Connect with us

Education

2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు

Published

on

2024వ సంవత్సరానికి ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రచురించిన ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ ‘నెక్స్ట్ వేవ్’ స్థాపించిన శశాంక్ గుజ్జుల, అనుపమ్ పెదర్లకు చోటు దక్కింది. విద్యారంగంలో విశేష మార్పులు తీసుకువచ్చినందుకు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇద్దరూ తెలుగు వారే కావడం విశేషం.

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్‌కి చెందిన ‘శశాంక్ గుజ్జుల’ ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదివాడు. ఏలూరికి చెందిన ‘అనుపమ్ పెదర్ల’ ఐఐటీ ఖరగపూర్‌లో బి.టెక్ పూర్తి చేశాడు.
ప్రఖ్యాత మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం భారత దేశ ఐటీ ఇండస్ట్రీ ఈ దశాబ్దంలో మూడు రేట్లు పెరగనుంది. ఎన్నో
అద్భుతమైన అవకాశాలు ఉన్నపటికీ విద్యార్థులలో పరిశ్రమకు కావలసిన నైపుణ్యాలు లేకపోవడం వలన ఉద్యోగాలు పొందడంలో ఇబ్బంది పడుతున్నారని వీరు గమనించి వీరిరువురు ఎన్నో గొప్ప ఉద్యోగావకాశాలను వదులుకుని ‘రాహుల్ అత్తులూరి’తో కలిసి ‘నెక్స్ట్ వేవ్’ స్థాపించారు.

నెక్స్ట్ వేవ్ ద్వారా యువతలో ఆధునిక 4.0 టెక్నాలజీల నైపుణ్యాలను పెంపొందిస్తూ వారికి చక్కటి ఐటీ ఉద్యోగాలు అందేలా ప్లేసెమెంట్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. కేవలం మూడు సంవత్సరాలలోనే భారత దేశ విద్య రంగంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న అంకుర సంస్థల్లోఒకటిగా నెక్స్ట్ వేవ్ నిలిచింది. గత సంవత్సరం గ్రేటర్ పసిఫిక్ కాపిటల్ నుంచి 275 కోట్ల రూపాయల ఫండింగ్ కూడా పొందారు.

అంకుర సంస్థలు మొదలుకొని అమెజాన్, గూగుల్, బ్యాంకు అఫ్ అమెరికా వంటి మల్టీ నేషనల్ కంపెనీలు వరకు 1700లకు పైగాకంపెనీలు వేలాది నెక్స్ట్ వేవ్ విద్యార్థులను ఇప్పటికే ఉద్యోగాలలో నియమించుకున్నాయి. రాబోయే రెండు సంవత్సరాలలో 10,000లకు పైగా కంపెనీలతో జత కట్టి అనేక ఉద్యోగావకాశాలు సృష్టించే లక్ష్యంతో నెక్స్ట్ వేవ్ ముందుకు సాగుతుంది.దేశం నలుమూలల నుంచి విద్యార్థులు నెక్స్ట్ వేవ్‌లో నేర్చుకుంటున్నారు.

ఈ సందర్బంగా నెక్స్ట్ వేవ్ కో-ఫౌండర్ శశాంక్ గుజ్జుల మాట్లాడుతూ.. ఇది మేము వ్యక్తిగతంగా సాధించిన గుర్తింపు కాదు. గొప్ప కలలు కని వాటి కోసం స్థిరంగా ప్రతి రోజు నేర్చుకుంటున్న నెక్స్ట్ వేవ్ విద్యార్థులకుఎంతో మంది యువతను చక్కటి ఉద్యోగాలు సాధించేలా నిరంతరం కృషి చేస్తున్న నెక్స్ట్ వేవ్ బృందానికి దక్కిన గుర్తింపు. నెక్స్ట్ వేవ్ మొదలైనప్పటి నుంచి మా దృష్టి అంతా కూడా టెక్నాలజీ రంగంలోని ఎన్నో గొప్ప అవకాశాలకు మన యువతని సిద్ధం చేయడమే.. ఇలాంటిగుర్తింపులు మరింత ఉత్సాహాన్ని నింపుతూ, మా లక్ష్యం వైపు అడుగు మరింత వేగంగా వేయడానికి తోడ్పడుతాయని అన్నారు.

