National
ఒకే కుటుంబంలో 165మంది- ఓట్ల కోసం ఫ్యామిలీ చుట్టూ నేతలు! అందరూ చర్చించే ఓటేస్తారట! – Voters In One Family In Bihar
110 Voters In One Family In Bihar : లోక్సభ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ఏడో విడత బరిలో నిలిచే అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జూన్ 1న ఏడో విడతలో పోలింగ్ జరగనున్న క్రమంలోనే బిహార్లోని ఓ కుటుంబం చర్చనీయాంశమైంది. ఒక కుటుంబమే కదా ఏముందని అనుకుంటున్నారా? ఆ ఒక్క కుటుంబంలోనే 165మంది సభ్యులు ఉన్నారు మరి. ఆ కుటుంబ సభ్యులను ఆకట్టుకునేందుకు రాజకీయ నాయకులకు చెందిన అనుచరులు వారి ఇంటిచుట్టూ తిరుగుతున్నారట. మరి ఆ ఫ్యామిలీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
అందరూ చర్చించి!
పట్నా నగరంలోని ‘చందేల్ నివాస్’ అనే ఇంట్లో 165మంది నివసిస్తున్నారు. ఇక ఈ కుటుంబంలో 110మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి 10మందికి కొత్తగా ఓటు హక్కు వచ్చింది. అందులో నలుగురు అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. వీరంతా విద్యావంతులు, రాజకీయాలపై అవగాహన కలిగిన పౌరులు. ఏదైనా ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు వేయడానికి ముందు అభ్యర్థుల గురించి చర్చిస్తారు. అనంతరం ఒక అభ్యర్థిపై ఏకాభిప్రాయానికి వచ్చి 70 నుంచి 80 శాతం మంది అతడికి ఓటు వేస్తారు. అయితే ఏకీభవించని మిగతా వారు వేరే అభ్యర్థికి ఓటు వేస్తారు. ప్రస్తుతం పట్నాలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో వీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు బ్యాంకు
స్థానిక నాయకులు చందేల్ కుటుంబాన్ని ఓ ఓటు బ్యాంకుగా భావిస్తారు. దీంతో ఎన్నికల సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థుల మద్దతుదారులు, తమ నాయకుడికే ఓటేయాలని చందేల్ కుటుంబం చుట్టూ తిరుగుతారు. వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు.
“ఓటు వేసే ముందు కుటుంబ అభిప్రాయాన్ని తీసుకోవాలి. కానీ నా ఓటు మాత్రం అభివృద్ధికే. ఇక్కడ ధరలు పెరుగుదల, నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి. రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. మహిళల భద్రత సమస్య కూడా ఉంది.”
– కల్పనా సింగ్, చందేల్ కుటుంబ సభ్యురాలు
భిన్నాభిప్రాయాలు
తాను కుటంబ విశ్వాసాలను పాటిస్తానని, అందుకే కుటుంబం చెప్పిన వారికే తాను ఓటు వేస్తానని చెబుతున్నారు చందేల్ కుటుంబంలోని మరో మహిళ సుమన్ సింగ్. ఇక తొలిసారి ఓటు వేయబోతున్న అనుష్క కుమారి, తన మొదటి ప్రాధాన్యం విద్యకే అని చెబుతోంది. బిహార్లో విద్యారంగాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపింది. మరోవైపు, మహిళా భద్రత విషయంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం చాలా కృషి చేసిందని, పాఠశాలల పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా మారిందని మరో సభ్యురాలు అభా సింగ్ చెప్పింది.
‘స్థానిక సమస్యలకు ప్రాధాన్యం’
స్థానికంగా మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్లో బోధించే చందేల్ కుటుంబ సభ్యుడు శివేంద్ర సింగ్, ఈ ప్రాంతంలో స్థానిక ప్రజాప్రతినిధి అందుబాటులో లేరని, రోడ్డు శిథిలావస్థకు చేరుకోవడం, డ్రైడేజీ లైన్లు పగిలిపోవడం, పరిశుభ్రత వ్యవస్థ సరిగా లేదని వాపోయాడు. ఓటు వేసేటప్పుడు వీటి గురించి ఆలోచిస్తానని తెలిపాడు.
