Business
Okaya EV Ferrato: కొత్త బ్రాండ్తో ఈవీ స్కూటర్ ప్రకటించిన ఒకాయా.. ఓలా, టీవీఎస్ ఐక్యూబ్కు గట్టి పోటీ ఖాయం

ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల హవా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అన్ని కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ఒకాయ ఈవీ తన కొత్త ప్రీమియం బ్రాండ్ అయిన ఫెర్రాటోను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతంలోనే పలు నివేదికల ప్రకారం ఫెర్రాటో తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయనుందని వెల్లడించాయి. అందుకు తగ్గట్టుగానే ఫెర్రాటో కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ‘డిస్రిఫ్టర్’ పేరుతో లాంచ్ చేస్తుంది. ఇది 228 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేసేలా 6.4 కేడబ్ల్యూ పీఎంఎస్ఎం మోటార్ వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్కు సంబంధించి గరిష్ట వేగం గంటకు 95 కిమీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫెర్రాటో ఈవీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఫెర్రాటో రాబోయే రోజుల్లో తన ఈవీ స్కూటర్ గురించి మరిన్ని టీజర్లను విడుదల చేసే అవకాశం ఉంది. ఫెర్రాటోకు సంబంధించిన డీలర్షిప్ నెట్వర్క్ ఇప్పటికే ఒకాయా ఈవీ ద్వారా ప్రకటించాఉ. ఒకాయా ఈవీ కంటే సేవా నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ఫెర్రాటో కోసం 100 కంటే ఎక్కువ డీలర్ షిప్లను ఏర్పాటు చేయాలని బ్రాండ్ యోచిస్తోంది. ఫెర్రాటోతో, వినియోగదారులకు ప్రీమియం అనుభవాన్ని అందించడమే ఒకాయా ఈవీ ప్రధాన లక్ష్యమని ఒకాయ ఎలక్ట్రిక్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అన్షుల్ గుప్తా ఇలా అన్నారు. స్థిరమైన మొబిలిటీ ల్యాండ్ స్కేప్లో తమ మార్క్ చూపడమే లక్ష్యంగా పని చేస్తామని వివరించారు. అమ్మకాలు, కస్టమర్ కార్యకలాపాలు, సేవా కేంద్రాలను పర్యవేక్షిస్తున్న ప్రత్యేక బృందంతో ఫెర్రాటో కోసం 100 ప్లస్ భాగస్వాములను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నామని వివరించారు.
ఫెర్రాటో బ్రాండ్ లైనప్ను ప్రారంభించిన తాజా స్కూటర్ మోటోఫాస్ట్ లాంచ్ చేయనుంది. ముఖ్యంగా మార్కెట్ను ఏలుతున్న ఓలా, టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లకు గట్టి పోటినిచ్చేలా దీన్ని రూపొందించారు. ఈ స్కూటర్ ధర రూ.1,36,999 ఎక్స్-షోరూమ్గా ఉంటుంది. ఎలక్ట్రిక్ మోటార్ 2300 వాట్స గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. స్కూటర్ గరిష్టంగా 70 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది. ఈ స్కూటర్లు మూడు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. ఎకో, సిటీ, స్పోర్ట్స్ రైడింగ్ మోడ్స్ ఈ స్కూటర్ ప్రత్యేకత. మోటోఫాస్ట్ 3.53 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో డ్యూయల్ బ్యాటరీ వ్యవస్థతో వస్తుంది. అలాగే ఈ స్కూటర్ ఎల్ఎఫ్పీ సాంకేతికతను ఉపయోగిస్తోంది. బ్యాటరీ ప్యాక్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4 నుంచి 5 గంటలు పడుతుంది. ఈ స్కూటర్ 110 కిమీ నుంచి 130 కిమీ మధ్య రైడింగ్ పరిధిని అందిస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది.
Business
18 నెలల తర్వాత విప్రోలో పెరిగిన ఉద్యోగులు.. ట్రెండ్ మార్చేసిందిగా.. మరో అదిరిపోయే గుడ్న్యూస్ కూడా..

దేశంలోని నాలుగో అతిపెద్ద ఐటీ సంస్థ విప్రో.. శుక్రవారం రోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించింది. అంతకుముందుతో పోలిస్తే ఈ Q1 నికర లాభం 4.6 శాతం పెరిగి రూ. 3003.2 కోట్లకు చేరింది. ఇదే సమయంలో గతంలో ఉన్న ట్రెండ్ మార్చేసింది. వరుసగా 6 త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గగా ఈ సారి మాత్రం పెరిగింది. మరోవైపు కొత్త నియామకాల ప్రణాళికల్ని కూడా వివరించింద
18 నెలల తర్వాత విప్రోలో పెరిగిన ఉద్యోగులు.. ట్రెండ్ మార్చేసిందిగా.. మరో అదిరిపోయే గుడ్న్యూస్ కూడా..!
