International
విశ్వశాంతికి ముప్పుగా మారిన పరిస్థితులు ఇవే..
![](https://infoline.one/wp-content/uploads/2024/05/skynews-soldiers-troops-sas_6390408.jpg)
భారత్, పాకిస్థాన్ వివాదంతో పాటు ప్రపంచంలో సున్నితమైన అంశాలుగా చైనా-తైవాన్, ఉత్తరకొరియా, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్-ఇరాన్ నిలిచాయి. రష్యా-యుక్రెయిన్ యుద్ధం కన్నా ముందే.. 2021లో చైనా-తైవాన్ మధ్య యుద్ధం జరుగుతుందన్న సందేహాలు నెలకొన్నాయి. ఇక ఉత్తరకొరియా-దక్షిణ కొరియా మధ్య మరోసారి యుద్ధవాతావరణం నెలకొంది.
వరుస క్షిపణి ప్రయోగాలతో ఉత్తరకొరియా కవ్విస్తోంది. యుద్ధం వస్తే ఎలా తప్పించుకోవాలన్న దానిపై దక్షిణకొరియా ప్రజలు రిహార్సల్స్ చేసుకుంటున్నారు. అటు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్ దాడులు, ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం వెనక ఇజ్రాయెల్-అమెరికా కుట్ర ఉందన్న ఆరోపణలతో పరిస్థితులు దిగజారాయి. ఈ పరిణామాలన్నీ ప్రపంచాన్ని మరింత గందరగోళంలోకి నెట్టివేస్తున్నాయి.
విద్వేషం పాలించే దేశం ఉంటుందా… విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా.. ఉందంటే అది మనిషిది అయి ఉంటుందా… ఆయువు పోసే ఆయుధముంటుందా… అని ఓ తెలుగు పాటలో ప్రశ్నించారు సిరివెన్నెల. ప్రపంచదేశాలన్నీ సుహృద్భావంతో ఉంటేనే ప్రజలందరూ బాగుంటారు. ఒకదేశంతో మరో దేశం అభివృద్ధి విషయంలో, పాలన విషయంలో, ప్రజలకు సౌకర్యాలు అందించడంలో పోటీపడాలి కానీ… రాజుల కాలంలోలా రాజ్యవిస్తరణ కోసం, ఆధిపత్యం కోసం పనిచేయకూడదు.
కానీ కొన్నిదేశాలు ఇదే పనిచేస్తున్నాయి. పొరుగు దేశాల మధ్య గొడవలు పెట్టి..ఆయుధవ్యాపారం, పెత్తనమూ సాగిస్తున్నాయి. ఈ క్రమంలో సరిహద్దుదేశాలు శత్రుదేశాలుగా మిగిలిపోతున్నాయి. మరికొన్నిదేశాలకు విభేదాలు వారసత్వంగా వచ్చాయి. వాటిని చర్చలతో పరిష్కరించుకోకుండా విభేదాలను మరింత పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నారు పాలకులు. యుద్ధం ఎంత చేదుఫలాలనిస్తుందో రెండు ప్రపంచ యుద్ధాలు, తర్వాతి కాలంలో రెండు దేశాల మధ్య జరిగిన అనేక యుద్ధాలు నిరూపించినా… ఆ అనుభవాలనుంచి ఎవరూ గుణపాఠాలు నేర్చుకోలేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.
ద్రవ్యోల్బణం కొత్త రికార్డులు
ప్రపంచంలో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి, శ్రీలంక దివాళా తీయడానికి కారణం కరోనాతో పాటు వెనువెంటనే మొదలైన రష్యాయుక్రెయిన్ యుద్ధం. అది రెండు దేశాల మధ్య యుద్ధమే అయినా ప్రపంచదేశాలన్నింటిపై ఆ ప్రభావం పడింది. చాలా దేశాల్లో నిత్యావసరాల ధరలు చుక్కలనంటాయి. ద్రవ్యోల్బణం కొత్త రికార్డులు సృష్టించింది.
అయినా సరే..కొన్ని దేశాల వైఖరిలో మార్పు రావడం లేదు. యుద్ధోన్మాద చర్యలను తగ్గించుకోవడం లేదు. చైనా-తైవాన్, ఉత్తరకొరియా-దక్షిణ కొరియా, ఇజ్రాయెల్-ఇరాన్ ఈ జాబితా కిందకే వస్తాయి. ఈ దేశాలు కావాలని ఉద్రిక్తతలను పెంచుకుంటున్నాయి. యుద్ధానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి.
