Hashtag
Prolonged sitting : ఎక్కువ సేపు కూర్చునే ఉంటే.. ప్రాణాలు పోతాయ్! ఆ అధ్యయనంలో షాకింగ్ విషయాలు..

Prolonged sitting side effects : మీరు గంటల తరబడి కూర్చూనే ఉండిపోతున్నారా? కూర్చునే అన్ని పనులు చేస్తున్నారా? అయితే.. ఇది మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే! ఎక్కువ సేపు కూర్చునే ఉంటే.. అనేక ఆరోగ్య సమస్యలు కలుగుతున్నాయని ఓ అధ్యయనం పేర్కొంది. ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది.
ఎక్కువ సేపు కూర్చునే ఉంటున్నారా?
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా.. ఈ స్టడీని నిర్వహించింది. 63-99ఏళ్ల మధ్యలో ఉన్న 5,856 మంది మహిళలను దశాబ్ద కాలం పాటు మానిటర్ చేసింది. వీరిలో 1,733 మంది మరణించారు.
అధ్యయనం ప్రకారం.. రోజుకు 11 గంటల పాటు కూర్చునే ఉండిపోయిన వారికి, (తొమ్మిదిన్నర గంటల పాటు కూర్చునే వారితో పోల్చితే) మరణించే రిస్క్ 57శాతం అధికంగా ఉంటుందట!
ఎక్కువ కూర్చుని ఉన్నా పర్లేదు, వ్యాయామాలు చేస్తే చాలని చాలా మంది చెబుతుంటారు. కానీ.. అందులో నిజం లేదని, తాజా అధ్యయనం తేల్చేసింది! ఎంత ఎక్కువ వ్యాయామాలు చేసినా.. తొందరగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.
అయితే.. ఆస్ట్రేలియాలో జరిగిన ఓ అధ్యయనం.. తాజా స్టడీకి వ్యతిరేకంగా ఉంది! ఎక్కువ సేపు కూర్చున్నా.. రోజుకు 9వేలు- 10,500 స్టెప్స్ వేస్తే, ప్రీ-మెచ్యూర్ డెత్ ప్రమాదం తగ్గుతుందని ఆ అధ్యయనం చెప్పుకొచ్చింది.
Prolonged sitting death : మరి ఈ రెండింటి మధ్య ఇంత తేడా ఎందుకు ఉంది? అంటే.. డేటా ఇంటర్ప్రిటేషన్ మెథడ్, యాక్టివిటీ మానిటరింగ్ సెటప్లో డిఫరెన్స్ వంటివి కారణాలుగా ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆస్ట్రేలియాలో నిర్వహించిన అధ్యయనంలో.. వ్రిస్ట్కి మానిటర్స్ పెట్టారు. పైగా.. సిట్టింగ్, స్టాండింగ్ టైమ్ని నిర్ధరించేందుకు స్పెసిఫిక్ సాఫ్ట్ట్వేర్ని వాడలేదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది?
పెద్దవారు.. కూర్చునే సమయాన్ని తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. అవసరమైతే.. సిట్టింగ్స్ మధ్యలో లంగ్ బ్రేక్స్ తీసుకోవాలని చెబుతోంది.
Prolonged sitting health issues : మరోవైపు.. 7 గంటల పాటు కూర్చునే ఉన్నా.. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని పలు ఇతర అధ్యయనలు చెబుతున్నాయి. 30 గంట సేపు కూర్చున్నా.. బ్లడ్ షుగర్ లెవల్స్, బీపీ పెరుగుతాయని హెచ్చరిస్తున్నాయి.
Hashtag
Pen Hospital: పెన్నుల కోసం ఓ స్పెషల్ హాస్పిటల్.. ఇచ్చట అన్ని పెన్నులు రిపేర్ చేయబడును..!

