Latest
Ayodhya Ramalayam: ‘శ్రీరామనవమి’కి అయోధ్యలో అద్భతం జరగనుంది.. అదెంటో తెలుసా?
Ayodhya Ramalayam:అయోధ్యలో కొలువైన రామ్ లల్లాను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో 2024 జవనరి 22న బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
అత్యాధునికమైన, సాంప్రదాయ విలువలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలయంలో ఈ శ్రీరామనవమికి ఓ అద్భుతం జరగనుంది. ప్రతీ శ్రీరామనవమికి రామాలయంలో ప్రత్యేక పూజలు ఉంటాయి. కానీ ఈసారి అయోధ్య ఆలయంలో జరిగే విశేషాలేంటంటే?
అయోధ్య రామమందిరం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆలయంగా ప్రఖ్యాతి చెందింది. ప్రస్తుతం అంకోర్ వాట్ లోని దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా రికార్డులో ఉంది. ఆ తరువాత తమిళనాడులోని రంగనాథ స్వామి ఆలయంగా పేరు తెచ్చుకుంది. అయోధ్య రామమందిరం లో ఎక్కడా ఇనుము, స్టీల్, సిమెంట్, కాంక్రీట్ వాడలేదు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి ప్రత్యేక శిలలను తెచ్చి నిర్మించారు. హైదరాబాద్ నుంచి ప్రధాన తలుపులను తీసుకొచ్చి సెట్ చేశారు. ఇక రిక్టర్ స్కేల్ పై 10 తీవ్రతతో భూకంపాలు వచ్చినా, మరే విపత్తులు ఏర్పడినా 2,500 ఏళ్ల పాటు ఆలయం ఉండేలా నిర్మించారు.
అయోధ్య రామాలయంలో ప్రతీ శ్రీరామనవమికి ఓ అద్భుతం చోటు చేసుకోనుంది. ఇప్పటి వరకు ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలోని మూల విరాట్ పై సూర్య కిరణాలు పడినట్లుగానే.. ఈసారి శ్రీరామనవిరోజు బాల రాముడి విగ్రహంపై సూర్యకిరణాలు ప్రసరించేలా నిర్మాణం చేపట్టారు. శ్రీరామనవమి రోజు బాలరాముడిని దర్శించుకునే భక్తులు ఈ అరుదైన దృశ్యాన్ని చూడొచ్చు.
దీనికి సంబందించి ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించారు. బాల రాముడి నుదుటిపై తిలకం లా సూర్యకిరణాలు పడేలా సెట్ చేశారు. లెన్స్ ప్రత్యేక అద్దాల సహాయంతో ఈ ప్రత్యేక వ్యవస్థను రూపొందించినట్లు ట్రస్ట్ అధికారులు వెల్లడించారు. ఈ దృశ్యాన్ని శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు మొదలై సుమారు 4 నిమిషాల పాటు ఉంటుందని తెలిపారు. సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇని స్టిట్యూట్ ఆధ్వర్యంలో దీనిని రూపొందించారు. 500 ఏళ్ల తరువాత అయోధ్యలో రాముడు జన్మస్థలంలో వేడుకలు జరగడం విశేషంగా చెప్పుకుంటున్నారు.
Latest
ఏపీ మంత్రివర్గ భేటీ – వాలంటీర్లు, ఉద్యోగుల పీఆర్సీపై కీలక నిర్ణయం..!!
ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 10న జరగనుంది. దసరా వేళ జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. అందులో భాగంగా వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన ఈ భేటీ లో కీలక నిర్ణయం ఉంటుందని సమాచారం. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలతో పాటుగా పీఆర్సీ నియామకం పైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
కీలక భేటీ
రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈనెల 10వ తేది సచివాలయంలోని మొదటి బ్లాక్లో జరుగనుంది. ఈ మేరకు బుధవారం సిఎస్ నీరబ్కుమార్ ప్రసాద్ వివిధ శాఖలకు జారీ చేసిన సర్య్కులర్లో హెచ్ఓడిలు 8వ తేది సాయంత్రం 4 గంటలలోగా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. మంత్రివర్గ సమావేశంలో మచిలీపట్నంపోర్టు అభివృద్ది, చెత్త పన్ను రద్దుకు ఆమోదం, పోలవరం, అమరావతి నిర్మాణాలు, ఇంటింటికీ మంచినీటి కుళాయిలు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, డ్వాక్రా సంఘాల తరహాలో స్వచ్చ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు పైన చర్చించి నిర్ణయం తీసుకోన్నారు.