1949లో తైవాన్ ఏర్పడిన దగ్గరినుంచి చైనాతో ఆ ప్రాంతానికి ఘర్షణలు కొనసాగుతున్నాయి. చైనా పునరేకీకరణ ఆ దేశ పాలకుల లక్ష్యంగా ఉంది. తైవాన్ను చాలా దేశాలు గుర్తించలేదు. అనేకసార్లు చైనా-తైవాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. తైవాన్ స్వతంత్రత గురించి మాట్లాడినప్పుడల్లా….చైనా భారీగా బలగాలను మోహరించడం, తైవాన్ జలసంధిలో యుద్ధ నౌకలను మోహరించడం, తైవాన్ భూభాగాలను ధ్వంసం చేయగలిగే క్షిపణులను పరీక్షించడం వంటి చర్యలతో భయపెట్టే ప్రయత్నం చేస్తుంటోంది.
తైవాన్ను ప్రత్యక్షంగా గుర్తించకపోయినప్పటికీ పరోక్షంగా ఆ దేశానికి అమెరికా అండదండలున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో…యుక్రెయిన్కు పరోక్ష సాయం అందించినట్టుగా కాకుండా తైవాన్ కోసం అమెరికా స్వయంగా యుద్ధరంగంలోకి దిగుతుందన్న అంచనాలున్నాయి. చిన్నదేశమైనప్పటికీ..ప్రపంచానికి అవసరమైన కంప్యూటర్స్ చిప్స్ తయారీలో సగం అవసరాలను తైవానే తీరుస్తోంది. తైవాన్కు, అమెరికాకు మధ్య గట్టి వాణిజ్యసంబంధాలున్నాయి.
దీంతో చైనా-తైవాన్ మధ్య యుద్ధం వస్తే అది ఆ రెండు దేశాలతో ఆగదని, అమెరికా రంగంలోకి దిగితే పరిణామాలు మారిపోతాయని ఎప్పుడూ ఆందోళన వ్యక్తమవుతూనే ఉంటుంది. అయినా సరే చైనా పునరేకీకరణ గురించి ఆ దేశ పాలకులు మాట్లాడుతూనే ఉంటారు. తాజాగా తైవాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో చైనా మరోసారి కవ్వింపులకు దిగింది.. తైవాన్ చుట్టూ పనిష్మెంట్ డ్రిల్స్ నిర్వహిస్తోంది.
తైవాన్ కొత్త అధ్యక్షునిగా లై చింగ్ బాధ్యతలు చేట్టారు. తైవాన్ కొత్త అధ్యక్షుణ్ణి చైనా వేర్పాటువాదిగా ఆరోపిస్తూ ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ బలగాలను మోహరించింది. చైనాకు గట్టిగా బదులిచ్చేందుకు తైవాన్ కూడా సరిహద్దులకు భారీగా బలగాలను తరలిస్తోంది. మొత్తంగా రెండు దేశాల మధ్య మరోసారి యుద్ధవాతావరణం నెలకొంది.
ఇక 70 ఏళ్లగా ఎప్పుడూ యుద్ధవాతావరణంలో ఉంటున్న ఉత్తరకొరియా – దక్షిణకొరియా మధ్య మళ్లీ పరిస్థితులు దిగజారాయి. దక్షిణకొరియాకు అన్నివిధాలా మద్దతుగా ఉండే అమెరికాలో ఈ ఏడాది ఎన్నికలు జరగనుండడంతో ఉత్తరకొరియా ఏదో ఒక చర్యకు పాల్పడవచ్చన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఖండాంతర క్షిపణులను, క్రూజ్ క్షిపణులను వరుసగా ప్రయోగిస్తోంది.
గత నెలలో ఆర్మీయూనివర్శిటీని సందర్శించిన సమయంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తమ సైన్యాధికారులు, సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, ఆ సమయం వచ్చేసిందని పిలుపునివ్వడం సంచలనం సృష్టించింది. సాధారణంగా క్షిపణుల పరీక్షల సమయంలో, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో కిమ్ యుద్ధం గురించి మాట్లాడుతూ ఉంటారు.
అయితే ఈ సారి ఇవే మాటలను కిమ్ కాస్త గట్టిగా చెప్పారని…యుద్ధం గురించి హెచ్చరికగా మాట్లాడారని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. యుద్ధం ఎప్పుడైనా రావొచ్చని భావించే దక్షిణ కొరియా ప్రజలు ఎప్పటిలానే ఇప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యుద్ధం నుంచి సురక్షితంగా తప్పించుకునే నీరు, ఆహారం, మ్యాప్, దిక్సూచి, గ్యాస్ మాస్క్, శరీరానికి ధరించే కవచం వంటివాటితో ఓ కిట్ సిద్ధంగా ఉంచుకుంటున్నారు. కిమ్ రష్యాకు ఆయుధసాయం అందిస్తున్నారు.
