Connect with us

National

‘మోదీ 3.0’ కేబినెట్​లో 33 కొత్త ముఖాలు- ముగ్గురు మాజీ సీఎంలకు తొలిసారి అవకాశం – Firstime Ministers In Modi Cabinet

Published

on

మోదీ.0 కేబినెట్​లో 33మంది కొత్తవారు ఆదివారం కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అందులో ఆరుగురికి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. ఇక తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో చేరినవారిలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), మనోహర్ లాల్ ఖట్టర్ (హరియాణా), హెచ్‌డీ కుమారస్వామి (కర్ణాటక) ఉన్నారు. కొత్తగా కేబినెట్​లో చేరిన వారిలో బీజేపీ మిత్రపక్షాలకు చెందిన ఏడుగురు నేతలు ఉన్నారు. తెలంగాణ నుంచి బండి సంజయ్​ కుమార్​ ఉండగా, ఆంధ్రప్రదేశ్​లో బీజేపీ నుంచి భూపతి రాజు శ్రీనివాస వర్మ, టీడీపీ నుంచి కె రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్​ పెమ్మసాని తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో చేరారు.

బీజేపీ నుంచి తొలిసారి

  • శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్)
  • మనోహర్ లాల్ ఖట్టర్ (హరియాణా)
  • కమలేష్ పాశ్వాన్ (ఉత్తర్​ప్రదేశ్)
  • రవ్‌నీత్ సింగ్ బిట్టు (పంజాబ్)
  • రక్షా ఖడ్సే (మహారాష్ట్ర)
  • సురేష్​ గోపి (కేరళ)
  • సుకాంత మజుందార్ (బంగాల్)
  • దుర్గా దాస్ ఉకే (మధ్యప్రదేశ్)
  • రాజ్ భూషణ్ చౌదరి (బిహార్)
  • సతీష్ దూబే (బిహార్)
  • సంజయ్ సేథ్ (ఝార్ఖండ్)
  • సీఆర్ పాటిల్ (గుజరాత్)
  • భగీరథ్ చౌదరి (రాజస్థాన్)
  • హర్ష్ మల్హోత్రా (దిల్లీ)
  • వి సోమన్న (కర్ణాటక)
  • సావిత్రి ఠాకూర్ (మధ్యప్రదేశ్)
  • ప్రతాప్రావు జాదవ్ (మహారాష్ట్ర)
  • జార్జ్ కురియన్ (కేరళ)
  • కీర్తి వర్ధన్ సింగ్ (ఉత్తర్​ప్రదేశ్​)
  • భూపతి రాజు శ్రీనివాస వర్మ (ఆంధ్రప్రదేశ్)
  • నిముబెన్ బాంబ్నియా (గుజరాత్)
  • మురళీధర్ మోహోల్ (మహారాష్ట్ర)
  • పబిత్రా మార్గరీట (అసోం)
  • బండి సంజయ్ కుమార్ ( తెలంగాణ)
  • బీజేపీ మిత్ర పక్షాల నుంచి తొలిసారి

    • కె రామ్మోహన్ నాయుడు (టీడీపీ)
    • చంద్రశేఖర్​ పెమ్మసాని (టీడీపీ)
    • లాలన్ సింగ్ (జేడీయూ)
    • రామ్​నాథ్​ ఠాకూర్ (జేడీయూ)
    • జయంత్ చౌదరి(ఆర్​ఎల్​డీ)
    • చిరాగ్​ పాసవాన్ (ఎల్​జేపీ)
    • హెచ్​డీ కుమారస్వామి (జేడీ(ఎస్))

    ‘మోదీ 3.0’ కేబినెట్​లో మాజీ ముఖ్యమంత్రులు
    కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రిమండలిలో ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉండటం విశేషం. ఈ జాబితాలో గతంలో గుజరాత్‌ సీఎంగా పని చేసిన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (మధ్యప్రదేశ్‌), రాజ్‌నాథ్‌ సింగ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ (హరియాణా), సర్బానంద్‌ సోనోవాల్‌ (అసోం), హెచ్‌డీ కుమారస్వామి (కర్ణాటక), జితిన్‌ రామ్‌ మాంఝీ (బిహార్‌) ఉన్నారు. ఇందులో ఐదుగురు సీఎంలు బీజేపీకి చెందినవారు కాగా, కుమారస్వామి, మాంఝీలు జేడీ(ఎస్‌), హిందుస్థానీ అవామీ మోర్చాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

