Hashtag
ISRO: అంతరిక్షంలో భారత్ స్పేస్ స్టేషన్.. ఇస్రో కీలక నిర్ణయం..

ఇస్రో ఈ పేరు తెలియని భారతీయుడు బహుశా ఉండడేమో.. ఒక్క భారతీయుడు ఏంటి ప్రపంచ దేశాల్లో ఇప్పుడు అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో అంటే ఒక బ్రాండ్. చంద్రయాన్ సక్సెస్తో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా భారత్ వైపు చూసేలా చేశారు భారత శాస్త్ర వేత్తలు. అదే విజయం కొనసాగించేందుకు పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్తూ సక్సెస్ రేట్లో ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంకి వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 2047 నాటికి అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఇస్రో శాస్త్ర వేత్తలు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2047వ సంవత్సరం నాటికి అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీవారి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లో నూతనంగా మూడవ లాంచ్ పాడ్ నిర్మించండానికి స్థల సేకరణ ఏర్పాట్లలో ఇస్రో ఇప్పటికే నిమగ్నమైంది. దీంతో పాటుగా సరికొత్త రాకెట్ లాంచింగ్ వెహికల్ న్యూ జనరేషన్ రాకెట్ లాంచింగ్ వెహికల్ ఎన్జీఆర్ఎల్వి 2035 నాటికి సిద్ధమయ్యే విధంగా ఇస్రోకు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది.
అందులో భాగంగానే 2028 న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ మొదటి టెస్ట్ వెహికల్ను తాత్కాలిక ప్రయోగంగా ప్రయోగించనున్నారు. 2035 – 47 సంవత్సరం నాటికి ఎన్జీఆర్ఎల్వి లాంచ్ వెహికల్ను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి ఇస్రోకి అంకితం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఇక్కడి శాస్త్రవేత్తలు. అయితే ఇస్రోకు ఈ ఎన్జీఆర్ఎల్వి న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ ఒక వరంగా మారనుంది. ఈ న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ డిసైన్ తయారు చేసే దానిపై ఇస్రోలో పనిచేస్తున్న పిఎస్ఎల్వీ, జిఎస్ఎల్వి, ఎల్ఎంవీ-3 రాకెట్ వెహికల్స్లో నైపుణ్యం కలిగిన పదిమంది శాస్త్ర వేత్తలను న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శివకుమార్ కు సహాయ సహకారాలు అందించనున్నారు. ఈ న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ కనుక ఇస్రోకు సిద్ధమైతే సుమారు 10 టన్నుల బరువు కలిగినటువంటి ఉపగ్రహాలను సైతం (జిటిఓ) GTO జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ కక్షలోకి సునాయాసనంగా ఉపగ్రహాలను సైతం ప్రవేశపెట్టగలిగే సత్తా ఇస్రోకి సొంతం కానుంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 1975 ఏప్రిల్ 19న ఆర్యభట్ట అనే సాటిలైట్తో ప్రస్థానం మొదలుపెట్టి నేటికి వందల కొద్ది ఉపగ్రహాలను నింగికి పంపి ప్రపంచ దేశాల దేశాలకు దీటుగా నిలబడింది.
అందులో ప్రధానమైన ఉపగ్రహాలు అంగారక, సూర్య, చంద్ర గ్రహాలపైకి ఉపగ్రహాలను పంపి అక్కడ ప్రయోగాలు చేపట్టి ప్రపంచ దేశాలకు ఇస్రో సత్తా చాటింది. సూర్య గ్రహంపైకి ఆదిత్య-L1 ఉపగ్రహాన్ని పంపి చరిత్ర సృష్టించింది. అదేవిధంగా చంద్రయాన్ వన్, చంద్రయాన్ టు ఉపగ్రహాలతో చంద్రునిపై అడుగులు పెట్టి చంద్రునిపై పరిశోధనలు చేసి ప్రపంచ రికార్డును కైవసం చేసుకుంది. అంతే కాకుండా మంగళయాన్ పేరుతో అంగారక గ్రహంపై కూడా ఉపగ్రహాలను పంపి ఇస్రో తన సత్తా చాటుకుని ప్రపంచ దేశాలు సైతం ఇస్రో వైపు చూసేలా ప్రయోగాలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే 2047వ సంవత్సరాన్ని టార్గెట్గా ఉంచుకొని ఇస్రో మరెన్నో దేశాభివృద్ధికి ఉపయోగపడే విధంగా రాకెట్ ప్రయోగాలకు సన్నాహాలు చేపడుతుంది.
