Telangana
TG PGECET 2024 Results Today: నేడే తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) 2024 పరీక్ష ఫలితాలు మంగళవారం (జూన్ 18) విడుదలకానున్నాయి. హైదరాబాదులోని కూకట్పల్లిలో ఉన్న జేఎన్టీయూ హెచ్గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ హాల్, అడ్మిషన్ భవనంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాదు జేఎన్టీయూ ఆన్లైన్లో నిర్వహించిన ఈ పరీక్షలు జూన్ 13తో ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22,712 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 20,626 (90.82%) మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు.
తెలంగాణ రాష్ట్రంలోని పలు కాలేజీల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం తెలంగాణ పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పీజీఈసెట్) ప్రతీయేట నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది పీజీఈసెట్ పరీక్ష జూన్ 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. రోజుకు రెండు సెషన్ల చొప్పున ఈ పరీక్ష జరిగింది. మొదటి సెషన్ పరీక్ష ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగాయి.
పీజీఈసెట్ 2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, అఫిలియేటెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మడీ, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పీజీఈసెట్ పరీక్షలో మొత్తం మార్కుల్లో కనీసం 25 శాతం మార్కులు వచ్చిన వారిని మాత్రమే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్ధులకు కనీస అర్హత మార్కులు ఉండవు. ఎన్ని మార్కులు వచ్చినా ర్యాంకు కేటాయిస్తారు.
Telangana
గుడ్ న్యూస్: హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం- ఇక పది రోజులు పుస్తక ప్రియులకు పండగే! – HYDERABAD BOOK FAIR 2024

Hyderabad Book Fair 2024 Begins Today Inaugurated by CM Revanth Reddy : పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్, మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బుక్ ఫెయిర్ ప్రారంభమయ్యింది. పది రోజుల పాటు సాగనున్న ఈ పుస్తకాల పండుగ ఎన్టీఆర్ స్టేడియంలో 300 పైగా స్టాళ్లతో కనువిందు చేయనుంది. కేవలం పుస్తకాలు మాత్రమే కాకుండా వాటి రచయితలను కూడా కలుసుకునే గొప్ప అవకాశం ఇది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2024 గురించిన మరిన్ని వివరాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
వందల స్టాళ్లు : హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో నేటి నుంచి (గురువారం 19) నుంచి 29వ తేదీ వరకు 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్(హెచ్బీఎఫ్)ను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. దీన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని హెచ్బీఎఫ్ అధ్యక్షుడు డా.యాకూబ్ షేక్ తెలిపారు. బుధవారం ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో హెచ్బీఎఫ్ కమిటీ సభ్యులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన బుక్ఫెయిర్లో సుమారు 350 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. వీటిలో దేశవ్యాప్తంగా ఉన్న 210 మందికిపైగా ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్లు పుస్తకాలను ప్రదర్శించనున్నట్లు వివరించారు.
300 Plus Stalls in Book Fair : బుక్ ఫెయిర్ ప్రాంగణానికి మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు, సభా కార్యక్రమాల వేదికకు రచయిత్రి, ప్రసిద్ధ విమర్శకురాలు బోయి విజయభారతి, పుస్తకాల ఆవిష్కరణ వేదికకు తోపుడుబండి సాదిక్గా నామకరణం చేశామని తెలిపారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, ఆచార్యులు రమా మేల్కోటేలతో సలహా కమిటీని ఏర్పాటు చేశామన్నారు.
తెలంగాణ రుచులతో ఫుడ్ స్టాళ్లు, పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు. ఈ సమావేశంలో హెచ్బీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్(వాసు), కోశాధికారి పి.నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు బాల్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ పాల్గొన్నారు.
Telangana
Yadadri: యాదగిరిగుట్టలో మరిన్ని మార్పులకు ప్రభుత్వం సిద్ధం..!

