Connect with us

Andhrapradesh

ANU Engineering: ఏఎన్‌‍యూ‌లో సెల్ఫ్‌ సపోర్ట్‌ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్‌ టెస్ట్‌

Published

on

ANU Engineering: గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో సెల్ఫ్ సపోర్ట్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 15న ఏఎన్‌యూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. జూన్ 12లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తు చేయడానికి జూన్ 12న ఆఖరి తేదీగా ప్రకటించారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ 2024-25 విద్యా సంవత్సరానికి గా సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. సెల్ఫ్‌ సపోర్ట్‌ విధానంలో బీటెక్+ఎంటెక్, బాచిలర్ ఆఫ్ డిజైన్ అండ్ బాచిలర్ ఆఫ్‌ ప్లానింగ్ కోర్సులు ఉన్నాయి.

బాచిలర్ ఆఫ్‌ డిజైన్ అండ్ ప్లానింగ్ కోర్సులను ఏఎన్ఐయూ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ అందిస్తుంది. బీటెక్+ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సును డాక్టర్ వైఎస్ఆర్ ఏఎన్‌యూ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ నిర్వహిస్తుంది.

ఏఏ కోర్సుల్లో‌ ఎన్నెన్ని సీట్లు
1. బీటెక్+ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సులో 510 సీట్లు ఉన్నాయి.

బీటెక్+ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ), సివిల్ ఇంజనీరింగ్ (సీఈ), మెకానికల్ ఇంజనీరింగ్ (ఎంఈ), ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ (ఈసీఈ), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (ఏఐ&ఏంఎల్), డేటా సైన్స్ (డీఎస్), సైబర్ సెక్యూరిటీ (సీఎస్) బ్రాంచ్ ల్లో ప్రవేశాలు ఉంటాయి.

Advertisement

2. బీడి జైన్ అండ్ ప్లానింగ్ ‌ప్రోగ్రామ్ లో 80 సీట్లు ఉన్నాయి.

అభ్యర్థుల కనీస అర్హత
కోర్సులకు ఆన్‌లైన్ దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులకు కనీస అర్హత మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులై ఉండాలి.‌ కనీసం 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ
ఇంజినీరింగ్ కోర్సులకు ఎంపిక ప్రక్రియలో ప్రవేశ పరీక్ష తప్పనిసరి. అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్, కౌన్సిలింగ్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.ప్రవేశ పరీక్షలో ప్రశ్నలు మూడు విభాగాల్లో ఉంటాయి. ఇంగ్లీష్ మాధ్యమంలో వంద ప్రశ్నలు ఉంటాయి. అందులో మ్యాథమెటిక్స్ 40 ప్రశ్నలు, ఫిజిక్స్ 30 ప్రశ్నలు, కెమిస్ట్రీ 30 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష రాయడానికి 90 నిమిషాల సమయం ఇస్తారు.

పరీక్ష కేంద్రాలు ఎక్కడెక్కడ?
ప్రవేశ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశా, రాజమహేంద్రవరం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడపలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.‌ తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.‌

రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1,000 ఉంటుంది. అలాగే ఓబీసీ, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1,200 ఉంటుంది.

Advertisement

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12 జూన్ 2024.

ప్రవేశ పరీక్ష: 15 జూన్ 2024

ఇతర వివరాలు, దరఖాస్తు చేసుకోవడానికి వెబ్‌సైట్ ను సందర్శించండి. https://nagarjunauniversity.ac.in/ లేదా http://anucet.in/

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhrapradesh

Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్… కెమెరాల ఈ-వేలానికి టీటీడీ ప్రకటన, ఇలా పొందవచ్చు!

Published

on

Tirumala Tirupati Devasthanams Updates: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన పలు రకాల కెమెరాలను టీటీడీ వేలం వేయనుంది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన కెమెరాలు ఇందులో ఉన్నట్లు పేర్కొంది.

ఈ కెమెరాలను ఆగ‌స్టు 1న రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నారు. ఇందులో నైకాన్, కెనాన్, కొడాక్ తదితర కెమెరాలు ఉన్నాయి. ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న కెమెరాలు మొత్తం 10 లాట్లు ఈ-వేలంలో ఉంచారు.

ఈ- వేలానికి సంబంధించిన ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరు ద్వారా సంప్రదించవచ్చు. లేదా టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో వివరించింది.

ఆండాళ్‌ తిరువడిపురం ఉత్సవం :
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 29 నుండి ఆగష్టు 7వ తేదీ వ‌ర‌కు శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉత్సవ రోజుల్లో ఉదయం శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.