అందులో భాగంగానే అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు, న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ కొరకు శ్రీహరికోటలో మూడవ లాంచ్ ప్యాడ్ నిర్మాణం చేపట్టడం వీటికి నిదర్శనం. ఇస్రో మొదటి సారి ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పీఎస్ఎల్వి, జీఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాలు విజయవంతంగా చేపట్టి ఇప్పుడు జీఎస్ఎల్వి, ఎల్విఎం 3 వాహక నౌక తో భారీ ఉపగ్రహాలను నింగిలోకి పంపుతుంది. అయితే వీటన్నింటికి భిన్నంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేసేలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఇస్రో భవిష్యత్ ప్రయోగాలు కొరకు ఎన్జీఆర్ఎల్వి న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్కు ఇప్పుడు రూపకల్పన చేస్తోంది. ఈ రూపకల్పన 2035-2040 కల్లా పూర్తి చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ ద్వారా ఇస్రో చంద్ర మండలంపైకి మానవులను సైతం పంపేందుకు అనువుగా ఉండే విధంగా ఎన్జీఎల్వికి రూపకల్పన చేస్తున్నారు.
Hashtag
Pen Hospital: పెన్నుల కోసం ఓ స్పెషల్ హాస్పిటల్.. ఇచ్చట అన్ని పెన్నులు రిపేర్ చేయబడును..!

మాటల్లో చెప్పలేని భావాలకు కలమే ఓ వరం. ధైర్యంగా అడగలేని ప్రశ్నలకు కలమే ఓ సమాధానం. కన్నీరు తీర్చలేని సమస్యలకు కలమే ఓ పరిష్కారం. ఎవరూ నిలదీయలేని వికృత చేష్టలకు కలమే ఓ చెప్పుదెబ్బ. బారసాలలో పిల్లల ముందుంచే వస్తువులలో కలం కూడా ఒకటి. డబ్బు, బంగారం కాకుండా కలం పట్టుకుంటే ఆ బిడ్డ గొప్ప విద్యావంతుడవుతాడని నమ్ముతారు. అన్నట్లు కోర్టులో నేరస్తుడికి మరణశిక్ష విధించిన సందర్భంలో ఆ తీర్పు చదివిన వెంటనే.. న్యాయమూర్తి ఆ తీర్పు రాసిన పెన్ను పాళీని వంచేసి విరగొట్టే సంప్రదాయము కోర్టుల్లో ఉండేది. పలువురికి కలం ఒక సెంటిమెంట్ కూడా. అందుకే కలం అంటే ప్రాణంగా ఇష్టపడేవారు ఉన్నారు. బ్రాండెడ్ వాచీలు, బట్టలు, ఇతర వస్తువులు ఎలాగో అలాగే విలువైన పెన్నులకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. పెన్నుని కొంతకాలం వాడేసి పారేసే వారు కొందరైతే… తమ సెంటిమెంట్ గా వాటిని కలకాలం ఉంచుకునే వారు మరికొందరు. అలాంటి వారి కోసమే శ్రీకాకుళంలో ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది పెన్ హాస్పిటల్.

