News
ఆగని అల్లర్లు చాలా జిల్లాల్లో టెన్షన్ వాతావరణం

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ ఘర్షణలు తగ్గుముఖం పట్టడంలేదు. పలు జిల్లాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపైఒకరు దాడులకు దిగుతున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికుల్లో భయాందోళన వ్యక్తమవుతుంది. ఘర్షణలు జరుగుతున్న పలు ప్రాంతాల్లో పోలీస్ అదనపు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. ముఖ్యంగా కడప, అనంతపురం, కర్నూలు, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
జమ్మలమడుగులో..
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవగుడి ఆదినారాయణ రెడ్డి, కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎర్రగుంట్ల మండలం నిడిజివి గ్రామంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి వద్ద, జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి ఇళ్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. అదేవిధంగా జమ్మలమడుగులోని వైసీపీ, బీజేపీ, టీడీపీ కార్యాలయాల వద్దకూడా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. నేతలను వారివారి గ్రామాలకే పరిమితం చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది.
పల్నాడు జిల్లాలో..
పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ విధించారు. పోలింగ్ అనంతరం జరుగుతున్న దాడుల నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలను గృహనిర్భందం చేశారు. మాచర్ల పట్టణంలో ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి పట్టణంలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా దాచేపల్లి మండలం మాదినపాడులో టీడీపీ కార్యకర్తలు హల్ చల్ చేశారు. ఆదిరెడ్డి అనే వైసీపీ నాయకుడిపై విచక్షణా రహితంగా ఇనుప రాడ్లతో దాడిచేశారు. ఆదిరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం దాచేపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
గురజాల నియోజకవర్గంలో ..
మాచవరం మండలం వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. మాచవరం మండలం వైసీపీ అధ్యక్షుడు చౌదరి సింగరయ్య దారం లక్ష్మిరెడ్డి పై టీడీపీ నేతలు దాడులు చేశారు. మాచవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద కారు ఎక్కుతుండగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వైసీపీ నాయకులు ఇరువురికి తీవ్ర గాయాలు కాగా, కారు ద్వంసమైంది. గాయపడిన వ్యక్తిని పిడుగురాళ్ల పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
News
Amaravati Farmers: తిరుపతికి చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్ర.. రేపు మొక్కుల చెల్లింపు

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దీక్ష విరమించిన అమరావతి రైతులు
గత నెల 24న వెంకటపాలెంలో ప్రారంభమైన పాదయాత్ర
17 రోజులపాటు 433 కిలోమీటర్ల ప్రయాణం
నేడు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు రైతులు
అమరావతి రైతుల పాదయాత్ర నిన్న తిరుపతికి చేరుకుంది. నేడు కాలిబాటలో తిరుమలకు చేరుకుని సోమవారం స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దీక్ష విరమించిన అమరావతి రైతులు గత నెల 24న అమరావతి వెంకటపాలెం నుంచి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు.
మొత్తం 30 మంది రైతులు 17 రోజులపాటు 433 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నిన్న తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నుంచి నేడు కాలినడకన తిరుమల చేరుకుంటారు. రేపు (సోమవారం) స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక్కటైన అమరావతి రైతులు సంవత్సరాల తరబడి ఉద్యమం చేపట్టారు. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ సారథ్యంలోని కూటమి అధికారంలోకి రావడం, అమరావతినే తిరిగి రాజధానిగా ప్రకటించి పనులు ప్రారంభించడంతో రైతులు దీక్ష విరమించారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడంతో ఇటీవల పాదయాత్రగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
News
Ambani Wedding Gifts: రిలయన్స్ ఉద్యోగులకు అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్.. బాక్సులో వెండి నాణెలు సహా..!

అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగులకు వెడ్డింగ్ గిఫ్ట్స్ అందించింది అంబానీ ఫ్యామిలీ. ఇప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. బాక్సులో వెండి నాణెం సహా ఏమున్నాయో ఉద్యోగులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి అంటే ఓ రేంజ్లో ఉంటుందని తెలిసిందే. అందరు ఊహించిన దానికంటే ఘనంగానే తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జరిపిస్తున్నారు ముకేశ్ అంబానీ. జులై 12వ తేదీన ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం జరగనుంది. ఇప్పకిటే అతిథులను వివాహ వేదిక వద్దకు తరలించేందుకు 3 ఫాల్కన్ 2000 జెట్ విమానాలను అందుబాటులో ఉంచింది అంబానీ కుటుంబం. పెళ్లి కోసం అంబానీలు చేస్తున్న ప్రతి వేడుక ఆసక్తికరంగా నిలుస్తోంది. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్లో పని చేస్తున్న ఉద్యోగులకు సైతం ప్రత్యేక వెడ్డింగ్ గిఫ్టులు పంపించింది.
అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం వేళ తమకు అందించిన వెడ్డింగ్ గిఫ్ట్స్ సంబంధించిన ఫోటోలను పలువురు ఉద్యోగుల సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్ అవుతున్నాయి. ఇంతకి అందులో ఏమున్నాయంటే. ఎరుపు రంగు బాక్సు పై బంగారు వర్ణం అక్షరాలతో వధూవరుల పేర్లు కనిపిస్తున్నాయి. బాక్సు లోపల నాలుగు రకాల మిఠాయిలు, తినుబండారాలు ఉన్నాయి. ఆలూ భుజియా, సేవ్, చిడ్వాతో పాటు ఓ సిల్వర్ కాయిన్ సైతం అందించారు.
News
ఈపీఎఫ్ఓ …పెనాల్టీ తగ్గింపు

ఏంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్లో కంట్రిబ్యూషన్లను జమ చేయడంలో ఆలస్యం చేసే లేదా డీఫాల్ట్ అయ్యే కంపెనీల యాజమాన్యాలకు విధించే అపరాధ రుసుమును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తగ్గించింది.
కార్మిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ల ప్రకారం.. ఈ మూడు పథకాలకు సంబంధించిన కంట్రిబ్యూషన్ జమ చేయకపోతే ఒక్కో నెలకు కంట్రిబ్యూషన్ మొత్తంలో 1 శాతం అపరాధ రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇది ఏడాదికి 12 శాతానికి పరిమితమవుతుంది. ఈ చర్య వల్ల డిఫాల్ట్ అయిన కంపెనీ యాజమాన్యాలపై తక్కువ భారం పడనుంది.
గతంలో డిఫాల్ట్ కాలాన్ని బట్టి పెనాల్టీ అధికంగా ఉండేది. రెండు నెలలలోపు డిఫాల్ట్ కు సంవత్సరానికి 5 శాతం, రెండు నుంచి నాలుగు నెలల కాలానికి డిఫాల్ట్ లకు సంవత్సరానికి 10 శాతం అపరాధ రుసుము విధించేవారు. నాలుగు నుంచి ఆరు నెలల వరకు డిఫాల్ట్ చేస్తే జరిమానా ఏడాదికి 15 శాతం, ఆరు నెలలకు మించి డిఫాల్ట్ కొనసాగితే ఏడాదికి 25 శాతం పెనాల్టీ ఉండేది.
-
Business9 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career9 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News9 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business9 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National10 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business9 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International9 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education8 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National8 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh8 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Crime News8 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh8 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana9 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
National8 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Railways8 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National9 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Spiritual8 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
Andhrapradesh8 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh8 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh8 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
Andhrapradesh12 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
National8 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
National8 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Political8 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh8 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
National9 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh8 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Andhrapradesh8 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Political8 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh8 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
National9 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
International9 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Andhrapradesh7 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
Business9 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Cinema11 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
International9 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
News10 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Education8 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Weather8 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Andhrapradesh8 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Andhrapradesh8 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
News8 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Business9 months ago
Bank Holidays June-2024: జూన్లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Railways7 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Education12 months ago
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు
-
Andhrapradesh9 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
News8 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh12 months ago
ప్రమాదపుటంచుల్లో ప్రపంచం
-
Andhrapradesh8 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
International8 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం