Crime News
Boat Accident: తీవ్ర విషాదం.. పడవ మునిగి 90 మంది జల సమాధి.! ఎక్కడంటే.?

ఆఫ్రికా దేశం మొజాంబిక్ తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ పడవ మునిగిపోవడంతో 90 మందికి పైగా జల సమాధి అయ్యారు. కాగా, ప్రమాద సమయంలో పడవలో 130 మంది వరకు ఉన్నట్లు సమాచారం. బోటు సామర్థ్యానికి మించి ప్రయాణించడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని అక్కడి అధికారులు వెల్లడించారు. మృతుల్లో అధిక సంఖ్యలో పిల్లలు ఉన్నట్టు స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఫెర్రీని చేపల పడవగా మార్చి అధిక సంఖ్యలో ప్రయాణించడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఘటనపై అధికారులు చెబుతున్న కోణం మరోలా ఉంది. దేశంలో కలరా వ్యాప్తి అంటూ వదంతుల నేపథ్యంలో ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలు తప్పించుకుని దీవుల్లోకి వెళ్తున్నట్లు నాంపుల ప్రావిన్స్ సెక్రటరీ జైమ్ నెటో వెల్లడించారు. ఇలా వెళ్తుండగా ఈ పడవ మునిగిందని తెలిపారు. మొజాంబిక్ దేశంలో గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకూ 15 వేల కలరా కేసులు నమోదైనట్లు, 32 మంది మరణించినట్లు అధికారిక గణాంకాలను బట్టి తెలుస్తోంది.
Crime News
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన

జమ్ముకశ్మీర్లో బస్సుపై దాడికి పాల్పడ్డారు. దీనిపై తాజాగా లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టెంట్ ఫ్రంట్ సంచలన ప్రకటన చేసింది. రియాస్ వద్ద బస్సుపై దాడికి పాల్పడింది తామే అని వెల్లడించింది.
రియాస్లోని శివ్ఖోరి పుణ్యక్షేత్రం దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దాంతో.. బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ సంఘటనలో పది మంది భక్తులు స్పాట్లోనే చనిపోయారు. మరో 30 మందికి పైగా గాయాలు అయ్యాయి. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. కాల్పులు తర్వాత బస్సు లోయలో పడిపోవడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు.
ఇక బస్సుపై కాల్పుల సంఘటన తర్వాత భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యి.. చుట్టుపక్కల ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. ఒక వైపు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగానే టీఆర్ఎఫ్ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయడం సంచలనంగా మారింది. ఇక గతంలో కూడా ఈ తరహా ఉగ్రదాడులు జరిగాయి. ఎత్తయిన కొండ ప్రాంతాల్లో ఉండి కాల్పులకు తెగబడ్డారు. బస్సుపై ఇద్దరు వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారని ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బస్సుపై దాడి ఘటనలో బాధితులంతా ఉత్తర్ప్రదేశ్కు చెందినవారని పోలీసులు తెలిపారు. మృతుల వివారాలను తెలియాల్సి ఉంది.
ద రిసిస్టెంట్ ఫ్రంట్ సంస్థ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందనీ.. గతేడాది జనవరిలో ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. కాగా.. లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా టీఆర్ఎఫ్ 2019లో ఉనికిలోకి వచ్చింది.
Andhrapradesh
పోలీసులకే షాక్ కళ్ళు జిగేల్

ఎన్నికల వేళ ఏపీలో అధికారులు తనిఖీలు ముమ్మురం చేశారు. పోలీసులతో పాటుగా ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్లు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో పలుచోట్ల భారీగా బంగారం, నగదు పట్టుబడుతోంది.
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీచేస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురంలో భారీగా బంగారం, వెండి నగలు పట్టుబడ్డాయి. గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. ఓ మినీవ్యానులో రూ. 17 కోట్ల విలువైన బంగారం, వెండి నగలను తరలిస్తున్నట్లు గుర్తించారు.తరలిస్తున్న బంగారం, వెండి అభరణాలకు సంబంధించి సరైన డాక్యుమెంట్స్ లేకపోవడంతో సీజ్ చేసి కాకినాడలోని జిల్లా ట్రెజరీ కార్యాలయానికి తరలించారు.
Crime News
Biggest Jail in India: భారతదేశంలోని అతిపెద్ద సెంట్రల్ జైళ్లు ఏవో తెలుసా..? వాటి ప్రత్యేకత ఏంటంటే..