నేటి తరానికి పాలి పెన్నులు… పెన్నులలో ఇంకు పోసుకోవటo, పెన్నుని క్లీన్ చేసుకోవడం, నిబ్ పాడయితే దానిని మార్చుకోవటం వంటివి పెద్దగా తెలియదు. యూజ్ అండ్ త్రో యుగంలో ఉన్న నేటి యువత మొబైల్ ఫోన్ మొదలుకుని ఏ వస్తువునైనా ఏడాది వాడటం తరువాత దానిని పక్కన పడేసి కొత్త దానిని కొనుక్కోవడం పట్లే ఆసక్తి చూపుతున్నారు. కానీ శ్రీకాకుళంలో మాత్రం పెన్నులు పాడయితే దానిని హాస్పిటల్ కి తీసుకు వెళతారు. అదేంటి మనుషులు, పశువులు అయితే హాస్పిటల్ కి తీసుకు వెళతారు కానీ పెన్నులు బాగుచేసే చోటుని హాస్పిటల్ అంటారేoటని అనుకుంటున్నారా….? అయితే ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి.
ఇక్కడ కలానికి ఎనలేని గౌరవం ఇస్తారు. పైగా జీవమున్న మనుషులను, పశువులను ఎలా అయితే ట్రీట్ చేస్తారారో అలాగే అనేక భావోద్వేగాలు, సెంటిమెంట్లతో తమ వద్దకు వచ్చే పెన్నులను సున్నితంగానే ట్రీట్ చేస్తారు ఇక్కడ. అలాఅని ఈ పెన్ హాస్పిటల్ ఈ మధ్యకాలంలో వచ్చిందయితే కాదు.. 1975 నుంచి ఈ పెన్ హాస్పిటల్ శ్రీకాకుళం 2టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్వహిస్తున్నారు. పొట్నూరు రాజారావు అనే వ్యక్తి ఈ పెన్ హాస్పిటల్ కి ఆద్యడు. కరోనా సమయంలో అతను మరణించగా వారసుడుగా అతని కుమారుడు నాగరాజు స్టేషనరీ, గిఫ్ట్ ఆర్టికల్స్ అమ్మటంతో పాటు అందులోనే ఈ పెన్ హాస్పిటల్ ను నిర్వహిస్తూ వస్తున్నాడు. ఎంత కాస్ట్లి పెన్ అయినా తండ్రికి ఇచ్చిన మాట బట్టి ఫ్రీగానే రిపేర్ చేసి ఇస్తాడు నాగరాజు. కొత్త, పాత అని తేడా లేకుండా అన్ని రకాల పెన్స్ను సరిచేసి ఇవ్వడం వీరి స్పెషాలిటీ.
ఈ పెన్ హాస్పటల్లో పెన్నులకు రిపేర్ చెయ్యటమే కాదు రూపాయి నుంచి లక్ష రూపాయిలు విలువ చేసే పెన్ను వరకు అనేక రకాల పెన్నులు అమ్మకానికి ఉంటాయి. ఈ పెన్ హాస్పిటల్ లో షీఫర్స్, మౌంట్ బ్లాక్ ,క్రాస్, వాటర్ మెన్, పార్కర్, పిన్ లైన్, పెరి కార్డెన్ కంపెనీలకు చెందిన ఎంతో విలువైన దేశ విదేశాల పెన్నులు అమ్మకానికి ఉంటాయి. మనుషుల మాదిరిగానే జీరో సైజ్ పెన్నులు, A4 సైజ్ పేపర్ అంతా బరువు మాత్రమే ఉండే వెయిట్ లాస్ పెన్నులు ఉన్నాయి. 80 ఏళ్ల పాటు ఇంకు గాని, రీఫిల్ గాని మార్చాల్సిన పని లేకుండా వాడే ఇన్ఫినిటీ పెన్ ఇక్కడ ఓ ప్రత్యేకం. ఈ పెన్నులో ఇంకుకు బదులు కార్భనిక్ గ్యాస్ ఉంటుంది. ఈ పెన్ ధర రూ.20,700.
ఇక AK 47 బుల్లెట్ తో రూపొందించిన బుల్లెట్ పెన్ కూడా పెన్ లవర్స్ తో పాటు సాధారణ ప్రజానీకాన్ని సైతం ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. అటు 24 కేరట్స్ గోల్డ్ ప్లేటెడ్ తో రూపొందించిన షీఫర్స్ కంపెనీ పెన్ను ధర అక్షరాలా రూ.75 వేలు. అయితే ఇంత ధర పెట్టీ కొన్న పెన్నులకు, సాధారణ పెన్నులకు సౌలభ్యం, హ్యాండ్ రైటింగ్ పరంగా చాలా వ్యత్యాసం ఉంటుందని అంటున్నారు పెన్ హాస్పిటల్ నిర్వాహకులు. ఒకసారి ఈ పెన్నులకు అలవాటు పడితే వదలలేరని చెబుతున్నారు.
