ జీపీటీ పేరిట దీనిని వచ్చే నెలలో అంటే మార్చిలో దీనిని లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. మన దేశంలోని టాప్ ఇంజినీరింగ్ స్కూల్స్ తో కలిసి దీనిని రూపొందించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మన దేశ ఆశయాలకు ఇది పెద్ద ఊతం ఇచ్చినట్లు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
హనూమ్యాన్ పేరుతో..
ఈ ల్యాంగ్వేజ్ మోడల్ ను మంగళవారం ముంబైలో జరిగిన సాంకేతిక సదస్సులో ప్రదర్శించారు. అక్కడి ప్రతి నిధుల ముందు ప్లే చేసిన వీడియోలో, దక్షిణ భారతదేశంలోని ఒక మోటార్సైకిల్ మెకానిక్ తన మాతృభాష తమిళంలో ఏఐ బాట్ను ప్రశ్నలు అడిగాడు. అలాగే ఒక బ్యాంకర్ హిందీలో సంభాషించాడు. హైదరాబాద్లోని ఒక డెవలపర్ కంప్యూటర్ కోడ్ రాయడానికి దానిని ఉపయోగించాడు. కాగా ఈ మోడల్ విజయవంతమైతే ఈ చాట్ బాట్ ను ‘హనూమ్యాన్’ గా పిలిచే అవకాశం ఉంది. దీని రాకతో రానున్న రోజుల్లో ఏఐ సాంకేతికతతో మరిన్ని ఏఐ దేశీయ టూల్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వైర్లెస్ క్యారియర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్, భారత ప్రభుత్వం మద్దతుతో ముంబైతో సహా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయాల సహకారంతో ఈ మోడల్ రూపుదిద్దుకుంది.
![](http://infoline.one/wp-content/uploads/2024/05/logo-info-3.png)
Career
యూపీపీఎస్సీ ఫలితాలను విడుదల చేసిన కేంద్రం..!
![](https://infoline.one/wp-content/uploads/2024/04/015c3720a96339d42279fe2c29bcb61015ce00abfd7965fba34217cc0d478ffb.webp)
యూపీపీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది కేంద్రం. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఏప్రిల్ 16 , 2024 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫైనల్ రిజల్ట్ 2023 ని అనౌన్స్ చేసింది.
అలానే యూపీఎస్సీ టాపర్ లిస్ట్ 2024 ని కూడా విడుదల చేసింది ఆదిత్య శ్రీవత్సవ కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.
యుపిఎస్సి సిఎస్సి ఫలితాల్లో ఆదిత్య శ్రీవత్సవ ఫస్ట్ ర్యాంక్ ని సాధించగా అనిమేష్ ప్రధాన్, దోనూరు అనన్య రెడ్డి రెండవ మరియు మూడవ స్థానాలని దక్కించుకున్నారు. 1016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఫలితాలని చెక్ చేసుకోవచ్చు.
