Connect with us

Health

Washing Fruits: పండ్లపై ఉన్న కనిపించని పురుగుమందులను ఇలా సులువుగా తొలగించండి, వాటితో క్యాన్సర్ వచ్చే ప్రమాదం

Published

on

Washing Fruits: పండ్లు పోషకాలతో నిండి ఉంటాయి. సమతుల్య ఆహారం కోసం వీటిని కూడా తింటూ ఉండాలి. అరటిపండ్లు, స్ట్రాబెర్రీలు, మామిడిపండ్లు, జామకాయలు.. ఇలా అన్నింటినీ ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే. అయితే వీటన్నింటిని క్రిమిసంహారక మందుల ద్వారా పండించడం అధికమైంది కాబట్టి రసాయనాలు నిండిన పండ్లను అలాగే తింటే క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లోనే ఈ పండ్లను జాగ్రత్తగా పరిశుభ్రంగా మార్చుకోవాలి. ఆ తర్వాతే వాటిని తినాలి. పండ్లపై ఉన్న రసాయనాలను ఎలా తొలగించాలో ఇక్కడ మేము చెప్పాము.

పండ్లు కొన్నాక వాటిపై ఉండే పురుగుల మందులను, రసాయనాలను తొలగించడానికి సులువైన మార్గం నీటిలో నానబెట్టడం. పండ్లు మునిగే వరకు నీటిలో వేసి నానబెట్టాలి. ఒక అరగంట పాటు అలా వదిలేయాలి. తర్వాత చేత్తోనే వాటిపై రుద్ది కడగాలి. కొళాయి కింద నీటిని వదిలి పండ్లను ఒక్కొక్క దాన్ని చేత్తోనే రుద్ది కడుగుతూ ఉంటే పైన ఉన్న పెస్టిసైడ్స్ పోయే అవకాశం ఉంది.


ఉప్పు వేసిన నీళ్లలో

ఒక పెద్ద గిన్నెలో నీళ్లు వేసి అందులో ఉప్పు వేసి బాగా కలపండి. ఆ నీటిలో పండ్లను వేసి అరగంట పాటు వదిలేయండి. ఆ తర్వాత ఆ పండ్లను చేతితోనే శుభ్రంగా రుద్ది మరొకసారి కొళాయి కింద పెట్టి నీటిలో కడగండి. ఇలా చేస్తే పైనున్న పెస్టిసైడ్స్ త్వరగా పోతాయి.


పీలింగ్

పండ్ల పై ఉన్న తొక్క పైనే క్రిమిసంహారకాలు, రసాయనాలు పేరుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాత పై తొక్కను తీసి తినేందుకు ప్రయత్నించండి.

స్టవ్ మీద గిన్నె పెట్టి నీరు వేసి మరిగించండి. మరీ ఎక్కువ ఉష్ణోగ్రతకు మరిగిస్తే పండ్లు పాడైపోతాయి. కాస్త గోరువెచ్చగా అయినప్పుడు పండ్లను ఆ నీటిలో ఒక నిమిషం పాటు నానబెట్టండి. ఆ తర్వాత వెంటనే తీసి చల్లని నీటిలో వేయండి. ఇలా చేయడం వల్ల పండ్లపై ఉన్న రసాయనాలు తొలగిపోయే అవకాశం ఉంది.

Advertisement

వెనిగర్
నీటిలో రెండు చుక్కల వెనిగర్ వేసి బాగా కలపండి. ఆ నీటిలో పండ్లను వేసి ఒక నిమిషం పాటు వదిలేయండి. ఆ తర్వాత వాటిని తీసి కొళాయి కింద పెట్టి చేత్తో రుద్ది కడగండి. ఆ పండ్లను టవల్ తో తుడిచి త్వరగా పొడిగా అయ్యేలా చేయండి. ఇలా చేస్తే పురుగుల మందులు పోయే అవకాశం ఉంది.

ప్రతి ఇంట్లో బేకింగ్ సోడా ఉండడం సర్వసాధారణం. నీటిలో ఈ బేకింగ్ సోడాను వేసి బాగా కలిపి పండ్లను వేసి నానబెట్టాలి. ఆ తర్వాత ఆ పండ్లను తీసి కుళాయి కింద ఉన్న నీటిలో రుద్ది కడగాలి. ఇలా చేస్తే పంటలపై ఉన్న రసాయనాలు చాలా వరకు పోతాయి. కొన్ని రకాల కూరగాయలను ఇలా శుభ్రం చేయడం ద్వారా పెస్టిసైడ్స్ ఫ్రీ ఆహారాలను తినే అవకాశం ఉంది.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Health

ప్రతి ఒక్కరూ డాక్టరే.. సొంత వైద్యంతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న వైనం

Published

on

మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. ఎవరో ఏదో చెప్తే..అలాగే ఫాలో అయిపోతే అంతా సెట్‌ అవుతుందనేది భ్రమ. కొన్నిసార్లు వైద్య నిపుణులు ట్రీట్‌మెంట్‌ ఇచ్చినా బాడీ రెస్పాండ్‌ కాదు. అలాంటిది గూగుల్‌ సమాచారమో లేక ఇంకేవరో స్వయం ప్రకటిత మేధావులు చెప్పినట్లు చేస్తే బాగుంటామని.. ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. కావాల్సినంతే తినాలి. తిన్నది అరిగించడం కోసం ఎంతో కొంత శారీరక శ్రమ చేయాలని చెప్తున్నారు.

సీజనల్‌ వ్యాధులకు అయితే సొంత వైద్యం చేసుకోవద్దనేది వైద్య నిపుణుల సూచన. జ్వరం వచ్చిన వెంటనే పారాసిటమాల్‌, యాంటిబయాటిక్స్‌, పెయిన్‌ కిల్లర్స్‌ వాడటంపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. డాక్టర్ల సూచన లేకుండా ట్యాబ్లెట్లు వాడటం చాలా డేంజర్‌ అని హెచ్చరిస్తున్నారు. రెండుమూడు రోజులు కంటిన్యూగా జ్వరం ఉంటే కచ్చితంగా టెస్టులు చేయించుకోవాల్సిందేని చెబుతున్నారు.

బయటికి ఆరోగ్యంగానే కనిపిస్తున్నా..
డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి వ్యాధులకు వేర్వేరు రోగ లక్షణాలు ఉంటాయి. కొందరు యాంటిబయాటిక్స్‌, పెయిన్‌ కిల్లర్స్‌ వాడుతుండటంతో అవి వ్యాధి లక్షణాలను బయటపడకుండా చేస్తాయని అంటున్నారు డాక్టర్లు. బయటికి ఆరోగ్యంగానే కనిపిస్తున్నా..లోపల మాత్రం డెంగ్యూ ముదిరి ప్లేట్‌లెట్స్ పడిపోతాయని అలర్ట్ చేస్తున్నారు. ఇన్ఫెక్షన్‌ బాడీలోని ఊపిరితిత్తుల్లోకి, లివర్‌లోకి చేరిన తర్వాత హాస్పిటల్‌కు వెళ్తున్నారు. రెండుమూడ్రోజుల్లో కోలుకోవాల్సిన వారు..అప్పుడు వారాలపాటు చికిత్స పొందాల్సి వస్తుందని అంటున్నారు డాక్టర్లు.

డెంగ్యూ అందరిపై ఒకే రకమైన ప్రభావం చూపుతుందని అనుకోవడం భ్రమ అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్‌. పెయిన్‌ కిల్లర్లు, ఆకు రసాలు తాగి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు. బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి ట్యాబ్లెట్లు కూడా ఎంతవరకు పనిచేస్తాయో క్లారిటీ లేదంటున్నారు వైద్య నిపుణులు. సొంత వైద్యం మీద ఆధారపడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దనేది వాళ్ల సూచన.

మరికొందరు.. ఫెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌ ప్రిస్క్రిప్షన్‌ ఆధారంగా మందుల్ని వాడుతుంటారు. అనారోగ్యానికి గురైన వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి?.. ఏ మందులైతే మంచిదో..డాక్టర్లు నిర్ధారించి రాసిన మెడిసిన్ అది. అదే ప్రిస్క్రిప్షన్‌ మిగతా వారికి పనికి రాదు. ఇక సోషల్‌ మీడియాలో వచ్చే వార్తల్ని నమ్మి చాలామంది ఆస్పిరిన్‌, ఎకోస్పిరిన్‌లు వాడేస్తున్నారు. ఇక కొంతమంది విటమిన్‌ సీ, డీ, జింక్‌ మందులను రోజువారీ మందుల మాదిరిగా వేసుకుంటున్నారు. మీతి మీరిన మెడిసిన్ కూడా మంచిది కాదంటున్నారు డాక్టర్లు. సొంత వైద్యంతో చాలామందికి బీపీ, షుగర్ అటాక్ అవుతుందంటున్నారు వైద్య నిపుణులు.

Advertisement

మితిమీరిన మందులు వాడటంతో
మితిమీరిన మందులు వాడటంతో దీర్ఘకాలిక రోగాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఆరోగ్యకరమైన జన్యువులు పాడై.. రాబోయే తరాలకు ఇప్పటి రోగాలను వారసత్వంగా అందించే పరిస్థితులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్‌ సోకినప్పుడు మాత్రమే యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ని వాడాలని సూచిస్తున్నారు. లేకుంటే బరువు తగ్గడం, ఆకలి కాకపోవడం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

అజిత్రోమైసిన్‌ వంటి యాంటి బయాటిక్‌ మందులు ఎక్కువగా వాడితే గుండెపై ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు.
సొంత వైద్యం పెరగడానికి అందరికీ సోషల్ మీడియాలో అందుబాటులోకి రావడమే కారణంటున్నారు ఎక్స్ పర్ట్స్‌. స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న ప్రతి ఒక్కరు.. యూట్యూబ్‌, గూగుల్‌లో సెర్చ్‌ చేసి ఇష్టం వచ్చిన ట్యాబ్లెట్లు, ప్రకృతి వైద్యం అంటూ ఏది పడితే అది వాడేస్తున్నారు. అదే అనారోగ్యానికి కారణం అవుతోంది.

Continue Reading

Health

Caffeine Overdose: అతిగా కాఫీ తాగితే అనర్ధాలు తప్పవు.. మరైతే రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తాగాలి?

Published

on

కాఫీ చాలా మందికి ఇష్టమైన పానీయం. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కప్పు కాఫీ తాగందే చాలా మందికి రోజు ప్రారంభం కాదంటే అతిశయోక్తి కాదు. వారి జీవిత్తాల్లో కాఫీ అంతగా మమేకమై పోతుంది. కానీ కాఫీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. శరీరంలో కెఫిన్ అధికంగా ఉండటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి.


శరీరంలో కెఫిన్ స్థాయిలు పెరగడం వల్ల నెర్వస్‌నెస్‌కి దారి తీస్తుంది. ఆందోళన ధోరణి కూడా పెరుగుతుంది. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో కెఫిన్ స్థాయి పెరుగుతుంది. దీని వల్ల నిద్ర సమస్యలు తలెత్తుతాయి.

కెఫీన్ ఆహారం జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. దీంతో ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. శరీరంలో కెఫిన్ స్థాయిని పెరగడం హృదయనాళ వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఇది గుండె సమస్యలకు దారి తీస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు కప్పు కాఫీ కూడా తాగకూడదు. ఇది మధుమేహం పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. కెఫీన్ స్థాయిలు పెరగడం కళ్లకు కూడా మంచిది కాదు. గ్లాకోమాతో బాధపడేవారికి, ఎక్కువ కాఫీ తాగడం వల్ల వారి కంటి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారుతుంది.

శరీరంలో కెఫిన్ స్థాయిలు పెరగడం వల్ల మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల యూరినరీ బ్లాడర్ కు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని వైద్యులు చెబుతున్నారు. రోజుకు 400 మిల్లీ గ్రాములకు మించి కాఫీ తాగకూడదని నిపుణులు అంటున్నారు.

Continue Reading

Health

ద్రాక్ష వర్సెస్ ఎండుద్రాక్ష.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా..?