హామీల అమలు
సూపర్ సిక్స్ పథకాల అమల్లో సంక్రాంతి నుంచి పి-4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, పేదరికంలేని సమాజం ఏర్పాటు దిశగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లడం లాంటి అంశాలపె కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలిసింది. సంక్రాంతి నుంచి పీ-4 అమలు పైన ముఖ్యమంత్రి సంకేతాలు ఇచ్చారు. దీపావళి నుంచి ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకం అమలు పైన మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఇక, ప్రస్తుతం ఆందోళన బాట పట్టిన వాలంటీర్ల అంశం పైన మంత్రివర్గంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. గత సమావేశంలోనే వీరికి సంబంధించి చర్చ వచ్చినా..పూర్తి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఉద్యోగుల అంశాలపై
అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న వేళ మంత్రుల పనితీరు పైన చంద్రబాబు సూచనలు చేసే అవకాశం ఉంది. ఇక..ఉద్యోగులు తమ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సమావేశం లో పీఆర్సీ నియామకం పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిషన్ తప్పుకుంది. దీంతో..దసరా వేళ కొత్త పీఆర్సీ నియామకం పైన నిర్ణయం చేస్తారని సమాచారం. దీంతో పాటుగా తిరుమల లడ్డూ వివాదంలో చోటు చేసుకున్న పరిణామాల పైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది
Latest
శునకానికి అరుదైన హార్ట్ సర్జరీ- దిల్లీ వైద్యుల ఘనత- ఆసియాలో ఇదే మొదటిసారి – Dog Heart Surgery
Dog Heart Surgery In Delhi : ఓ శునకానికి అరుదైన శస్త్ర చికిత్స చేశారు దిల్లీలోని పశువైద్య నిపుణులు. సంక్లిష్టమైన గుండె సమస్యను ఎదుర్కొంటున్న ఒక కుక్కకు కోతలేని గుండె సర్జరీ నిర్వహించారు. అయితే భారత ఉపఖండంలో ప్రైవేటు వైద్యులు ఇలాంటి సర్జరీని నిర్వహించడం ఇదే మొదటిసారి. ఏడేళ్ల వయసున్న జూలియట్ అనే శునకం రెండేళ్లుగా మైట్రల్ కవాటాల్లో సమస్యతో బాధపడుతోంది. ఈ భాగాల్లో వయసుతోపాటు వచ్చే క్షీణతల కారణంగా ఈ పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. శునకాల్లో వచ్చే గుండె సమస్యల్లో దీని వాటా 80శాతంగా ఉంది. దీంతో గుండె ఎడమ ఎగువ గదిలో రక్తప్రవాహం వెనక్కి వెళుతుంది. ఇక ఈ వ్యాధి ముదిరేకొద్దీ ఊపిరితిత్తుల్లో రక్తం, ద్రవాల పరిమాణం పెరిగుతుంది. ఇది క్రమంగా గుండె వైఫల్యానికి దారితీస్తుంది.
ఈ సమస్యతో బాధపడుతున్న జూలియట్కు దిల్లీలోని మ్యాక్స్ పెట్జ్ ఆసుపత్రి నిపుణులు, ట్రాన్స్కెథతర్ ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపెయిర్ (టీఈఈఆర్) అనే ప్రక్రియ ద్వారా సర్జరీ చేశారు నిర్వహించారు. ఈ ప్రక్రియలో భాగంగా శరీరానికి కోత పెట్టాల్సిన అవసరం లేకుండా రక్తనాళం గుండా ఒక సాధనాన్ని పంపి శస్త్రచికిత్స చేశారు. గుండె కొట్టుకుంటుండగానే ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశారు. గత నెల 30న ఈ శస్త్రచికిత్స జరిగింది. రెండు రోజుల అనంతరం ఆ శునకాన్ని డిశ్ఛార్జి చేశారు. ప్రస్తుతం శునకం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇలాంటి శస్త్ర చికిత్స చేయడం ఆసియాలోనే మొదటది, ప్రపంచంలోనే రెండోది అని తెలిపారు.
తొలిసారి కోతికి కంటిశుక్లం సర్జరీ
Monkey Cataract Surgery In Haryana : మనుషుల లాగానే కోతికి క్యాటరాక్ట్(కంటి శుక్లం) శస్త్ర చికిత్స చేసి కంటి చూపు వచ్చేలా చేశారు హరియాణా పశు వైద్యులు. హిసార్లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్(LUWAS) వారు ఈ సర్జరీ నిర్వహించారు. కోతికి ఈ తరహా చికిత్స చేయడం ఇదే మొదటిసారి అని వైద్యులు తెలిపారు.
హిసార్లోని ఓ కోతి కొద్ది రోజుల కిత్రం విద్యుత్ షాక్కు గురైంది. కాలిన గాయాలతో బాధపడుతున్న వానరాన్ని మునీశ్ కుమార్ అనే వ్యక్తి కాపాడి వెటర్నరీ విశ్వవిద్యాలయానికి తరలించాడు. వెటర్నరీ వైద్యులు కోతికి చికిత్స చేశారు. కొద్ది రోజులకు నడవగలిగింది. కానీ, ముందున్న వస్తువును గుర్తించలేకపోయింది. దీంతో మళ్లీ కోతిని పరిశీలించగా కంటి శుక్లాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వానరానికి క్యాటరాక్ట్ సర్జరీ నిర్వహించారు. ఈ సర్జరీ సక్సెస్ కావడం వల్ల కోతికి కంటిచూపు వచ్చింది.