ముఖ్యంగా కవులు, రచయితలు తమకు సౌలభ్యంగా ఉన్న కలం విషయంలో ఎంత ధర అయినా వెనక్కి తగ్గరని అంటున్నారు. ఇక చాలా మంది తమ సొంతానికి వాడుకునేoదుకు ఇష్టపడి ఈ కాస్ట్లీ పెన్నులు కొనుగోలు చేస్తే….మరికొంతమంది తల్లిదండ్రులకు, ప్రేయసి, ప్రియులకి, పై అధికారులకు గిఫ్ట్ గా కొనుగోలు చేసి ఇస్తారని అంటున్నారు.
సిరా అనే ఇంధనంతో అక్షరం అనే ఆయుధాన్ని వెంటపెట్టుకొని ప్రపంచాన్ని జయించేది కలం. అందుకే ఆత్రేయ,ఆరుద్ర, ఓల్గా లాంటి ఎందరో ప్రముఖ రచయితలు, కవులు వారి రచనలను కలం పేర్లతో ప్రచురించి ఫేమస్ అయ్యారు. కలం స్నేహం పేరిట పరిచయాలు అవుతున్నారు.కలానికి కాలం చెల్లి కంప్యూటర్ కి దగ్గరైన ఈ రోజుల్లో శ్రీకాకుళంలో ఇంకా పెన్ హాస్పిటల్ ఆదరణ పొందటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Hashtag
బర్రె కోసం 10 కిలోల బంగారు చైన్ చేయించి.. దాని మెడలో వేసిన వ్యక్తి

అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి తల్లీదండ్రులు బంగారు గొలుసులు చేయిస్తుండడం చూస్తూనే ఉంటాయి. ఓ వృద్ధుడు మాత్రం తన బర్రెకి బంగారు గొలుసు చేయించాడు. గొలుసు అంటే ఏదో రూ.10 వేలదో తులం బంగారంతోనో చేయించింది కాదు. 10 కిలోల బంగారంతో చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజికి మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తన బర్రెకు గొలుసు తొడుగుతూ అతడు మురిసిపోయాడు. ఆ సమయంలో మరొకరు అతడికి సాయం చేశారు. మరో వ్యక్తి ఇందుకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించాడు. అయితే, ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వ్యక్తి.. ‘మాషాల్లా.. ఆవుకి 10 కిలోల బంగారు గొలుసు. దాని ధర ఎంతో?’ అని పేర్కొన్నాడు.
అయితే, వీడియోలో ఉన్నది బర్రె అయితే పోస్ట్ చేసిన వ్యక్తి మాత్రం ఆవు అంటూ రాసుకురావడం నెటిజన్లను తికమకకు గురిచేస్తోంది. ఆవుగా భావించి బర్రెకు 10 కిలోల బంగారం చేయించారా ఏంటి? అంటూ కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయినా పశువులకు అంత ఖర్చు చేసి బంగారు గొలుసులు చేయించడం ఏంటంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.
Hashtag
Mystery Mummy: ఈజిప్ట్ రాజు సమాధిలో ప్రవేశించిన 20 మంది మృతి.. 100 ఏళ్ల రహస్యం నేడు బట్టబయలు

ఈజిప్టు రాజులకు సంబంధించిన రహస్య కథలు ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉన్నాయి. పురాతన ఈజిప్ట్ రాజులలో ఒకరు టుటన్ఖామున్. ఈ రాజు సమాధి, చావు నేటికీ రహస్యంగానే ఉంది. ఈ రాజు సమాధి దగ్గరకు వెళ్లిన వారు ఇప్పటివరకు శపించబడ్డారని చెబుతూ ఉంటారు. టుటన్ఖామున్ సమాధిని రహస్యంగా తెరిచిన వ్యక్తులు మరణించారని నమ్ముతారు. 20 మంది టుటన్ఖామున్ సమాధిని తెరిచారని, వారందరూ మరణించారని పేర్కొన్నారు. ఈ రహస్య మరణాల పరంపర 1922 సంవత్సరంలో ప్రారంభమైంది. 100 సంవత్సరాల తర్వాత టుటన్ఖామున్ సమాధిని తెరిచిన తర్వాత ప్రజలు ఎలా చనిపోయారనే నిజం శాస్త్రవేత్తలకు తెలిసింది.