” దేశ హితం, అభివృద్ధికే నేను ఓటు వేస్తాను. అయితే ప్రస్తుత లోక్సభ ఎన్నికల సమయంలో ఏకాభిప్రాయం ఏర్పడినా, ప్రతి ఒక్కరూ వారికి ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేసే స్వేచ్ఛ ఉంది. కానీ అసెంబ్లీ, నగర పంచాయతీ ఎన్నికల జరిగినప్పుడు మాత్రం కుటుంబంలోని సభ్యులందరి ఓట్లు ఒకే అభ్యర్థికి వెళతాయి.”
–అమిత్ గౌతమ్, చందేల్ కుటుంబ సభ్యుడు
‘మే 31న నిర్ణయిస్తాం’
ఇంకా అభ్యర్థులు ఎవరూ తమ ఇంటికి రాలేదని సీనియర్ కుటుంబ సభ్యుడు అరుణ్ కుమార్ సింగ్(74) తెలిపారు. అభ్యర్థుల స్థానిక అనుచరులు వస్తారని చెప్పారు. మే 31న తామందరం సమావేశమై అభ్యర్థిపై ఓ నిర్ణయానికి వస్తామని స్పష్టం చేశారు.
కుటుంబ నేపథ్యం
అరుణ్ కుమార్ సింగ్ తండ్రి వైశాలి జిల్లాలోని రాఘోపుర్కు చెందిన వారు. అరుణ్ తండ్రికి ఓ సోదరుడు ఉన్నాడు. వారిద్దరూ వ్యవసాయం చేసేవారు. అయితే గ్రామంలో వ్యవసాయ భూమి అమ్మి 1974లో సోదరులిద్దరూ పట్నా వచ్చారు. అనంతరం ఇద్దరూ కలిసి స్థలం తీసుకుని ఇల్లు నిర్మించుకున్నారు. వారిద్దరి సంతానమే ఇప్పుడు చందేల్ నివాసంలో నివసిస్తోంది. ఈ కటుంబంలోని 165 మందిలో 35మంది ఇంటికి దూరంగా ఉన్నారు. కొందరు విదేశాల్లో ఉన్నారు. మరికొందరి వృత్తి, ఉద్యోగాల రీత్యా ముంబయి, దిల్లీ, నొయిడా వంటి నగరాల్లో నివసిస్తున్నారు. ఈ కుటుంబంలో 24మంది ఇంజినీర్లు, ఇద్దరు డాక్టర్లు, నలుగురు న్యాయవాద వృత్తిలో ఉన్నారు. 20మందికి పైగా కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. పలువురు మహిళలు కూడా స్థానికంగా ఉపాధి పొందుతున్నారు.
National
స్తంభం పైన ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. ఇంతలో అటుగా వచ్చిన ఓ పక్షి…
కొన్ని దృశ్యాలు చూస్తే.. నమ్మశక్యంగా అనిపించవు. అరె.. ఇది ఏమైనా మ్యాజిక్కా లేక కనికట్టా అనిపిస్తుంది. తాజాగా 78వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. కేరళలో జాతీయ జెండా ఎగురవేస్తుండగా.. పైభాగంలో ఇరుక్కుపోయింది. ఈ సమయంలో అటుగా వచ్చిన ఒక పక్షి.. ఇరుక్కుపోయిన పైభాగాన్ని విప్పేసింది. నమ్మశక్యం కాని ఈ ఘటన కేరళలో వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Kerala – National Flag got stuck at the top while hoisting. A bird came from nowhere and unfurled it!! ✨ pic.twitter.com/lRFR2TeShK
— Shilpa (@shilpa_cn) August 16, 2024
ఇండిపెండెన్స్ డే శుభ సందర్భంగా, కొందరు పిల్లలు, పెద్దలు కలిసి జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో జాతీయ జెండా ఎగరవేస్తుండగా.. దురదృష్టవశాత్తు అది పైభాగంలో చిక్కుకుపోయింది. క్షణాల్లో, ఎక్కడి నుంచో ఎగురుతూ ఒక పక్షి వచ్చి చిక్కుకుపోయిన త్రివర్ణ పతాకాన్ని విప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆపై పక్షి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇది “దైవిక జోక్యం!” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “ఈ ప్రకృతి ఏదో దాగి ఉంది. మనుషులే అర్థం చేసుకోలేకపోతున్నారు” అని మరొకరు వ్యాఖ్యానించారు. “ఇలా జరగడానికి ఆస్కారం లేదు.. ఇది ఎడిట్ చేసిన వీడియో కావొచ్చు” అని మరొక వ్యక్తి అనుమానం వ్యక్తం చేశారు.