రష్యాతో రాజకీయ సంబంధాలను మెరుగుపర్చుకున్నారు. ప్రస్తుతానికి ఉత్తరకొరియా, దక్షిణకొరియా మధ్య యుద్ధం తప్పదన్న సంకేతాలు కనిపించనప్పటికీ.. ఒక వేళ యుద్ధమంటూ జరిగితే ఉత్తరకొరియాకు మద్దతుగా రష్యా, చైనా, దక్షిణకొరియాకు మద్దతుగా జపాన్, అమెరికా రంగంలోకి దిగుతాయి. ఆ పరిస్థితులు మూడో ప్రపంచయుద్ధానికి దారితీసే ప్రమాదముంది.
ఇక ప్రపంచాన్ని శాంతికి దూరం చేస్తున్న మరో సంక్షోభం ఇరాన్-ఇజ్రాయెల్. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఎప్పుడూ ఉద్రిక్త పరిస్థితులే ఉంటాయి. గత అక్టోబరు నుంచి గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతీకారదాడులు ప్రపంచాన్ని భయకంపితులను చేస్తున్నాయి. ఇది చాలదన్నట్టు ఈ సంక్షోభంలోకి ఇరాన్ వచ్చి చేరింది. హమాస్కు ఇరాన్ ఆర్థిక, ఆయుధ సాయం అందిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. సిరియాలో ఇజ్రాయిల్ దాడిలో ఇరాన్ అధికారులు చనిపోవడంతో ప్రతీకారంతో ఇరాన్ 300 డ్రోన్లతో ఇజ్రాయెల్పై విరుచుకపడింది.
తాజా ఉద్రిక్తతలు
ఇజ్రాయిల్, అమెరికా కలిసి ఇరాన్ను అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. సరిగ్గా ఈ తరుణంలోనే ఇరాన్ అధ్యక్షుడు అనుమానాస్పద హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం, ఈ ప్రమాదం వెనక ఇజ్రాయెల్- అమెరికా హస్తముందన్న విశ్లేషణలు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పరిస్థితులను మరింతగా దిగజార్చాయి. రెండు దేశాల మధ్య ఏ క్షణం ఏ జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయి కానీ..పాక్ వైఖరి ఎప్పుడెలా మారుతుందో చెప్పలేం. దేశప్రజలకు తింటానికి తిండిలేకపోయినా పట్టించుకోకుండా భారత్తో యుద్ధానికి దిగగలిగే తెంపరితనం పాకిస్థాన్ది. కాబట్టి ఇది ఎప్పుడూ సున్నితమైన అంశమే.
ఇక ఉత్తరకొరియా-దక్షిణకొరియా సంక్షోభం, చైనా-తైవానా తాజా ఉద్రిక్తతలు, ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ… ప్రపంచాన్ని మరో యుద్ధం వైపు నడిపిస్తుందన్న భయాందోళన నెలకొంది. ప్రధాని మోదీ చెప్పినట్టు యుద్ధంలో అంతిమంగా గెలిచేదెవ్వరు లేరనేది నిజం. కావాలని ఉద్రిక్తతలు రెచ్చగొట్టేదేశాలు, కవ్వింపులకు పాల్పడే నాయకులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మహాత్ముడు ప్రపంచానికి చాటిచెప్పిన శాంతిసందేశమే అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం.
International
‘గత ఒప్పందాల పట్ల గౌరవం ఉండాలి- బార్డర్లో శాంతి ఉంటేనే చైనాతో సత్సంబంధాలు!’ : జైశంకర్
![](https://infoline.one/wp-content/uploads/2024/07/1200-675-22050237-thumbnail-16x9-jai-shankar.jpg)
Jaishankar meets Chinese FM : చైనాతో సంబంధాలను ‘స్థిరపరచడానికి’, ‘పునర్నిర్మించడానికి’ వాస్తవాధీన రేఖతో పాటు గత ఒప్పందాల పట్ల ‘పూర్తి గౌరవం’ ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఆసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశాల్లో భాగంగా లావోస్ రాజధాని వియంటియాన్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో జైశంకర్ భేటీ అయ్యారు. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేసేదిశగా ఇరునేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు మంత్రి చెప్పారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చను కొనసాగించినట్టు భేటీ అనంతరం జైశంకర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సరిహద్దుల్లో పరిస్థితి తప్పనిసరిగా ఇరుదేశాల సంబంధాలపై ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకొంటే తప్ప చైనాతో సంబంధాలు మామూలుగా ఉండవని భారత్ స్పష్టం చేసింది.