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. 140 కోట్లకు పైగా జనాభాలో ఒకవైపు నేరాలు జరుగుతుండగా,మరోవైపు న్యాయం కోసం పోరాటాలు కూడా జరుగుతున్నాయి. ఒక నివేదిక ప్రకారం, దేశంలో 1300 కంటే ఎక్కువ జైళ్లు ఉన్నాయి.నేరాలను అరికట్టడానికి, సామాజిక న్యాయానికి ప్రతీకగా జైలును చూస్తాం. భారతదేశంలో వివిధ రకాల జైళ్లు ఉన్నాయి. ప్రతి జైలు దాని పరిమాణం, ఖైదీలను ఉంచే సామర్థ్యాన్ని బట్టి విభిన్న లక్షణాలను కలిగి ఉంటుంది.
భారతదేశంలోని టాప్ 10 జైళ్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
1. తీహార్ జైలు..
ఢిల్లీలో ఉన్న తీహార్ జైలు భారతదేశంలోనే కాకుండా దక్షిణాసియాలోనే అతిపెద్ద జైలు క్యాంపస్. ఇది 1957లో స్థాపించబడింది. 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ జైలు క్యాంపస్లో 9 సెంట్రల్ జైళ్లు ఉన్నాయి. ఇందులో 5200 మంది ఖైదీలు ఉండగలరు.
2. ఎరవాడ సెంట్రల్ జైలు..
మహారాష్ట్రలోని పూణేలో ఉన్న ఎరవాడ సెంట్రల్ జైలు భారతదేశంలోని రెండవ అతిపెద్ద జైలు. ఇందులో చాలా మంది ఖైదీలు శిక్షను అనుభవిస్తున్నారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో మహాత్మా గాంధీ కూడా ఈ జైలు గోడల మధ్య బంధించబడడం గమనార్హం.ప్రస్తుతం 3600 మంది ఖైదీలకు వసతి ఉంది.
3. నైని సెంట్రల్ జైలు..
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఉన్న నైని సెంట్రల్ జైలు భారతదేశంలోనే మూడవ అతిపెద్ద సెంట్రల్ జైలు, 237 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 3000 మంది ఖైదీలకు వసతి ఉంది.
4. పుజల్ సెంట్రల్ జైలు..
తమిళనాడులోని చెన్నైలో ఉన్న పుఝల్ సెంట్రల్ జైలు దేశంలోని అతిపెద్ద జైళ్లలో ఒకటి. ఇది 26 సెప్టెంబర్ 2006 నుండి పని చేస్తోంది. 211 ఎకరాలలో విస్తరించి ఉన్న జైలు క్యాంపస్లో 1,251 మంది రిమాండ్ ఖైదీలు, 1,250 మంది శిక్ష పడిన ఖైదీలు, 500 మంది మహిళా ఖైదీలను ఉంచే సామర్థ్యం ఉంది.
5. వెల్లూరు సెంట్రల్ జైలు..
దేశంలోని అతిపెద్ద జైళ్లలో తమిళనాడులోని వెల్లూరు సెంట్రల్ జైలు కూడా ఒకటి. ఇది 1830లో స్థాపించబడింది. దీని క్యాంపస్ 153 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇది జిల్లాలో అతిపెద్దది. తమిళనాడులో రెండవది.
6. రాజమండ్రి సెంట్రల్ జైలు..
రాజమండ్రి సెంట్రల్ జైలు ఆంధ్రప్రదేశ్లో ఉంది. 196 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సముదాయాన్ని 1864లో బ్రిటిష్ సామ్రాజ్యం జైలుగా మార్చింది. దీని తరువాత 1870 లో దీనికి సెంట్రల్ జైలు అని పేరు పెట్టారు.
7. పాటియాలా సెంట్రల్ జైలు..
పంజాబ్లోని పాటియాలాలో ఉన్న సెంట్రల్ జైలు కూడా దేశంలోని అతిపెద్ద జైళ్లలో ఒకటి. దీని క్యాంపస్ కూడా 110 కోట్లకు పైగా విస్తరించి ఉంది.
8. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు..
దేశంలోని పెద్ద జైళ్లలో కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న పరపన్న అగ్రహార సెంట్రల్ జైలు కూడా ఒకటి. ఈ సెంట్రల్ జైలు కూడా 40 ఎకరాల్లో విస్తరించి ఉంది. కర్నాటకలో అతిపెద్ద జైలు హోదాను కలిగి ఉంది. ఇది 1997లో స్థాపించబడింది. 2,200 మంది సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రస్తుతం 5,000 మందికి పైగా ఖైదీలను కలిగి ఉంది.
9. అలీపూర్ సెంట్రల్ జైలు..
దేశంలోని టాప్ 10 జైళ్లలో పశ్చిమ బెంగాల్లోని అలీపూర్ సెంట్రల్ జైలు సముదాయం కూడా ఉంది. 40 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సెంట్రల్ జైలులో పెద్ద సంఖ్యలో ఖైదీలు నివసించారు. రాజకీయ ఖైదీలను ప్రత్యేకంగా ఇక్కడ ఉంచారు. ఫిబ్రవరి 20, 2019 నుండి ఇది జైలు నుండి మ్యూజియంగా మార్చబడింది.
10. గయా సెంట్రల్ జైలు..
1851 సంవత్సరంలో స్థాపించబడిన ఈ జిల్లా జైలు 1922లో సెంట్రల్ జైలుగా మార్చబడింది. బీహార్లోని గయా జిల్లాలో ఉన్న ఈ సెంట్రల్ జైలు కూడా దేశంలోని 10వ అతిపెద్ద జైళ్ల జాబితాలో చేర్చబడింది. దీని క్యాంపస్ 31 ఎకరాలలో విస్తరించి ఉంది.
-
Business9 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career9 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News9 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business8 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National9 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business9 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International9 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education8 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National8 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్కు గుడ్బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh8 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Crime News8 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh8 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Telangana9 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
Railways8 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National9 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
National8 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Spiritual8 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
Andhrapradesh8 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh8 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh8 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
National8 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Andhrapradesh12 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
National8 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Political8 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh8 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Andhrapradesh8 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
National9 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh8 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
Political8 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
National9 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Andhrapradesh8 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Business9 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Andhrapradesh7 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
Cinema11 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
International9 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
International9 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
News9 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Education8 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Weather8 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Andhrapradesh8 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Andhrapradesh8 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
News8 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Railways7 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh8 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Business9 months ago
Bank Holidays June-2024: జూన్లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
News8 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Andhrapradesh8 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
Education12 months ago
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు
-
International8 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Andhrapradesh12 months ago
ప్రమాదపుటంచుల్లో ప్రపంచం