మాటల్లో చెప్పలేని భావాలకు కలమే ఓ వరం. ధైర్యంగా అడగలేని ప్రశ్నలకు కలమే ఓ సమాధానం. కన్నీరు తీర్చలేని సమస్యలకు కలమే ఓ పరిష్కారం. ఎవరూ నిలదీయలేని వికృత చేష్టలకు కలమే ఓ చెప్పుదెబ్బ. బారసాలలో పిల్లల ముందుంచే వస్తువులలో కలం కూడా ఒకటి. డబ్బు, బంగారం కాకుండా కలం పట్టుకుంటే ఆ బిడ్డ గొప్ప విద్యావంతుడవుతాడని నమ్ముతారు. అన్నట్లు కోర్టులో నేరస్తుడికి మరణశిక్ష విధించిన సందర్భంలో ఆ తీర్పు చదివిన వెంటనే.. న్యాయమూర్తి ఆ తీర్పు రాసిన పెన్ను పాళీని వంచేసి విరగొట్టే సంప్రదాయము కోర్టుల్లో ఉండేది. పలువురికి కలం ఒక సెంటిమెంట్ కూడా. అందుకే కలం అంటే ప్రాణంగా ఇష్టపడేవారు ఉన్నారు. బ్రాండెడ్ వాచీలు, బట్టలు, ఇతర వస్తువులు ఎలాగో అలాగే విలువైన పెన్నులకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. పెన్నుని కొంతకాలం వాడేసి పారేసే వారు కొందరైతే… తమ సెంటిమెంట్ గా వాటిని కలకాలం ఉంచుకునే వారు మరికొందరు. అలాంటి వారి కోసమే శ్రీకాకుళంలో ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది పెన్ హాస్పిటల్.

నేటి తరానికి పాలి పెన్నులు… పెన్నులలో ఇంకు పోసుకోవటo, పెన్నుని క్లీన్ చేసుకోవడం, నిబ్ పాడయితే దానిని మార్చుకోవటం వంటివి పెద్దగా తెలియదు. యూజ్ అండ్ త్రో యుగంలో ఉన్న నేటి యువత మొబైల్ ఫోన్ మొదలుకుని ఏ వస్తువునైనా ఏడాది వాడటం తరువాత దానిని పక్కన పడేసి కొత్త దానిని కొనుక్కోవడం పట్లే ఆసక్తి చూపుతున్నారు. కానీ శ్రీకాకుళంలో మాత్రం పెన్నులు పాడయితే దానిని హాస్పిటల్ కి తీసుకు వెళతారు. అదేంటి మనుషులు, పశువులు అయితే హాస్పిటల్ కి తీసుకు వెళతారు కానీ పెన్నులు బాగుచేసే చోటుని హాస్పిటల్ అంటారేoటని అనుకుంటున్నారా….? అయితే ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి.
ఇక్కడ కలానికి ఎనలేని గౌరవం ఇస్తారు. పైగా జీవమున్న మనుషులను, పశువులను ఎలా అయితే ట్రీట్ చేస్తారారో అలాగే అనేక భావోద్వేగాలు, సెంటిమెంట్లతో తమ వద్దకు వచ్చే పెన్నులను సున్నితంగానే ట్రీట్ చేస్తారు ఇక్కడ. అలాఅని ఈ పెన్ హాస్పిటల్ ఈ మధ్యకాలంలో వచ్చిందయితే కాదు.. 1975 నుంచి ఈ పెన్ హాస్పిటల్ శ్రీకాకుళం 2టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్వహిస్తున్నారు. పొట్నూరు రాజారావు అనే వ్యక్తి ఈ పెన్ హాస్పిటల్ కి ఆద్యడు. కరోనా సమయంలో అతను మరణించగా వారసుడుగా అతని కుమారుడు నాగరాజు స్టేషనరీ, గిఫ్ట్ ఆర్టికల్స్ అమ్మటంతో పాటు అందులోనే ఈ పెన్ హాస్పిటల్ ను నిర్వహిస్తూ వస్తున్నాడు. ఎంత కాస్ట్లి పెన్ అయినా తండ్రికి ఇచ్చిన మాట బట్టి ఫ్రీగానే రిపేర్ చేసి ఇస్తాడు నాగరాజు. కొత్త, పాత అని తేడా లేకుండా అన్ని రకాల పెన్స్ను సరిచేసి ఇవ్వడం వీరి స్పెషాలిటీ.
ఈ పెన్ హాస్పటల్లో పెన్నులకు రిపేర్ చెయ్యటమే కాదు రూపాయి నుంచి లక్ష రూపాయిలు విలువ చేసే పెన్ను వరకు అనేక రకాల పెన్నులు అమ్మకానికి ఉంటాయి. ఈ పెన్ హాస్పిటల్ లో షీఫర్స్, మౌంట్ బ్లాక్ ,క్రాస్, వాటర్ మెన్, పార్కర్, పిన్ లైన్, పెరి కార్డెన్ కంపెనీలకు చెందిన ఎంతో విలువైన దేశ విదేశాల పెన్నులు అమ్మకానికి ఉంటాయి. మనుషుల మాదిరిగానే జీరో సైజ్ పెన్నులు, A4 సైజ్ పేపర్ అంతా బరువు మాత్రమే ఉండే వెయిట్ లాస్ పెన్నులు ఉన్నాయి. 80 ఏళ్ల పాటు ఇంకు గాని, రీఫిల్ గాని మార్చాల్సిన పని లేకుండా వాడే ఇన్ఫినిటీ పెన్ ఇక్కడ ఓ ప్రత్యేకం. ఈ పెన్నులో ఇంకుకు బదులు కార్భనిక్ గ్యాస్ ఉంటుంది. ఈ పెన్ ధర రూ.20,700.