Published

on

పండ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ద్రాక్ష పండు తీపి, పుల్లని రుచితో చాలా మందిని ఆకర్షిస్తుంది. ఎండుద్రాక్షను చాలా మంది ఇష్టపడే ద్రాక్షను ఎండబెట్టడం ద్వారా తయారుచేస్తారు. ఇది స్వీట్లు, తీపి వంటకాలను అలంకరించడానికి ఉపయోగిస్తారు. ద్రాక్షలో 80 శాతం నీరు ఉంటుంది. అయితే ఎండుద్రాక్షలో నీటి శాతం 15 శాతం మాత్రమే. అయితే, ప్రజలు ద్రాక్ష, ఎండుద్రాక్ష రెండింటినీ చాలా ఇష్టంగా తింటారు. అయితే ఈ పండ్లు, డ్రై ఫ్రూట్స్‌లో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

ద్రాక్ష, ఎండుద్రాక్ష రెండూ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉన్నప్పుడు, ఏది ఎక్కువ ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది..? అంటే.. ద్రాక్ష కంటే ఎండుద్రాక్షలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. వాస్తవానికి, ద్రాక్షను ఎండబెట్టిన తర్వాత ఎండుద్రాక్ష తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో, చక్కెర, యాంటీఆక్సిడెంట్లు ఉపయోగించబడతాయి. ఇవి కేలరీల రూపంలోకి మార్చబడతాయి. అరకప్పు ద్రాక్ష పండ్లను తింటే కేవలం 30 క్యాలరీలు, అదే మోతాదులో ఎండుద్రాక్ష తింటే 250 కేలరీలు శరీరానికి అందుతాయి.

ఎండుద్రాక్ష తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఎండుద్రాక్ష ఫైబర్ గొప్ప మూలంగా పరిగణించబడుతుంది. ఇది కాకుండా,ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఈ డ్రై ఫ్రూట్‌లో కనిపిస్తాయి. ఎండుద్రాక్షలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇది పేగులోని బ్యాక్టీరియాను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

ద్రాక్ష తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ..

విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ద్రాక్షలో ఉంటాయి. ఈ రెండు పోషకాలు మన చర్మ కణాలను యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది మీ చర్మాన్ని క్యాన్సర్‌కు కారణమయ్యే కిరణాల నుండి కూడా రక్షిస్తుంది. మీరు ద్రాక్షను తీసుకుంటే, ముఖం నుండి నల్ల మచ్చలు, ముడతలు తగ్గుతాయి.

Advertisement

ఎండుద్రాక్ష, ద్రాక్షలో ఏది ఎక్కువ ఆరోగ్యకరమైనది?

ఈ రెండు ఆహార పదార్థాలు వారి స్వంత మార్గంలో ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి. కానీ ద్రాక్ష మరింత ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే తక్కువ కేలరీలు ఉన్న వస్తువు ఆరోగ్యానికి మంచిది. అందువలన దాని అసలు రూపంలో పండు తినడానికి ప్రయత్నించండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు infoline.one బాధ్యత వహించదు.)

Continue Reading
Andhrapradesh2 weeks ago

విజయవాడ వాసులకు అద్దిరిపోయే తీపికబురు.. ఏపీకి ఇది కదా కావాల్సింది.!

Latest2 weeks ago

ఏపీ మంత్రివర్గ భేటీ – వాలంటీర్లు, ఉద్యోగుల పీఆర్సీపై కీలక నిర్ణయం..!!

Education2 weeks ago

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఐఐటీ.. అన్నీ కుదిరితే అక్కడే.. ఎన్నాళ్లకెన్నాళకు!

Spiritual2 weeks ago

తిరుమల లడ్డూ వివాదంతో అయోధ్య రామాలయం సంచలన నిర్ణయం!

Andhrapradesh2 months ago

Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా?

Andhrapradesh2 months ago

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఆర్జిత సేవా టికెట్లు విడుదల ఎప్పుడంటే..?

Andhrapradesh2 months ago

Musi River: వివాదంగా మారిన మూసీ బ్యూటిఫికేషన్.. తమ ఇళ్లను కూల్చివేయొద్దంటూ..

Spiritual2 months ago

కృష్ణాష్టమి అంటే కన్నయ్య జన్మదినమే.. ఈ ప్రదేశాలలో జన్మాష్టమి పండుగను భిన్నంగా జరుపుకుంటారు

National2 months ago

స్తంభం పైన ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. ఇంతలో అటుగా వచ్చిన ఓ పక్షి…

National2 months ago

Railway Jobs: క్రీడాకారులకు సదావకాశం.. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

National2 months ago

ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ఏం సందేశం ఇచ్చారో తెలుసా?