Advertisement

నెక్స్ట్ వేవ్ కో-ఫౌండర్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనుపమ్ పెదర్ల మాట్లాడుతూ.. యువత మన దేశ బలం. వారందరు చక్కటినైపుణ్యాలతో ఉంటే మన దేశం ఒక అగ్రగామిగా మారడం ఖాయం. ప్రపంచ స్థాయి టెక్నాలజీ విద్యను భారత దేశ ప్రతి మూలకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. ప్రతి విద్యార్ధి ఒక వజ్రం లాంటి వారు అని మేము గట్టిగా నమ్ముతాము. వారికి సరైన మార్గదర్శనంతో తోడ్పాటు అందిస్తే అద్భుతమైనవిజయాలు సాధిస్తారు. ఇది మా నెక్స్ట్ వేవ్ విద్యార్థులు అనేక సార్లు నిరూపించారు. ఫోర్బ్స్ నుంచి ఈ గుర్తింపు అనేది వేలాది యువత జీవితాల్లో నెక్స్ట్ వేవ్ తీసుకొస్తున్న మార్పుకి నిదర్శనం.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Education

తెలంగాణ హైస్కూలు టైమింగ్ లో మార్పు

Published

on

ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు
హైదరాబాద్, రాష్ట్రంలో స్కూళ్ల టైమింగ్స్​ను ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు హైస్కూల్ ​వేళల్లో మార్పు లు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు హైస్కూల్​ టైమింగ్స్​ఉం డగా.. ఇప్పుడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటలకు మార్చారు.

ఇక హైదరాబాద్​లో అప్పర్ ​ప్రైమరీ స్కూళ్ల టైమింగ్స్​కూడా మార్చారు. సిటీలో ట్రాఫిక్​ సమస్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అప్పర్ ప్రైమరీ స్కూళ్లను ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడపాలని సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Continue Reading

Education

విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై ఉచితం.. నేరుగా వారికే..

Published

on

విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై ఉచితం.. నేరుగా వారికే..
ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీవ్యాప్తంగా ఉన్న గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను నేరుగా అందించాలని నిర్ణయం తీసుకుంది. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పేస్ట్, బ్రష్, షాంపూ వంటి కాస్మొటిక్ వస్తువులను ఉచితంగా అందివ్వనున్నారు. అయితే గతంలోనూ విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను ఉచితంగా అందించేవారు. అయితే నేరుగా ఇవ్వకుండా వారి తల్లుల ఖాతాల్లో ఈ మొత్తం జమ చేస్తూ వచ్చారు. అయితే ఈ ఛార్జీలు సకాలంలో అందక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారనే వార్తలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాస్మొటిక్ వస్తువులను విద్యార్థులకు నేరుగా ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది.

గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాఠశాల విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను నేరుగా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం కాస్మొటిక్ వస్తువులను నేరుగా ఇవ్వకుండా.. కాస్మొటిక్ ఛార్జీలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేస్తూ వచ్చింది. అయితే ఆ నగదు సకాలంలో విడుదల చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. దీంతో కాస్మొటిక్ వస్తువులు అందక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే పేస్టు, బ్రష్, షాంపూ వంటి కాస్మొటిక్ వస్తువులను నేరుగా వారికి ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ అధికారులు తమ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు పంపారు. సీఎం చంద్రబాబు ఆమోదిస్తే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