ఇక AK 47 బుల్లెట్ తో రూపొందించిన బుల్లెట్ పెన్ కూడా పెన్ లవర్స్ తో పాటు సాధారణ ప్రజానీకాన్ని సైతం ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. అటు 24 కేరట్స్ గోల్డ్ ప్లేటెడ్ తో రూపొందించిన షీఫర్స్ కంపెనీ పెన్ను ధర అక్షరాలా రూ.75 వేలు. అయితే ఇంత ధర పెట్టీ కొన్న పెన్నులకు, సాధారణ పెన్నులకు సౌలభ్యం, హ్యాండ్ రైటింగ్ పరంగా చాలా వ్యత్యాసం ఉంటుందని అంటున్నారు పెన్ హాస్పిటల్ నిర్వాహకులు. ఒకసారి ఈ పెన్నులకు అలవాటు పడితే వదలలేరని చెబుతున్నారు.
ముఖ్యంగా కవులు, రచయితలు తమకు సౌలభ్యంగా ఉన్న కలం విషయంలో ఎంత ధర అయినా వెనక్కి తగ్గరని అంటున్నారు. ఇక చాలా మంది తమ సొంతానికి వాడుకునేoదుకు ఇష్టపడి ఈ కాస్ట్లీ పెన్నులు కొనుగోలు చేస్తే….మరికొంతమంది తల్లిదండ్రులకు, ప్రేయసి, ప్రియులకి, పై అధికారులకు గిఫ్ట్ గా కొనుగోలు చేసి ఇస్తారని అంటున్నారు.
సిరా అనే ఇంధనంతో అక్షరం అనే ఆయుధాన్ని వెంటపెట్టుకొని ప్రపంచాన్ని జయించేది కలం. అందుకే ఆత్రేయ,ఆరుద్ర, ఓల్గా లాంటి ఎందరో ప్రముఖ రచయితలు, కవులు వారి రచనలను కలం పేర్లతో ప్రచురించి ఫేమస్ అయ్యారు. కలం స్నేహం పేరిట పరిచయాలు అవుతున్నారు.కలానికి కాలం చెల్లి కంప్యూటర్ కి దగ్గరైన ఈ రోజుల్లో శ్రీకాకుళంలో ఇంకా పెన్ హాస్పిటల్ ఆదరణ పొందటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Hashtag
బర్రె కోసం 10 కిలోల బంగారు చైన్ చేయించి.. దాని మెడలో వేసిన వ్యక్తి

అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి తల్లీదండ్రులు బంగారు గొలుసులు చేయిస్తుండడం చూస్తూనే ఉంటాయి. ఓ వృద్ధుడు మాత్రం తన బర్రెకి బంగారు గొలుసు చేయించాడు. గొలుసు అంటే ఏదో రూ.10 వేలదో తులం బంగారంతోనో చేయించింది కాదు. 10 కిలోల బంగారంతో చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజికి మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తన బర్రెకు గొలుసు తొడుగుతూ అతడు మురిసిపోయాడు. ఆ సమయంలో మరొకరు అతడికి సాయం చేశారు. మరో వ్యక్తి ఇందుకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించాడు. అయితే, ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వ్యక్తి.. ‘మాషాల్లా.. ఆవుకి 10 కిలోల బంగారు గొలుసు. దాని ధర ఎంతో?’ అని పేర్కొన్నాడు.
అయితే, వీడియోలో ఉన్నది బర్రె అయితే పోస్ట్ చేసిన వ్యక్తి మాత్రం ఆవు అంటూ రాసుకురావడం నెటిజన్లను తికమకకు గురిచేస్తోంది. ఆవుగా భావించి బర్రెకు 10 కిలోల బంగారం చేయించారా ఏంటి? అంటూ కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయినా పశువులకు అంత ఖర్చు చేసి బంగారు గొలుసులు చేయించడం ఏంటంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.
