International
విశ్వశాంతికి ముప్పుగా మారిన పరిస్థితులు ఇవే..
భారత్, పాకిస్థాన్ వివాదంతో పాటు ప్రపంచంలో సున్నితమైన అంశాలుగా చైనా-తైవాన్, ఉత్తరకొరియా, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్-ఇరాన్ నిలిచాయి. రష్యా-యుక్రెయిన్ యుద్ధం కన్నా ముందే.. 2021లో చైనా-తైవాన్ మధ్య యుద్ధం జరుగుతుందన్న సందేహాలు నెలకొన్నాయి. ఇక ఉత్తరకొరియా-దక్షిణ కొరియా మధ్య మరోసారి యుద్ధవాతావరణం నెలకొంది.
వరుస క్షిపణి ప్రయోగాలతో ఉత్తరకొరియా కవ్విస్తోంది. యుద్ధం వస్తే ఎలా తప్పించుకోవాలన్న దానిపై దక్షిణకొరియా ప్రజలు రిహార్సల్స్ చేసుకుంటున్నారు. అటు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్ దాడులు, ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం వెనక ఇజ్రాయెల్-అమెరికా కుట్ర ఉందన్న ఆరోపణలతో పరిస్థితులు దిగజారాయి. ఈ పరిణామాలన్నీ ప్రపంచాన్ని మరింత గందరగోళంలోకి నెట్టివేస్తున్నాయి.
విద్వేషం పాలించే దేశం ఉంటుందా… విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా.. ఉందంటే అది మనిషిది అయి ఉంటుందా… ఆయువు పోసే ఆయుధముంటుందా… అని ఓ తెలుగు పాటలో ప్రశ్నించారు సిరివెన్నెల. ప్రపంచదేశాలన్నీ సుహృద్భావంతో ఉంటేనే ప్రజలందరూ బాగుంటారు. ఒకదేశంతో మరో దేశం అభివృద్ధి విషయంలో, పాలన విషయంలో, ప్రజలకు సౌకర్యాలు అందించడంలో పోటీపడాలి కానీ… రాజుల కాలంలోలా రాజ్యవిస్తరణ కోసం, ఆధిపత్యం కోసం పనిచేయకూడదు.
కానీ కొన్నిదేశాలు ఇదే పనిచేస్తున్నాయి. పొరుగు దేశాల మధ్య గొడవలు పెట్టి..ఆయుధవ్యాపారం, పెత్తనమూ సాగిస్తున్నాయి. ఈ క్రమంలో సరిహద్దుదేశాలు శత్రుదేశాలుగా మిగిలిపోతున్నాయి. మరికొన్నిదేశాలకు విభేదాలు వారసత్వంగా వచ్చాయి. వాటిని చర్చలతో పరిష్కరించుకోకుండా విభేదాలను మరింత పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నారు పాలకులు. యుద్ధం ఎంత చేదుఫలాలనిస్తుందో రెండు ప్రపంచ యుద్ధాలు, తర్వాతి కాలంలో రెండు దేశాల మధ్య జరిగిన అనేక యుద్ధాలు నిరూపించినా… ఆ అనుభవాలనుంచి ఎవరూ గుణపాఠాలు నేర్చుకోలేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.
ద్రవ్యోల్బణం కొత్త రికార్డులు
ప్రపంచంలో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి, శ్రీలంక దివాళా తీయడానికి కారణం కరోనాతో పాటు వెనువెంటనే మొదలైన రష్యాయుక్రెయిన్ యుద్ధం. అది రెండు దేశాల మధ్య యుద్ధమే అయినా ప్రపంచదేశాలన్నింటిపై ఆ ప్రభావం పడింది. చాలా దేశాల్లో నిత్యావసరాల ధరలు చుక్కలనంటాయి. ద్రవ్యోల్బణం కొత్త రికార్డులు సృష్టించింది.