ఆగష్టు 7న శ్రీ ఆండాళ్‌ అమ్మవారి శాత్తుమొర సంద‌ర్భంగా ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని అలిపిరికి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు.

Advertisement

ప్రత్యేకపూజల అనంతరం అలిపిరి నుండి రామనగర్‌ క్వార్టర్స లోని గీతామందిరం, ఆర్‌ఎస్‌ మాడ వీధి లోని శ్రీ విఖనసాచార్యుల ఆలయం, శ్రీ చిన్నజీయర్‌ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. రాత్రి 8 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారి సన్నిధిలో శాత్తుమొర నిర్వహిస్తారు.

మరోవైపు తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 30వ తేదీన ఆడికృత్తిక పర్వదినం జరగనుంది. ఈ సందర్భంగా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.

ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

రూ.1.5 కోట్లు విరాళం
తెనాలికి చెందిన శ్రీ సత్య శ్రీనివాస్ (నేషనల్ స్టిల్స్, సిఎఫ్ఓ) ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1.5 కోట్లు విరాళం అందించారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం చెక్కును దాత టిటిడి ఈఓ జె.శ్యామల రావుకు అందజేశారు.

Advertisement
Continue Reading

Andhrapradesh

అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలోకి డబ్బులు, నెలాఖరుకు పక్కా

Published

on

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రైతుల కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. గత రెండేళ్లుగా పడుతున్న ఇబ్బందులపై రైతుల కూటమి ప్రభుత్వానికి వరుసగా విన్నవిస్తున్నారు. అమరావతి రైతులకు కౌలు బకాయి రూ.380 కోట్లని తేలగా.. ఆ చెల్లింపుల దిశగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరుగుతోంది.. ఈలోపే ప్రభుత్వం డబ్బులు చెల్లించేందుకు సిద్ధహవుతోంది.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

అమరావతి రైతులకు శుభవార్త.. రాజధాని రైతులకు చెల్లించాల్సిన కౌలుపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అమరావతి రైతుల నుంచి కౌలు చెల్లింపులపై వినతులు వస్తుండటంతో.. మున్సిపల్‌శాఖ మంత్రి పొంగూరు నారాయణ కౌలు చెల్లింపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు రాజధాని రైతులకు ప్రభుత్వం రూ.380 కోట్ల మేర కౌలు బకాయిలు ఉన్నట్లు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. కౌలు బకాయిల అంశాన్ని నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి.. నెలాఖరులోగా కౌలు చెల్లించేలా కృషి చేస్తానని మంత్రి నారాయణ అమరావతి రైతు జేఏసీ నేతలు తెలిపారు.

సకాలంలో కౌలు రాకపోవడంతో అప్పులపాలయ్యామని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన రెండేళ్లుగా కౌలు ప్రస్తావనే లేకుండా చేశారని.. ఇప్పుడు అప్పు పుట్టే పరిస్థితి కూడా లేకుండా పోయింది అన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు కౌలు చెల్లించి ఆదుకోవాలని కోరారు. కౌలు చెల్లించకపోవడంతో పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. ప్రభుత్వం ఇచ్చే కౌలుతో పిల్లల్ని చదివించుకుంటున్నామంటున్నారు పలువురు పోలీసులు.. ఇప్పుడు వారికి ఫీజులు కట్టే పరిస్థితి లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం 28,656 మంది రైతులు దాదాపు 34 వేల ఎకరాల భూములు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో కొందరు చిన్న, సన్నకారు రైతులు.. ఆర్థికపరమైన ఇబ్బందులతో రిటర్నబుల్‌ ప్లాట్లు అమ్ముకున్నారు. ఈ కారణంగా వారంతా కౌలుకు అనర్హులయ్యారు. తాజా లెక్క ప్రకారం 28,656 మందిలో కేవలం 22,980 మందికి మాత్రమే కౌలు వస్తుంది.. వీరిలో 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులతో పాటుగా.. గిరిజన, దళిత, బీసీ, మైనార్టీ, అసైన్డ్ రైతులే ఉన్నారు. అయితే రైతులకు కౌలు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు

మరోవైపు అమరావతి రైతులు కౌలు చెల్లింపులపై హైకోర్టును ఆశ్రయించారు. తమకు సకాలంలో కౌలు డబ్బులు చెల్లించేలా చూడాలని కోరారు.. హైకోర్టు విచారణ జరిపి కీలక ఆదేశాలు జారీ చేసింది.. కానీ తమకు మాత్రం కౌలు అందలేదంటున్నారు. రెండేళ్లుగా కౌలు ఎగవేయడంతో అప్పులు చేసినట్లు రైతులు చెబుతున్నారు. కొంతమంది ఈ కౌలు డబ్బులతో పిల్లల్ని చదివిస్తున్నారు. దీంతో ఫీజులు కట్టుకోవడం కూడా వారికి భారంగా మారింది. అందుకే కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కౌలు చెల్లింపులకు సంబందించి కసరత్తు మొదలుపెట్టడంతో.. రైతులు ఆనందంలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. అమరావతిలో పనులు కూడా ఊపందుకున్నాయి. ముందుగా ప్రభుత్వం జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించింది.. అలాగే పెండింగ్‌ పనుల్ని కూడా తిరిగి ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నారు.

Advertisement
Continue Reading

Andhrapradesh

Andhra Pradesh: ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

Published

on

ఏపీలో డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పనకు పెద్దపీట వేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది లక్షన్నర మందికి లోన్స్ అందించేలా ప్రణాళిక రూపొందిస్తుంది. ఈ రుణాలు ఒకే సమయంలో సంఘంలో గరిష్ఠంగా ముగ్గురికి అందించే వెసులుబాటు ఉంది.
ఏపీలో డ్వాక్రా సంఘాలకు మరింత చేయూత ఇవ్వాలని ఏపీలోని ఎన్డీయే సర్కార్ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ లోన్స్ మాత్రమే కాకుండా.. భారీగా పర్సనల్ లోన్స్ ఇవ్వాలని డిసైడ్ అయింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో లక్షన్నర మంది డ్వాక్రా మహిళలకు రూ.2 వేల కోట్ల మేర వ్యక్తిగత రుణాలు అందించాలని సెర్ప్‌ అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. 1.35 లక్షల మందికి రూ.లక్ష మేర, 15 వేల మందికి రూ.5 లక్షల లోన్స్ ఇవ్వనున్నారు. ఒక గ్రూప్‌లో ముగ్గురికి ఒకేసారి ఈ లోన్స్ ఇచ్చే వెసులుబాటు ఉంది. బ్యాంకులతో మాట్లాడి ఈ రుణాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తారు. కొత్తవారికి మాత్రమే కాదు.. ఇప్పటికే ఏదైనా జీవనోపాది పొందుతున్నవారికి సైతం లోన్స్ ఇస్తారు. లబ్ధిదారులు ఉత్సాహంతో ముందుకు సాగుతుంటే.. ఈ రుణాన్ని రూ 10 లక్షలు కూడా పెంచుతామని ప్రభుత్వం తెలిపింది

Continue Reading
Andhrapradesh1 hour ago

Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్… కెమెరాల ఈ-వేలానికి టీటీడీ ప్రకటన, ఇలా పొందవచ్చు!

International1 hour ago

‘గత ఒప్పందాల పట్ల గౌరవం ఉండాలి- బార్డర్​లో శాంతి ఉంటేనే చైనాతో సత్సంబంధాలు!’ : జైశంకర్

International1 hour ago

US Presidential Election 2024 : అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు.. ఎక్స్‌లో వెల్లడి ..

International1 hour ago

Elon Musk : ఆ ‘వోక్‌మైండ్ వైరస్’ నా కొడుకును బలి తీసుకుంది.. నన్ను మభ్యపెట్టారన్న మస్క్.. తీవ్రంగా ఖండించిన కుమార్తె!

National2 hours ago

Indian Railways: లోయర్‌ బెర్త్‌ కోసం రైల్వే కొత్త నిబంధనలు.. అదేంటో తెలుసా?

Career1 day ago

IOCL Recruitment 2024: ఐఓసీఎల్ లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

National1 day ago

‘కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే అలా చేశాం’- నేమ్ బోర్డుల ఏర్పాటుపై సుప్రీంలో యూపీ అఫిడవిట్​

National1 day ago

టీచర్​గా రాష్ట్రపతి- విద్యార్థులకు పాఠాలు చెప్పిన ముర్ము- స్పెషల్ ఏంటంటే? – Draupadi Murmu Teaching

International1 day ago

ఆ లిస్ట్​ ప్రకారమే పరేడ్ – భారత్ ఏ ప్లేస్​లో రానుందంటే? – PARIS OLYMPICS 2024

National1 day ago

Kargil Vijay Diwas 2024 : ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు.. కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ

National2 days ago

Zomato Delivery Boy : ఉండేది ముంబై మురికివాడలో.. నెలకు అద్దె రూ. 500.. జొమాటో డెలివరీ బాయ్ రియల్ లైఫ్ స్టోరీ..!