International
US Presidential Election 2024 : అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు.. ఎక్స్లో వెల్లడి ..
![](https://infoline.one/wp-content/uploads/2024/07/Kamala-Harris_V_jpg-816x480-4g.webp)
Kamala Harris : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ పేరు ఖరారైంది. తన ‘ఎక్స్’ ఖాతాలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుపై సంతకం చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అన్ని ఓట్లూ పొందేందుకు కృషి చేస్తానని అన్నారు. నవంబర్ లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ లో జరగనున్నాయి. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ నామినేట్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి.
ప్రధానంగా కమలాహారిస్ పేరు వినిపించింది. కమలాహారిస్ కు పోటీగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా పేరు తెరపైకి వచ్చింది. అయితే, శుక్రవారం ఆ విషయంపై క్లారిటీ వచ్చేసింది. కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఒబామా, ఆయన సతీమణి సమర్ధించారు. కమలహారిస్ కు ఫోన్ చేసి తమ మద్దతును తెలియజేశారు. మా స్నేహితురాలు కమలాహారిస్ కు నేను, మిషెల్ కొద్దిరోజుల క్రితం ఫోన్ చేశాం. ఆమె అమెరికాకు అధ్యక్షురాలు అవుతారని మేం భావిస్తున్నాం. మా పూర్తి మద్దతును ఆమెకు తెలియజేశామని చెప్పారు. దీనికితోడు పార్టీలో కీలక నేతలంతా కమలా హారిస్ అభ్యర్థిత్వానికి మద్దతు పలకడంతో అమెరికా డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పేరు ఖరారైంది.
Today, I signed the forms officially declaring my candidacy for President of the United States.
I will work hard to earn every vote.
And in November, our people-powered campaign will win. pic.twitter.com/nIZLnt9oN7
— Kamala Harris (@KamalaHarris) July 27, 2024
ఇప్పటికే అమెరికాలో ప్రచారం హోరెత్తుతోంది. అమెరికా డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ పేరు ప్రముఖంగా ఉండటంతో.. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆమెను టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. దీంతో కమలాహారిస్ అభ్యర్థిత్వం ఖరారు కాకముందే ట్రంప్ వర్సెస్ హారిస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ప్రస్తుతం కమలాహారిస్ అభ్యర్థిత్వం ఖరారు కావటంతో ట్రంప్, హారిస్ ల మధ్య పోరు రసవత్తరంగా మారనుంది.
International
Elon Musk : ఆ ‘వోక్మైండ్ వైరస్’ నా కొడుకును బలి తీసుకుంది.. నన్ను మభ్యపెట్టారన్న మస్క్.. తీవ్రంగా ఖండించిన కుమార్తె!
![](https://infoline.one/wp-content/uploads/2024/07/240725-elon-musk-vivian-jenna-wilson-transgender-cs-8a4956.webp)
Elon Musk : టెక్ బిలియనీర్, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన లింగమార్పిడి ప్రక్రియను తప్పుబట్టారు. లింగమార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారిన తన కుమారుడు ‘వోక్మైండ్ వైరస్’ కారణంగానే బలైపోయాడంటూ మస్క్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల్లో లింగమార్పిడి ప్రక్రియను మస్క్ తప్పుబట్టారు. ఈ ప్రక్రియ తనకు ఇష్టం లేకపోయినా మభ్యపెట్టి మరి లింగమార్పిడి సర్జరీకి తనతో సైన్ చేయించారని మస్క్ చెప్పారు.
అప్పట్లో కరోనా సమయంలో ప్రపంచమంతా అల్లకల్లోమైన పరిస్థితులు.. నా మనసు చాలా గందరగోళంగా అనిపించేది. లింగమార్పిడి చేయనిపక్షంలో ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని చెప్పారని, అసలు వాస్తవాలను దాచిపెట్టి తనను మబ్యపెట్టారంటూ మస్క్ వాపోయారు.
ఒక మాటలో చెప్పాలంటే.. ‘‘ఇది స్టెరిలైజేషన్ లాంటిందిగా పేర్కొన్నారు. అత్యంత దుర్మార్గమైన చర్య.. ఇలాంటి ప్రక్రియను ప్రోత్సహిస్తున్న వారందరిని జైలుకు పంపాలి‘‘ అంటూ మస్క్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక్కడ.. వోక్మైండ్ వైరస్ అనే పదాన్ని ‘‘సామాజిక సమస్యలపై అతిగా స్పందించడం‘‘ ఉద్దేశించి మస్క్ మాట్లాడారు.