అయినా సరే..కొన్ని దేశాల వైఖరిలో మార్పు రావడం లేదు. యుద్ధోన్మాద చర్యలను తగ్గించుకోవడం లేదు. చైనా-తైవాన్, ఉత్తరకొరియా-దక్షిణ కొరియా, ఇజ్రాయెల్-ఇరాన్ ఈ జాబితా కిందకే వస్తాయి. ఈ దేశాలు కావాలని ఉద్రిక్తతలను పెంచుకుంటున్నాయి. యుద్ధానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి.
1949లో తైవాన్ ఏర్పడిన దగ్గరినుంచి చైనాతో ఆ ప్రాంతానికి ఘర్షణలు కొనసాగుతున్నాయి. చైనా పునరేకీకరణ ఆ దేశ పాలకుల లక్ష్యంగా ఉంది. తైవాన్ను చాలా దేశాలు గుర్తించలేదు. అనేకసార్లు చైనా-తైవాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. తైవాన్ స్వతంత్రత గురించి మాట్లాడినప్పుడల్లా….చైనా భారీగా బలగాలను మోహరించడం, తైవాన్ జలసంధిలో యుద్ధ నౌకలను మోహరించడం, తైవాన్ భూభాగాలను ధ్వంసం చేయగలిగే క్షిపణులను పరీక్షించడం వంటి చర్యలతో భయపెట్టే ప్రయత్నం చేస్తుంటోంది.
తైవాన్ను ప్రత్యక్షంగా గుర్తించకపోయినప్పటికీ పరోక్షంగా ఆ దేశానికి అమెరికా అండదండలున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో…యుక్రెయిన్కు పరోక్ష సాయం అందించినట్టుగా కాకుండా తైవాన్ కోసం అమెరికా స్వయంగా యుద్ధరంగంలోకి దిగుతుందన్న అంచనాలున్నాయి. చిన్నదేశమైనప్పటికీ..ప్రపంచానికి అవసరమైన కంప్యూటర్స్ చిప్స్ తయారీలో సగం అవసరాలను తైవానే తీరుస్తోంది. తైవాన్కు, అమెరికాకు మధ్య గట్టి వాణిజ్యసంబంధాలున్నాయి.
దీంతో చైనా-తైవాన్ మధ్య యుద్ధం వస్తే అది ఆ రెండు దేశాలతో ఆగదని, అమెరికా రంగంలోకి దిగితే పరిణామాలు మారిపోతాయని ఎప్పుడూ ఆందోళన వ్యక్తమవుతూనే ఉంటుంది. అయినా సరే చైనా పునరేకీకరణ గురించి ఆ దేశ పాలకులు మాట్లాడుతూనే ఉంటారు. తాజాగా తైవాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో చైనా మరోసారి కవ్వింపులకు దిగింది.. తైవాన్ చుట్టూ పనిష్మెంట్ డ్రిల్స్ నిర్వహిస్తోంది.
తైవాన్ కొత్త అధ్యక్షునిగా లై చింగ్ బాధ్యతలు చేట్టారు. తైవాన్ కొత్త అధ్యక్షుణ్ణి చైనా వేర్పాటువాదిగా ఆరోపిస్తూ ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ బలగాలను మోహరించింది. చైనాకు గట్టిగా బదులిచ్చేందుకు తైవాన్ కూడా సరిహద్దులకు భారీగా బలగాలను తరలిస్తోంది. మొత్తంగా రెండు దేశాల మధ్య మరోసారి యుద్ధవాతావరణం నెలకొంది.
ఇక 70 ఏళ్లగా ఎప్పుడూ యుద్ధవాతావరణంలో ఉంటున్న ఉత్తరకొరియా – దక్షిణకొరియా మధ్య మళ్లీ పరిస్థితులు దిగజారాయి. దక్షిణకొరియాకు అన్నివిధాలా మద్దతుగా ఉండే అమెరికాలో ఈ ఏడాది ఎన్నికలు జరగనుండడంతో ఉత్తరకొరియా ఏదో ఒక చర్యకు పాల్పడవచ్చన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఖండాంతర క్షిపణులను, క్రూజ్ క్షిపణులను వరుసగా ప్రయోగిస్తోంది.
గత నెలలో ఆర్మీయూనివర్శిటీని సందర్శించిన సమయంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తమ సైన్యాధికారులు, సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, ఆ సమయం వచ్చేసిందని పిలుపునివ్వడం సంచలనం సృష్టించింది. సాధారణంగా క్షిపణుల పరీక్షల సమయంలో, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో కిమ్ యుద్ధం గురించి మాట్లాడుతూ ఉంటారు.
అయితే ఈ సారి ఇవే మాటలను కిమ్ కాస్త గట్టిగా చెప్పారని…యుద్ధం గురించి హెచ్చరికగా మాట్లాడారని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. యుద్ధం ఎప్పుడైనా రావొచ్చని భావించే దక్షిణ కొరియా ప్రజలు ఎప్పటిలానే ఇప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యుద్ధం నుంచి సురక్షితంగా తప్పించుకునే నీరు, ఆహారం, మ్యాప్, దిక్సూచి, గ్యాస్ మాస్క్, శరీరానికి ధరించే కవచం వంటివాటితో ఓ కిట్ సిద్ధంగా ఉంచుకుంటున్నారు. కిమ్ రష్యాకు ఆయుధసాయం అందిస్తున్నారు.
రష్యాతో రాజకీయ సంబంధాలను మెరుగుపర్చుకున్నారు. ప్రస్తుతానికి ఉత్తరకొరియా, దక్షిణకొరియా మధ్య యుద్ధం తప్పదన్న సంకేతాలు కనిపించనప్పటికీ.. ఒక వేళ యుద్ధమంటూ జరిగితే ఉత్తరకొరియాకు మద్దతుగా రష్యా, చైనా, దక్షిణకొరియాకు మద్దతుగా జపాన్, అమెరికా రంగంలోకి దిగుతాయి. ఆ పరిస్థితులు మూడో ప్రపంచయుద్ధానికి దారితీసే ప్రమాదముంది.
ఇక ప్రపంచాన్ని శాంతికి దూరం చేస్తున్న మరో సంక్షోభం ఇరాన్-ఇజ్రాయెల్. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఎప్పుడూ ఉద్రిక్త పరిస్థితులే ఉంటాయి. గత అక్టోబరు నుంచి గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతీకారదాడులు ప్రపంచాన్ని భయకంపితులను చేస్తున్నాయి. ఇది చాలదన్నట్టు ఈ సంక్షోభంలోకి ఇరాన్ వచ్చి చేరింది. హమాస్కు ఇరాన్ ఆర్థిక, ఆయుధ సాయం అందిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. సిరియాలో ఇజ్రాయిల్ దాడిలో ఇరాన్ అధికారులు చనిపోవడంతో ప్రతీకారంతో ఇరాన్ 300 డ్రోన్లతో ఇజ్రాయెల్పై విరుచుకపడింది.
తాజా ఉద్రిక్తతలు
ఇజ్రాయిల్, అమెరికా కలిసి ఇరాన్ను అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. సరిగ్గా ఈ తరుణంలోనే ఇరాన్ అధ్యక్షుడు అనుమానాస్పద హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం, ఈ ప్రమాదం వెనక ఇజ్రాయెల్- అమెరికా హస్తముందన్న విశ్లేషణలు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పరిస్థితులను మరింతగా దిగజార్చాయి. రెండు దేశాల మధ్య ఏ క్షణం ఏ జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయి కానీ..పాక్ వైఖరి ఎప్పుడెలా మారుతుందో చెప్పలేం. దేశప్రజలకు తింటానికి తిండిలేకపోయినా పట్టించుకోకుండా భారత్తో యుద్ధానికి దిగగలిగే తెంపరితనం పాకిస్థాన్ది. కాబట్టి ఇది ఎప్పుడూ సున్నితమైన అంశమే.