Hashtag
Mystery Mummy: ఈజిప్ట్ రాజు సమాధిలో ప్రవేశించిన 20 మంది మృతి.. 100 ఏళ్ల రహస్యం నేడు బట్టబయలు

ఈజిప్టు రాజులకు సంబంధించిన రహస్య కథలు ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉన్నాయి. పురాతన ఈజిప్ట్ రాజులలో ఒకరు టుటన్ఖామున్. ఈ రాజు సమాధి, చావు నేటికీ రహస్యంగానే ఉంది. ఈ రాజు సమాధి దగ్గరకు వెళ్లిన వారు ఇప్పటివరకు శపించబడ్డారని చెబుతూ ఉంటారు. టుటన్ఖామున్ సమాధిని రహస్యంగా తెరిచిన వ్యక్తులు మరణించారని నమ్ముతారు. 20 మంది టుటన్ఖామున్ సమాధిని తెరిచారని, వారందరూ మరణించారని పేర్కొన్నారు. ఈ రహస్య మరణాల పరంపర 1922 సంవత్సరంలో ప్రారంభమైంది. 100 సంవత్సరాల తర్వాత టుటన్ఖామున్ సమాధిని తెరిచిన తర్వాత ప్రజలు ఎలా చనిపోయారనే నిజం శాస్త్రవేత్తలకు తెలిసింది.
పురాతన ఈజిప్షియన్ గ్రంథాలు మమ్మీ అవశేషాలను భద్రపరిచే వ్యక్తులు ‘ఏ వైద్యుడు నయం చేయలేని వ్యాధితో మరణానికి గురయ్యారని’ చదివినట్లు లెడ్బైబుల్ నివేదించింది. అయినప్పటికీ అటువంటి భయంకరమైన హెచ్చరికలు ఉన్నాయి. అయితే జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్లో రాస్ ఫెలోస్ రాసిన కొత్త అధ్యయనం ప్రకారం 100 సంవత్సరాల క్రితం నిజంగా ఏమి జరిగింది, అంటే సమాధిని తెరిచిన తర్వాత ప్రజలు ఎందుకు మరణించారు అనే ప్రశ్నకు సమాధానం దొరికింది.
మనుషులు ఎలా చనిపోయారు?
సమాధి తెరచిన ప్రజల మరణాలకు కారణం యురేనియం, విషపూరిత వ్యర్థాలను కలిగి ఉన్న సహజ మూలకాల నుంచి వచ్చే రేడియేషన్ విషప్రయోగం అని నమ్ముతారు. ఈ కణాలు క్యాన్సర్కు కారణమవుతాయి. నివేదికల ప్రకారం 1922లో టుటన్ఖామున్ సమాధిలోకి ప్రవేశించిన మొదటి వ్యక్తిగా పేరుగాంచిన హోవార్డ్ కార్టర్ అనే పురావస్తు శాస్త్రవేత్త కూడా ఇదే విధంగా మరణించి ఉండవచ్చు. అంతేకాదు హాడ్కిన్స్ లింఫోమా కూడా సమాధిలోకి ప్రవేశించారు. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడి సుమారు 11 సంవత్సరాల పాటు క్యాన్సర్ తో పోరాడి మరణించారు.
వివిధ వ్యాధులతో మరణించారు
నివేదికల ప్రకారం సమాధిలోకి ప్రవేశించిన వ్యక్తులలో లార్డ్ కార్నార్వోన్ రక్తం విష తుల్యంగా మారడంతో మరణించాడు. అదేవిధంగా సమాధిలోకి ప్రవేశించిన ఇతర వ్యక్తులు కూడా వివిధ వ్యాధులతో మరణించారు. ఆ తర్వాత ఇది శాపంగా భావించడం మొదలు పెట్టారు. అయితే నేడు ఈ మరణాలకు గల అసలు కారణం, ఇప్పుడు ఆ నిజం ప్రపంచం ముందు వెల్లడైంది.
-
Business10 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career10 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News10 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business10 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National10 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business10 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International10 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
National9 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Education9 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
Crime News9 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh9 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Telangana10 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
National9 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Andhrapradesh9 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Railways9 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National10 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Spiritual9 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
Andhrapradesh9 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh9 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh1 year ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Andhrapradesh9 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
National9 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
National9 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Political9 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh9 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh8 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
Andhrapradesh9 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
International10 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Andhrapradesh9 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
National10 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh9 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
National10 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Political9 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Business10 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
International10 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
Cinema12 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
News10 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Education9 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Weather9 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Andhrapradesh9 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Education1 year ago
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు
-
News9 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh9 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
Business10 months ago
Bank Holidays June-2024: జూన్లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Railways8 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh10 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Andhrapradesh1 year ago
ప్రమాదపుటంచుల్లో ప్రపంచం
-
Andhrapradesh9 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
International9 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
National1 year ago
బెంగళూరులో బాంబ్ బ్లాస్ట్.. హైదరాబాద్లో హై అలర్ట్..