Student
పిట్ట కొంచెం.. కూత ఘనం..! ఏడేళ్ళకే అద్భుత ప్రతిభతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్లో స్థానం
![](https://infoline.one/wp-content/uploads/2024/04/chava-tarak-nanda-india-book-of-record.webp)
సాధారణంగా ఎవరైనా ఒక నాలుగైదు దేశాల రాజధానుల పేర్లు, వాటి కరెన్సీని సులభంగానే గుర్తు పెట్టుకుంటారు. మహా అయితే మనం నిత్యం వినియోగించే పది అంకెల ఫోన్ నెంబర్లను కూడా గుర్తుపెట్టుకుంటాం. ఓ 20 దేశాల పేర్లు వాటి రాజధానులు, ఆయా దేశాల కరెన్సీని గుర్తు పెట్టుకోవాలంటే కాస్త కష్టమే..! కానీ ఏడేళ్ల బుడతడు మాత్రం వంద దేశాలు, వాటి రాజధానుల పేర్లను మాత్రం అవలీలగా చెప్పేస్తున్నాడు. ఈ బుడతడు పిట్ట కొంచెం.. కూత ఘనం.. అన్నట్లుగా తన ప్రతిభతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్లో స్థానం దక్కించుకున్నాడు. ఈ బుడతడు ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ ఆశ్లేష దంపతులు స్థానికంగా ఆర్కే హాస్పిటల్ను నిర్వహిస్తున్నారు. వీరికి ఓ పాప బాబు ఉన్నారు. ఏడేళ్ళ మాష్టర్ చావా తారక్ నంద ఎల్కేజీ చదువుతున్నాడు. చిన్నతనం నుంచే అద్భుత ప్రతిభ కనబరుస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈ బుడతడు వంద దేశాలు, వాటి రాజధానుల పేర్లను అవలీలగా చెప్పేస్తున్నాడు. దేశంలోనే వేగంగా అతి తక్కువ సమయంలో దేశాలు, వాటి రాజధానుల పేర్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
అతి తక్కవ సమయం 1.42 సెకండ్లలో ప్రపంచంలోని 100 దేశాల రాజధానుల పేర్లను ఏకధాటిగా చెప్పి ప్రతిష్టాత్మక ఇండియా బుక్ ఆప్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డు కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన పోటీల్లో ఈ రికార్డును చావా తారక్ నంద సాధించాడు. ఇప్పటివరకు తమిళనాడుకు చెందిన అమ్మాయి 1.59 సెకండ్లలో సాధించిన రికార్డును తారక్ నంద బ్రేక్ చేశాడు. చిన్నోడి ప్రతిభను చూసి అబ్బురపడుతున్నారు.
తారక్ నంద అక్క ఆకృతి కూడా రికార్డు హొల్దరే. గత ఏడాది ఆమె కూడా నాలుగు నిమిషాల్లో 194 దేశాలు, వాటి రాజధానుల పేర్లు గడగడా చెప్పేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంస పొందింది. తారక్ నందకు మాటలు వచ్చే సమయంలోనే అక్క ఆకృతి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు కోసం ప్రిపేర్ అవుతోంది. దీంతో అక్క తోపాటు ఈ బుడతడు కూడా దేశాలు వాటి రాజధానుల పేర్లను పలకడం మొదలు పెట్టాడు. డాక్టర్లుగా ఉన్న తల్లిదండ్రులిద్దరూ తారక్ నంద ప్రతిభను గమనించి అక్క ఆకృతితో పాటు తారక్ నంద కూడా ఇంట్లోనే వారు శిక్షణ ఇచ్చారు. దీంతో ఈ బుడతడు పిట్ట కొంచెం.. కూత ఘనం.. అన్నట్లుగా ప్రతిభను చాటుతున్నాడు.
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడంతో తారక్ నందపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తమ పిల్లలిద్దరూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం గర్వంగా ఉందని తారక్ తల్లిదండ్రులు చెబుతున్నారు. మిగిలిన విభాగాల్లో కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించేందుకు ఇద్దరికీ ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నట్లు వారు చెబుతున్నారు. ప్రతి పిల్లల్లో ప్రతిభ ఉంటుందని దానిని గుర్తించి ప్రోత్సహిస్తే రాణిస్తారని వీరు చెబుతున్నారు.
Education
త్వరలో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల – Telangana Inter Results Release
![](https://infoline.one/wp-content/uploads/2024/04/1200-675-21213247-thumbnail-16x9-inter22.webp)
Telangana Inter Results Release : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మన రాష్ట్రం కంటే ముందే తెలంగాణలో పరీక్షలు పూర్తి అయినా విడుదల కొంత ఆలస్యమైంది. దీంతో అక్కడి ఫలితాలు ఎప్పుడు వస్తాయని విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆరా తీస్తున్నారు.
ఏప్రిల్ 22లోపు :
ఏప్రిల్ 22లోపు ఒకేసారి మొదటి, ద్వితీయ సంవత్సరం ఇంటర్మిడియట్ రిజల్ట్ ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇందుకు అవసరమైన అన్ని ముందస్తు కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా ఫలితాల విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈటీవీ భారత్ ప్రతినిధి ఇంటర్మిడియట్ అధికారులను పరీక్ష ఫలితాల విడుదలపై సంప్రదించారు. ఈ నెల 21 లేదా 22 తేదీలలో ఇంటర్ ఫలితాలు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు ఆయన తెలిపారు. ఏదైనా అనివార్య పరిస్థితులు ఉత్ఫన్నమైనా 25లోపు ఫలితాలు వస్తాయన్నారు.
సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా :
తెలంగాణ ఇంటర్మిడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసిమరీ.. ఎంతో పకడ్బందీగా పరీక్షలను నిర్వహించారు. ఈ ఏడాదికి సంబంధించి సంబంధించి 9 లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంటర్మిడియట్ పరీక్షలకు హాజరయ్యారు. ప్రస్తుతం వీరంతా కూడా పరీక్ష ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. వాస్తవానికి ఈఏడాది మూల్యాంకన ప్రక్రియను మార్చి 10నే ప్రారంభించి దాదాపు 20రోజుల్లోనే పూర్తి చేశారు. మార్కుల నమోదు ప్రక్రియను కూడా ముగించారు. కానీ పరీక్షకు హాజరు కాని విద్యార్ధులు, వివిధ కారాణాలతో పరీక్షలకు హాజరైనా పూర్తి చేయని వారి వివరాలను ప్రస్తుతం కంప్యూటీకరణ చేస్తున్నారు. అలాగే ఫలితాల విడుదలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా, సాంకేతికపరమైన ఇబ్బందులూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో ఫలితాల విడుదల దృష్ట్యా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లోఉంది. కొందరు అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో ఫలితాల విడుదల కొంత ఆలస్యమైంది.
తగ్గిన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మిడియట్ ఉత్తీర్ణత :
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాల్లో ఈ ఏడాది విద్యార్ధుల ఉత్తీర్ణత శాతం బాగా తగ్గింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 67 శాతం, సెకండ్ ఇయర్లో 78 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ సౌరబ్గౌర్, పరీక్షల కంట్రోలర్ సుబ్బారావు తెలిపారు. ఫలితాల్లో ప్రతి ఏడాది మాదిరి ఈ సంవత్సరం కూడా బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో కూడా బాలికలు 71 శాతం, బాలురు 64 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్లో ఫలితాల్లో బాలికలు 81 శాతం, బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో ఉత్తీర్ణత తగ్గడంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
Business2 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career2 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
Business2 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
Business2 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National3 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
News2 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Education2 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National2 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Crime News2 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh2 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Spiritual2 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National2 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Andhrapradesh2 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
National2 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh2 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Political1 month ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
National1 month ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
National2 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Andhrapradesh2 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Andhrapradesh1 month ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Railways1 month ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
Telangana2 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Andhrapradesh2 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Andhrapradesh2 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Political2 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh2 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Andhrapradesh1 month ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh1 month ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
International2 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
News3 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
News2 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Business2 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Spiritual2 months ago
Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?
-
National2 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Education1 month ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
International1 month ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Andhrapradesh2 months ago
AP Schools Reopen Date 2024: ఏపీలో వేసవి సెలవుల పొడిగింపు.. తిరిగి బడి గంట మోగేది అప్పుడే!
-
News2 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Hyderabad1 month ago
ఏపీలో చంద్రబాబు వస్తే హైదరాబాదుకు వచ్చిన నష్టం ఏమీ లేదు… పొంగులేటి
-
Cinema2 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
-
Cinema4 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Andhrapradesh1 month ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
Andhrapradesh5 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Weather1 month ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Andhrapradesh2 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Andhrapradesh2 months ago
ఏపీలో ఆ శాఖ ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ మరో రెండేళ్లు పొడిగింపు
-
National2 months ago
ఒకే కుటుంబంలో 165మంది- ఓట్ల కోసం ఫ్యామిలీ చుట్టూ నేతలు! అందరూ చర్చించే ఓటేస్తారట! – Voters In One Family In Bihar
-
Railways2 weeks ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Life Style2 months ago
Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు
-
National2 months ago
Loksabha : ఈనెల 24 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు….. స్పీకర్ ఎన్నిక!