ఇక ఉత్తరకొరియా-దక్షిణకొరియా సంక్షోభం, చైనా-తైవానా తాజా ఉద్రిక్తతలు, ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ… ప్రపంచాన్ని మరో యుద్ధం వైపు నడిపిస్తుందన్న భయాందోళన నెలకొంది. ప్రధాని మోదీ చెప్పినట్టు యుద్ధంలో అంతిమంగా గెలిచేదెవ్వరు లేరనేది నిజం. కావాలని ఉద్రిక్తతలు రెచ్చగొట్టేదేశాలు, కవ్వింపులకు పాల్పడే నాయకులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మహాత్ముడు ప్రపంచానికి చాటిచెప్పిన శాంతిసందేశమే అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం.
International
యుద్ధం ముగించేందుకు సిద్ధం- జెలెన్స్కీతో మాత్రం మాట్లాడం: పుతిన్ – PUTIN ON RUSSIA UKRAINE WAR
Putin On Russia Ukraine War : ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఇందుకోసం ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎలాంటి ముందస్తు షరతులు కూడా పెట్టబోమని చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాత్రం మాట్లాడే ప్రసక్తి లేదని పుతిన్ స్పష్టం చేశారు. ఆ దేశ పార్లమెంటుతో మాత్రమే తాము చర్చలు జరుపుతామని చెప్పారు.
‘భూభాగాన్ని ఆక్రమిస్తూనే ఉన్నాం’
అయితే ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాదికి వాయిదా పడ్డాయని తెలిపారు. జెలెన్స్కీని తాము చట్టబద్ధ అధ్యక్షుడిగా చూడటం లేదని అన్నారు. గురువారం పుతిన్ నాలుగున్నర గంటల పాటు సాగిన వార్షిక విలేకరుల సమావేశంలో వివిధ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఉక్రెయిన్తో యుద్ధంలో తాము విజయానికి చేరువలో ఉన్నామని తెలిపారు. తమ దళాలు రోజుకొక చదరపు కిలోమీటర్ భూభాగాన్ని ఆక్రమిస్తూనే ఉన్నామని పుతిన్ చెప్పారు. తాము చేపట్టిన ప్రత్యేక సైనిక ఆపరేషన్ విజయవంతమవుతోందని అన్నారు.
‘ట్రంప్ను కలవడానికి నేను సిద్ధం’
మరోవైపు, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్తో నాలుగేళ్లుగా తాను మాట్లాడలేదని అయితే ఆయన్ను కలవడానికి తాను సిద్ధంగా ఉన్నానని పుతిన్ చెప్పారు. అంతకుముందు అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడిపై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. ఆయన తెలివైన రాజకీయ నేత అని అన్నారు. అయితే, ఇటీవల ఆయనపై జరిగిన హత్యాయత్నాలు దిగ్భ్రాంతి కలిగించాయన్న పుతిన్, ప్రస్తుతం ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల ప్రచారంలో జరిగిన ఘటనలను గుర్తుచేసుకున్నారు.
“అమెరికా ఎన్నికల్లో ట్రంప్పై పోరాడేందుకు కొందరు అనాగరిక పద్ధతులు పాటించారు. ఆయన కుటుంబాన్ని, పిల్లలను లక్ష్యంగా చేసుకొని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడం దిగ్భ్రాంతి కలిగించింది. ఒకటికంటే ఎక్కువసార్లు ఆయనపై హత్యాయత్నాలు జరగడం విచారకరం. నా ఆలోచన ప్రకారం ఇప్పుడు ట్రంప్ ఏమాత్రం సురక్షితంగా లేరు. అయితే ఆయన తెలివైన వ్యక్తి. ముప్పును అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉంటారని విశ్వసిస్తున్నా” అని పుతిన్ తెలిపారు.
International
అమెరికాకు తప్పిన షట్ డౌన్ ముప్పు! నిధుల బిల్లుకు చివరి క్షణంలో ఆమోదం – US SHUTDOWN 2024
US Shutdown 2024 : అమెరికా షట్డౌన్ గండం నుంచి తప్పించుకున్నట్లే కనిపిస్తోంది. ట్రంప్ డిమాండ్లతో నిలిచిపోయిన కీలక నిధుల బిల్లును ప్రతినిధుల సభ చివరి క్షణంలో ఆమోదం తెలిపింది. శుక్రవారం అర్ధరాత్రిలోగా ఉన్న గడువుకు కొన్ని గంటల ముందు అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశపెట్టిన కొత్త ప్రణాళికకు ప్రతినిధుల సభ ఆమోదించింది. అయితే, అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేవనెత్తిన డిమాండ్లను ఈ ప్లాన్ నుంచి తొలగించింది. అనంతరం ఈ బిల్లును సెనెట్కు పంపింది. అక్కడ కూడా ఆమోదం లభిస్తే అమెరికాకు షట్డౌన్ ముప్పు తొలగిపోతుంది.
బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన రిపబ్లికన్లు
ప్రభుత్వ కార్యకలాపాలు, జీతాలకు సంబంధించి ప్రభుత్వానికి నిధులు సమకూర్చేలా బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును తొలుత ట్రంప్ తిరస్కరించారు. సమాఖ్య ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం సహా వివిధ ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించేందుకు ఈ బిల్లులో రెండేళ్లపాటు రుణాలపై పరిమితిని ఎత్తివేయాలంటూ కోరారు. దీంతో ట్రంప్ ప్రతిపాదనను చేరుస్తూ ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ గురువారం సరికొత్త బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే, దీన్ని ప్రతినిధుల సభ 235-174తో తిరస్కరించింది. ఏకంగా 38 మంది రిపబ్లికన్ సభ్యులే డెమొక్రాట్లతో కలిసి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.
‘అధికార మార్పిడికి అంతరాయం’
అయితే తాజా పరిణామాలపై వైట్ హౌస్ స్పందించింది. షట్డౌన్ వస్తే అధికార మార్పిడికి అంతరాయం కలుగుతుందని వ్యాఖ్యానించింది. దీంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అటు రిపబ్లికన్ల నుంచే వ్యతిరేకత రావడం వల్ల ఈ బిల్లులో మళ్లీ మార్పులు చేశారు. ట్రంప్ చేసిన డిమాండ్లను తొలగించి సమాఖ్య కార్యకలాపాలకు నిధులు, విపత్తు సహకారం వంటి అంశాలతో 118 పేజీల మరో కొత్త ప్యాకేజీ బిల్లును స్పీకర్ మైక్ జాన్సన్ శుక్రవారం సభలో ప్రవేశపెట్టారు. దీనికి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఈ బిల్లుకు 366-34తో ప్రతినిధుల సభ ఆమోదం లభించింది. మెజారిటీ రిపబ్లికన్లు ఈ కొత్త బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. అనంతరం దీన్ని సెనెట్కు పంపించారు. ప్రస్తుతం సెనెట్లో డెమొక్రాట్లకు ఆధిక్యం ఉంది. దీంతో అక్కడ కూడా బిల్లు సునాయాశంగా ఆమోదం పొందే అవకాశం ఉంది. శుక్రవారం అర్ధరాత్రిలోగా (అమెరికా కాలమానం ప్రకారం) సెనెట్ ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది.
ట్రంప్ హయాంలో షట్డౌన్
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు ప్రభుత్వం మూతపడింది. దేశ చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్డౌన్గా నిలిచింది. ఈ సారి కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయనుకున్నా ఆఖరి నిమిషంలో అమెరికాకు షట్డౌన్ ముప్పు తప్పింది.