పురాతన ఈజిప్షియన్ గ్రంథాలు మమ్మీ అవశేషాలను భద్రపరిచే వ్యక్తులు ‘ఏ వైద్యుడు నయం చేయలేని వ్యాధితో మరణానికి గురయ్యారని’ చదివినట్లు లెడ్బైబుల్ నివేదించింది. అయినప్పటికీ అటువంటి భయంకరమైన హెచ్చరికలు ఉన్నాయి. అయితే జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్లో రాస్ ఫెలోస్ రాసిన కొత్త అధ్యయనం ప్రకారం 100 సంవత్సరాల క్రితం నిజంగా ఏమి జరిగింది, అంటే సమాధిని తెరిచిన తర్వాత ప్రజలు ఎందుకు మరణించారు అనే ప్రశ్నకు సమాధానం దొరికింది.
మనుషులు ఎలా చనిపోయారు?
సమాధి తెరచిన ప్రజల మరణాలకు కారణం యురేనియం, విషపూరిత వ్యర్థాలను కలిగి ఉన్న సహజ మూలకాల నుంచి వచ్చే రేడియేషన్ విషప్రయోగం అని నమ్ముతారు. ఈ కణాలు క్యాన్సర్కు కారణమవుతాయి. నివేదికల ప్రకారం 1922లో టుటన్ఖామున్ సమాధిలోకి ప్రవేశించిన మొదటి వ్యక్తిగా పేరుగాంచిన హోవార్డ్ కార్టర్ అనే పురావస్తు శాస్త్రవేత్త కూడా ఇదే విధంగా మరణించి ఉండవచ్చు. అంతేకాదు హాడ్కిన్స్ లింఫోమా కూడా సమాధిలోకి ప్రవేశించారు. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడి సుమారు 11 సంవత్సరాల పాటు క్యాన్సర్ తో పోరాడి మరణించారు.
వివిధ వ్యాధులతో మరణించారు
నివేదికల ప్రకారం సమాధిలోకి ప్రవేశించిన వ్యక్తులలో లార్డ్ కార్నార్వోన్ రక్తం విష తుల్యంగా మారడంతో మరణించాడు. అదేవిధంగా సమాధిలోకి ప్రవేశించిన ఇతర వ్యక్తులు కూడా వివిధ వ్యాధులతో మరణించారు. ఆ తర్వాత ఇది శాపంగా భావించడం మొదలు పెట్టారు. అయితే నేడు ఈ మరణాలకు గల అసలు కారణం, ఇప్పుడు ఆ నిజం ప్రపంచం ముందు వెల్లడైంది.
-
Business9 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career9 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News9 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business9 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National9 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business9 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International9 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education8 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National8 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh8 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Crime News8 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh8 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana9 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Railways8 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National9 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
National8 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Spiritual8 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
Andhrapradesh8 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh8 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh8 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Andhrapradesh12 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
National8 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
National8 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Political8 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh8 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Andhrapradesh8 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
National9 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Political8 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh8 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Andhrapradesh8 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
National9 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Andhrapradesh7 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
Business9 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Cinema11 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
International9 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
International9 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
Weather8 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
News9 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Education8 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Andhrapradesh8 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
News8 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh8 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
Railways7 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Business9 months ago
Bank Holidays June-2024: జూన్లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Andhrapradesh9 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
News8 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh8 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
Education12 months ago
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు
-
International8 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Andhrapradesh12 months ago
ప్రమాదపుటంచుల్లో ప్రపంచం