2008లో మస్క్ మాజీ భార్య జస్టిన్ విల్సన్తో విడాకులు తీసుకున్నారు. వీరికి జేవియర్ అలెగ్జాండర్, గ్రిఫ్పిన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, వారిలో ఒకరైన జేవియర్ నాలుగేళ్ల కిందట లింగమార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారాడు. తన తండ్రిలా ఆకారం, ఏ రూపంలోనూ ఎలాంటి సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్లుగా వివియన్ జెనా విల్సన్గా పేర్కొన్నాడు. లింగమార్పిడి అనంతరం వివియన్ జెనా విల్సన్గా జేవియర్ పేరు మార్చుకున్నాడు.
నేనే అతన్ని తిరస్కరించాను.. మస్క్ వ్యాఖ్యలపై కుమార్తె విల్సన్ :
ఎలన్ మస్క్ కుమార్తె 20 ఏళ్ల వివియన్ జెన్నా విల్సన్.. తన లింగ పరివర్తనపై తండ్రి వాదనలను తీవ్రంగా ఖండించింది. “వోక్మైండ్ వైరస్”పై మస్క్ వ్యాఖ్యలను బహిరంగంగానే ఆమె తప్పుబట్టింది. థ్రెడ్స్ వేదికగా 13వేల మంది ఫాలోవర్లతో మాట్లాడుతూ.. తానే మస్క్ని తిరస్కరించానని, మరో విధంగా కాదని స్పష్టం చేసింది. మస్క్ చేసిన ట్వీట్ను తప్పుబడుతూ వరుస ట్వీట్లను చేసింది. ‘‘జేవియర్ స్వలింగ సంపర్కుడిగా జన్మించాడు. కొద్దిగా ఆటిస్టిక్ (ఆటిజం)గా ఉన్నాడు. మానసిక పరమైన ఎదుగుదల లేదు.
లింగ డిస్ఫోరియా లక్షణాలను కలిగి ఉన్నాడు. అతను దాదాపు 4 ఏళ్ల వయస్సు నుంచి నాకు తెలుసు. తనకు జాకెట్ ధరించాలని ఉందని చెప్పేవాడు. కానీ అతడు అమ్మాయి కాదు’’ అంటూ మస్క్ పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన విల్సన్.. తండ్రి వ్యాఖ్యలను పూర్తిగా తప్పు అంటూ లేబుల్ చేసింది. మస్క్ సానుభూతి పొందేందుకు వాటిని కల్పించినట్లు తెలిపింది. తన పరివర్తనకు సంబంధించిన వాస్తవాలను తప్పుగా సూచించారని ఆమె ఆరోపించింది.
-
Business2 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career2 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
Business2 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
Business2 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National3 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
News2 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Education2 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National2 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh2 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Crime News2 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Spiritual2 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National2 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
National2 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh2 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh2 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Political1 month ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
National1 month ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
National2 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Andhrapradesh2 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Andhrapradesh1 month ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Railways1 month ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
Telangana2 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Andhrapradesh2 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Political2 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh2 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh2 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Andhrapradesh1 month ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh1 month ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
International2 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Business2 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Spiritual2 months ago
Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?
-
News3 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
National2 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
News2 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
International1 month ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Education1 month ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
News2 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh2 months ago
AP Schools Reopen Date 2024: ఏపీలో వేసవి సెలవుల పొడిగింపు.. తిరిగి బడి గంట మోగేది అప్పుడే!
-
Hyderabad1 month ago
ఏపీలో చంద్రబాబు వస్తే హైదరాబాదుకు వచ్చిన నష్టం ఏమీ లేదు… పొంగులేటి
-
Cinema2 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
-
Cinema4 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Andhrapradesh1 month ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
Andhrapradesh5 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Andhrapradesh2 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Weather1 month ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
National2 months ago
ఒకే కుటుంబంలో 165మంది- ఓట్ల కోసం ఫ్యామిలీ చుట్టూ నేతలు! అందరూ చర్చించే ఓటేస్తారట! – Voters In One Family In Bihar
-
Railways2 weeks ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh2 months ago
ఏపీలో ఆ శాఖ ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ మరో రెండేళ్లు పొడిగింపు
-
Life Style2 months ago
Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు
-
National2 months ago
Loksabha : ఈనెల 24 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు….. స్పీకర్ ఎన్నిక!