IT Employees: దేశంలోని నాలుగో అతిపెద్ద ఐటీ సంస్థ విప్రో.. శుక్రవారం రోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించింది. అంతకుముందుతో పోలిస్తే ఈ Q1 నికర లాభం 4.6 శాతం పెరిగి రూ. 3003.2 కోట్లకు చేరింది. ఇదే సమయంలో గతంలో ఉన్న ట్రెండ్ మార్చేసింది. వరుసగా 6 త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గగా ఈ సారి మాత్రం పెరిగింది. మరోవైపు కొత్త నియామకాల ప్రణాళికల్ని కూడా వివరించింది
Wipro Hiring Plans: భారత దిగ్గజ ఐటీ సంస్థలు వరుసగా 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాల్ని ప్రకటిస్తున్నాయి. తొలుత అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, తర్వాత వరుసగా హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ కూడా ఫలితాలు వెల్లడించగా ఇప్పుడు శుక్రవారం రోజు విప్రో కూడా Q1 ఫలితాల్ని వెల్లడించింది. ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో విప్రో నికర లాభం రూ. 3003.2 కోట్లుగా నమోదైంది. కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఇది 4.6 శాతం మేర పెరిగింది. ఇక ఆదాయం 3.8 శాతం తగ్గి రూ. 21,963.8 కోట్లకు చేరింది. అంతకుముందు ఇది రూ. 22,831.10 కోట్లుగా ఉండేది. ఇటీవలి కొన్ని త్రైమాసికాలతో పోలిస్తే విప్రో ఈసారి అంచనాల్ని మించి రాణించిందని చెప్పొచ్చ
విప్రో ఉద్యోగులు
ఇక విప్రోను గత కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన అతిపెద్ద సమస్య కంపెనీలో ఉద్యోగుల సంఖ్య తగ్గుతుండటం. ముఖ్యంగా గడిచిన 6 త్రైమాసికాలు అంటే మొత్తం 18 నెలలు.. విప్రోలో ఉద్యోగుల సంఖ్య తగ్గుతూనే వచ్చింది. అయితే ఈసారి మాత్రం ట్రెండ్ మార్చేసింది. గత 6 త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గగా ఈసారి మాత్రం అది పెరిగింది.
విప్రో ఉద్యోగుల సంఖ్య..
ఈ ఏప్రిల్- జూన్ సమయంలో విప్రోలో ఉద్యోగుల సంఖ్య 337 పెరిగింది. జూన్ 30 తో ముగిసిన నాటికి ఈ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,34,391 గా ఉంది. అయినప్పటికీ కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలోని ఉద్యోగుల సంఖ్యతో చూస్తే 15,367 తక్కువే. అప్పుడు ఉద్యోగుల సంఖ్య 2,49,758 గా ఉండగా.. వరుసగా 3 త్రైమాసికాల్లో ఈ మేర తగ్గిందన్నమాట. ఇక ఫలితాల సందర్భంగానే అట్రిషన్ రేటు గురించి కూడా ప్రకటించింది సంస్థ. ఇది 14.2 శాతం నుంచి 14.1 శాతానికి దిగొచ్చింది.
విప్రో నియామకాలు..