Continue Reading

Andhrapradesh

జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

Published

on

ఆమరావతి, జూన్‌ 25: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన సోమవారం (జూన్‌ 24) కొలువైన మంత్రిమండలి మెగా డీఎస్సీ పాటు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) కూడా నిర్వహించేందుకు అమోదం తెలిపింది.
ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించని వారితో పాటు, ఈ ఏడాది కొత్తగా బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు కూడా మెగా డీఎస్సీ రాసేంందుకు అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో మరోమారు టెట్‌ పరీక్ష నిర్వహించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ జులై 1వ తేదీన విడుదలకానుంది. కొంచెం అటుఇటుగా టెట్ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయనున్నారు. కొంచెం తేదీల మార్పుతో ఒకేసారి దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డీఎస్సీ కంటే ముందే మొదట టెట్‌ పరీక్ష నిర్వహించి.. ఆ తర్వాత డీఎస్సీకి సన్నద్ధమయ్యేందుకు 30 రోజులు సమయం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. టెట్‌ ఫలితాలు వెలువడిన తర్వాత డీఎస్సీ పరీక్ష ఉంటుంది.

అన్నీ అనుకున్నట్లు కుదిరితే జులై 1వ తేదీనే మెగా డీఎస్సీతోపాటు టెట్‌కు కూడా ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటనను రద్దు చేసి, కొత్తగా 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ ప్రకటన ఇస్తారు. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడగా.. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,72,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఎన్నికల కోడ్‌ కారణంగా పరీక్ష నిర్వహించకుండానే వాయిదా పడింది. ఆ తర్వాత అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేసి పోస్టుల సంఖ్య పెంచి.. మెగా డీఎస్సీకి నోటిఫికేసన్‌ వెలువరించనున్నట్లు ప్రకటించింది.

సోమవారం మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి ఏడాదీ డీఎస్సీ నిర్వహించే అంశంపై కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఏ విద్యా సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చే ఖాళీలను ఎప్పటికప్పుడు అవసరం మేరకు డీఎస్సీ నిర్వహించాలనే యోచన కూడా చేస్తుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిచాలంటే రాష్ట్రంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండాలని నిపుణులు సైతం అభిప్రాయ పడుతున్నారు.

Continue Reading
Andhrapradesh3 weeks ago

Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా?

Andhrapradesh3 weeks ago

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఆర్జిత సేవా టికెట్లు విడుదల ఎప్పుడంటే..?

Andhrapradesh3 weeks ago

Musi River: వివాదంగా మారిన మూసీ బ్యూటిఫికేషన్.. తమ ఇళ్లను కూల్చివేయొద్దంటూ..

Spiritual3 weeks ago

కృష్ణాష్టమి అంటే కన్నయ్య జన్మదినమే.. ఈ ప్రదేశాలలో జన్మాష్టమి పండుగను భిన్నంగా జరుపుకుంటారు

National3 weeks ago

స్తంభం పైన ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. ఇంతలో అటుగా వచ్చిన ఓ పక్షి…

National3 weeks ago

Railway Jobs: క్రీడాకారులకు సదావకాశం.. స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

National3 weeks ago

ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ఏం సందేశం ఇచ్చారో తెలుసా?

Andhrapradesh3 weeks ago

NTR Health University: ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలకు యాజమాన్య కోటా నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

International4 weeks ago

యుద్ధం వస్తే ఎలా? టెక్నాలజీపరంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌ ఎవరు స్ట్రాంగ్‌?

Hashtag4 weeks ago

Pen Hospital: పెన్నుల కోసం ఓ స్పెషల్ హాస్పిటల్.. ఇచ్చట అన్ని పెన్నులు రిపేర్ చేయబడును..!