Andhrapradesh2 months ago

NTR Health University: ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలకు యాజమాన్య కోటా నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

International2 months ago

యుద్ధం వస్తే ఎలా? టెక్నాలజీపరంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌ ఎవరు స్ట్రాంగ్‌?

Hashtag2 months ago

Pen Hospital: పెన్నుల కోసం ఓ స్పెషల్ హాస్పిటల్.. ఇచ్చట అన్ని పెన్నులు రిపేర్ చేయబడును..!

International2 months ago

రష్యాలోకి 30 కి.మీ. దూసుకెళ్లిన యుక్రెయిన్ సైన్యం.. సేఫ్ జోన్లకు 76 వేల మంది తరలింపు

National2 months ago

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలో హైఅలర్ట్ .. ఎర్రకోట వద్ద పటిష్ఠ భద్రత

National2 months ago

UPSC Civils Mains 2024: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసిందోచ్

Andhrapradesh2 months ago

AP Police Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్‌

International2 months ago

ఇజ్రాయెల్​పై దాడికి ఇరాన్‌ సన్నాహాలు – అణు జలాంతర్గామిని పంపిస్తున్న అమెరికా – Iran backed Attack On Israel

International2 months ago

‘రాక్షసి వెళ్లిపోయింది’ – హసీనాపై ముహమ్మద్ యూనుస్​ ఘాటు వ్యాఖ్య – Yunus Comments On Hasina

International2 months ago

Donald Trump : ‘ఎక్స్‌’లో డొనాల్డ్ ట్రంప్‌తో ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ.. ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Technology2 months ago

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరు గ్రూప్‌లో చేరడానికి ముందే అన్నీ తెలుసుకోవచ్చు!

National2 months ago

2036 నాటికి భారత జనాభా 152 కోట్లు – పెరగనున్న మహిళలు – తగ్గనున్న యువత – INDIA POPULATION 2036

National2 months ago

ఐఐటీ మద్రాస్ దేశంలోనే బెస్ట్​- వరుసగా ఆరోసారి- టాప్​ కాలేజీల లిస్ట్​ ఇదే! – NIRF Ranking 2024

International2 months ago

Israel Hamas war : గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 100మందికిపైగా మృతి

National2 months ago

PM Modi: భారీ వర్షంలో రైతులతో ప్రధాని మోదీ భేటీ.. సింప్లిసిటీ చూస్తే వావ్ అనాల్సిందే.. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి..

Telangana2 months ago

Yadadri: యాదగిరిగుట్టలో మరిన్ని మార్పులకు ప్రభుత్వం సిద్ధం..!

Andhrapradesh2 months ago

PG Medical Courses: మెడికల్‌ విద్యార్ధులకు బిగ్‌షాక్‌.. పీజీ వైద్య విద్య ఫీజులు పెంచిన సర్కార్!

Andhrapradesh2 months ago

Tungabhadra Dam: 69 ఏళ్ల చరిత్రలో ఫస్ట్‌టైమ్‌ ప్రమాదం.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు

Cricket2 months ago

Team India: ఇకపై టెస్ట్ జట్టులో కనిపించని ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు.. చివరి మ్యాచ్ ఎప్పుడు ఆడారంటే?

Business5 months ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career5 months ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

National6 months ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

News5 months ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

Business5 months ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

Business5 months ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

Education4 months ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

International5 months ago

‘పోస్ట్​ స్టడీ వర్క్​ ఆఫర్​ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్​ వెళ్లే విద్యార్థులకు గుడ్​ న్యూస్​ – UK Graduate Route Visa

National4 months ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

Andhrapradesh4 months ago

జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

Andhrapradesh4 months ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

Crime News4 months ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

Spiritual4 months ago

Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

Telangana5 months ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

National5 months ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Railways4 months ago

పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే

Andhrapradesh4 months ago

పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

National4 months ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

National4 months ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

National4 months ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

Andhrapradesh4 months ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

Political4 months ago

పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

Political4 months ago

కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

Andhrapradesh4 months ago

వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

Andhrapradesh4 months ago

సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల

Andhrapradesh4 months ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

Andhrapradesh4 months ago

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

Weather4 months ago

జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…

National5 months ago

Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!

Education4 months ago

ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త

Trending