మరోవైపు కొత్త నియామకాలపైనా విప్రో కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 10 వేల మంది నుంచి 12 వేల వరకు తాజా ఉత్తీర్ణుల్ని (ఫ్రెషర్స్) క్యాంపస్ రిక్రూట్మెంట్లు (కళాశాల ప్రాంగణాలు), ఆఫ్ క్యాంపస్ ఎంపికల ద్వారా నియమించుకోబోతున్నట్లు స్పష్టం చేసింది. ఇక ఇప్పటివరకు ఆఫర్ లెటర్స్ ఇచ్చినవారికి కొలువులు ఇవ్వడం పూర్తి చేయనున్నట్లు విప్రో హెచ్ఆర్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ వెల్లడించారు. ఈ 3 నెలల సమయంలో 3 వేల మందిని కొత్తగా చేర్చుకున్నట్లు వివరించారు. గత త్రైమాసికంలో కొత్తగా 100 కోట్ల డాలర్ల విలువైన ఆర్డర్స్ దక్కించుకున్నట్లు తెలిపారు విప్రో సీఈఓ
Business
పోస్టాఫీసులో ఖాతా ఉన్న వారికి నిర్మలా సీతారామన్ ఊహించని శుభవార్త

ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకుల మాదిరిగానే, పోస్ట్ ఆఫీస్లు కూడా చాలా పొదుపు పథకాలను కలిగి ఉన్నాయి, కొన్ని పోస్టాఫీసు పథకాలు కస్టమర్ పెట్టుబడి కోసం బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి. ఈ విధంగా, జూలై 1 నుండి, పోస్ట్ ఆఫీస్లో అనేక కొత్తపథకాలు ప్రారంభమయ్యాయి, మీకు అద్భుతమైన రాబడిని ( Amazing Returns ) ఇచ్చే పెట్టుబడి వనరులో పెట్టుబడి పెట్టడానికి మీకు ప్రణాళిక ఉంటే, Post Office యొక్క ఈ new RD scheme మీ ఉత్తమ ఎంపిక.
పోస్టాఫీసు ( Post Office ) యొక్క ఈ కొత్త ఆర్డి పథకంలో మీరు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలనే నియమం లేదు. బదులుగా, మీరు వీలైనంత తక్కువ డబ్బుతో చిన్న పెట్టుబడిని ( Small Investment ) ప్రారంభించవచ్చు. ఇక్కడ వారు మీ పెట్టుబడికి తక్కువ స్థాయి పన్నులతో పూర్తి భద్రతను అందిస్తారు మరియు మెచ్యూరిటీ వ్యవధిలో మీ మొత్తం పెట్టుబడికి రాబడితో పాటు అద్భుతమైన రాబడిని అందిస్తారు.
Post Office Recurring Deposit Scheme:
పోస్టాఫీసు ( Post Office ) యొక్క ఈ కొత్త ఆర్డి పథకంలో మీరు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలనే నియమం లేదు. బదులుగా, మీరు వీలైనంత తక్కువ డబ్బుతో చిన్న పెట్టుబడిని ( Small Investment ) ప్రారంభించవచ్చు. ఇక్కడ వారు మీ పెట్టుబడికి తక్కువ స్థాయి పన్నులతో పూర్తి భద్రతను అందిస్తారు మరియు మెచ్యూరిటీ వ్యవధిలో మీ మొత్తం పెట్టుబడికి రాబడితో పాటు అద్భుతమైన రాబడిని అందిస్తారు.
ఈ ప్రత్యేక రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ( special recurring deposit scheme ) లో, పెట్టుబడిదారుల డబ్బుకు 7.5% వడ్డీ రేటు నిర్ణయించబడింది. కేవలం ఐదేళ్లపాటు ఇన్వెస్ట్ చేయండి మరియు మెచ్యూరిటీ వ్యవధిలో పొదుపుతో అధిక రాబడిని పొందండి.
కనీసం ₹100తో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి:
పోస్టాఫీసు ప్రత్యేక RD పథకంలో కేవలం వంద రూపాయల నుండి పెట్టుబడిని ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. మీరు అటువంటి ప్రత్యేక పథకాల ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, మీరు వెంటనే మీ సమీపంలోని పోస్టాఫీసు శాఖ Post Office ను సందర్శించి పెట్టుబడి ఖాతాను తెరవవచ్చు.
ఉదాహరణ: మీరు నెలవారీ ₹840 పెట్టుబడితో 5-సంవత్సరాల ప్లాన్ను ప్రారంభిస్తే, మీ మొత్తం పెట్టుబడి మొత్తం సంవత్సరానికి ₹10,080 అవుతుంది. దీని ప్రకారం ఐదు సంవత్సరాలకు ₹50,400. మెచ్యూరిటీ వ్యవధిలో 7.5% వడ్డీ ప్రాతిపదికన మొత్తం ₹72,665 విత్డ్రా చేసుకోవచ్చు.
Business
Wipro: ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. విప్రో జాక్పాట్.. అమెరికా కంపెనీతో రూ.4500 కోట్ల డీల్!