International4 weeks ago

రష్యాలోకి 30 కి.మీ. దూసుకెళ్లిన యుక్రెయిన్ సైన్యం.. సేఫ్ జోన్లకు 76 వేల మంది తరలింపు

National4 weeks ago

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలో హైఅలర్ట్ .. ఎర్రకోట వద్ద పటిష్ఠ భద్రత

National4 weeks ago

UPSC Civils Mains 2024: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసిందోచ్

Andhrapradesh4 weeks ago

AP Police Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్‌

International4 weeks ago

ఇజ్రాయెల్​పై దాడికి ఇరాన్‌ సన్నాహాలు – అణు జలాంతర్గామిని పంపిస్తున్న అమెరికా – Iran backed Attack On Israel

International4 weeks ago

‘రాక్షసి వెళ్లిపోయింది’ – హసీనాపై ముహమ్మద్ యూనుస్​ ఘాటు వ్యాఖ్య – Yunus Comments On Hasina

International4 weeks ago

Donald Trump : ‘ఎక్స్‌’లో డొనాల్డ్ ట్రంప్‌తో ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ.. ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Technology4 weeks ago

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరు గ్రూప్‌లో చేరడానికి ముందే అన్నీ తెలుసుకోవచ్చు!

National4 weeks ago

2036 నాటికి భారత జనాభా 152 కోట్లు – పెరగనున్న మహిళలు – తగ్గనున్న యువత – INDIA POPULATION 2036

National4 weeks ago

ఐఐటీ మద్రాస్ దేశంలోనే బెస్ట్​- వరుసగా ఆరోసారి- టాప్​ కాలేజీల లిస్ట్​ ఇదే! – NIRF Ranking 2024

International4 weeks ago

Israel Hamas war : గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 100మందికిపైగా మృతి

National4 weeks ago

PM Modi: భారీ వర్షంలో రైతులతో ప్రధాని మోదీ భేటీ.. సింప్లిసిటీ చూస్తే వావ్ అనాల్సిందే.. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి..

Telangana4 weeks ago

Yadadri: యాదగిరిగుట్టలో మరిన్ని మార్పులకు ప్రభుత్వం సిద్ధం..!

Andhrapradesh4 weeks ago

PG Medical Courses: మెడికల్‌ విద్యార్ధులకు బిగ్‌షాక్‌.. పీజీ వైద్య విద్య ఫీజులు పెంచిన సర్కార్!

Andhrapradesh4 weeks ago

Tungabhadra Dam: 69 ఏళ్ల చరిత్రలో ఫస్ట్‌టైమ్‌ ప్రమాదం.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు

Cricket4 weeks ago

Team India: ఇకపై టెస్ట్ జట్టులో కనిపించని ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు.. చివరి మ్యాచ్ ఎప్పుడు ఆడారంటే?

National4 weeks ago

17 నెలల తర్వాత.. జైలు నుంచి విడుదలైన సిసోడియా..

National4 weeks ago

New rule : విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ఆగ‌స్టు 15 నుంచి పాఠ‌శాల్లో కొత్త రూల్‌.. ‘గుడ్ మార్నింగ్ చెప్పొద్దు..’

Andhrapradesh4 weeks ago

Andhra Pradesh: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పట్నుంచంటే..?

Spiritual4 weeks ago

ఈ సంవత్సరం కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు?ఆగస్టు 26నా, 27నా? మధుర, బృందావనంలో ఎప్పుడు జరుపుతారంటే?

Business3 months ago

Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…

Career3 months ago

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

Business3 months ago

ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది

National4 months ago

IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

News3 months ago

జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు

Business3 months ago

ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు

Education3 months ago

వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

National3 months ago

Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!

National3 months ago

అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్‌ రామచంద్ర

Andhrapradesh3 months ago

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!

Spiritual3 months ago

Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

Telangana3 months ago

Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

Crime News3 months ago

జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

Andhrapradesh2 months ago

జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్

National3 months ago

నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు

Railways3 months ago

పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే

National3 months ago

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే

Andhrapradesh3 months ago

పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!

National3 months ago

కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి

Andhrapradesh3 months ago

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

Political3 months ago

కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

Political3 months ago

పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు

Andhrapradesh3 months ago

ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…

Andhrapradesh3 months ago

వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!

Weather3 months ago

జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…

National3 months ago

Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!

Education3 months ago

ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త

Andhrapradesh3 months ago

SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?

Business3 months ago

ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ

Andhrapradesh3 months ago

సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల

Trending