Telangana2 days ago

అరుదైన పురస్కారానికి ఎంపికైన చేనేత కళాకారుడు.. తెలంగాణ నుంచే ఎందుకంటే..

National3 days ago

సెంచరీ కొట్టిన ‘టమాటా’ – కొనలేక ‘టాటా’ చెబుతున్న సామాన్యుడు – Tomato prices in Hyderabad

National3 days ago

పోలవరం గుడ్ టైం స్టార్ట్ – ‘ప్రాజెక్టు బాధ్యతంతా మాదే – నిధులిచ్చి పూర్తి చేస్తామన్న కేంద్రం’ – CENTRAL GOVT FUNDS TO POLAVARAM

International3 days ago

ముదిరిన ఉత్తర కొరియా ‘చెత్త’యుద్ధం! సౌత్​ కొరియా అధ్యక్ష కార్యాలయంలో పడ్డ ట్రాష్​ బెలూన్స్​! – Korean Countries Balloons War

National3 days ago

వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ – తొమ్మిది ప్రాధాన్యాలతో కేటాయింపులు – Union Budget 2024

International3 days ago

మాల్‌లో వీధి పిల్లికి సెక్యూరిటీ గార్డ్ జాబ్.. ఈ ఐడియా అదుర్స్ కదూ..

National3 days ago

కన్వర్ యాత్ర చుట్టూ కాంట్రవర్సీలు.. సుప్రీంకోర్టు మెట్లెక్కిన నేమ్ బోర్డు ఇష్యూ

International3 days ago

US politics: డెమొక్రాట్లు, రిపబ్లికన్లలో భారత్‌కు అండగా నిలిచేదెవరు?

International4 days ago

‘సీక్రెట్‌ సర్వీస్‌ వైఫల్యమే’- ట్రంప్‌పై కాల్పుల కేసులో డైరెక్టర్‌ అంగీకారం – Trump Shooting Case

National4 days ago

IT పరిశ్రమల ఒత్తిడి వల్లే 14గంటల వర్క్ ప్రతిపాదన ​: కర్ణాటక మంత్రి – 14 Hours Work In Karnataka

Telangana4 days ago

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూల్‌ సమయాల్లో మార్పులు..

National5 days ago

RSS కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనే వీలు- దశాబ్దాల నాటి బ్యాన్ ఎత్తివేత- కాంగ్రెస్ ఫైర్ – RSS Ban Removed

International5 days ago

అమెరికా రాజకీయాల్లో మనోళ్ల సత్తా.. ఉన్నత పదవుల్లో ఇండియన్ అమెరికన్స్

International5 days ago

షాకింగ్.. సింగర్ ప్రాణం తీసిన ఫ్యాన్..! అసలేం జరిగిందంటే..

Andhrapradesh5 days ago

అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలోకి డబ్బులు, నెలాఖరుకు పక్కా

National5 days ago

Budget 2024: మోదీ సర్కార్ 3.0 తొలి బడ్జెట్.. తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కే అవకాశం..!

Business6 days ago

18 నెలల తర్వాత విప్రోలో పెరిగిన ఉద్యోగులు.. ట్రెండ్ మార్చేసిందిగా.. మరో అదిరిపోయే గుడ్‌న్యూస్ కూడా..

Andhrapradesh6 days ago

Andhra Pradesh: ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

International6 days ago

మోదీకి మస్క్‌ అభినందనలు!

Business2 months ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career2 months ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

Business2 months ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

Business2 months ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

National3 months ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

News2 months ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

Education2 months ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

National2 months ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

Crime News2 months ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

Andhrapradesh2 months ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

Spiritual2 months ago

Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

National2 months ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

National2 months ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

Andhrapradesh2 months ago

పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

Andhrapradesh2 months ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

Political1 month ago

కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

National1 month ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

National2 months ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Andhrapradesh2 months ago

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

Andhrapradesh1 month ago

జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

Railways1 month ago

పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే

Telangana2 months ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

Andhrapradesh2 months ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

Political2 months ago

పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

Andhrapradesh2 months ago

ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత

Andhrapradesh2 months ago

వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

Andhrapradesh1 month ago

సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల

Andhrapradesh1 month ago

రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP

International2 months ago

Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం

Business2 months ago

ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ

Trending