Wipro: కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రభావితమైన రంగాల్లో టెక్ కంపెనీలే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలే గతేడాది భారీగా ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. టెక్, ఐటీ కంపెనీలకు పెద్ద డీల్స్ అంతంమాత్రంగానే ఉంటుండడంతో చాలా కంపెనీలు వ్యయనియంత్రణ చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశీయ టెక్ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించాయి. దీంతో ఐటీ ఉద్యోగుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. కానీ, ఇటీవల భారతీయ టెక్ కంపెనీలకు గిరాకీ క్రమంగా పుంజుకుంటోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్ వంటి కంపెనీలు బిగ్ డీల్స్ సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు వాటి జాబితాలో చేరిపోయింది దేశీయ టెక్ దిగ్గజం విప్రో.
ఐటీ సర్వీసెస్ మేజర్ విప్రో తాజాగా అమెరికా కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి సుమారు 550 మిలియన్ డాలర్ల ఆర్డర్ అందుకుంది. ఈ డీల్పై ఇరు సంస్థలు సంతకాలు చేసినట్లు సమాచారం. ఈ కాంట్రాక్టు 5 ఏళ్ల పాటు ఉంటుందని, అమెరికా కంపెనీతో 550 మిలియన్ డాలర్ల డీల్ కుదిరినట్లు ఎక్స్చేంజీ ఫైలింగ్లో వెల్లడించింది విప్రో. భారత దేశ కరెన్సీలో చూసుకుంటే ఈ డీల్ విలువ సుమారు రూ.4500 కోట్లకుపైగా ఉంటుంది. ఈ డీల్ ద్వారా 5 ఏళ్ల పాటు అమెరికా కమ్యూనికేషన్ సర్వీసెస్ ప్రొవైడర్కు కొన్ని ప్రొడక్టులు, పరిశ్రమ నిర్దిష్ట పరిష్కారాల కోసం నిర్వహించే సేవలను అందిస్తుందని ఎక్స్చేంజీ ఫైలింగ్లో వెల్లడించింది. అయితే, ఈ డీల్కి సంబంధించిన ఇతర విషయాలేమీ విప్రో బహిర్గతం చేయలేదు.
ప్రస్తుతం ఐటీ పరిశ్రమ అనిశ్చితిలో ఉన్న క్రమంలో భారీ డీల్ కుదుర్చుకోవడం కంపెనీతో పాటు అందులో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులకు సైతం శుభవార్తగానే చెప్పవచ్చు. ప్రాజెక్టులు పెరగడం ద్వారా ఉద్యోగుల తొలగింపులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మరింత మందికి ఉపాధి లభిస్తుంది. మరోవైపు.. ఈ డీల్పై పూర్తి విప్రో కంపెనీ ప్రతినిధి ఒకరు పలు విషయాలు వెల్లడించారు. ఇది 5 ఏళ్ల టైమ్ పీరియడ్ కాంట్రాక్ట్ అని తెలిపారు. ఎంపిక చేసిన ప్రొడక్టులు, ఇండస్ట్రీకి సంబంధించిన నిర్దిష్ట సొల్యూషన్స్ కోసం సర్వీసులు అందించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న స్టేజీలో మిగిలిన వివరాలను కంపెనీ బహిర్గతం చేయాలనుకోవట్లేదని వెల్లడించారు.
500 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు ఉండే పెద్ద డీల్స్, కాంట్రాక్టులు అనేవి టాప్ టైప్ ఐటీ సర్వీసెస్ సంస్థలకు చాలా కీలకంగా ఐటీ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ డీల్స్ నేరుగా కంపెనీల రెవెన్యూ వృద్దిపై ప్రభావం చూపుతాయి. గత ఆర్థిక ఏడాది క్యూ4లో విప్రో ఇప్పటికే అతిపెద్ద డీల్ 1.2 బిలియన్ డాలర్ల డీల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇది ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన కంపెనీ రెవెన్యూ వృద్ధిని 9.5 శాతం మేర పెంచింది.
-
Business9 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career9 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News9 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business9 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National9 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business9 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International9 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education8 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National8 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh8 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Crime News8 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh8 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana9 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Railways8 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National9 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
National8 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Spiritual8 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
Andhrapradesh8 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh8 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh8 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Andhrapradesh12 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
National8 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
National8 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Political8 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh8 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Andhrapradesh8 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
National9 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Political8 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh8 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Andhrapradesh8 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
National9 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Andhrapradesh7 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
Business9 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Cinema11 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
International9 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
International9 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
News9 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Education8 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Weather8 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Andhrapradesh8 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Andhrapradesh8 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
News8 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Railways7 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh9 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Business9 months ago
Bank Holidays June-2024: జూన్లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
News8 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh8 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
Education12 months ago
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు
-
International8 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Andhrapradesh12 months ago
ప్రమాదపుటంచుల్లో ప్రపంచం