International
భారత్, చైనాల మధ్య శాంతికి రోడ్ మ్యాప్.. సంబంధాల బలోపేతానికి ఆరు సూత్రాల ప్రణాళిక
సరిహద్దుల్లోని తూర్పు లడఖ్ వద్ద ఘర్షణతో భారత్, చైనాల మధ్య దాదాపు ఐదేళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు స్తంభించిపోయాయి. ఈ తరుణంలో సంబంధాల పునరుద్దరణకు ఇరు దేశాలూ ముందుడుగు వేశాయి. బీజింగ్లో బుధవారం భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధులు భేటీ అయ్యాయి. ఈ ప్రతినిధుల బృందానికి భారత్ నుంచి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా నుంచి విదేశాంగ మంత్రి వాంగ్ యీ నేతృత్వం వహించారు. చర్చల్లో శాంతి స్థాపనకు రోడ్ మ్యాప్, సంబంధాల బలోపేతానికి ఆరు సూత్రాల ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించారు. టిబేట్ మీదుగా కైలాస మానసరోవర యాత్ర పునరుద్ధరణ, నదీజలాల వివరాలను పంచుకోవడం, పరస్పరం వాణిజ్యం పెంపు వంటి అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు.
సానుకూల వాతావరణంలో ఈ చర్చలు సాగాయని, ఆరు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చైనా ప్రకటించింది. ‘దశల వారీగా రోడ్మ్యాప్పై అంగీకారానికి వచ్చాం… ఇది వివాదాస్పద అంశాలను పక్కనబెట్టి సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సమస్యలను సులభంగా పరిష్కరించడానికి సహకరిస్తుంది’ అని చైనా తెలిపింది.అయితే, భారత్ మాత్రం దానిని ప్రస్తావించకపోవడం గమనార్హం. సైనిక బలగాల ఉపసంహరణపై అక్టోబరు 21న జరిగిన ఒప్పందం అమలు ఫలితంగా సరిహద్దుల్లో పెట్రోలింగ్ మొదలైందని భారత్ పేర్కొంది.
మొత్తం ద్వైపాక్షిక సంబంధాల నుంచి సరిహద్దు వివాదాలను వేరుచూసి.. సరైన రీతిలో పరిష్కరించుకోవాలని తద్వారా ఆ ప్రభావం సంబంధాలపై పడకుండా చూసుకోవాలని నిర్ణయించారు. సముచిత, సహేతుక, పరస్పర ఆమోదయోగ్యమైన ప్యాకేజీలకు ఇకపైనా కట్టుబడి ఉండాలని, శాంతికి విఘాతం కలగకుండా చూసుకోవాలని తీర్మానించారు.
అలాగే, ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, సైనిక-దౌత్యపరమైన చర్చలను సమన్వయంతో మెరుగుపరచాలని నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో ప్రతినిధుల సమావేశాన్ని వచ్చే ఏడాది భారత్లో నిర్వహించాలని అవగాహనకు వచ్చారు. కాగా, సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు ప్రత్యేక ప్రతినిధులు 2003 నుంచి ఇప్పటివరకు 22సార్లు భేటీ అయ్యి చర్చలు జరిపారు. ప్రస్తుతం జరిగింది 23వ సమావేశం. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిని నెలకొల్పడం, ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్దరణ ఈ చర్చల లక్ష్యం.
వివాదాస్పద పాయింట్ల దెమ్చోక్, దెప్సాంగ్ల నుంచి సైన్యాల ఉపసంహరణకు అక్టోబరు 21న ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో పాటు అక్టోబరు 24న రష్యాలోని కజాన్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రత్యేకంగా భేటీ అయి సయోధ్యకు మార్గం వేశారు.
-
Business8 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career8 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News8 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business8 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National8 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business8 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International8 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education7 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National7 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh7 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Crime News7 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh7 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana8 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Spiritual7 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
Railways7 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National8 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
National7 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Andhrapradesh7 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh7 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
National7 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Andhrapradesh7 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
National7 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh11 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Political7 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
National8 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh7 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Andhrapradesh7 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Political7 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh7 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
National8 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Cinema10 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Business8 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Andhrapradesh7 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh6 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
International8 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Education7 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Weather7 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
International8 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
News8 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
News7 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh7 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
Andhrapradesh7 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Railways6 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Business8 months ago
Bank Holidays June-2024: జూన్లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Andhrapradesh8 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
News7 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh7 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
International7 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Cinema8 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
-
Andhrapradesh7 months ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…