Latest
IT Employees: ఐటీ ఉద్యోగులకు షాక్.. దిగ్గజ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్.. అలా చేయకుంటే తీసేస్తామంటూ..!
Cognizant Employees: నాస్డాక్ లిస్టెడ్ దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. పలు మార్లు చెప్పినా ఉద్యోగులు.. ఆఫీసుకు రాకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. తమ ఆదేశాల్ని ధిక్కరిస్తే ఊరుకునేదే లేదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 15న కాగ్నిజెంట్.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ గురించి కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు హెచ్చరికల్ని పంపినా ఆఫీసులకు రానివారిపై నిఘా పెట్టింది. సంబంధిత బిజినెస్ యూనిట్ సీనియర్లకు సమాచారం ఇచ్చారా లేరా అని ఆరా తీసింది. తమ మార్గదర్శకాల్ని లెక్కచేయని వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని ఆ లేఖలో పేర్కొంది. ఆఫీసులకు రాని వారు.. ఇప్పుడు వస్తే రావాలని.. లేకపోతే లేఆఫ్స్ చేస్తామని హెచ్చరించింది.
‘మా నియమ నిబంధనలు, ఆదేశాల్ని పాటించని వారు తీవ్ర దుష్ర్పవర్తనకు పాల్పడినట్లే పరిగణించాల్సి వస్తుంది. ఇది కంపెనీ నిబంధనలకు విరుద్దం. వీటిని ఉల్లంఘించిన వారికై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. కొన్ని సార్లు ఇది టెర్మినేషన్కు కూడా దారి తీయొచ్చు.’ అని కంపెనీ ఒక ఉద్యోగికి రాసిన లేఖలో ఇలా వెల్లడించింది.
అయితే కాగ్నిజెంట్ ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే.. ఉద్యోగుల్ని ఆఫీసులకు రావాలని స్పష్టం చేసింది. వారంలో కనీసం 3 రోజులు ఆఫీసుకు రావాలని.. మిగతా రోజులు వర్క్ ఫ్రమ్ హోం చేసుకోవచ్చని పేర్కొంది.
ఈ మేరకు అప్పట్లోనే కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ ఎస్ ఉద్యోగులకు ఒక మెమోలో పేర్కొన్నారు. కానీ వీటిని ఉద్యోగులు పెద్దగా పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగ్నిజెంట్ సంస్థలో మొత్తం 3,47,700 మంది ఉద్యోగులు ఉండగా.. దీంట్లో 2,45,000 మంది ఇండియాలోనే ఉండటం విశేషం. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో ఇండియాలోనే ఎక్కువగా ఉన్నట్లు వార్షిక నివేదికలో సంస్థ తెలిపింది. ఈ కంపెనీకి భారత్లో ప్రధాన ప్రత్యర్థులైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో కూడా 2023 చివర్లోనే ఉద్యోగులు .. ఆఫీసులకు రావాలని ఆదేశాలు జారీ చేశాయి.
టీసీఎస్.. ఏకంగా వారంలో 5 రోజులు కూడా ఆఫీసులకు వచ్చి పనిచేయాలని స్పష్టం చేయడం గమనార్హం. ఇక ఇటీవల కాగ్నిజెంట్ ఈ క్యాలెండర్ ఏడాది మొదటి ఆర్థిక సంవత్సరం ఫలితాల్ని ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన ఆదాయం 1.1 శాతం మేర తగ్గి 4.8 బిలియన్ డాలర్లకు చేరింది. నికర లాభం 6 శాతం పతనమై 546 మిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇక్కడ ఉద్యోగుల సంఖ్య ఒక్క త్రైమాసికంలో 3300 తగ్గింది. మొత్తంగా సంవత్సరంలో చూసినట్లయితే ఏకంగా 7100 వరకు తగ్గింది. ఇతర చాలా ఐటీ కంపెనీల్లో కూడా ఉద్యోగుల సంఖ్య ఇదే స్థాయిలో పడిపోయింది.
-
Business8 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career8 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News8 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business8 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National9 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business8 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International9 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education8 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National8 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Crime News8 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh7 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Andhrapradesh8 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana9 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Railways8 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
Spiritual8 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
National8 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
National8 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Andhrapradesh8 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh8 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh8 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
National8 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Andhrapradesh12 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
National8 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Political8 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh8 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
National9 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh8 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Andhrapradesh8 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Political8 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
National8 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Business9 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Andhrapradesh8 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh7 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
Cinema11 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
International9 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
International8 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
News9 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Education8 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Weather8 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
News8 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh8 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Andhrapradesh8 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
Railways7 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh8 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Business9 months ago
Bank Holidays June-2024: జూన్లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
News8 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Education12 months ago
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు
-
Andhrapradesh8 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
International8 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Andhrapradesh12 months ago
ప్రమాదపుటంచుల్లో ప్రపంచం