    ‘మోదీ 3.0’ కేబినెట్​లో మహిళలు
    ఆదివారం కొలువుదీరిన ‘మోదీ 3.0’ కేబినెట్​ ఏడుగురు మహిళలకు చోటు దక్కింది. వారిలో ఇద్దరు కేబినెట్‌ హోదా పొందారు. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్‌తో పాటు బీజేపీ ఎంపీలు అన్నపూర్ణాదేవి, శోభా కరంద్లాజే, రక్షా ఖడ్సే, సావిత్రి ఠాకుర్, నిముబెన్‌ బాంభణియా, అప్నాదళ్‌ ఎంపీ అనుప్రియా పటేల్‌ మంత్రి పదవులు సొంతం చేసుకున్నారు. నిర్మలా సీతారామన్, అన్నపూర్ణాదేవి కేబినెట్‌ హోదా పొందగా, మిగిలినవారు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. గత ప్రభుత్వంలో 10 మంది మహిళా మంత్రులు ఉండగా, ఈసారి ఆ సంఖ్య 7కు తగ్గింది.

    Continue Reading
    Advertisement
    Click to comment

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    National

    ‘కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే అలా చేశాం’- నేమ్ బోర్డుల ఏర్పాటుపై సుప్రీంలో యూపీ అఫిడవిట్​

    Published

    on

    UP Government On Kanwar Yatra Case : కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా ఆహారశాలలపై ప్రదర్శించాలన్న ఉత్తర్వులను తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం సమర్థించుకుంది. తీర్థయాత్ర శాంతియుతంగా, క్రమబద్ధంగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను వ్యతిరేకిస్తూ, సుప్రీంకోర్టుకు తాజాగా తమ వివరణను తెలియజేసింది. ఆహారశాలలు, తినుబండారాల పేర్ల విషయంలో సంశయం తలెత్తుతోందని యాత్రికులు ఫిర్యాదు చేశారని ప్రభుత్వం చెప్పింది. వారి ఆందోళనలను పరిష్కరించేందుకే ఉత్తర్వులు జారీ అయ్యాయని, అందుకు అనుగుణంగా పోలీసులు చర్యలు తీసుకున్నారని పేర్కొంది. అంతకుముందు యూపీ ప్రభుత్వ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. విక్రయించేది శాకాహారమా, మాంసాహారమా అనేది ప్రదర్శిస్తే సరిపోతుందని, హోటల్‌ యజమానులు ఎవరు అందులో పనిచేసేవారెవరు అనే వివరాల కోసం బలవంతం చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.

    Continue Reading

    National

    టీచర్​గా రాష్ట్రపతి- విద్యార్థులకు పాఠాలు చెప్పిన ముర్ము- స్పెషల్ ఏంటంటే? – Draupadi Murmu Teaching

    Published

    on

    Draupadi Murmu Teaching: దేశ ప్రథమ పౌరురాలిగా ద్రౌపదీ ముర్ము బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమె తనకెంతో ఇష్టమైన వృత్తి అయిన ఉపాధ్యాయురాలిగా మారారు. ప్రెసిడెంట్‌ ఎస్టేట్‌లోని డా.రాజేంద్ర ప్రసాద్‌ కేంద్రీయ విద్యాలయ పాఠశాలకు వెళ్లి తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. తొలుత విద్యార్థుల పేర్లు అడిగిన రాష్ట్రపతి వారి అభిరుచులు, లక్ష్యాలు తెలుసుకున్నారు. ఈ తరం విద్యార్థులు ఎంతో ప్రతిభావంతులని, సాంకేతికంగా వీరికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని ముర్ము అన్నారు.

    అనంతరం గ్లోబల్‌ వార్మింగ్‌పై వారికి బోధించారు. భావితరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. నీటి సంరక్షణ ప్రాముఖ్యాన్ని వివరించారు. పర్యావరణ మార్పు ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలని విద్యార్థులను ప్రోత్సహించారు. నీటి సంరక్షణ ప్రాముఖ్యాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌ (అమ్మ పేరుతో ఒక మొక్కను నాటండి)’ గురించి ప్రస్తావించారు. ప్రతీ విద్యార్థి తమ పుట్టిన రోజున ఓ మొక్క నాటాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.

    ఒడిశాకు చెందిన ద్రౌపదీ ముర్ము దేశ 15వ రాష్ట్రపతిగా 2022 జులై 25న ప్రమాణస్వీకారం చేశారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన తొలి ఆదివాసీ వ్యక్తిగా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ పదవిని చేపట్టిన అతి పిన్నవయస్కురాలు కూడా ద్రౌపది ముర్ము కావడం విశేషం. రాష్ట్రపతిగా ఆమె ప్రమాణస్వీకారం చేసే నాటికి ముర్ము వయసు 64 సంవత్సరాలు. కాగా, రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆమె ఝార్ఖండ్‌ గవర్నర్‌గా వ్యవహరించారు. అంతకుముందు ఆమె 1994- 97 మధ్య రాయ్‌రంగ్‌పూర్‌లోని శ్రీఅరబిందో ఇంటిగ్రెల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో గౌరవ అసిస్టెంట్‌ టీచర్‌గా వ్యవహరించారు.

    రాష్ట్రపతి భవన్​లో కొత్త పేర్లు
    దిల్లీ రాష్ట్రపతి భవన్‌లో రెండు హాల్స్‌ పేర్లు మారాయి. భవన్​లో దర్బార్ హాల్‌, అశోక్‌ హాల్‌ను ఇకనుంచి కొత్త పేర్లతో పిలవనున్నారు. ఈ మేరకు ప్రెసిడెంట్‌ సెక్రటేరియట్‌ వెల్లడించింది. వివిధ కార్యక్రమాలకు వేదికగా ఉంటున్న దర్బార్ హాల్​ను గణతంత్ర మండపం, అశోక్‌ హాల్‌ను అశోక్‌ మండపంగా పిలవనున్నారు.

    Continue Reading

    National

    Kargil Vijay Diwas 2024 : ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు.. కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ

    Published

    on

    PM Narendra Modi : భారత భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నించిన పాకిస్థాన్ సేనలను తరిమికొట్టిన భారత సైన్యం వీర పరాక్రమానికి ప్రతీక కార్గిల్ యుద్ధం. ఆ విజయగాథకు నేటితో పాతికేళ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో కార్గిల్ 25వ విజయ్ దివస్ ను పురస్కరించుకొని కార్గిల్ లోని ద్రాస్ లో యుద్ధవీరుల స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. అనంతరం యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు అంజలి ఘటించారు. అనంతరం అమర జవాన్ల సతీమణులు, కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ కొద్దిసేపు ముచ్చటించారు.

    ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. అమరుల త్యాగాలకు గుర్తుగా విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. దేశంకోసం సైనికులు చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయి. కార్గిల్ విజయం భారత సైనికుల పరాక్రమానికి నిదర్శనం. 1999లో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికులను కలిశాను. సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి. కార్గిల్ యుద్ధ సమయంలో సామాన్యుడిలా సైనికుల మధ్య ఉన్నాను. దేశంకోసం వారు చేసిన పోరాటం నా మదిలో నిలిచిపోయింది. పాకిస్థాన్ గత అనుభవాల నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదన్న మోదీ.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

    కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎక్స్ వేదికగా అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. 1999 నాటి కార్గిల్ యుద్ధంలో మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి జవాన్ కు నివాళులర్పించారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అమర జవాన్లకు నివాళులర్పించారు.

    Continue Reading
    Career17 hours ago

    IOCL Recruitment 2024: ఐఓసీఎల్ లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

    National17 hours ago

    ‘కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే అలా చేశాం’- నేమ్ బోర్డుల ఏర్పాటుపై సుప్రీంలో యూపీ అఫిడవిట్​

    National17 hours ago

    టీచర్​గా రాష్ట్రపతి- విద్యార్థులకు పాఠాలు చెప్పిన ముర్ము- స్పెషల్ ఏంటంటే? – Draupadi Murmu Teaching

    International17 hours ago

    ఆ లిస్ట్​ ప్రకారమే పరేడ్ – భారత్ ఏ ప్లేస్​లో రానుందంటే? – PARIS OLYMPICS 2024

    National17 hours ago

    Kargil Vijay Diwas 2024 : ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు.. కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ

    National2 days ago

    Zomato Delivery Boy : ఉండేది ముంబై మురికివాడలో.. నెలకు అద్దె రూ. 500.. జొమాటో డెలివరీ బాయ్ రియల్ లైఫ్ స్టోరీ..!

    Telangana2 days ago

    అరుదైన పురస్కారానికి ఎంపికైన చేనేత కళాకారుడు.. తెలంగాణ నుంచే ఎందుకంటే..

    National3 days ago

    సెంచరీ కొట్టిన ‘టమాటా’ – కొనలేక ‘టాటా’ చెబుతున్న సామాన్యుడు – Tomato prices in Hyderabad

    National3 days ago

    పోలవరం గుడ్ టైం స్టార్ట్ – ‘ప్రాజెక్టు బాధ్యతంతా మాదే – నిధులిచ్చి పూర్తి చేస్తామన్న కేంద్రం’ – CENTRAL GOVT FUNDS TO POLAVARAM

    International3 days ago

    ముదిరిన ఉత్తర కొరియా ‘చెత్త’యుద్ధం! సౌత్​ కొరియా అధ్యక్ష కార్యాలయంలో పడ్డ ట్రాష్​ బెలూన్స్​! – Korean Countries Balloons War

    National3 days ago

    వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ – తొమ్మిది ప్రాధాన్యాలతో కేటాయింపులు – Union Budget 2024

    International3 days ago

    మాల్‌లో వీధి పిల్లికి సెక్యూరిటీ గార్డ్ జాబ్.. ఈ ఐడియా అదుర్స్ కదూ..

    National3 days ago

    కన్వర్ యాత్ర చుట్టూ కాంట్రవర్సీలు.. సుప్రీంకోర్టు మెట్లెక్కిన నేమ్ బోర్డు ఇష్యూ

    International3 days ago

    US politics: డెమొక్రాట్లు, రిపబ్లికన్లలో భారత్‌కు అండగా నిలిచేదెవరు?

    International4 days ago

    ‘సీక్రెట్‌ సర్వీస్‌ వైఫల్యమే’- ట్రంప్‌పై కాల్పుల కేసులో డైరెక్టర్‌ అంగీకారం – Trump Shooting Case

    National4 days ago

    IT పరిశ్రమల ఒత్తిడి వల్లే 14గంటల వర్క్ ప్రతిపాదన ​: కర్ణాటక మంత్రి – 14 Hours Work In Karnataka

    Telangana4 days ago

    Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూల్‌ సమయాల్లో మార్పులు..

    National4 days ago

    RSS కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనే వీలు- దశాబ్దాల నాటి బ్యాన్ ఎత్తివేత- కాంగ్రెస్ ఫైర్ – RSS Ban Removed

    International4 days ago

    అమెరికా రాజకీయాల్లో మనోళ్ల సత్తా.. ఉన్నత పదవుల్లో ఇండియన్ అమెరికన్స్

    International4 days ago

    షాకింగ్.. సింగర్ ప్రాణం తీసిన ఫ్యాన్..! అసలేం జరిగిందంటే..

    Andhrapradesh4 days ago

    అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలోకి డబ్బులు, నెలాఖరుకు పక్కా

    National4 days ago

    Budget 2024: మోదీ సర్కార్ 3.0 తొలి బడ్జెట్.. తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కే అవకాశం..!

    Business6 days ago

    18 నెలల తర్వాత విప్రోలో పెరిగిన ఉద్యోగులు.. ట్రెండ్ మార్చేసిందిగా.. మరో అదిరిపోయే గుడ్‌న్యూస్ కూడా..

    Andhrapradesh6 days ago

    Andhra Pradesh: ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

    International6 days ago

    మోదీకి మస్క్‌ అభినందనలు!

    Education6 days ago

    తెలంగాణ హైస్కూలు టైమింగ్ లో మార్పు

    Spiritual6 days ago

    పూరీ రత్నభాండాగారం రహస్య గదిలో ఆయుధాలు

    National7 days ago

    ‘బ్రాండెడ్’ షూసే వారి టార్గెట్- 7ఏళ్లుగా అదే పని- మీవేమైనా పోయాయా?

    National7 days ago

    UPSC ఛైర్మన్‌ అనూహ్య రాజీనామా!- IAS పూజా ఖేడ్కర్‌ వివాదంతో!!

    National7 days ago

    పూజా ఖేడ్కర్‌కు UPSC షాక్​- అభ్యర్థిత్వం రద్దు? పరీక్షలు రాయకుండా బ్యాన్​పై షోకాజ్​ నోటీసులు – pooja khedkar ias controversy

    Business2 months ago

    Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

    Career2 months ago

    విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

    Business2 months ago

    ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

    Business2 months ago

    ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

    National3 months ago

    IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

    News2 months ago

    జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

    Education2 months ago

    వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

    National2 months ago

    Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

    Crime News2 months ago

    జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

    Andhrapradesh2 months ago

    ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

    Spiritual2 months ago

    Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

    National2 months ago

    నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

    Andhrapradesh2 months ago

    పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

    National2 months ago

    ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

    Andhrapradesh2 months ago

    250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

    Political1 month ago

    కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

    National1 month ago

    కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

    National2 months ago

    అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

    Andhrapradesh1 month ago

    ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

    Railways1 month ago

    పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే

    Andhrapradesh1 month ago

    జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

    Telangana2 months ago

    Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

    Andhrapradesh2 months ago

    SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

    Andhrapradesh1 month ago

    ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత

    Political2 months ago

    పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

    Andhrapradesh2 months ago

    వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

    Andhrapradesh1 month ago

    సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల

    Andhrapradesh1 month ago

    రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP

    International2 months ago

    Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం

    Business2 months ago

    ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ

    Trending