తెలంగాణ ప్రజల ఇలవేల్పు. భక్తుల కోర్కెలు తీర్చే శ్రీలక్ష్మీనరసింహ స్వామి.. ప్రజల చేత యాదగిరి నర్సన్నగా విరాజిల్లుతున్నాడు. అయితే.. గొప్ప చరిత్ర ఉన్న యాదగిరిగుట్టను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక… అప్పటి సీఎం కేసీఆర్ 1200 కోట్ల రూపాయలతో ఆలయాన్ని పునర్ నిర్మించారు. యావత్ దేశం అబ్బురపడేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు. 2016 నుంచి ఐదేళ్ల పాటు శ్రమించి యాదగిరిగుట్టను సర్వాంగ సుందరంగా మార్చారు. అంతేకాదు… యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మారుస్తూ… భక్తులకు దర్శనం కల్పించారు.
ఇక ప్రధానాలయం పునర్నిర్మాణానికి ముందు వరకు ఉన్న ఆచారాలను అప్పట్లో తొలగించారు. భక్తులు కొండపై బస చేయడం, కొబ్బరి కాయలు కొట్టడం, తలనీలాలు సమర్పించడం, పుష్కరిణిలో స్నానం చేసి మొక్కులు తీర్చుకోవడం వంటి సాంప్రదాయాల్ని తొలగించారు. అంతేకాదు గుట్టపై పలు వాహనాల రాకపోకలపైనా పలు ఆంక్షలు విధించారు.
ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం… ఆలయం అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యార్థం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. పాత ఆచార, సంప్రదాయాలను మళ్లీ అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే యాదాద్రిని యాదగిరిగుట్టగా పిలవాలన్న రేవంత్ సర్కార్… ఆలయంలో మరిన్ని మార్పుల చేర్పులు చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే భక్తులకు డ్రెస్ కోడ్ను తప్పనిసరి చేసింది. ఆలయ ఈవోతో పాటు సిబ్బంది కూడా డ్రెస్ కోడ్ను పాటిస్తున్నారు. స్వామి సన్నిధిలో భక్తులు బస చేసే విధంగా డార్మెంటరీ హాల్ను ఏర్పాటు చేశారు. అలాగే కొబ్బరి కాయలు కొట్టడం, కొండపైకి ఆటోలు వెళ్లడం వంటి పలు నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నారు. అంతేకాదు స్వామివారి క్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు… ఇటీవలే ప్లాస్టిక్ వాడకాన్ని కూడా నిషేధించారు. అలాగే ఏళ్లుగా వస్తున్న గిరిప్రదక్షిణ సంప్రదాయాన్ని మళ్లీ అందుబాటులోకి తెచ్చారు. ఇక తాజాగా ఆలయ సన్నిధిలోని విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానానికి అనుమతించారు. ఇక కొండపై పాత ఆచార సాంప్రదాయాలను పునరుద్ధరించడం పట్ల భక్తులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా ప్రభుత్వాలు మారడంతో… యాదగిరిగుట్టపై ఆచారాలు, సాంప్రదాయాలు, భక్తుల సౌకర్యాల కల్పనలోనూ మార్పులొస్తున్నాయి. ఇక ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం… భక్తుల సౌకర్యార్ధం మరికొన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి… ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో..!
Telangana
అరుదైన పురస్కారానికి ఎంపికైన చేనేత కళాకారుడు.. తెలంగాణ నుంచే ఎందుకంటే..

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, కంచిపట్టు చీరలకు యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి కేరాఫ్ అడ్రస్. చేనేత కార్మికుల నైపుణ్యానికి ప్రతీక ఇక్కడి ఈ చీరలు. సృజనాత్మకత, నూతన డిజైన్లతో వస్త్రాల తయారీ ఇక్కడి చేనేత కార్మికుల అద్భుత కళారూపానికి నిదర్శనం. ఎన్నో ప్రత్యేకతలతో పర్యావరణహితంగా చీరను రూపొందించి మరోసారి జాతీయ స్థాయిలో తెలంగాణ చేనేత ఘనతను ఓ కళాకారుడు చాటిచెప్పారు.
యాదాద్రి జిల్లా చేనేత కార్మికులకు పుట్టినిల్లు..