National
Railway Jobs: క్రీడాకారులకు సదావకాశం.. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024-25 సంవత్సరానికి గాను వెస్ట్రన్ రైల్వేలో గ్రూప్ ‘సి’, గ్రూప్ ‘డి’ ఖాళీల భర్తీకి ఈ ప్రకటన వెలువరించింది. అర్హులైన పురుష, మహిళా క్రీడాకారులు ఈ పోస్టుకలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 14, 2024వ తేదీలోని చివరి తేదీగా నిర్ణయించారు. మొత్తం 64 గ్రూప్ ‘సి’, గ్రూప్ ‘డి’ పోస్టులను స్పోర్ట్స్ కోటాలో ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. లెవెల్-4/5 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లెవెల్-2/3 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ, పన్నెండో తరగతిలో, లెవెల్-1 పోస్టులకు పదో తరగతి, ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బాస్కెట్బాల్, క్రికెట్, రెజ్లింగ్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాడీ బిల్డింగ్, సైక్లింగ్, హాకీ, ఖో-ఖో, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్.. వంటి క్రీడాంశాల్లో ఏదైనా ఒక దానిలో వివిధ స్థాయుల్లో విజయాలు సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు జనవరి 01, 2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. పురుష, మహిళా క్రీడాకారులు ఇరువురూ దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు ఇలా..
లెవెల్-4/5 పోస్టులు: 5
లెవెల్-2/3 పోస్టులు: 16
లెవెల్-1 పోస్టులు: 43
ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 16, 2024వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 14, 2024వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తుంది. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.500లు తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్ఎం/ దివ్యాంగులు/ మహిళలు/ మైనారిటీలు/ ఈబీసీ అభ్యర్థులు రూ.250లు రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్, ట్రయల్స్ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
National
ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ఏం సందేశం ఇచ్చారో తెలుసా?
Independence Day 2024: ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎర్రకోట వద్ద ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా సైనికులు పూల వర్షం కురిపించారు. వికసిత భారత్ థీమ్తో స్వాతంత్ర్య వేడుకలను నిర్వహిస్తున్నారు. ఎర్రకోట పరిసరాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎర్రకోటలో వేడుకలకు ఆరు వేల మంది హాజరయ్యారు.
పంద్రాగస్టు సందర్భంగా మోదీ ఎర్రకోట వద్ద ప్రసంగిస్తూ.. హర్ ఘర్ తిరంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని తెలిపారు.
-
Business3 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career3 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
Business3 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
National4 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
News3 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business3 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
Education3 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National3 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
National3 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Andhrapradesh3 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Spiritual3 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
Telangana4 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Crime News3 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh2 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
National3 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Railways3 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National3 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh3 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh3 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
National3 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Political3 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Political3 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh3 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Andhrapradesh3 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
National3 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Weather3 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Andhrapradesh3 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Education3 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Andhrapradesh3 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Business4 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Andhrapradesh3 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
National4 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh3 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
News3 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
International4 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
News4 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
International4 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Spiritual3 months ago
చార్ ధామ్ యాత్రకు పొటెత్తిన భక్తులు.. గత ఏడాదికంటే ఎక్కువే!
-
Cinema6 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Andhrapradesh3 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Andhrapradesh3 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Railways2 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh3 months ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
News3 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh3 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
Cinema3 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
-
International3 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Andhrapradesh7 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Spiritual3 months ago
Tirumala : వెంకటేశా.. ఇంత సమయమా?
-
Business4 months ago
Bank Holidays June-2024: జూన్లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?