ఇక్కడి చేనేత కార్మికుల అద్భుత కళారూపాలు ఖండాంతర ఖ్యాతిని సాధించాయి. ఈ ప్రాంతంలోని నేతన్నలు ఎన్నో చేనేత పురస్కారాలను అందుకున్నారు. తాజాగా ఓ చేనేత కార్మికుడు పర్యావరణహితమైన చీరను రూపొందించి.. జాతీయస్థాయిలో తెలంగాణ చేనేత ఘనతను చాటాడు. చౌటుప్పల్ మండలం కొయ్యల గూడెంకు చెందిన కర్నాటి ముఖేశ్ ఈ అరుదైన నేతను నేసాడు. కేంద్ర చేనేత, జౌళి శాఖ 2023 సంవత్సరానికి జాతీయ స్థాయిలో 14 మందిని జాతీయ పురస్కారానికి ఎంపిక చేయగా.. వారిలో తెలంగాణ నుంచి ముఖేశ్ ఈ అవార్డు సాధించారు. బీటెక్ ఎలక్ట్రానిక్స్ చదివిన ముఖేశ్ బాల్యం నుండి తాత, తండ్రి వారసత్వంగా చేనేత వృత్తిని కొనసాగించారు. 15 ఏళ్లుగా ముఖేష్ పలు ప్రయోగాలను చేస్తూ ఈ రంగంలోనే ఉన్నారు. ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఇచ్చే జాతీయ పురస్కారానికి రాష్ట్రం నుంచి 27 మంది చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. వారందరిలో ముఖేష్ ఒక్కరే రాష్ట్రం నుంచి జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికయ్యాడు.

పర్యావరణహితమైన చీర..
కర్నాటి ముఖేష్ రెండేళ్లపాటు శ్రమించి ప్రకృతి నుంచి సేకరించిన పది రకాల రంగులు అద్ది, వందపూల డిజైన్లతో ప్రత్యేకంగా నేసిన డబుల్ ఇక్కత్ ప్రకృతి రంగుల చీరను జాతీయ పురస్కారానికి నిపుణుల కమిటీ ఎంపిక చేసింది. నాణ్యమైన పత్తితో తయారైన సన్నటి నూలు దారాన్ని చీర తయారీకి ఉపయోగించారు. నూలును ఆయుర్వేద గుణాలున్న కరక్కాయ పొడి, కుంకుడుకాయ రసంతో శుద్ధిచేశారు. మగ్గంపై పడుగు, పేక ఒక్కో పోగును అల్లుతూ రెండేళ్లు శ్రమించి 46 అంగుళాల వెడల్పు, ఏడు మీటర్ల పొడవుతో 600 గ్రాముల బరువుండే చీరను నేశారు. కర్నాటి ముఖేష్ చేనేత ఇక్కత్ చీరల తయారీలో నూతన ఆవిష్కరణల కోసం నిరంతరం ప్రయత్నిస్తుండేవాడు. 2022లో రాష్ట్రప్రభుత్వం నుంచి కొండా లక్ష్మణ్ చేనేత పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఈ జాతీయ చేనేత పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. తెలంగాణ నుంచి జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు కర్నాటి ముఖేష్ జాతీయ చేనేత పురస్కారానికి ఎంపిక కావడం పట్ల చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-
Business9 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career9 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News9 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business9 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National10 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business9 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International9 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education8 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National8 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Crime News8 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh8 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Andhrapradesh8 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana9 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
National8 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Railways8 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National9 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Spiritual8 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
Andhrapradesh8 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh8 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh8 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Andhrapradesh12 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
National8 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
National8 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Political8 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh8 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
National9 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh8 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Andhrapradesh8 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Political8 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh8 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
National9 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Andhrapradesh7 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
Business9 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
International9 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Cinema11 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
International9 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
News9 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Education8 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Weather8 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Andhrapradesh8 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Andhrapradesh8 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
News8 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Railways7 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh9 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Business9 months ago
Bank Holidays June-2024: జూన్లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Education12 months ago
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు
-
News8 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh8 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
Andhrapradesh12 months ago
ప్రమాదపుటంచుల్లో ప్రపంచం
-
International8 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం